-
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్కుమార్గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నకు ప్రేమతో.. కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్ర సర్వీసుకు..
సాక్షి, అమరావతి: ఆ తండ్రి కుమారుడిని వేలు పట్టుకుని నడిపించారు. అంతగా అక్షరాలు తెలియని ఆయన తన బిడ్డ ఆర్డీఓ కావాలని, పది మందికీ సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆ విష యాన్ని కుమారుడితో పాటు బంధువులు, ఊరి ప్రజలతో పదేపదే చెప్పేవారు. కొన్నాళ్లకు ఆ కుమారుడు తన తండ్రి కోసం చేస్తున్న ఉద్యోగాన్ని కాదని ఆర్డీఓ ఉద్యోగంలో చేరాడు. నాన్న కలను నెరవేర్చాడు. ఆ కుమారుడే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సేనాపతి ఢిల్లీరావు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తన కోసం తండ్రి తపించిన తీరును, ఆయన కల నెరవేర్చిన వైనాన్ని కలెక్టర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పిడిమందస. మాది పేద కుటుంబం మాది. అమ్మానాన్న అంతగా చదువుకోలేదు. ఇంటికి నేనే పెద్ద కొడుకుని. నాన్న త్రినాథ్ పనులపై బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వరకు అంతా వేచి ఉండి, వచ్చాకే భోజనం చేసేవాళ్లం. ఎప్పుడైనా ఆయన రావడం ఆలస్య మైతే నేను నిద్రపోయేవాడిని. నాన్న వచ్చాక నన్ను నిద్రలేపి తన చేత్తో ఓ ముద్ద తినిపించి తిరిగి నిద్రపుచ్చేవారు. నన్ను బాగా చదివించి ఆర్డీఓను చేయాలన్నది నాన్న కల. విశాఖ సింహాచలం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే నన్ను తనే రైల్లో తీసుకెళ్లేవారు. చదవండి: (నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు) అలా తీసుకెళ్లేటప్పుడు నువ్వు బాగా చదువుకుని ఆర్డీఓ కావాలి నాన్నా.. అనేవారు. మా ఊరి వాళ్లతోనూ, బంధుగణంతోనూ అదే చెబుతుండేవారు. మా వాడు తహసీల్దారుకన్నా పెద్ద ఆఫీసర్ ఆర్డీఓ అవుతాడనేవారు. దురదృష్టవశాత్తూ నా ఇంటర్ అయ్యాక ఆయన చనిపోయారు. నేను చదువు పూర్తి చేసుకుని 2003లో కేంద్ర సర్వీసుకు చెందిన అగ్రికల్చర్ రీసెర్చి సర్వీసు ఇనిస్టిట్యూట్లో సైంటిస్ట్ ఉద్యోగంలో చేరాను. నాన్న కోసం కేంద్ర సర్వీసును వదిలి 2007లో రాష్ట్ర సర్వీసులకొచ్చాను. 2008 మార్చిలో విజయనగరం జిల్లా ఆర్డీఓగా చేరి నాన్న కల నెరవేర్చాను. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత గుంటూరు ఆర్డీఓగా, రాష్ట్రంలో పలు చోట్ల ఇతర హోదాల్లోనూ పనిచేశాను. ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాను. నాన్న కోరుకున్నట్టుగా ఆర్డీఓ అయ్యాను. ఆర్డీఓకు మించి కలెక్టర్ స్థాయిలో ఉన్న నన్ను చూస్తే నాన్న ఎంత మురిసిపోయేవారో. కానీ విధి ఆయన్ను మా నుంచి దూరం చేసింది. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నాన్న ఆశీస్సులతోనే నేను ఆర్డీఓగా, కలెక్టర్గా ఎదిగానని భావిస్తున్నాను. మహేష్కుమార్ రావిరాల, జాయింట్ కలెక్టర్, కృష్ణాజిల్లా నాన్న కోరిక నెరవేర్చా మా నాన్న రావిరాల నరసయ్య రెవెన్యూ శాఖలో నల్గొండ పట్టణంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగపర్వం ప్రారంభించారు. నాకు, మా అన్నయ్యకు చదువులో చిన్ననాటి నుంచి మార్గం చూపేవారు. మా వెన్నంటి ఉండి మా అన్నదమ్ములను ఎంబీబీఎస్ వరకు చదివించారు. మా నాన్నలో ఉన్న చిన్ననాటి కోరిక తీరకపోవటం, చిన్న వయసులోనే ఆయన తండ్రి చనిపోవటంతో నన్ను సివిల్స్ వైపు నడిపించి ఐఏఎస్ అధికారి అయ్యేలా నా వెన్నంటి ఉండి నడిపించారు. 2016లో నేను ఐఏఎస్కు ఎంపికైనప్పుడు నా కోరికను నీలో చూసుకుంటున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మా కుటుంబం అంతా అంతులేని ఆనందం పొందాం. మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన మా నాన్నకు ఫాదర్స్డే శుభాకాంక్షలు. – మహేష్కుమార్ రావిరాల, జాయింట్ కలెక్టర్, కృష్ణాజిల్లా -
ఈటల అవినీతిలో టీఆర్ఎస్కు భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని, మాజీమంత్రి ఈటల రాజేందర్ అవినీతిలో టీఆర్ఎస్కు కూడా భాగస్వామ్యం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ ఆరోపించారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోమని అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఈటల ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెంచుతున్నందుకు బీజేపీకి ఓటేయాలా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని, దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారని మహేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ విద్యార్థి, నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ అని.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడిన వ్యక్తిని గెలిపించాలని కోరారు. -
జియో అమరావతి మారథాన్కు విశేష స్పందన
సాక్షి, అమరావతి: జియో అమరావతి మారథాన్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతిలోని మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్ద మొదలైన ఈ మారథాన్లో సుమారు 5000 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఏపీ రాజధానిలో జియో అమరావతి మారథాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. 5కే, 10కే, 21కే కేటగిరిల్లో పోటీలు నిర్వహించారు. 21కే రన్ను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఐఏఎస్ అధికారి క్రాంతిలాల్ దండే, ఐపీఎస్ అధికారి చంద్రశేఖర్లు జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు.10కే రన్ను మంత్రి నక్కా ఆనంద్ బాబు, స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్ను జియో ఏపీ సీఈవో మహేష్ కుమార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జియో అమరావతి మారథాన్ రన్లో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అమరావతి నగరం అభివృద్ధి కోసం నిర్వహించే రన్లో నగరవాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మరింతగా డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో మారథాన్లో భాగస్వాములమైనట్లు ఆయన తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
నాకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే..
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
దేశంలోనే అత్యధిక మెజారిటీ..
● హైలైట్స్..
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
చింతపండు బస్తాల మధ్య గంజాయి రవాణా..
చికిత్స పొందుతున్న సీపీఎం నాయకుడు మృతి
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రమాదంలో రాజ్యాంగం
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement