-
‘లాక్డౌన్’తో సత్ఫలితాలు
న్యూఢిల్లీ: 30 రోజుల లాక్డౌన్ కాలంలో కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగామని, కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే సమయాన్ని పెంచగలిగామని కేంద్రం తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను భారీగా పెంచగలిగామని పేర్కొంది. లాక్డౌన్ సమయంలో గొంతు, ముక్కులో నుంచి సేకరించిన నమూనాల ద్వారా జరిపే ‘ఆర్టీ–పీసీఆర్’ పరీక్షా విధానాన్ని ఒక కీలక ఆయుధంగా ఉపయోగించామని కేంద్ర సాధికార బృందం–2 చైర్మన్ మిశ్రా చెప్పారు. ‘ఏప్రిల్ 22 నాటికి 5 లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం’ అన్నారు. భారత్లో వైరస్ వ్యాప్తి భారీగా లేదని, ఆ గ్రాఫ్లో పెరుగుదల నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అంటే, భారత్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లే భావించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘అమెరికాలో మార్చి 26 నాటికి 5 లక్షల పరీక్షలు జరపగా, అందులో 80 వేలు పాజిటివ్గా తేలాయి. భారత్లో ఏప్రిల్ 22 నాటికి 5 లక్షల పరీక్షలు జరపగా.. దాదాపు 20 వేల కేసులే నమోదయ్యాయి’ అని మిశ్రా వివరించారు. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి కొత్త కేసుల సంఖ్య 16 రెట్లు పెరగగా, నిర్ధారణ పరీక్షల సామర్ధ్యం 24 రెట్లు పెరిగిందని వివరించారు. ఇప్పటివరకు 3,773 కోవిడ్–19 ప్రత్యేక ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయని, వాటిలో 1.94 లక్షల ఐసొలేషన్ బెడ్స్, 24,644 ఐసీయూ బెడ్స్, 12,371 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని మిశ్రా తెలిపారు. లాక్డౌన్ ప్రకటించిన సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్స్ దేశంలో 100 మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 325కి చేరిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవతెలిపారు. 14 రోజుల్లో 78 జిల్లాల్లో జీరో పాజిటివ్ 14 రోజుల్లో దేశవ్యాప్తంగా 78 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 28 రోజుల్లో 12 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కోలుకున్నవారి శాతం పదిరోజుల క్రితం 9.9గా ఉండగా, ఇప్పుడు 19.89కి చేరుకుందన్నారు. కాగా, పారిశ్రామిక వర్గాల నుంచి వారి సమస్యలపై సమాచారం తీసుకుని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. మనిహాయింపులతో పాటు కొత్తగా ప్రకటించిన కొన్ని నిబంధనలు పాటించడం ఆచరణసాధ్యంగా లేవని పలువురు పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు చెప్పారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మెరుగుదల కనిపిస్తోందన్నారు. 21,700 కేసులు.. 686 మరణాలు దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కొత్తగా 1,229 కేసులు, 34 మరణాలు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారానికి 21,700కి పెరిగింది. కోవిడ్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 686కి చేరింది. బుధవారం సాయంత్రం నుంచి 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,229 కేసులు, 34 మరణాలు సంభవించాయి. మొత్తం 21,700 కేసుల్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,689 అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 4,324 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇలా కోలుకున్నవారి శాతం 19.93 అని వివరించింది. బుధవారం నుంచి చోటు చేసుకున్న మరణాల్లో అత్యధికం మహారాష్ట్రలో సంభవించాయి. ఆ రాష్ట్రంలో 18 మంది, గుజరాత్లో 8 మంది మరణించారు. మొత్తం 686 మరణాల్లోనూ మహారాష్ట్రలో అత్యధికం చోటు చేసుకున్నాయి. -
ఆ విషయం మాకూ తెలుసు.. అదో వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ నేటితో 30వ రోజుకు చేరుకుందని ఎంపవర్డ్ కమిటీ-2 ఛైర్మన్ సీకే మిశ్రా తెలిపారు. లాక్డౌన్ దేశంలో ఎంతోమందికి కష్టాలు తెచ్చిపెట్టిందని, కానీ కష్టాలతో ప్రజలు చేస్తున్న లాక్డౌన్ ఎన్నో జీవితాలు కాపాడిందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నెల రోజుల్లో కరోనా వైరస్ ఉధృతి నిలకడగా ఉంది. ఈ 30 రోజుల్లో కరోనా టెస్టులు 33 రెట్లు పెరిగాయి. అయినా ఇది సరిపోదు.. ఆ విషయం మాకూ తెలుసు. అందుకే విస్తృత స్థాయిలో కరోనా టెస్టులు చేస్తూ ముందుకెళ్తున్నాం. కరోనా విస్తృతిని ఒక స్థాయికి పరిమితం చేయగలిగాం. టెస్టులు, పాజిటివ్ కేసుల నిష్పత్తి మొదటి నుంచి ఒకేలా ఉంది. 5 లక్షల టెస్టుల్లో యూకే 80వేల పాజిటివ్, ఇటలీలో 1 లక్షకు పైగా ఇలా.. పశ్చిమ దేశాల్లో ప్రతి 5 లక్షల టెస్టులకు పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ( 24 గంటల్లో 1409 పాజిటివ్ కేసులు ) దక్షిణ కొరియాలో మాత్రం టెస్టుల సంఖ్యకు, కేసుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం చాలా ఉంది. పశ్చిమ దేశాలతో పోల్చితే దక్షిణ కొరియా బాగా పనిచేసింది. టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్ ఒక వ్యూహం. ఇది కొత్త సవాల్. సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాం. ప్రతి రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ఎదురవుతున్న సవాళ్లకు తగ్గట్టుగా వ్యూహాలు మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్లాం. అన్ని వనరులను వినియోగించుకుంటూ అవసరాన్ని మించి సంసిద్ధతను పెంచుకుంటూ వెళ్తున్నాం. సోషల్ డిస్టెన్సింగ్ కచ్చితంగా అమలు చేయడమే మన లక్ష్యం. వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారిని కాపాడుకోవాలి. మరణాల సంఖ్యను చాలా తక్కువకు పరిమితం చేయాలి. కోలుకునేవారి సంఖ్యను పెంచాల’’ని అన్నారు. ( దారుణం: బ్రతికుండగానే కళ్లు పీకి.. ) -
నల్లమల చుట్టూ భారీ కందకం
విలువైన ఎర్రచందనం వృక్ష సంపద ఉన్న నల్లమల అభయారణ్యం చుట్టూ భారీ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సి.కె.మిశ్రా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మిశ్రా... అరుదైన ఎర్రచందనం వృక్ష సంపదనును కాపాడటంలో భాగంగా ఈ కందకం తీస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలను కలుపుతూ మొత్తం 1,200 కిలో మీటర్ల పొడవున ఇది ఉంటుందన్నారు. 3 మీటర్ల లోతున, 3 మీటర్ల వెడల్పులో ఈ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల అక్రమ రవాణాను అరికట్టవచ్చని, అడవిలో నుంచి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. భూగర్భ జలాలు కూడా పెరగటానికి ఎంతగానో దోహద పడుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 900 ఊట కుంటల నిర్మాణం, 250 చెక్ డ్యాంలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
టీమిండియా హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
చెలరేగిన స్టబ్స్, అభిషేక్.. లక్నో ముందు భారీ టార్గెట్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement