-
ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?
దేశంలో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ డబ్బును బ్యాంకుల్లో కాకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఎంత డబ్బు నిల్వ ఉంచవచ్చనే దానిపై పరిమితులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇంట్లో నిల్వ చేసే డబ్బుపై ఎలాంటి పరిమితి లేదు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పాలి. దానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. ఆ డబ్బు లెక్కలోకి రానిదై ఉండకూడదు. ఇంట్లో ఉంచిన డబ్బుకు పత్రాలు సరిపోలకపోతే ఆదాయపు పన్ను అధికారులు మొత్తం డబ్బుపై 137 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లెక్కలోకిరాని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవచ్చు కూడా. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! నిబంధనలు ఏం చెబుతున్నాయి? అటువంటి జరిమానాలు పడకూడదంటే నగదుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయినా ఏదైనా రుణం లేదా డిపాజిట్ రూ. 20,000లకు మించి నగదు రూపంలో తీసుకునేందుకు వీలు లేదు.ఈ నిబంధన ఆస్తి లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిగితే దానికి సంబంధించి లెక్కా పత్రాలు గనుక లేకపోతే ఐటీ అధికారులు జరిమానా విధిస్తారు. ఒకేసారి రూ. 50,000లకు మించి డిపాజిట్ లేదా విత్డ్రా చేసేటప్పుడు పాన్ నంబర్లు, ఆధార్, ఇతర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ఇక ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించి రూ. 30 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో చెల్లించినా, తీసుకున్నా విచారణకు లోబడి ఉండాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ని ఉపయోగించి ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసినా విచారణ ఉంటుంది. -
లెక్కల ‘పంచాయితీ’
సాక్షి, కొత్తగూడెం: పంచాయతీ ఎన్నికల్లో డబ్బు వరదలా పారింది. ఎంత కట్టడి చేసినా మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేశారు. నిబంధనలకు నీళ్లొదిలారు. ఎన్నికల తతంగం ముగిసి నెలరోజులైనా ఇప్పటి వరకు ఖర్చు వివరాలను మాత్రం అధికారులకు అందజేయలేదు. అసలు ఎలా చూపాలోనని గెలుపొందిన అభ్యర్థులు హైరానా పడుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఓటమి చెందిన వారు కూడా ఖర్చు వివరాలు అందజేయాలని జిల్లా అధికారులు సూచించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఆ వివరాలు సమర్పించలేదు. జిల్లాలో 758 పంచాయతీలుండగా 39 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 7 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగలేదు. రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా రూ. కోట్లలో ఖర్చు పెట్టారు. ఈ ఖర్చు వివరాలు రప్పించే విషయంలో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులతో పాటు పంచాయతీ యంత్రాంగం నిర్లక్ష్యంగానే వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. ఖర్చు వివరాలు సేకరించాల్సింది ఎంపీడీఓలే అన్నట్టుగా జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారులు, తాము కాదు పంచాయతీ శాఖ వారేనని ఎంపీడీఓలు.. ఇలా ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఖర్చు వివరాలను నమోదు చేయడానికి మండలాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు ఆడిట్ కోసం సహకార శాఖకు చెందినవారిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. దీంతో పాటు తహశీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కింది నుంచి పై స్థాయి వరకు కేవలం ఎన్నికల ఖర్చు వివరాలు సేకరించేందుకే వ్యవస్థలు ఏర్పాటు చేసినా నేటికీ ఏ ఒక్కరి నుంచి కూడా తీసుకోలేకపోయారు. ఈ అధికారులంతా గ్రామాల్లో పర్యటిస్తూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు నమోదు చేయాలి. కానీ సిబ్బంది కొరతను సాకుగా చూపి నమోదు చేయకుండానే వదిలేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆడిటర్ వద్దకు వచ్చిన లెక్కలు తప్పితే క్షేత్ర స్థాయిలోకి వచ్చి ప్రచార ఖర్చును లెక్కించలేకపోయారు. గెలిచిన అభ్యర్థుల తర్జన భర్జన.. ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్, వార్డు అభ్యర్థులు అసలు ఎన్నికల ఖర్చు విషయాన్నే పట్టించుకోవడం లేదు. కానీ ఎన్నికల సంఘం మాత్రం వీరు కూడా ఖర్చు వివరాలు అందజేయాలని పేర్కొంది. వీరి విషయాన్పి పక్కన పెడితే గెలిచిన అభ్యర్థులు లెక్క చూపడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఎంత చూపితే ఏమవుతుందోనని హైరానా పడుతున్నారు. రూ. లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన సర్పంచ్ అభ్యర్థులు దేనికి ఎంత ఖర్చు చేశామని ప్రాథమికంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఇదంతా చూపితే తమ పదవికే ముప్పు వస్తుందని.. తగ్గించి చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఎలా ఖర్చు చూపారని మాజీ సర్పంచ్లను అడిగి తెలుసుకుంటున్నారు. రూ. లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు.. 2006 వరకు గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల ఖర్చు వివరాలు స్వయంగా అప్పగించేవారు. కానీ ప్రస్తుతం పోటీ చేసిన అభ్యర్థులంతా లెక్కలు సమర్పించాలన్న నిబంధన విధించారు. లెక్కలు చూపించకపోతే మూడేళ్ల పాటు మరే ఎన్నికల్లోనూ పోటీచేసే అవకాశం లేదని హెచ్చరిక సైతం జారీ చేశారు. నిబంధనల ప్రకారం 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ. 80 వేలు, వార్డు సభ్యులు రూ.10 వేలు, 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.40 వేలు, వార్డు సభ్యులు రూ. 6 వేలు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేయాలి. కానీ అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా ఖర్చు చేశారు. పలు మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు రూ.కోటి వరకు కూడా ఖర్చు పెట్టారు. వివరాలు అందజేయాల్సిందే : డీపీఓ ప్రభాకర్రెడ్డి అభ్యర్థులు ఖర్చు వివరాలు గడువులోపు సమర్పించకుంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. వచ్చే నెల 2న అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి అందజేస్తాం. ఈ లోపు ఓడిన, గెలుపొందిన అభ్యర్థుల ఖర్చు వివరాలు సంబంధిత అధికారులకు అందజేయాలి.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement