అనంతపురం మెడికల్ : ఆయుష్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఆదివారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. జేసీ–2 ఖాజామొహిద్దీన్ పర్యవేక్షణలో ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీడీ) వెంకట్రామ్ నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, నేషనల్ హెల్త్ మిషన్ డీపీఎం డాక్టర్ అనిల్కుమార్, డీఐఓ డాక్టర్ పురుషోత్తం సమక్షంలో బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఆయుర్వేద, హోమియో, యునానీ ఆస్పత్రుల్లో పని చేస్తున్న 24 మంది కాంపౌండర్లు, 17 మంది క్లాస్–4 ఉద్యోగులకు బదిలీ చేశారు. ఎన్జీఓ సంఘం లేఖలతో వచ్చిన ఇద్దరు ఉద్యోగులకు యథాస్థానాల్లో ఉంచారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ తిరుపతినాయుడు, డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఆయుష్ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్
Published Sun, Jun 4 2017 11:13 PM
Related news
-
ఆయుష్ కాంపౌండర్ ఆత్మహత్యాయత్నం
తిరుపతి (అలిపిరి) : 16 నెలల వేతనం చెల్లించకపోగా ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపం చెందిన ఆయుష్ విభాగం కాంపౌండర్ గౌతమి(29) సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి భర్త బ్రహ్మానందం కథనం మేరకు.. పాలసముంద్రం మండలంలోని ఆయుష్ డిస్పెన్సరీ కాంపౌండర్గా గౌతమి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తోంది. ఆమె భర్తతోపాటు కార్వేటినగరంలో కాపురం ఉంటున్నారు. 16 నెలలుగా వేతనం ఇవ్వకపోయినా ఎప్పుడో ఒకసారి ఇస్తారులే అని పనిచేస్తోంది. వారం క్రితం డిస్పెన్సరీ వైద్యులు బదిలీపై వెళ్లడంతో రోగులు రావడం లేదని పేర్కొంటూ ఆయుష్ విభాగం ఉన్నతాధికారులు సిబ్బందిని తొలగించారు. దీంతో గౌతమి మానసికంగా కుంగిపోయింది. సోమవారం పురుగుల మందు తాగింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించడంతోనే.. జిల్లాలో ఆయుష్ విభాగంలో 47 మంది ఉద్యోగులను తొలగించారు. వారు వారం క్రితం అమరావతిలో ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించలేదు. ఈ క్రమంలో మానసికి ఒత్తిడికి లోనైన ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. మాకు న్యాయం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా 850 మంది ఆయుష్ ఉద్యోగులను తొలగించారు. జిల్లాలో 47 మంది ఉన్నారు. 16 నెలలగా వేతనం ఇవ్వలేదు. నేను ఆత్మహత్య చేసుకుంటే కనీసం మిగతా వారికైనా న్యాయం జరుగుతుందని భావించా. ప్రభుత్వం ఆయుష్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. – గౌతమి, బాధితురాలు, పాలసముంద్రం మండలం -
మమ్మల్ని ఆదుకో అన్నా..!
రాష్ట్రంలో ఉన్న ఆయుష్ కేంద్రాల్లో సిబ్బందిని ఆదుకో అన్నా అంటూ ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం పారామెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం వారు జననేతను కలుసుకుని సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ పథకం కింద రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు 587 ఆయుష్ డిస్పెన్సరీలను కేటాయించగా వీటిలో కేవలం 136 డిస్పెన్సరీల్లో మాత్రమే వైద్యాధికారులు ఉన్నారన్నారు. మిగిలిన 451 డిస్పెన్సరీల్లో ఆరేళ్లుగా పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఖాళీగా ఉన్న ఆయుష్ మెడికల్ ఆఫీసర్, పారా మెడికల్ సిబ్బంది భర్తీ కోసం 2014, 2016 సంవత్సరాల్లో ఆయుష్ కమిషనర్ వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినా భర్తీ కాలేదన్నారు. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బందికి 2016 ఏప్రిల్ నుంచి జీతాలు, కాంట్రాక్టు రెన్యువల్స్ ఇవ్వడం లేదన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ కష్టంగా మారడంతో పాటు ఉద్యోగ భద్రత లేక మానసిక ఆందోళనకు గురౌతున్నామన్నారు. ఈ విధంగా నలుగురు సిబ్బంది మరణించారని వాపోయారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి 2012లో లేఖ కూడా రాశారని, తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తమ సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే మా సమస్యపై స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 451 ఆయుష్ డిస్పెన్సరీల్లో ఆయుష్ వైద్యులను నియమించడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమకు జీతాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయుష్ ఎన్ఆర్హెచ్ఎం పారామెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జె.లక్ష్మీనారాయణ, నాయకులు యూవీకే శాస్త్రి, పడాల పద్మావతి, వట్టికుళ్ల నాగమణి, పి.లలిత, మోహన్రాయ్ తదితరులు కోరారు. -
తక్షణమే వారి వేతనాలు చెల్లించండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఆయుష్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఆయుష్ శాఖలో పనిచేస్తున్న సుమారు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించడమే కాకుండా వారికి ఇవ్వాల్సిన 17 నెలల వేతనాలు ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆయుష్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం తక్షణమే వారికి వేతనాలు చెల్లించి, వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సర్కారును ఆదేశించింది. డాక్టర్లను నియమించని కారణంగా కాంపౌండర్లను, ఆర్డర్లీ నర్సింగ్ సిబ్బందిని ఎలా తొలగిస్తారని సర్కారు మొట్టిక్కాయలు వేసింది. కోర్టు తీర్పు అనంతరం ఆయుష్ శాఖ ఉద్యోగులు హనుమంతరెడ్డి, సురేష్గుప్తా, లక్ష్మినారాయణ, రాధకుమారి తదితరులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయుష్ ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
నేడు ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 10 గంటలకు చేపట్టనున్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయ మీటింగ్ హాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీహెచ్ఏ, ఎల్డీ కంప్యూటర్, ఎఫ్డబ్ల్యూడబ్ల్యూ, ఫార్మసిస్టులు, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్స్, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, స్వీపర్లు, వాచ్మన్లు తదితర కేడర్ల ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఉంటుంది. కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేసీ–2 ఖాజామొహిద్దీన్ రానున్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేశ్నాథ్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరుగుతుంది. అన్ని కేడర్లకు సంబంధించి బదిలీలకు 295 మంది అర్హులున్నట్లు అధికారులు తేల్చారు. -
తీరిన ‘ఆయుష్షు’!
– వైద్యాధికారి లేని చోట ఉద్యోగుల తొలగింపు – ఏడాదిగా జీతాలూ చెల్లించని వైనం – మూసివేత దిశగా 30 డిస్పెన్సరీలు – ఆందోళనలో ఆయుష్ ఉద్యోగులు అనంతపురం మెడికల్ : బాబొస్తే జాబొస్తుందనుకుంటే ఉన్న ఉద్యోగాలూ ఊడాయి. ఏడాది పాటు జీతాలు లేకున్నా ఏదో ఒక రోజు వస్తాయనుకున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతూ ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగించేశారు. ఆ నెపాన్ని తెలివిగా కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆయుష్’ను బలోపేతం చేయాల్సింది పోయి విధుల నుంచే తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాల్లోకెళ్లితే.. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద 46 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇందులో అమడగూరు, అగళి, ఎర్రగుంట్ల ఆయుర్వేద డిస్పెన్సరీలు మూతపడ్డాయి. మిగిలిన వైద్యశాలల్లో 22 ఆయుర్వేద, 13 హోమియో, 6 యునానీ, రెండు న్యాచురోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయుష్ వైద్యశాలల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ కం నర్స్ (ఎస్ఎన్ఓ) పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం 82 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. ఏటా వీరికి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చినాటికి గడువు పూర్తికాగా ఒక్కరికీ రెన్యూవల్ చేయలేదు. వైద్యులు లేని చోట ఉద్యోగుల తొలగింపు తాజాగా ఆయుష్ ఉద్యోగులు అవసరం లేదని, వారిని ఇంటికి పంపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో వైద్యుల్లేని చోట మిగిలిన సిబ్బందిని తొలగించనున్నారు. జిల్లాలోని 22 ఆయుర్వేద డిస్పెన్సరీలకు సంబంధించి ప్రస్తుతం ఆరుగురు వైద్యులు, 17 మంది కాంపౌండర్లు, 17 మంది ఎస్ఎన్ఓలు పని చేస్తున్నారు. బుక్కపట్నం, చెన్నేకొత్తపల్లి, కిష్టిపాడు, పెద్దకౌకుంట్ల, రాప్తాడు, తిమ్మంపల్లిలో మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. అగళి, బొమ్మనహాళ్, చుక్కలూరు, కళ్యాణదుర్గం, కొర్రపాడు, ఎన్ఎస్ గేట్, నల్లచెరువు, పెద్దవడుగూరు, పేరూరు, పుట్టపర్తి, రామగిరి, రొద్దం, శెట్టూరు, తాడిమర్రి, యల్లనూరు, యర్రగుంట డిస్పెన్సరీల్లో డాక్టర్లు లేరు. జిల్లావ్యాప్తంగా 13 హోమియో డిస్పెన్సరీలుండగా బేవనహళ్లి, బుక్కరాయసముద్రం, కొనకొండ్ల, కుందుర్పిలో వైద్యులుండగా 9 డిస్పెన్సరీల్లో కాంపౌండర్లు, 13 ఆస్పత్రుల్లో ఎస్ఎన్ఓలున్నారు. అమడగూరు, ఆత్మకూరు, ఎద్దులపల్లి, కదిరి, కణేకల్లు, ఎన్పీ కుంట, పట్నం, పెనుకొండ, కొత్తచెరువులో డాక్టర్లు లేరు. ఇక నేచురోపతి డిస్పెన్సరీలకు సంబంధించి కూడేరు కేంద్రంలో డాక్టర్ ఉన్నా ఏనాడూ విధులకు హాజరైంది లేదు. చౌళూరులో వైద్యుడు లేరు. ఈ రెండు ఆస్పత్రులకు గాను ఒక కాంపౌండర్, ఇద్దరు ఎస్ఎన్ఓలు పని చేస్తున్నారు. యునానీకి సంబంధించి గార్లదిన్నె, కె.బసనహళ్లి, పరిగిలో డాక్టర్లు ఉన్నారు. బ్రహ్మసముద్రం, కేఎన్ పల్లి, వజ్రకరూరులు వైద్యుల్లేరు. ఆయా డిస్పెన్సరీల్లో నలుగురు కాంపౌండర్లు, ఐదుగురు ఎస్ఎన్ఓలు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు వైద్యులు ఉన్న చోట మాత్రమే ఉద్యోగులను కొనసాగించనున్నారు. బకాయి జీతాలు చెల్లించలేం! గతేడాది నుంచి ఉద్యోగులకు జీతాలు రావాల్సి ఉంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో జీతాలు కూడా రాని పరిస్థితి తలెత్తింది. ఆయుష్ కమిషనర్ రేవతి గత నెల 20వ తేదీన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్లకు జారీ చేసిన ఉత్తర్వులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల జీతాల బడ్జెట్తో పాటు 2017–18 సంవత్సరానికి సైతం జీతాలు ఇవ్వలేమని అందులో పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ లేని చోట విధులు నిర్వర్తిస్తున్న పారామెడికల్ సిబ్బంది జీతాలను విడుదల చేయలేమని ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకే ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా 30 డిస్పెన్సరీలు మూతపడే సూచనలు కన్పిస్తున్నాయి.
Related News by category
-
నిత్యం అప్రమత్తంగా ఉండాలి
అనంతపురం: నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న విడపనకల్లు, ఓబుళాపురం అంతరాష్ట్ర చెక్ పోస్టులను డీఐజీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలలో డీఐజీ స్వయంగా పాల్గొన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. కర్ణాటక నుంచి వచ్చే బస్సులు, లగేజీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రాత్రి వేళ పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకోవడంతో కలెక్టరేట్తో పాటు అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాలు, రాయదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బందోబస్తును స్వయంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. -
బాలికలు.. భళా
● పదో తరగతిలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు ● బాలికలు 85.01, బాలురు 77.08 శాతం ఉత్తీర్ణత ● 598 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థిని తన్నేరు ప్రణతి ● 76 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు భళా అనిపించారు. సోమవారం విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 30,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 25,0003 మంది ఉత్తీర్ణత (80.93) శాతం సాధించారు. వీరిలో 15,017 మంది బాలికలను గాను 12,766 మంది 85.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 15,876 మందికి గాను 12,237 మంది 77.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో గతేడది 16 స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి ఏకంగా 76 స్కూళ్లు ఈ వందశాతం ఫలితాలు సాధించడం విశేషం. ఉత్తీర్ణులైన వారిలో 18,432 మంది ప్రథమశ్రేణి, 4,100 మంది ద్వితీయ శ్రేణి, 2,471 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. టాప్లో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు టాప్లో నిలిచాయి. 273 మంది విద్యార్థులకు గాను 269 మంది 98.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 660 మందికి గాను 638 మంది 96.67 శాతం, ప్రైవేట్ స్కూళ్లలో 11,175 మందికి గాను 10,719 మంది 95.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 237 మందికి గాను 226 మంది 95.36 శాతం, ఏపీ మోడల్ స్కూళ్లల్లో 1,137 మందికి గాను 1027 మంది 90.33 శాతం, కేజీబీవీల్లో 1,252 మందికి గాను 1,053 మంది 84.11 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 190 మందికి గాను 145 మంది 76.32 శాతం, ఎయిడెడ్ స్కూళ్లల్లో 426 మందికి గాను 324 మంది 76.06 శాతం, మునిసిపల్ స్కూళ్లల్లో 2,155 మందికి గాను 1,522 మంది 70.63 శాతం, జిల్లా పరిషత్ స్కూళ్లల్లో 11,453 మందకి గాను 7,800 మంది 68.10 శాతం, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,935 మందికి గాను1,280 మంది 66.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. 24వ స్థానంలో జిల్లా జిల్లాలో గతేడాదికంటే మెరుగైన ఫలితాలు వచ్చినా రాష్ట్రంలో నాలుగుస్థానాలకు కిందకు పడిపోయిది. గతేడాది 66.25 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మన జిల్లా 20వ స్థానంలో నిలవగా ఈసారి 80.93 శాతం అంటే 14.68 శాతం పెరిగింది. 24వ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 30లోగా ఫీజు చెల్లింపు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఈనెల 30లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టుల పైన రూ. 125, మూడు లోపు సబ్జెక్టులకు రూ. 110, ఒకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ. 60 చెల్లించాలని సూచించారు. రీకౌంటింగ్కు రూ. 500, రీ వెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రం నకలు కావాల్సిన వారు రూ. 1000 ఈనెల 30లోగా సంబంధిత పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. -
పదిలో ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ
అనంతపురం రూరల్: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగు పరచడంతో పాటు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో 1,172 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా వీరిలో 964 మంది ఉత్తీర్ణత సాదించారు. 37 బీసీ వసతి గృహాల్లో 560 మందికి గాను 448 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. వీరిలో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని 360 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 321 మంది ఉత్తీర్ణత సాదించారు. వీరిలో 11 మంది 500కు పైగా మార్కులు సాధించారు. 3 ఎస్టీ వసతి గృహాలు, 6 గురుకుల పాఠశాలల్లోని 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వీరిలో 195 మంది ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అత్యధికంగా గుత్తి ఎస్సీ బాలుర వసతి గృహం–1 విద్యార్థి డి.ఆసీఫ్ 570 మార్కులు, రాయదుర్గంలోని బీసీ (బాలికల) హాస్టల్ విద్యార్థిని అభిల 560 మార్కులు, గొల్లలదొడ్డిలోని గిరిజన సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థి గురుచరణ్ నాయక్ 533 మార్కులు సాధించారు. -
విజయం మాదే: ఎమ్మెల్యే అనంత
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.ర్యాలీలో భాగంగా గీతామందిరం సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా ప్రజలకు రూ.2 వేల కోట్ల సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనంతపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్సార్ సీపీకి వచ్చిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అవినీతిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై అప్పట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. -
మండుటెండలోనూ పోటెత్తారు..
ఉరవకొండ: పట్టణంలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా గ్రామాల నుంచి తరలివచ్చి విశ్వకు మద్దతు తెలిపారు. మహిళలు సైతం వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. డీజేలు, డ్రమ్స్, వాయిద్యాలు, తప్పెట్లు, బాణాసంచా పేలుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా కూడేరు సంగమేశ్వరస్వామి ఆలయం, పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి విశ్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను తన కుమారుడు, పార్టీ యువనేత ప్రణయ్రెడ్డి, నాయకులు ఏసీ ఎర్రిస్వామి, మూలగిరిపల్లి ఓబన్న, ఎంసీ నాగభూషణంతో కలిసి ఆర్ఓ కేతన్గార్గ్కు అందించారు. ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ఉప్పొంగిన ఉత్సాహంతో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కవితాహోటల్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఉరవకొండ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, నిండు మనసుతో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్, యాదవ, రజక కార్పొరేషన్ల చైర్మన్లు హరీష్యాదవ్, మీసాల రంగన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరన్న, ఆర్టీసీ రీజి నల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ‘విశ్వ’ నామినేషన్ భారీగా తరలివచ్చిన నాయకులు
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్.. కేవలం 61 గంటల్లోనే!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement