-
సీఎం సిద్ధరామయ్యకు ఆర్థికం
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకుని, ముఖ్యమైన నీటిపారుదల, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ విభాగాలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కేటాయించారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతోపాటు 8మంది మంత్రులు ఈ నెల 20న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 24 మందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. వీరిలో గతంలో హోం శాఖను నిర్వహించిన జి.పరమేశ్వరకు తిరిగి అదే శాఖను కట్టబెట్టారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖను ఎంబీ పాటిల్కు, కేజే జార్జికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్థిక శాఖతోపాటు కేబినెట్ వ్యవహారాలు, పరిపాలన సిబ్బంది వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్, ఐటీ తదితర ఇతరులకు ఇవ్వని శాఖలు సీఎం సిద్ధరామయ్య వద్దే ఉన్నాయి. శివకుమార్కు భారీ, మధ్యతరహా నీటి వనరులు, బెంగళూరు సిటీ డెవలప్మెంట్ శాఖలను ఇచ్చారు. హెచ్కే పాటిల్కు న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాలు, లెజిస్లేషన్, పర్యాటక శాఖలు, కేహెచ్ మునియప్పకు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలను కేటాయించారు. రామలింగారెడ్డికి రవాణా, ముజ్రాయ్ శాఖలను ఇచ్చారు. హెచ్సీ మహదేవప్పకు సాంఘిక సంక్షేమం, సతీశ్ జర్కిహోళికి పబ్లిక్ వర్క్స్ శాఖలను అప్పగించారు. శివానంద పాటిల్కు టెక్స్టైల్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ బాధ్యతలు కేటాయించారు. దినేశ్ గుండూరావుకు ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, రెవెన్యూ శాఖను కృష్ణ బైరెగౌడకు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను ఇచ్చారు. ఏకైక మహిళా మంత్రి లక్ష్మి ఆర్ హెబ్బాల్కర్కు మహిళ, శిశు అభివృద్ధి, సీనియర్ సిటిజన్ సాధికారిత శాఖ ఇచ్చారు. -
రేపే కేంద్ర కేబినెట్ విస్తరణ.. 5 రాష్ట్రాలకు ప్రాధాన్యం?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొనసాగుతుంది. జూలై 7న(బుధవారం) కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. రేపు సా.5:30 నుంచి 6 గంటల మధ్య కేబినెట్ విస్తరణ జరుగనుంది. తొలుత జూలై 7వ తేదీన కేబినెట్ పునర్వీవ్యవస్థీకరణ జరుగనున్నట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత జూలై 8వ తేదీన కేబినెట్ విస్తరణ జరపాలని నిర్ణయించారు. కాగా, మళ్లీ ముందు అనుకున్న తేదీ ప్రకారం జూలై 7వ తేదీనే కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు మొగ్గు చూపారు. ఈ కేబినెట్లో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం దక్కనుంది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 53 మందితోనే మంత్రివర్గం కార్యకలాపాలు కొనసాగిస్తుంది. మిగిలిన 28 స్థానాలను మరో రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ముఖ్యనేతలతో భేటీ అయినట్లు తెలిసింది. కేబినెట్ విస్తరణ గురించి ఈ భేటీలో చర్చించనున్నారని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆశావాహుల జాబితాలో సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, జేడీయూ నాయకులు ఆర్సీపీ సింగ్, లల్లన్ సింగ్ (బిహార్), అప్నా దళ్ నేత అనుప్రియ పాటిల్, పంకజ్ చౌదరి(యూపీ), కైలశ్ విజయవర్గీయ (మధ్యప్రదేశ్), నారాయణ రాణే (మహారాష్ట్ర), రీటా బహుగుణ జోషి, రామశంకర్ కథేరియా (యూపీ), పశుపతి పారస్, రాహుల్ కశ్వన్, చంద్రప్రకాశ్ జోషి (రాజస్థాన్) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. -
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక శాఖ లేకపోవడం బాధాకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతమున్న సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బీసీలకు సంబంధించిన అనుకూల సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడంలో తీవ్ర అన్యాయం చేసిందని, ప్రత్యేక శాఖ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి పాలన సాగించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. -
సేనకు హోం, ఎన్సీపీకి ఆర్థికం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల శాఖలు ఖరారయ్యాయి. కీలక హోం మంత్రిత్వ శాఖను శివసేన తన వద్ద అంటిపెట్టుకుంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేకు హోంతో పాటు పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటక, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖలు, మరో శివసేన మంత్రి సుభాష్ దేశాయ్కి పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, యువజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్కు ఆర్థిక శాఖను, గృహనిర్మాణం, మరికొన్ని శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్భల్కు నీటి పారుదల, గ్రామీణాభివృద్ది శాఖలు కేటాయించారు. కాంగ్రెస్ మంత్రి బాలాసాహెబ్ తోరట్కు రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖలు ఇచ్చారు. మరో కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్కు పీడబ్ల్యూడీ, గిరిజనాభివృద్ధి శాఖలు అప్పగించారు. కాగా. గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 79వ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన నివాసంలో పూలగుచ్ఛం అందజేశారు. -
ఫిరాయింపు నేతల్లో ముగ్గురికి మంత్రి పదవులు
పనాజీ: కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం లభించనుంది. వారితో పాటు డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబోను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్టు అధికార బీజేపీ నాయకుడొకరు తెలిపారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ) మంత్రులు ముగ్గురినీ తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. గోవాలో ప్రమోద్ సావంత్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జీఎఫ్పీ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సరదేశి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోవా శాసన సభలోని 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పది మంది గత బుధవారం బీజేపీలో చేరారు. వారితో కలిసి లోబో శుక్రవారం ఢిల్లీలో అమిత్షాను కలిసి వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో 40 మంది సభ్యులున్న శాసన సభలో బీజేపీ బలం 27కు పెరిగింది. ఇదిలా ఉండగా, తమ మంత్రివర్గంలోని జీఎఫ్పీకి చెందిన ముగ్గురు మంత్రులను రాజీనామా చేయాలని కోరినట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. అలాగే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల రోహన్ కాంటేను కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలని అడిగినట్టు చెప్పారు.మంత్రి వర్గంలోకి కొత్తగా నలుగురిని తీసుకుంటున్నందున వీరి రాజీనామాలను కోరినట్టు శుక్రవారం ఆయన తెలిపారు.అధిష్టానం చెప్పిన మేరకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement