-
కిరోసీన్ మారుతోంది
నల్లబజారుకు తరలుతున్న బ్లూ కిరోసిన్ చాకచక్యంగా దోపిడీ చేస్తున్న డీలర్లు లీటర్ కిరోసిన్ రూ.30 వరకు విక్రయం కన్నెత్తి చూడని అధికార గణం లబోదిబోమంటున్న కార్డుదారులు పేదలకు అందాల్సిన సబ్సిడీ కిరోసిన్ చౌకదుకాణాల డీలర్ల చేతివాటంతో యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతోంది. లీటరు కిరోసిన్ రూ.30 వరకు విక్రరుుంచి జేబులు నింపుకుంటున్నారు. దీనిపై ప్రశ్నించిన కార్డుదారులపై కొందరు డీలర్లు భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో మొత్తం 10,27,892 కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులు ఉన్నారుు. ప్రతినెలా ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా సబ్సిడీపై 11.4 లక్షల లీటర్ల మేరకు కిరోసిన్ పంపిణీ చేస్తోంది. గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలకు లీటరు రూ.15 చొప్పున, గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు లీటరుకు రూ.4 చొప్పున పెంపుదల చేసి రూ.19 మేరకు విక్రరుుస్తున్నారు. ఈ విధానాన్ని ఈ నెల కోటా నుంచి అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న 6,95,188 కుటుంబాలకు పెంపుదల చేసిన రేట్లు వర్తిస్తారుు. ఇలా దోపిడీ సబ్సిడీ కిరోసిన్ను చౌకదుకాణాల ద్వారా ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు పంపిణీ చేయాలి. బియ్యం, చక్కెర, వివిధ సరుకులతోపాటు కిరోసిన్నూ డీలర్లు ఒకేసారి అందించాలి. అరుుతే కొందరు డీలర్లు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రేషన్ సరుకులు అందించే సమయంలో కిరోసిన్ ఇవ్వడం లేదు. ఇదేమని లబ్ధిదారులు ప్రశ్నిస్తే ‘కిరోసిన్ ఇవ్వడం వల్ల చేతు లు పాడవుతారుు, అదే చేతులతో రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల అవికూడా కిరోసిన్ వాసన వస్తా రుు, వారం తరువాత రండి’.. అంటూ బోల్తాకొట్టిస్తున్నారు. బయోమెట్రిక్ విధానంలో కిరోసిన్ ఇచ్చినట్లు వేలిముద్రలు వేసి తిప్పి పంపుతున్నారు. తీరా వారం తర్వాత వచ్చినాలబ్ధిదారులకు కిరోసిన్ ఇవ్వడంలేదు. టైం అరుుపోరుుందంటూ బుకారుుస్తున్నారు. గట్టిగా నిలదీస్తే ‘అధికార’ అండదండలు చూసుకుని కొందరు భౌతిక దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా ఏజెంట్లు సబ్సిడీ కిరోసిన్ను నల్ల బజారులో విక్రరుుంచేందకు ఏజెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లోని ప్రొవిజన్ షాపులు, చిల్లర దుకాణాలను వారు ఆవాసంగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. డీలర్లు దోపిడీ చేసిన కిరోసిన్ను గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట ఏజెంట్లకు తరలిస్తున్నారు. వారి వద్ద రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఏజెంట్లు సేకరించిన కిరోసిన్ను లారీ డ్రైవర్లు, ఫ్యాక్టరీలకు రూ.40 చొప్పున విక్రరుుస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేమి చౌకదుకాణాల్లో రేషన్, కిరోసిన్ పంపిణీపై ఎప్పటికప్పుడు పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలి. అరుుతే సంబంధిత అధికారులు చౌకదుకాణాలకు వెళ్లిన దాఖలాలు లేవు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నారుు. కిరోసిన్ ఇవ్వడంలేదు ప్రతినెలా 1 నుంచి 15 తేదీ వరకు రేషన్ మాత్రం ఇస్తున్నారు. కిరోసిన్ ఇవ్వడంలేదు. డీలర్ను ప్రశ్నిస్తే మేము ఉన్నప్పుడు వస్తే ఇస్తాం, లేదంటే ఇవ్వడం కుదరదని చెబుతున్నారు. - అశ్విని, గిరింపేట, చిత్తూరు -
సబ్సిడీ కిరోసిన్పై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: సబ్సిడీలు పక్కదారి పట్టకుండా ఆహారం, ఎరువులకు సంబంధించి ప్రయోగాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన కేంద్రం తాజాగా కిరోసిన్పై దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కిరోసిన్ను ఇంధనంగా వినియోగిస్తున్నారని, అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇది నల్లబజారుకు తరలిపోతోందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆన్నారు. దీన్ని నివారించేందుకు కిరోసిన్ను ఇంధనంగా వాడకుండా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఛండీగఢ్, హర్యానాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు. తదుపరి వ్యవస్ధీకరించాల్సిన వస్తువుల జాబితాలో కిరోసిన్ ఉన్నప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ కిరోసిన్ను ఇంధనంగా వినియోగిస్తున్నందున ఈ సమస్యకు తగిన పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే కిరోసిన్ రాయితీని నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా 2016–17 సంవత్సరంలో ఏడు రాష్ట్రాల్లోని 39 జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ పక్కదారి పట్టకుండా నివారించడంవల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు మిగులుతాయని, వాటిని సామాజిక కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు. -
ఇంధన సబ్సిడీలకు 22,000 కోట్లు కావాలి..
ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెట్రోలియం శాఖ లేఖ న్యూఢిల్లీ: వంటగ్యాస్, కిరోసిన్ సబ్సిడీల కారణంగా వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ద్వితీయార్ధంలో రూ.22,201 కోట్లు ఇవ్వాల్సిందిగా చమురు శాఖ కోరుతోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు సబ్సిడీల భారంపై పరిహారం కింద రూ.17,000 కోట్లను చెల్లించింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఓఎంసీల ఆదాయ నష్టాల్లో(రూ.51,110 కోట్లు) ఈ మొత్తం మూడో వంతు మాత్రమే. కాగా, ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి(అప్స్ట్రీమ్ ఆయిల్) కంపెనీలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా(ఓఐఎల్)లు రూ.31,926 కోట్లను భరించాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 50 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో ద్వితీయార్ధంలో అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీలు ఓఎంసీలకు ఆదాయ నష్టాల కింద ఎలాంటి చెల్లింపులూ జరపాల్సిన అవసరం లేదని కూడా పెట్రోలియం శాఖ పేర్కొంది. ఆర్థిక శాఖకు రాసిన లేఖలో ఈ వివరాలను తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత 2014-15 ఏడాదిలో ఓఎంసీలకు ఆదాయ నష్టాలు(మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇంధనాలను విక్రయించడం కారణంగా) రూ.74,773 కోట్లుగా అంచనా.
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement