Sakshi News home page

311వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Mon, Dec 3 2018 10:35 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 311వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం బూరాడనుంచి కొనసాగించారు. అక్కడి నుంచి కొర్లవలస క్రాస్‌, గురవాం, రాజాం మీదుగా అంతకాపల్లి వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం రాజాంలో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement