-
అట్లాంటా గ్యాస్ స్టేషన్ దోపిడీ.. ఇంటి దొంగల పనే!
అట్లాంటాలోని బుఫోర్డ్ హైవేలోగల గ్యాస్ స్టేషన్లో గత జనవరి 21న జరిగిన సాయుధ దోపిడీని దులుత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఛేదించింది. వివరాల్లోకి వెళితే గ్యాస్ స్టేషన్ నిర్వాహకుడు, క్యాషియర్ రాజ్ పటేల్.. నలుపు రంగు దుస్తులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని, ఐదువేల డాలర్లు దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్యాస్ స్టేషన్లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ సోషల్ మీడియాలో ప్రసారం అయినప్పుడు ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ పటేల్ను ఆ గుర్తు తెలియని వ్యక్తి కొట్టగానే అతను వెంటనే కింద పడిపోయినట్లు వీడియోలో కనిపించింది. రాజ్ పటేల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతనితో పాటు అదే గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న కర్టిస్లను విచారించారు. దీనిలో వారు డబ్బు కోసం కుట్ర పన్నారని తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పటేల్ ఈ దోపిడీకి సంబంధించి చెబుతున్నదానిలో పోలీసులకు పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్ పటేల్ విచారణ అధికారులతో గుర్తు తెలియని వ్యక్తి తన ముఖంపై కత్తితో దాడి చేశాడని చెప్పాడు. అయితే పోలీసులకు రాజ్ పటేల్ ముఖంపై ఎలాంటి గుర్తులు కనిపించలేదు. సెక్యూరిటీ ఫుటేజ్లో కర్టిస్.. రాజ్ పటేల్ను మెల్లగా కొట్టినప్పటికీ అతను వెంటనే పడిపోవడం పోలీసులలో అనుమానాలను పెంచింది. తనపై దాడిచేశాక ఆ గుర్తు తెలియని వ్యక్తి బయటపడేందుకు గ్యాస్ స్గేషన్లోని మరో తలుపును ఉపయోగించాడని రాజ్ పటేల్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ అధికారి అదే తలుపు నుండి బయటకు వెళ్లి అక్కడ పరిశీలించాడు. కర్టిస్ ఆ గదిలో పనిచేసేవాడని పటేల్ పోలీసులకు తెలిపాడు. అయితే కర్టిస్ తాను ఈ దాడి జరిగిన సమయంలో ఎవరినీ చూడలేదని పోలీసు అధికారులకు చెప్పాడు. వీడియో ఫుటేజీలో ఆ గుర్తు తెలియని వ్యక్తి సైడ్ డోర్ నుండి బయటకు వెళ్లి, అక్కడున్న చెత్తకుప్ప దగ్గర రెండుసార్లు బట్టలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో పోలీసులు కర్టిస్ను అదుపులోకి తీసుకుని, ఆ గది కీని అడిగారు. అతను కీని బయటకు తీసే సమయంలో అతని జేబులో నుండి విలువైన బిల్లులు పడిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. కర్టిస్ గ్యాస్ స్టేషన్లో ఉద్యోగి అని, ఈ దోపిడీకి పాల్పడింది అతనేనని పటేల్ పోలీసుల ముందు ఆరోపించాడు. పోలీసుల విచారణలో కర్టిస్ తాను నగదు దొంగిలించినట్లు అంగీకరించాడు. అయితే ఇదంతా రాజ్ పటేల్ చేసిన ప్లాన్ అని, తాను దొంగిలించిన నగదు తీసుకుంటే, రాజ్ పటేల్ బీమా సొమ్ము తీసుకోవాలని ప్లాన్ చేశాడని కర్టిస్ పోలీసులకు తెలిపాడు. -
బార్ క్యాషియర్ దారుణహత్య
కర్ణాటక: బార్లో మద్యం తాగడానికి వచ్చిన యువకులు– సిబ్బంది మధ్య గొడవ జరిగి సిబ్బంది ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు బార్ క్యాషియర్ సచిన్ (27). నిందితులు ఆయనూరు తండాకు చెందిన నిరంజన్, సతీష్, అశోక్ నాయక్లు. నవరత్న బార్లో వీరు మద్యం తాగడానికి వచ్చారు. రాత్రి 11 గంటలకు.. బార్ మూసేయాలి, ఇక వెళ్లిపోవాలని సిబ్బంది వారికి సూచించారు. మందు తాగుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతారా అని తాగుబోతులు గొడవ పడ్డారు. దాంతో క్యాషియర్ సచిన్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నువ్వేంటి మాకు చెప్పేది అని కత్తితో అతని పొట్టలో పొడిచారు. తరువాత బయట పోలీసులు ఉన్నప్పటికీ, బైక్లపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సచిన్ను బార్ సిబ్బంది ఆయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. కుంసి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
ఆమెకు వివక్షత వేధింపులే వరంగా మారాయి...ఏకంగా రూ. 72 లక్షలు గెలుపొందింది
కంపెనీల్లో కొంతమంది సహోద్యోగులతో తొందరగా కలవలేక ఇబ్బంది పడుతుంటారు. అలాగే సహోద్యోగులు కొంతమంది తమ తోటి ఉద్యోగులు అనే భావం లేకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అందులోనూ మహిళలైతే ఇలాంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు. కొంతమంది తమ కంటే బాగా పనిచేస్తుందన్న అక్కసుతో లేక తమ కంటే తక్కువ కులం అనో తమతో కలవనీకుండా దూరం పెడతూ ఆవేదనకు గురయ్యేలా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక ఆమె ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. ఐతే ఆమె పోరాడి అందుకు ప్రతిగా పరిహారాన్ని కూడా అందుకుంది. వివరాల్లోకెళ్తే....లండన్లోని స్ట్రాట్ఫోర్డ్లో ఆస్పర్స్ క్యాసినో అనే గేమింగ్ కంపెని ఉంది. 51 ఏళ్ల రీటా లెహెర్ అనే అమె ఆ కంపెనీ క్వాషియర్గా పనిచేస్తోంది. ఐతే ఆమె ఆఫ్రికన జాతికి చెందని మహిళ. దీంతో ఆకంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆమెను దూరం పెట్టేవారు. ఆఫీసులో జరిగే ఎలాంటి ఫంక్షన్లకి, పార్టీలకి ఆమెని పిలిచేవారు కాదు. రీటాకి గేమింగ్ కంపెనీలో 22 ఏళ్ల అనుభవం ఉంది. ఆమె ఆ కంపెనీలో హై-ఎండ్ డీలర్గా, షాప్ మేనేజర్గా కూడా విధులు నిర్వర్తించింది. కానీ ఆమెకు కంపెనీలో సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి తగిన గుర్తింపు గానీ గౌరవం గానీ లేదు. అంతేకాదు ఆమె ప్రమోషన్ కోసం చేసుకున్న దరఖాస్తులను కూడా పదేపదే తిరస్కరింపబడేవి. దీంతో ఆమె చాలా ఏళ్లు విసిగిపోయి ఒక దశలో కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోవాలనుకుంది కూడా. ఇక ఈ జాతి వివక్షతకు చెక్పెట్టాని నిర్ణయించుకుని పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కంపెనీ ప్యానెల్ ఈ విషయమై పూర్తిగా విచారణ జరిపింది. రీట్ జాతి వివక్షతకు గురిఅవ్వడమే కాకుండా సహోద్యోగులు ఆమె పట్ల నడుచుకున్న తీరు, ఆమె పడిన మానసిక క్షోభను అర్థం చేసుకుంది. సహోద్యోగులు, అధికారులు ఒక ఉద్యోగిని వివక్షతకు గురిచేస్తే ఆ ఉద్యోగి పనిపై తీవ్రప్రభావం పడుతుందని, తన చుట్టు ఉన్న వాతావరణం బాగుంటేనే ఆ ఉద్యోగి నూతనోత్సహంతో పనిచేయగలుగుతుందని ఇది సహించలేనిదని తెలిపింది. రీటా ఎదుర్కొన్న వివక్ష వేధింపులకు పరిహారంగా ఆమెకు సుమారు రూ 72 లక్షలు అందజేయనున్నట్లు కూడా ప్రకటించింది. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
క్యాష్ వ్యాన్పై కాల్పులు: రూ.11లక్షలు లూటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో దొంగలు చెలరేగి పోయారు. భారీ నగదుతో వెళుతున్న క్యాష్వ్యాన్ పై కాల్పులు జరిపి సుమారు రూ.11లక్షల సొమ్మును ఎత్తుకళ్లారు. బైక్ వచ్చిన ముగ్గురు ఆగంతకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విజయ్ విహార్లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యాషియర్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
చిల్లర కోసం వచ్చి..
చిట్యాల (నకిరేకల్) : రూ.20వేల చిల్లర కోసం వచ్చిన ఓ వ్యక్తి.. క్యాషియర్ పొరపాటున ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన స్థానిక కెనరా బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బ్యాంకుకు వచ్చిన శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుడు నూతనంగా విడుదలైన నోట్లు కావాలని తన వద్ద ఉన్న పది రెండు వేల రూపాయల నోట్లను క్యాషియర్కు ఇచ్చాడు. వాటికి చిల్లరగా క్యాషియర్ రూ.20 నోట్లనుకుని క్యాషియర్ పొరపాటును రూ.200 బెండల్ను సదరు యువకుడికి ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రూ.20వేలుపోను.. రూ.లక్షా 80 వేల తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం బ్యాంకు లావాదేవీల జమ, ఖర్చుల్లో భారీ తేడాలు రావడంతో.. బ్యాంకు అధికారులు సీసీ పుటేజీలను పరిశీలించారు. పసువు రంగు చొక్కా వేసుకుని, మెడలో నల్లటి బ్యాగుతో వచ్చిన గడ్డంతో ఉన్న యువకుడు క్యాషియర్ కిష్టయ్య పొరపాటున ఇచ్చిన నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మొత్తం క్యాష్ పోవటంతో బ్యాంకు సిబ్బంది తీవ్ర ఆందోళన ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Advertisement