-
రేపిస్టులను కాల్చివేసేందుకు వెనుకాడను!
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ రేపిస్టుల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అనుమతిస్తే మహిళలపై నేరాలకు ఒడిగట్టే వారిని సంఘటన స్థలంలోనే కాల్చిపారేస్తామని, ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం సంకోచించరని ఆయన పేర్కొన్నారు. అయితే, మన రాజ్యాంగం అలాంటి వాటిని అనుమతించదని, అందుకే పోలీసులు ప్రతి వ్యక్తి మానవహక్కులను గౌరవిస్తూ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారని వెంటనే ఆయన వివరణ ఇచ్చారు. 'భారత రాజ్యాంగం అనుమతించి ఉంటే ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలంలోనే మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కాల్చివేయడమో, ఉరి తీయడమో చేసేవారు. అయినప్పటికీ మేం మానవహక్కులకు కట్టుబడి ఉన్నాం. వాటిని గౌరవిస్తాం' అని బస్సీ చెప్పారు. దేశ రాజధానిలో మహిళలపై జరుగుతున్న నేరాలకు కారణం లింగ నిష్పత్తిలో భారీ అగాథం ఉండటమే. ప్రస్తుతం వెయ్యి మంది పురుషులకు 600 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. మరోవైపు కొందరు మగవాళ్లు మహిళలను తమ తల్లిగానో, చెల్లిగానో, కూతురిగానో, భార్యగానో చూడకుండా కేవలం సరుకుగా భావిస్తున్నారు. అందువల్లే 21 ఏళ్ల యువకుడు 80 ఏళ్ల మహిళ లేదా ఐదేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడు' అని బస్సీ పేర్కొన్నాడు. మహిళల భద్రతకు ఢిల్లీ పోలీసులు శాయశక్తుల కృషి చేస్తున్నారన్న బస్సీ.. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పై పరోక్ష విమర్శలు చేశారు. పోలీసులు కేజ్రీవాల్ సర్కార్ పరిధిలో లేకపోవడం తమ అదృష్టమని చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అధీనంలో ఉండి ఉంటే ఆయన 'స్థానిక ప్రయోజనాల' కారణంగా తమపై రాజకీయ ఒత్తిడి ఉండేదని, ప్రధానమంత్రి, హోంమంత్రికి అలాంటి ఉద్దేశం లేకపోవడం వల్ల తాము స్వేచ్ఛగా పనిచేస్తున్నామని బస్సీ అన్నారు. -
'ఢిల్లీ పోలీస్ కమిషనర్ దాక్కొని పనిచేయడు'
ఢిల్లీ: తనపై ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతికి పాల్పడేవాళ్లను సమాధుల్లోకి పంపుతానని హూంకరించారు. భూముల కొనుగోలు వ్యవహారంలో కమిషనర్ బస్సీ అవినీతికి పాల్పడ్డారని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై బస్సీ మండిపడ్డారు. ఆప్ ప్రభుత్వం తనపై చేపడుతున్న దుష్ప్రచారానికి బెదిరిపోనని బస్సీ స్పష్టం చేశారు. 'ఢిల్లీ కమిషనర్ దాక్కొని పనిచేయడం లేదు. వీధుల్లో నిలబడి పనిచేస్తాడు. నా బాధ్యతల నిర్వహణలో నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నాను. ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. మోసానికి పాల్పడేవారిని సమాధి చేస్తా' అని బస్సీ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. నిజాన్ని ప్రజలకు తెలిపి, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని ప్రజల ముందు ఉంచుతానన్నారు. ఆధారం లేకుండా ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని బస్సీ తెలిపారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement