-
Tamil Nadu: పన్నీరు సెల్వంకు మరో షాక్
అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వంకు మరో షాక్ తగిలింది. ఆధిపత్య పోరులో తనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. ఓపీఎస్కు హ్యాండిచ్చే విధంగా ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని, ఇది వారి వ్యక్తిగతం అని అమిత్ షా స్పష్టం చేయడం పన్నీరు శిబిరాన్ని కలవరంలో పడేసింది. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, న్యాయ పోరాటం, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తె చ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి ఢి ల్లీ వెళ్లిన ఆయన అక్కడి పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. అదే సమయంలో కేంద్రం తనకు అనుకూలంగా ఉంటుందని, వారి ద్వారా పళని స్వామికి చెక్ పెట్టవచ్చనున్న ధీమాతో ఆ పార్టీ సమన్వయ కమిటీ పన్నీరు సెల్వం ఉంటూ వస్తున్నారు. చర్చకు ముగింపు.. ఢిల్లీ పర్యటన సందర్భంగా పళని స్వామికి అమిత్ షా హిత బోధ చేసినట్టు పన్నీరు సెల్వంతో పాటుగా మిగిలిన వారిని కలుపుకుని వెళ్లాలని క్లాస్ తీసుకున్నట్లుగా కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై పెద్దఎత్తు చర్చలు సాగడంతో పన్నీరు శిబిరంలో ఆనందడోలికల్లో తేలింది. కేంద్రం ద్వారా మళ్లీ అన్నాడీఎంకేను కై వసం చేసుకోవచ్చనే ధీమాతో తన బలాన్ని చాటే ప్రయత్నాలను పన్నీరు వేగవంతం చేశారు. అలాగే కేంద్రం ద్వారా పళణి స్వామితో రాయబారాలు జరపడం లేదా, కోర్టు తుది తీర్పు వ్యవహారంలో కేంద్రాన్ని ఆశ్రయించడం వంటి ఎత్తుగడలతో పన్నీరు ముందుకెళ్లారు. అయితే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. పన్నీరు శిబిరానికి పెద్ద షాక్ ఇచ్చే విధంగా , తాజాగా జరుగుతున్న చర్చకు ముగింపు పలికే రీతిలో బెంగళూరులో అమిత్ షా ఓ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. జోక్యం చేసుకోం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడీఎంకే అంతర్గాత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అది వారి అంతర్గత వ్యవహారం, ఇందులో ఒకరిపై ఒత్తిడి తీసుకు రావాల్సినంత అవసరం తమకు లేదన్నారు. వారి మధ్య సమస్యలు, వివాదాలను వాళ్లే పరిష్కరించుకోవాలే గానీ మధ్యవర్తులు ఉండ కూడదని వ్యాఖ్యానించారు. ఓ పార్టీ వ్యవహారంలో జోక్యం చేసుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. పన్నీరు సెల్వం వ్యవహారంలో అన్నాడీఎంకేనే నిర్ణయం తీసుకోవాలి. తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆయన చర్చకు ముగింపు పలికారు. ఈ వ్యాఖ్యలు పన్నీరు సెల్వం శిబిరాన్ని షాక్కు గురి చేసింది. అదే సమయంలో పళని స్వామి శిబిరంలో జోష్ను నింపింది. వందే భారత్లో పళణి అమిత్ షా వ్యాఖ్యలు ఉదయాన్నే పళణి శిబిరంలో జోష్ను నింపాయి. ఇదే ఊపులో పళణి స్వామి ఆనందంగా వందే భారత్ రైలులో ప్రయాణించారు. సేలం నుంచి ఆయన వందే భారత్ రైలులో పర్యటించారు. ఈ సమయంలో ఆయనతో అనేక మంది ప్రయాణికులు సెల్పీలు దిగడం విశేషం. -
Tamil Nadu: ‘పళని’ దూకుడుకు కళ్లెం..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి దూకుడుకు సుప్రీంకోర్టు శుక్రవారం కళ్లెం వేసింది. ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ దసరా సెలవుల అనంతరం కొనసాగించేందుకు నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాలు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తొలుత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అలాగే జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మరో తీర్పు రావడంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు స్వీకరించారు. ఈ హోదాతో పార్టీపై పట్టు సాధించే పనిలో పడ్డారు. సమావేశాలు, సభలు అంటూ విస్తృతంగా దూకుడు పెంచారు. త్వరలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ సర్వసభ్య సమావేశం సభ్యులతో ముందుగానే తనకు మద్దతు తెలిపే విధంగా సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 11న జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. నిబంధనలు ఉల్లంఘించారని వాదనలు పన్నీరుసెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం వచ్చింది. దసరా సెలవుల అనంతరం ఈ పిటిషన్ను విచారించేందుకు తొలుత న్యాయమూర్తి నిర్ణయించినా, పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు ఉంచారు. అన్నాడీఎంకేలో నిబంధనలకు అనుగుణంగా పన్నీరుసెల్వం నడుచుకున్నా, పళని స్వామి తరపున వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టారని వివరించారు. పార్టీ పరంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే, పన్నీరును పార్టీ నుంచి బయటకు పంపించినట్లు ప్రకటించి, వ్యక్తిగతంగా పళని స్వామి నిర్ణయాలు తీసుకుని, పార్టీ నిబంధనలను తుంగలో తొక్కినట్టు వివరించారు. సర్వసభ్య సమావేశాన్ని ఆగమేఘాలపై నిర్వహించారని, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. పళనిస్వామి అన్నాడీఎంకే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేయాలని కోరారు. అరగంట పాటుగా వాదనలు సాగాయి. పళని శిబిరానికి షాక్ పళనిస్వామి తరఫు న్యాయవాదులు సైతం కోర్టు ముందు వాదనలు ఉంచినా చివరకు ఈ కేసుతో పాటు అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన అన్ని కేసులను ఒకే గొడుగు కిందకు తెచ్చి దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి పదవికి ఎలాంటి ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని పేర్కొంటూ స్టే విధించారు. దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగింపు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో పళని స్వామి శిబిరానికి షాక్ తప్పలేదు. దసరా సెలవుల అనంతరం జరిగే విచారణ, వెలువడే ఉత్తర్వుల మేరకు ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పళని స్వామి మద్దతు నేత, ఎంపీ సీవీ షన్ముగం కోర్టు ఆవరణలో మీడియా మాట్లాడారు. తాము ప్రధాన కార్యదర్శి ఎన్నికకు ఇంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అయితే కోర్టుకు పన్నీరు తరఫున తప్పుడు సమాచారం ఇచ్చి స్టే పొందారని పేర్కొన్నారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, ఆ మేరకు వెలువడే ఉత్తర్వుల ఆధారంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు తనకు అనుకూలంగా రావడంతో ఇదే అదనుగా పార్టీ కేడర్ను తన వైపుకు తిప్పుకునే విధంగా దక్షిణ తమిళనాడులో పర్యటనలకు పన్నీరు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం గమనార్హం. -
అన్నాడీఎంకే ఆఫీస్లోకి వెళ్లేందుకు పన్నీరు ప్రయత్నాలు.. మళ్లీ టెన్షన్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే కార్యాలయంలోకి అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నాలు చేశారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయన మద్దతుదారులు చొచ్చుకెళ్లవచ్చన్న సమాచాంతో భద్రతను పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళతో పన్నీరు మద్దతుదారుడు వైద్యలింగం శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి కోర్టు ఆమోద ముద్ర వేయడంతో పళనిస్వామి పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారు. పార్టీ నేతలతో సమావేశాలు, బలోపేతం, సర్వ సభ్య సమావేశంతో పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. పళనిస్వామికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక బా«ధ్యతలతో తిరుమల శ్రీవారి దర్శనానికి పళనిస్వామి బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో తానేమి తక్కువ తిన్నానా..? అన్నట్టు పన్నీరు సెల్వం సైతం పావులు కదుపుతున్నారు. చిన్నమ్మతో భేటీ. అన్నాడీఎంకే వివాదాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సైతం రాజకీయంగా దూకుడు పెంచారు. శుక్రవారం తంజావూరులో ఆమె పర్యటించారు. ఆమెను పన్నీరు సెల్వం మద్దతుదారుడు, ఎమ్మెల్యే వైద్యలింగం కలిశారు. ఆమెతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే చిన్నమ్మను కలిసేందుకు పన్నీరు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐకమత్యంగా ఉందామని చిన్నమ్మ పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత నెలకొంది. నేను సైతం.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం సిద్ధమవుతున్నారు. గతంలో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈసారి ముందుగానే పోలీసు భద్రత కోరే పనిలో పడ్డారు. తమకు భద్రత కల్పించాలని పన్నీరుసెల్వం మద్దతు నేత జేసీడీ ప్రభాకరన్ చెన్నై పోలీసులకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. అన్నాడీఎంకే కార్యాలయం వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, అక్కడే తేల్చుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో పార్టీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు పన్నీరు మద్దతుదారులు ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పన్నీరు సెల్వం శ్రీవిల్లిపుత్తూరు అండాల్ అమ్మవారిని, వనపేచ్చి అమ్మన్ ఆలయాల్లో పూజలు నిర్వహించడం గమనార్హం. -
మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను
ఇన్నాళ్లూ పార్టీపై పట్టుకోసం పోరాడిన ఈపీఎస్, ఓపీఎస్ మధ్య తాజాగా మరో కొత్త వివాదం మొదలైంది. అన్నాడీఎంకే బ్యాంక్ ఖాతాల నిర్వహణ బాధ్యత నాదంటే.. నాదంటూ వారిద్దరూ లేఖల యుద్ధానికి దిగారు. పరిస్థితి ముదిరితే ఖాతాలను స్తంభింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలపై తనదే పెత్తనమని ఎడపాడి పళనిస్వామి, కాదు..కాదు కోశాధికారిగా తానే అధికారిక వ్యక్తినని పన్నీర్సెల్వం కొత్తగా మరో కుమ్ములాట మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సమస్య సద్దుమణిగే వరకు ఇద్దరికి అవకాశం లేకుండా సీలువేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఖాతాల్లోని రూ.300 కోట్లు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చదవండి: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా? అంతకంతకూ ముదురుతున్న వివాదాలు అంతఃకలహాలతో అన్నాడీఎంకే అట్టుడికి పోతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి పళనిస్వామి ఎంపిక, పన్నీర్సెల్వం శాశ్వత బహిష్కరణ జరిగిపోయింది. కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్ను తప్పించినట్లు బ్యాంకు అధికారులకు ఈపీఎస్ ఓ లేఖ పంపారు. అయితే తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలులేదని, హద్దుమీరితో తగిన చర్యలు తప్పవని పన్నీరు సెల్వం మరో లేఖలో హెచ్చరించారు. ఇక కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్ను నియమించాం, ఆయన అనుమతి లేకుండా లావాదేవీలు జరుపరాదని కరూరు వైశ్య బ్యాంకు, ఇండియన్ బ్యాంకుకు, చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఈపీఎస్ మంగళవారం మరో లేఖ రాశా రు. ఈరెండు బ్యాంకుల్లో అన్నాడీఎంకేకు సుమారు రూ.300 కోట్లు ఉండటంతో ఈపీఎస్, ఓపీఎస్లు తహతహలాడుతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక బ్యాంకు అధికారులు తలలుపట్టుకున్నారు. రూ.300 కోట్లు పక్కదారి పట్టకుండా పార్టీ బ్యాంకు ఖాతాలకు తాత్కాలికంగా సీలు వేయడమే మేలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీఈసీకి పోటాపోటీ పిటిషన్లు ఈనెల 11న సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలపై ఈపీఎస్, ఓపీఎస్ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) కార్యాలయంలో పోటాపోటీగా పిటిషన్లు వేశారు. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, ఆమోదయోగ్యం కాని ఆ పిటి షన్లపై స్టే విధించాలని సీఈసీకి సమర్పించిన పిటిషన్లో ఓపీఎస్ పేర్కొన్నారు. బైలా ప్రకారమే పార్టీ వ్యవహారాల్లో సవరణలు చేశామని ఎడపాడి పేర్కొంటూ సీఈసీకి ఆధారాలు సమర్పించారు. మలి అడుగు ఎలా..? ఆశించినట్లుగానే ఎడపాడి పళనిస్వామికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పన్నీర్సెల్వంను బహిష్కరించడం కూడా జరిగిపోయింది. అయితే పార్టీపై పూర్తిస్థాయి పట్టుసాధించడం కోసం చేపట్టాల్సిన చర్యలపై చట్ట నిపుణులతో ఈపీఎస్ మంగళవారం సమాలోచనలు జరిపారు. పన్నీర్సెల్వం బహిష్కరణకు గురైనందున ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి వెంటనే చేజారిపోతుందా..? అని కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర అంశాలు ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సోమ వారం అరాచకాలకు పాల్పడిన, కార్యాలయంలోకి జొరబడిన 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీ రామ చంద్రన్, జయలలిత విగ్రహాలకు రోజూ పూలమాలలు వేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో వారి విగ్రహాల్లో ఎండిపోయిన రోజాపూల మాలలను చూసి పారీ్టశ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకేలోని రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో ఎడపాడి తన ఇంటిని తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. ఆఫీసుకు వేసిన సీలును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఎడపాడి మద్ద తుదారు తరపున న్యాయవాది విజయ్ నారాయణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. -
బహిష్కరణ వేటుపై కోర్టుకు ఓపీఎస్!.. ఈపీఎస్ సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం అన్నాడీఎంకే బహిష్కరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. కోటిన్నర క్యాడర్ ఎన్నుకున్న తనను ఎలా తప్పిస్తారని? ఆ అధికారం ఒక్క పళనిస్వామికో, ఇతర నేతలకో అస్సలు లేదని వ్యాఖ్యానించారు. తన బహిష్కరణకు అసంబద్ధంగా పేర్కొన్న ఓపీఎస్.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని, బహిష్కరణ నిర్ణయంపై చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఓపీఎస్కు షాకిస్తూ పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. దీంతో ప్రెసిడియమ్ చైర్మన్ తమిళ్మహాన్ హ్సుస్సేన్ అధ్యక్షతన వనగారమ్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే ఇంటీరియమ్ జనరల్ సెక్రెటరీగా పళనిస్వామిని ఎన్నుకుంటూ.. అలాగే పన్నీర్సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటించింది అన్నాడీఎంకే. డీఎంకేతో కుమ్మక్కయ్యాడు అన్నాడీంకే జనరల్ సెక్రెటరీ(ఇంటీరియమ్) హోదాలో ఈ పళనిస్వామి.. పన్నీర్సెల్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అధికార పక్షం డీఎంకేలో పన్నీర్సెల్వం కుమ్మక్కు అయ్యాడంటూ సంచలన ఆరోపణలే చేశారు ఓపీఎస్. ఓపీఎస్ హింసాకాండకు పాల్పడ్డాడు. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పోలీస్ భద్రత కల్పించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేంటి?. .. పార్టీకి ఒక్కరే నేత ఉండాలని సీనియర్లు చెప్పిన సూచనను సైతం ఓపీఎస్ పెడచెవినపెట్టాడు. నేను మీలో ఒక్కడినే(పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి..). ఈ పార్టీనే నా జీవితం. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా.. పని చేశా. ఇద్దరి నాయకత్వంలో పని తీరు ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ ఒక దుష్టశక్తితో పోల్చారు. డీఎంకే ప్రభుత్వం అంటే.. కమీషన్లు, అవినీతికి కేరాఫ్. అలాంటి పార్టీ ప్రభుత్వంపై ఓపీఎస్ కొడుకు ఓపీ రవీంద్రన్ లోక్ సభ సభ్యుడిగా ఉండి మరీ.. ప్రశంసలు గుప్పిస్తున్నాడు. అలాగే ఓపీఎస్ ఒక్కడే పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించొద్దంటూ వాదించాడు.. కోర్టుకెక్కాడు అంటూ పళని స్వామి విమర్శలు గుప్పించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement