-
గిరిజన యోధుడు..
ఆదర్శం: (కొమురం భీం): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల్ని రక్షించేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. గోండు గూడెం వాసులతో కలిసి గె రిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనులకు స్వయం పాలన కోసం నిజాం పాలనపై యుద్ధభేరి మోగించాడు. హైదరాబాద్, సాక్షి: దేశంలో బ్రిటిష్ పాలన రాకముందే గిరిజన సామ్రాజ్యం(క్రీ.శ 1240 - 1749) ఉండేది. ఆ గోండ్వానా (గోండు) రాజ్యాన్ని ఆ తరువాత మరాఠీలు హస్తగతం చేసుకున్నారు. సిపాయిల తిరుబాటు (1857) కంటే ముందే బ్రిటిష్ పాలకులపై గోండులు తిరుబాటు చేశారు. 1836 నుంచి 1860 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఘన చరిత్ర ఆదీవాసీలది. అప్పటి గోండ్వానాలో అంతర్భాగంగా ఉన్న ఉత్తర తెలంగాణ నిజాం నిరంకుశ పాలన చవిచూసిన రోజులవి. ఇలాంటి పరిస్థితుల్లో 1931- 40 మధ్యకాలంలో నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలపై తిరుబాటు బావుటాను యువ గోండు ధీరుడు కొమురంభీం ఎగురవేశాడు. ‘జల్-జంగల్ -జమీన్’ నినాదంతో గిరిజనుల స్వయం పాలన కోసం యుద్ధభేరి మోగించాడు. ఆదిలాబాద్ జిల్లా కెరిమరి మండలం సంకేపల్లిగూడెంలో కొమురం చిన్నూ, మోహినీబాబు దంపతులకు 1900లో కొమురం భీం పుట్టాడు. అటవీ సిబ్బంది దాడిలో తండ్రి కొమురం చిన్నూ మరణించడంతో తల్లితో కలిసి భీం మకాం సుర్ధాపూర్కు మారింది. భీం సాగు చేసే భూమిని నిజాం జాగీర్దార్ సిద్ధిఖ్ ఆక్రమించాడు. గోండులతో వెట్టిచాకిరీ చేయించాడు. బెదిరింపులకు, ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. గిరిజనులు అడవుల్లో పశువుల్ని మేతకు తీసుకువెళ్లినా, వంటచెరకు ఇంటికి తెచ్చినా ‘బంబ్రాం, దూపపెట్టి’ పేర్లతో నిజాం ప్రభుత్వం శిస్తు విధించింది. ఇదేమిటని ప్రశ్నించి పాపానికి జోడేఘాట్ పరిసరాల్లో ఇళ్లు, పంటల్ని ధ్వంసం చేశారు. దీంతో కొమురం భీం నిజాం పాలనపై ‘తుడుం’ మోగించాడు. సిద్ధిఖ్ను హతమార్చి అస్సాం వెళ్లి ఐదేళ్ల పాటు కూలి పనిచేస్తూ తల దాచుకున్నాడు. అక్కడే రాత్రి వేళ అక్షరాలను వంటబట్టించుకుని తిరిగొచ్చాడు. ఆసిఫాబాద్ పరిసరాల్లోని పన్నెండు గ్రామాలతో ‘గోండు రాజ్యం’గా ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచించాడు. జోడేఘాట్, బాబే ఝరీ, పట్నాపూర్, చల్బరిడి, శివగూడ, టెకెన్నవాడ, భీమన్గొంది, కల్లేగావ్, నర్సాపూర్, అంకుశాపూర్, లైన్ పటల్, శోశగూడ వంటి గోండు గూడెంల వాసులతో కలిసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. నిజాం సైన్యం ప్రతిదాడులు చేసి కొమురంకు కుడి, ఎడమ భుజాలుగా ఉండే కొమురం సూరు, లచ్చు పటేల్ను బంధించింది. పలువురు ఆదివాసీలను జైళ్లల్లో పెట్టింది. అయినా కొమురం భీం వెరవలేదు. దాంతో నిజాం ఒక మెట్టు దిగి గిరిజనుల భూములకు పట్టాలిస్తామన్నాడు. అడవిపై గిరిపుత్రులకు సర్వహక్కులు కావాలన్న భీం డిమాండ్ను నిజాం తోసిపుచ్చాడు. నిజాం సైన్యం నిఘా మరింత పెంచింది. కొరియర్గా వ్యవహరించిన కుర్ధు పటేల్ ఇచ్చిన సమాచారంతో భీం రహస్య స్థావరాలను నిజాం సైన్యం తెలుసుకుని అర్ధరాత్రి వేళ జోడేఘాట్ గుట్టల్ని చుట్టుముట్టింది. హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో కొమురం భీం 1940 సెప్టెంబర్ 1న వీరమరణం పొందాడు. -
ఎన్నికైన ప్రతిసారీ ప్రతిపక్షమే!
సిరిసిల్ల, న్యూస్లైన్: నిజాం నిరంకుశ పాలనపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు చెన్నమనేని రాజేశ్వర్రావు(92). తనయుడికి రాజకీయ భవితవ్యం ఇచ్చేందుకు ఐదున్నర దశాబ్దాల రాజకీయ జీవితం నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఎమెల్యేగా గెలిచిన ప్రతిసారీ ప్రతిపక్షంలోనే కూర్చుండడం విశేషం. రూ.పదిహేను వందలతో ఎమ్మెల్యేనయ్యానని చెప్పుకునే ఆయన గాంధీయిజం, మావోయిజం ప్రభావం తనపై ఉందంటారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని నాగారం రాజేశ్వర్రావు స్వగ్రామం. చెన్నమనేని శ్రీనివాసరావు, చంద్రమ్మ దంపతులకు పెద్ద కుమారుడు. హన్మంతరావు, వెంకటేశ్వర్రావు, విద్యాసాగర్రావు సోదరులు. విద్యాసాగర్రావు బీజేపీ నేతగా, కేంద్ర మాజీమంత్రిగా అందరికీ పరిచయమే. మరో సోదరుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హన్మంతరావు కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యుడు. రాజేశ్వర్రావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే భార్యతో సహా సాయుధ పోరాటం వైపు అడుగులు వేసి జైలు పాలయ్యారు. ముంబయిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను కలిసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. 1952లో చంచల్గూడ జైలు నుంచే నామినేషన్ పత్రాలు పంపినా గడువుకు అరగంట ఆలస్యంగా అవి ఎన్నికల అధికారికి చేరడంతో పోటీచేసే అవకాశం కోల్పోయారు. తర్వాత 1957, 1967, 1985, 1994, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. 1985 నుంచి 1989 వరకు శాసనసభలో సీపీఐ పక్షనేతగా కొనసాగారు. అదే సమయంలో సోదరుడు సీహెచ్.విద్యాసాగర్రావు బీజేపీ పక్షనేతగా కొనసాగారు. 1998లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 1999 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. తనయుడు చెన్నమనేని రమేశ్బాబు కోసం రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'లవ్ టుడే' హీరో కొత్త సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
అమేథీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దుండగుల దాడి, కార్ల ధ్వంసం
No Headline
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
జగన్తోనే పారదర్శక పాలన
సమరోత్సాహంలో యువత
గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
జనం చిత్రవధ
బాబుది ముమ్మాటికీ నిరాదరణే..
సంక్షేమంలో ఛాలెంజ్
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement