Sakshi News home page

మాజీ రంజీ క్రికెటర్ల భేటీ

Published Mon, Nov 28 2016 11:27 AM

former ranji cricketers meet for lodha instructions

సాక్షి, హైదరాబాద్: మాజీ రంజీ క్రికెటర్లు ఆదివారం జింఖానా గ్రౌండ్‌‌సలోని హెచ్‌సీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. క్రికెట్ ప్లేయర్ల సంఘం (సీపీఏ) అధ్యక్షుడు మనోహర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో 34 మంది హైదరాబాద్‌కు ఆడిన మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. లోధా కమిటీ సిఫార్సుల్ని హెచ్‌సీఏ అమలుచేయడంపై వీరంతా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాజీలు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ప్రస్తుత నిబంధనల మేరకు కొత్త ప్లేయర్ల సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇందుకోసం స్టీరింగ్ కమిటీని నియమించారు.

 

ఈ కమిటీ హెచ్‌సీఏతో సమన్వయంతో పనిచేస్తుంది. ఇది కేవలం మధ్యంతర కమిటీ మాత్రమేనని విజయ్ మోహన్‌రాజ్ స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఎన్నుకునేవరకు మాత్రమే ఇది పనిచేస్తుందన్నారు. ఈ కమిటీలో ఎం.వి.నరసింహారావు, వెంకటపతి రాజు, నోయల్ డేవిడ్, విజయ్ మోహన్‌రాజ్‌లు ఉన్నారు. ఇందులో ఐదో సభ్యుడిగా శివలాల్‌యాదవ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయన సమ్మతి మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది.

Advertisement

What’s your opinion

Advertisement