-
నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
-
అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉండదు
సాక్షి, అమరావతి/విశాఖ దక్షిణ: వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ ప్రాంతాల్లో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. రుతు పవనాల కదలిక జోరుగా ఉందని, ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
కొత్త రకం వానలివి!
సాక్షి, హైదరాబాద్: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి.. కేరళ నుంచి గుజరాత్ వరకు వానలు పడితే.. అది నైరుతి రుతుపవనాలు అని చెప్పుకొంటాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపానులు, అల్పపీడనాలతో వానలు కురిస్తే ఈశాన్య రుతుపవనాలు.. మరి ఎక్కడో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో పశ్చిమ తీరంలోని గుజరాత్లో వానలు కురిస్తే..! ఇదిగో ఇలాంటి అరుదైన, వింత వర్షాలు కురుస్తున్నాయి ఈ ఏడాది. ఈ పరిణామానికి పేరేమీ లేదు కానీ.. వాతావరణ విచిత్రాల్లో ఇదీ ఒకటిగా మాత్రం చూడాల్సి ఉంటుంది. గత 20 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ఇలా జరిగిందట. రెండు రుతుపవనాలకు కాస్త భిన్నం.. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ప్రభావం చూపే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరంతో పాటు ఈశాన్య, మధ్య భారతాన్ని వానలతో నింపితే.. ఆ తర్వాత తూర్పు తీరం వెంబడి వానల ప్రభావం చూపేందుకు ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. గాలి వీచే వేగం, దిశల్లో మార్పుల్లేని కారణంగా ఈ దృగ్విషయాల్లో తేడాలు చాలా తక్కువే. కానీ ఈ ఏడాది చాలా ఏళ్ల తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రభావం గుజరాత్, రాజస్తాన్ల వరకూ విస్తరించింది. వాతావరణ వ్యవస్థలు (అల్పపీడం, తుపానులు వంటివి) బలంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంటాయని, కాకపోతే చాలా అరుదుగా జరుగుతుందని దేశంలో తొలి వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్కు చెందిన శాస్త్రవేత్త పల్వట్ మహేశ్ ‘సాక్షి’కి తెలిపారు. 2007లో యామిన్ తుపాను చూసుకుంటే.. బంగాళాఖాతంలో పుట్టి.. గుజరాత్ మీదుగా అరేబియా సము ద్రం దాటి పాకిస్తాన్లోని కరాచీ వరకూ సా గింది. జూన్ 17న దీన్ని తొలిసారి గుర్తించా రు. ఆ తర్వాత ఏపీలోని కాకినాడ వద్ద తీరం దాటడంతో బలహీనపడుతుందని వాతావర ణ నిపుణులు అంచనా వేశారు. కానీ జూన్ 26 నాటికి ఇది కరాచీ చేరుకుని అక్కడ భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుపాను కారణంగా భారత్లో దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోగా.. పాక్లో 213 మంది చనిపోయా రు. యామిన్ తర్వాత అంతటి బలమైన వా తావరణ వ్యవస్థ ఏర్పడటం ఇదే తొలిసారి. గాలి దిశలో మార్పు ప్రభావం.. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభా వం తెలంగాణ, విదర్భ ప్రాంతాల వరకు కన్పిస్తుంది. ఈ కారణంగానే సెప్టెంబర్, అక్టోబర్ తొలి 2 వారాల్లో అడపాదడపా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. నేలపై గాలి వాయవ్య దిశగా వీస్తూ ఉండటం వల్ల.. వాతావరణ వ్యవస్థ నేలపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఫలితం గా బలహీనపడేందుకు అవకాశాలు ఎక్కు వగా ఉంటాయి. అయితే ఈ ఏడాది గాలి వా యవ్యం వైపు కాకుండా పశ్చిమం వైపు తిరగడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగని అన్ని అల్పపీడనాలు గుజరాత్ వర కు ప్రయాణిస్తున్నాయా.. అంటే అదీ లేదు. ఆగస్టులో దాదాపు 5 అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ వాటిల్లో బలమైనవి ఏవీ లేవు. కొన్ని తెలంగాణ వరకూ ప్రయాణించాయి. మరికొ న్ని విదర్భ అంచులు తాకాయి. కానీ అక్టోబర్ లో ఏర్పడ్డ అల్పపీడనం మాత్రం గుజరాత్ వ రకు ప్రయాణించింది. 2007, 2020 రెండిం టిలోనూ సూర్యుడిపై ఏర్పడే మచ్చల (పే లుళ్ల ఫలితంగా నల్లగా కనిపించే ప్రాంతాలు) తక్కువగా ఉండటం కొసమెరుపు! -
అల్పపీడనాలే ఆదుకున్నాయ్!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో అల్పపీడనాలే ఆదుకున్నాయి. సీజన్ ఆరంభమైనప్పట్నుంచి ముగిసే వరకు బంగాళాఖాతంలో ఐదు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఒక్క వాయుగుండంగానీ, తుఫాన్గానీ ఏర్పడకుండానే సమృద్ధిగా వర్షాలు కురిశాయి. జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ ఆఖరు వరకు నైరుతి రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కనీసం రెండు వాయుగుండాలుగానీ, ఒకట్రెండు తుఫాన్లుగానీ వస్తుంటాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అల్పపీడనాలే పుష్కలంగా వర్షాలు కురిపించి రైతులకు, రాష్ట్రానికి మేలు చేశాయి. వీటితో పాటు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణులు వంటివి మరో 12 వరకూ ఏర్పడ్డాయి. ఇవి కూడా రాష్ట్రంలో వర్షాలకు దోహదపడ్డాయి. కోస్తా కంటే సీమలోనే అత్యధిక వర్షపాతం సబ్ డివిజన్వారీగా చూస్తే కోస్తాంధ్ర కంటే ఈ సారి రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అక్కడ 411.6 మి.మీల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 756.1 మి.మీల వర్షం కురిసింది. సీమలో అత్యధికంగా కడప జిల్లాలో 401.3 మి.మీలకు గాను 843.6 మి.మీలు నమోదైంది. ఇక కోస్తాంధ్ర (యానాంతో కలిపి)సబ్డివిజన్లో సాధారణ వర్షపాతం 586.9 మి.మీ కాగా, 725.3 మి.మీల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా మినహా.. రాష్ట్రంలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే లోటు వర్షపాతం నమోదైంది. అక్కడ 742.4 మి.మీలకు 558.5 మి.మీల వర్షపాతమే రికార్డయింది. నెలలవారీగా చూస్తే జూలైలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టులో స్వల్పంగానే వానలు పడా ్డయి. జూన్లో 32 శాతం, జులైలో 74 శాతం, ఆగస్టులో 6 శాతం, సెప్టెంబర్లో 58 శాతం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. పొంగుతున్న వాగులు, వంకలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యా ప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, ఓర్వకల్లు మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాపాఘ్ని నది ఉప్పొంగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో గరిష్టంగా 76.8 మి.మీ. వర్షం కురిసింది.విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలతో వాగులు, వంకలు, చెక్డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు పలుచోట్ల కోతకు గురైంది. ఇక్కడి జియోట్యూబ్ రక్షణ గోడ పూర్తిగా ధ్వంసమైంది. కృష్ణమ్మకు మళ్లీ వరద ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 38,516 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రాత్రి 7 గంటలకు రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి మొత్తం 56,058 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వగా ఉండగా, డ్యామ్ నీటిమట్టం 885 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఆదివారం దాదాపు 52 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ముందు జాగ్రత్తగా 16 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
ఇక చలి పంజా..!
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement