గోవాతో రంజీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు తడబడటంతో గోవాతో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఆట చివరిరోజు బుధవారం ఓవర్నైట్ స్కోరు 238/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గోవా 269 పరుగులవద్ద ఆలౌటైంది. రవి కిరణ్ (2/36), ఆశిష్ రెడ్డి (2/41), ప్రజ్ఞాన్ ఓజా (2/98) రెండేసి వికెట్లు తీయగా... సీవీ మిలింద్ (3/63) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన హైదరాబాద్ తమ ప్రత్యర్థి గోవా జట్టును ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లో గోవా 68 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. ఓపెనర్ అమోగ్ సునీల్ దేశాయ్ (192 బంతుల్లో 9 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కినందుకు హైదరాబాద్కు మూడు పాయింట్లు లభించగా... గోవాకు ఒక పాయింట్ దక్కింది.
హైదరాబాద్ ‘డ్రా’తో సరి
Published Thu, Dec 18 2014 12:39 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement