-
డమ్మీ ఈవీఎంతో ఎమ్మెల్యే హడావుడి
-
అక్కడ ఎక్కడినుంచో ఎందుకు తెచ్చారు?
ఓ భారీ కుట్రను వెల్లడించడానికి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి సస్పెండయిన ఆప్ నేత కపిల్ మిశ్రా కూడా హాజరయ్యారు. కేజ్రీవాల్ బంధువుల పేరు మీద జరిగిన భూ కుంభకోణాలు, మంత్రుల విదేశీ పర్యటనలు తదితర అంశాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా అటు నుంచి అటే అసెంబ్లీ సమావేశానికి ఆయన వచ్చేశారు. ఇక ఈ సమావేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రస్తావించారు. ఆప్ నాయకులతో కలిసి తాను ఈవీఎంల గురించి పలు ప్రశ్నలతో ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లానని, అయితే తమకు అక్కడినుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని ఆమె చెప్పారు. అయినా ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలకు ఎక్కడో రాజస్థాన్ నుంచి ఈవీఎంలు తేవాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. విచారణ కోసం ఈవీఎంలను స్వాధీనం చేసుకోవాలని బాంబే హైకోర్టు ఇటీవల ఆదేశించిందని, అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు కూడా ఏకంగా 2446 ఈవీఎంలను సీజ్ చేసిందని చెప్పారు. ఎన్నికలలో ఓడిపోయినందుకో లేదా ప్రచారం కోసమో ఈవీఎంల అంశాన్ని లేవనెత్తడం లేదని ఆమె చెప్పారు. పదేళ్ల పాటు ఎంసీడీలో దుష్ట పరిపాలన చేసిన తర్వాత బీజేపీ మళ్లీ ఈ స్థాయిలో మెజారిటీ సాధిస్తుందని ఎవరూ అనుకోలేదని, అందువల్ల ఇందులో వాస్తవం ఏంటో బయటకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో అన్న అంశాన్ని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ అసెంబ్లీలో చేసి చూపించారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement