-
Gujarat assembly elections 2022: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. -
సీపీఎస్ వద్దు..పెన్షన్ కావాలి
చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు గళమెత్తారు. మచిలీపట్నంలో పెన్షన్ సాధన సమితి తూర్పుకృష్ణాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, పెన్షనర్ల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్జీవో హోమ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, పలు దఫాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెట్టిచాకిరీ చేస్తున్న ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళన ధర్మమైనది : పేర్ని ఏపీ ఏన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా శాఖ సారధ్యంలో పెన్షన్ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల ఆందోళనకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ధర్మమైనదని ఇందుకు ఉద్యోగుల సమస్యకు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. డీఏ పెంపుదల విషయంలో కేసీఆర్ను చూసి ఉద్యోగులకు ప్రకటించిన విధంగానే తెలంగాణా రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటిస్తే తప్ప ఆంధ్రరాష్ట్రంలో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి లేదని అర్ధమవుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా అధ్యక్ష,కార్యదర్శులు ఉల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు మత్తి కమలాకరరావు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి సత్యనారాయణ, శోభన్బాబు, యూటీఎఫ్ నాయకులు కెఏ ఉమామహేశ్వరరావు, ఏపీటీఎఫ్ నాయకులు తమ్ము నాగరాజు, ఎస్టీయు నాయకులు కొమ్ము ప్రసాద్, డి చంద్రశేఖర్, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు చేబ్రోలు శరత్చంద్ర, కైతేపల్లి దాస్, ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు జి కిషోర్కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు జీటీవీ రమణ, పెన్షనర్స్ అసోసియేషన్ జీవీ రామారావు, రామస్వామి, ఎన్జీవో సంఘ నాయకులు గౌరి, రమాదేవి, బి సీతారామయ్య, ఎల్వీ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయటవర్స్ వద్ద ధర్నా ఇబ్రహీంపట్నం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేయాలని రాష్ట్ర పెన్షన్ సాధన సమితి పిలుపుమేరకు క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగసంఘాలు ఆంజనేయటర్స్ వద్ద శనివారం ధర్నా నిర్వహించాయి. క్యాపిటల్ సిటీ బ్రాంచి అమరావతి సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు సీవీ.రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ పెన్షన్ రద్దు కోసం దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. రాష్ట్రకోశాధికారి వీరేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న ట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీహెచ్ అజయ్కుమార్, మహిళా అ«ధ్యక్షురాలు పీవీఎల్ఎస్.రత్న, ఏపీఎన్టీవో సంఘం కార్యదర్శులు నరసింహం, జగదీశ్వరరావు, తులసీరత్నం, కృపావ రం, క్యాపిటల్సీటీ బ్రాంచి కార్యదర్శి నాగభూష ణం, రాష్ట్ర ఉద్యోగుల సమైక్య సభ్యులు రాజ్యలక్ష్మీ, రాష్ట్ర అడిట్సంఘం ప్రధానకార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర ఎకనామిక్, స్టాటిక్స్ సంఘం, పీఏవో, అగ్నిమాపక శాఖల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
– ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామిరెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఉపాధ్యాయ భవనంలో బుధవారం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రఘురామిరెడ్డి మాట్లాడారు. టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ వి«ధానం రద్దు చేయాలన్నారు. బదిలీల్లో ప్రతిభ ఆధారిత పాయింట్లను తొలగించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగవరప్రసాద్ మాట్లాడుతూ క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున పాఠశాలలు మూసివేతకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాశాఖ అధికారులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పూర్వ ప్రధానకార్యదర్శి పరమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 10 నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్సుందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరసింహుడు మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని సమీక్షించాలన్నారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు పీవీ మాధవ, ప్రధానకార్యదర్శి డి.ప్రభాకర్, గౌరవాధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్లకు జీతాలు, అరియర్స్ చెల్లించాలన్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సబ్కమిటీ సభ్యులు అశోక్కుమార్, ముత్యాలప్ప, డేనియల్, సిరాజుద్దీన్, శ్రీనివాసులు, గాయిత్రి, నరసింహారెడ్డి, ప్రేమావతమ్మ, చంద్రకళ,హనుమప్ప, గోపాల్నాయుడు పాల్గొన్నారు. --- -
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నెల్లికుదురు : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత పింఛన్ విధానంపై అసెంబ్లీ తీర్మానం చేయాలన్న డిమాండ్తో ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి సర్వీస్రూల్స్ వర్తింప చేసేలా కృషి చేస్తామని, సీఆర్పీల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు స్వీకరించిన గుగులోతు రాము, పి.కల్పన, కర్ణాకర్, లింగమూర్తిని సన్మానించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల నుంచి పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డితో పాటు సొంటిరెడ్డి యుగేందర్, పెరుమాండ్ల యుగేందర్, బీరవెల్లి నర్సింహరెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు, సూరిబాబు, మాసిరెడ్డి రమేష్రెడ్డి, డాక్టర్ టి.శ్రీనివాస్, ఖలీద్ మహమూద్, ఎండి.యాసీన్ పాల్గొన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా విద్యారణ్యపురి: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్)ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కువద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. లింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు ఉద్యోగులకు ఒక సామాజిక భద్రతగా పాతపెన్షన్ విధానం ఉండేదన్నారు.అయితే నూతన పెన్షన్ విధానం (సీపీఎస్)తో ఉద్యోగ విరమణ పొందిన కుటుంబానికి సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన ధనిక రాష్ట్రంగా చెపుతున్న తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు సంఘటితంగా పోరాడుతామన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం గంగాధార్ మాట్లాడుతూ ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణతో ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు ఉద్యోగులు ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో పెన్షన్ ,గ్రాట్యూటీ, జీపీఎఫ్ వంటివి నష్టపోవాల్సి వస్తుందన్నారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి వెంకటరెడ్డి , టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి రాంచందర్, జనరల్ సెక్రటరీ టి.సుధర్శనం నాయకులు జి ఉప్పలయ్య, పి.సుధర్శన్రెడ్డి, బి. జాన్నాయక్, డి. మహేందర్రెడ్డి, ఎ. గోవిందరావు, కె. కొమ్మాలు, డి.కుమారస్వామి, జి. శ్రీనివాస్రెడ్డి, బి. రాములు, జి. ఆదిరెడ్డి, జి.సురేందర్ పాల్గొన్నారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
Advertisement