Sakshi News home page

అట్టహాసంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు

Published Thu, Nov 16 2023 12:48 AM

-

పుల్లంపేట : పుల్లంపేట మండలంలోని ఎస్‌బీవీడీ సభా క్రీడా మైదానంలో బుధవారం రాష్ట్రస్థాయి ఇంటర్‌ స్కూల్‌ క్రీడా పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యాయామ అధికారి భానుమూర్తి రాజు, సర్వశిక్షా అభియాన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, డీఈఓ పురుషోత్తం, ఎంపీపీ ముద్దా బాబుల్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముద్దా బాబుల్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు పుల్లంపేటలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పోటీల్లో నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారన్నారు.విజేతలను అభినందించారు. బాలుర విభాగంలో మోంట్రీ స్కూల్‌ వారు ప్రథమ స్థానంలో నిలువగా, కెవీఎస్‌ వాలేరు వారు ద్వితీయస్థానంలో, కేవీఎస్‌ తిరుపతి వారు తృతీయస్థానం సాధించారు. బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో పెంచల్‌ రెడ్డి పాఠశాల, కేవీఎస్‌ మార్కాపురం వారు ద్వీతీయ స్థానం సాధించారు. అనంతరం గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులు అందించారు. మండల విద్యాశాఖ అధికారి చక్రాధర్‌ రాజు, నాగా తిరుమలరావు, ఎస్‌బీవీడీ సభా విద్యాసంస్థల కరస్పాండెంట్‌ శ్రీరాములు, చంద్రకుమార్‌, బాలశేఖర్‌, నీలకంఠరావు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement