-
పొరుగు ఇళ్లకు క్వారంటైన్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఉన్నారు. నేడు కరోనా వైరస్ భూతం చేరింది. అనుమానపు చూపులతో విభజన రేఖ గీసింది. అమెరికా నుంచి వచ్చారు.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. క్వారంటైన్కు వెళ్లాల్సిందేనని పొరుగిళ్లవారు.. మా ఇల్లు.. మా ఇష్టం ఇక్కడే ఉంటామని ప్రవాసీల పంతం. ఒకప్పుడు అమెరికాలో ఉన్నా.. లండన్ వెళ్లి వచ్చినా.. స్టేటస్ సింబల్గా భావించే జనం.. ఇప్పుడు మాత్రం విదేశాల పేరు చెబితేనే వామ్మో అంటున్నారు. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్ బందంకొమ్ము ప్రాంతంలోని ఒక ఆపార్టుమెంటులో నివసించే కుటుంబం ఇటీవల యూఎస్కు వెళ్లివచ్చింది. ఐదుగురు కుటుంబసభ్యులు అమెరికా నుంచి నేరుగా ఇంటికే చేరుకున్నారు. ఎయిర్పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ చేసి కోవిడ్-19 లక్షణాలు లేకపోవడంతో పంపించేశారు. అయితే, ఈ విషయంలో ఆ నోటా..ఈ నోటా తెలుసుకున్న ఇరుగు పొరుగు ఫ్లాట్లలో నివసించే జనం.. అమెరికా నుంచి వచ్చారు కదా! క్వారంటైన్కు వెళ్లాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో పోలీసులు, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పరీక్షలు చేసేందుకు రావాలని కోరేందుకు ఆపార్ట్మెంట్కు చేరుకున్నారు. ఇంకేముంది అమెరికా నుంచి కుటుంబ సభ్యులు అంతెత్తున లేచారు. అసలు వీరిని పైకి(తమ ఫ్లోర్) ఎందుకు రానిచ్చారు అంటూ వాచ్మెన్పై ఎగబడ్డారు. చదవండి: విదేశీ ప్రయాణమే కొంపముంచిందా? ఆపార్ట్మెంటులో స్వీయ నియంత్రణ పాటించకుండా.. ఎడాపెడా సంచరిస్తున్న వీరితో ఆందోళనలో ఉన్న ఆపార్ట్మెంటు వాసులకు.. కనీసం టెస్టులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్న వీరి వైఖరి అంతుబట్టక లబోదిబోమంటున్నారు. చాలా ఆపార్ట్మెంట్లలో పరిస్థితి ఇలానే ఉంది. సెల్ఫ్ డిక్లరేషన్తో విదేశాలకు వెళ్లివచ్చినవారిని సెల్ఫ్ క్యారంటైన్కు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, తమ ఇంట్లోనే ఒంటరిగా ఉన్న వీరికి పక్క ఇళ్లవారితో చిక్కులు వస్తున్నాయి. ప్రభుత్వ క్వారంటైన్లో ఉండకుండా ఇలా రావడం వల్ల తమ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టాల్సివస్తోందని లబోదిబోమంటున్నారు. స్వేచ్ఛగా తిరిగిన తర్వాత బయటపడితే... ప్రజలంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రం ఏ మాత్రం భయపడకుండా బంధువులు, సన్నిహితులను కలుసుకుంటూ విందు, వివాహాలకు హాజరవుతూ జల్సా చేస్తున్నారు. విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ ఎలాంటి లక్షణాలు బయటపడలేదని చెబుతూ యథేచ్ఛగా సంచరిస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న పౌరులపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలకంటే ముందే బంధుమిత్రుల ఇళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్కు వెళ్లిన వీరిపై ఇప్పుడు నియంత్రణ విధించడం విడ్డూరంగా కనిపిస్తోంది. వాస్తవానికి కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ రెండువారాలు స్వీయ నియంత్రణ పాటించకుండా.. క్వారంటైన్లో ఉండకుండా స్వేచ్ఛగా తిరిగిన అనంతరం.. ఈ లక్షణాలు కనిపిస్తే పరిస్థితేంటనేది ఆర్థం కావడంలేదు. ఇటీవల ఐర్లాండ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న వ్యక్తి మరుసటి రోజే వివాహ ఆహ్వాన పత్రికతో ఇంట్లో వాలడంతో సదరు ఆహ్వానితుడు భయపడుతూ.. కార్డు తీసుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేసిన మరో యువకుడు ఏకంగా మరుసటి రోజే పోలీసు ఉన్నతాధికారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పొతే.. లెక్కలేనంత మంది.. రాష్ట్రానికి రావడమేకాదు.. అందరితో కలివిడిగా వ్యవహరించారు. ఇలాంటి చర్యలతోనే పాశ్చాత్య దేశాల్లో కరోనా విస్తృతి పెరిగిందనే సత్యాన్ని విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. పేరు మార్పుతో తిప్పలు కొసమెరుపు ఏమంటే..: చైనా పేరు వింటే వెన్నులో వణుకు పుడుతోందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. తాజాగా చెన్నై ఐఐటీలో చదివే ఓ విద్యార్థికి సెలవులు ప్రకటించడంతో ఇంటికి చేరాడు. అయితే, అతడు వచ్చింది చెన్నై నుంచి కాగా.. చైనా నుంచి వచ్చారనే పుకారు అందుకుంది. ఇంకేముందు పొద్దునే పోలీసులకు ఫోన్లు, తహసీల్దార్, ఎంపీడీవో, వైద్యాధికారుల పరుగో పరుగు. అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఇదెక్కడ జరిగిందో తెలుసా నాగర్కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తండా. -
పేదల పొరుగున పెరిగితే...
పేదరికం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో, ఆర్థికంగా వెనుకబడినవారు నివసించే ప్రాంతాల్లో ఉండే యువతుల్లో ఊబకాయ సమస్య అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. పేదరికం, ఊబకాయానికి మధ్య పాక్షిక సంబంధం ఉండే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. తక్కువ ఆదాయం ఉండేవారు నివసించే ప్రాంతాల్లో వ్యాయామ సౌకర్యాలు, ఆరోగ్యకరమైన ఆహారవనరులు లేకపోవడమే కాక, అధిక ఒత్తిడి కూడ ఊబకాయానికి కారణమౌతోందని చెప్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నవారు నివసించే ప్రాంతంలో ఎక్కువకాలం ఉండటం యువతుల జీవితకాల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని అమెరికా కొలరాడో డెన్వర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ లిప్పర్ట్ తెలిపారు. నేషనల్ సర్వే డేటాలోని ఏడవతరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పరిశోధన బృందం 13 సంవత్సరాలపాటు పరిశీలించింది. విద్యార్థులు బాల్యంనుంచి యుక్త వయసులోకి మారుతున్న సమయంలో వారు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి, వారిలో ఊబకాయం సమస్య సంక్రమిస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడి అయింది. పిల్లలు...బాల్యం నుంచీ యుక్త వయసు వరకూ పేదలు ఉండే ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే వారిలో ఊబకాయం సమస్య అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. అదే యుక్త వయసులోకి మారుతున్న సమయంలో పేదలు ఉన్న ప్రాంతంనుంచీ సంపన్న ప్రాంతానికి మారినప్పుడు ఊబకాయ సమస్య తక్కువగానూ, సంపన్న ప్రాంతంనుంచీ తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతానికి చేరినప్పుడు స్థూలకాయం సమస్య ఎక్కువవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా మురికివాడల్లోనూ, పేదలు నివసించే ప్రాంతాల్లోనూ ఎక్కువకాలం పెరిగిన యువతులు భవిష్యత్తులో ఊబకాయం సమస్యతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనల్లో వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువతులకు సానుకూల వనరులు సమకూర్చడం, నివాస పరిస్థితులు మెరుగు పరచడంవల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంగా కొనసాగే అవకాశం ఉంటుందని లిప్పర్ట్ సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement