-
జనరల్ సీట్లో గెలిచినా అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ, ఎస్సీ, బీసీలతోపాటు మహిళలకు రిజర్వ్ చేసిన మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ఆయా వర్గాలకు రిజర్వ్ స్థానం నుంచే కాకుండా జనరల్ సీటు నుంచి గెలిచిన వారు కూడా పోటీకి అర్హులే. జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే స్పష్టతనిస్తూ సర్క్యులర్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు, మహిళలకు రిజర్వ్ చేసిన చైర్మన్, మేయర్ పదవులకు సంబంధిత రిజర్వేషన్ స్థానం నుంచి కాకుండా జనరల్ స్థానం నుంచి సదరు కేటగిరికి చెందిన వ్యక్తి గెలిచినా ఆయా పదవులకు పోటీ చేసేందుకు అర్హులని స్పష్టతనిచ్చింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వ్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ఆయా కేటగిరీల వారు జనరల్ సీటు నుంచి పోటీచేసి గెలిచినా ఆయా పదవులకు పోటీ పడవచ్చునని పేర్కొన్నారు. -
పోటీ రసవత్తరం
వికారాబాద్, న్యూస్లైన్ : మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్కు రిజర్వ్ కావడంతో వికారాబాద్లో పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకునేందుకు మాజీ కౌన్సిలర్లతో పాటు ఆయా పార్టీల్లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్ల కోటాలో గెలిచి ఆయా వార్డుల్లో పెత్తనం చెలాయించిన వారు.. ప్రస్తుతం జనరల్ వార్డులపై కన్నువేశారు. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టాలంటే ఉన్న జనరల్ వార్డుల నుంచే ఎన్నికవ్వాలి కాబట్టి.. పట్టణంలోని 3, 4, 10, 12, 24 వార్డులపై అందరూ దృష్టి సారించారు. ఎక్కడైతే పోటీ, ఖర్చు తక్కువగా ఉంటుందో ఆ వార్డుల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే ఏకంగా వేర్వేరు వార్డుల్లో భార్యాభర్తలు పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇదిలాఉంటే ఎలాగైనా సరే చైర్మన్ పదవి దక్కించుకోవాలనే వ్యూహంతో అందరూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రెండు మూడు రోజులుగా మాజీ కౌన్సిలర్లు, బంధువులు, అనుచరులతో కలిసి ఆయా వార్డులకు వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. పాత పరిచయాలు గుర్తు చేస్తూ, దూరపు బంధుత్వాలు కలుపుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆయా వార్డుల్లోని ముఖ్య నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఆయా పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారు కూడా ప్రయత్నాల్లో, ప్రచారంలో తీసిపోవడం లేదు. ఆయా వార్డుల్లో తమ వర్గానికి చెందిన ఎన్ని ఓట్లు ఉన్నాయనేది లెక్కలు తీస్తున్నారు. అలాగే తమకు ప్రత్యర్థులుగా నిలిచేదెవరు, వారికి ఎవరితో ఫోన్ చేయిస్తే వింటారు అనే అంశాలపైనా దృష్టి సారించి, ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నెల పదో తేదీన నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండటంతో లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఎవరికి వారు అనుచరులను కూడగట్టుకొని అధిష్టానాల వద్ద బలనిరూపణకు సైతం సిద్ధమవుతున్నారు. పార్టీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్గానైనా సరే బరిలో దిగాలని పలువురు నిర్ణయించుకున్న ట్టు తెలుస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement