-
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
కారును ఓవర్టేక్ చేయబోయి..
పటాన్చెరు టౌన్: లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలు కాగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ రెహమాన్(19), ఖాసీం ఇద్దరూ బతుకుదెరువు కోసం ఏడాది కిందట వచ్చి బొల్లారం పరిధిలోని గాంధీనగర్లో ఉంటున్నారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ పని నిమిత్తం బైక్పై శంకర్పల్లి వైపు బయలుదేరారు. ముత్తంగి సర్వీస్ రోడ్ నుంచి కర్ధనూర్ వైపు వెళ్తుండగా కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందులో చికిత్స పొందుతూ అబ్దుల్ రెహమాన్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: పుట్టపర్తిలో దారణం.. అనుమానంతో భర్త! -
లారీని ఓవర్ టేక్ చేస్తూ.. ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
హైదరాబాద్: బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు డీసీఎంను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో వెనక నుంచి వచ్చిన టిప్పర్ వారి మీదుగా వెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కై సర్ నగర్లో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుండిగల్ ఐఏఆర్ఈ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పవన్ ( 21), మణిదీప్ (20) మల్లంపేటలో నివాసం ఉంటున్నారు. సోమవారం కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న వీరు కై సర్ నగర్ సమీపంలో ముందు వెళుతున్న డీసీఎంను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ వీరిపై నుండి వెళ్లడంతో తీవ్ర గాయాలైన పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మణిదీప్ను ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్ జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, బూరుగుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకులకు ఝలక్ ఇచ్చిన ఎంఎఫ్ఐలు.. లోన్లలో ఇవే టాప్!
ముంబై: సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నాయి. సూక్ష్మ రుణాల్లో బ్యాంకులను దాటుకుని నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సూక్ష్మ రుణాల్లో ఎంఎఫ్ఐల వాటా 2022–23లో 40 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 35 శాతం కంటే పెరిగింది. కరోనా లాక్డౌన్లతో ఎంఎఫ్ఐ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడం గమనార్హం. కలెక్షన్లు, కొత్త రుణాల మంజూరు గణనీయంగా పడిపోయింది. దీంతో 2020 మార్చి నాటికి సూక్ష్మ రుణాల్లో ఎంఫ్ఐల వాటా 32 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 31 శాతానికి తగ్గింది. 2022 మార్చి నాటికి తిరిగి 35 శాతానికి పుంజుకున్నది. ఇక ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సూక్ష్మ రుణాల్లో తమ వాటాను 40 శాతానికి పెంచుకున్నాయి. గత ఆర్థిక సంవత్సంలో సూక్ష్మ రుణాల్లో బ్యాంక్లు 24 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎంఎఫ్ఐలు 37 శాతం వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగాలకు రుణ వితరణ కింద దాదాపు అన్ని బ్యాంకులు ఎంఎఫ్ఐ రుణ పుస్తకాన్ని నిర్వహించడం తప్పనిసరి. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్ల వాటా 2023 మార్చి నాటికి 34 శాతానికి తగ్గింది. ఈ రంగంలో బ్యాంక్ల వాటా 2020, 2022 మార్చి నాటికి 40 శాతంగా ఉంటే, మధ్యలో 2021 మార్చి నాటికి 44 శాతానికి పెరిగింది. కరోనా సవాళ్లను ఎంఎఫ్ఐ పరిశ్రమ అధిగమించడంతో, సూక్ష్మ రుణాల్లో అవి మరింత దూకుడుగా వాటాను పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేర్ విడుదల చేసింది. వృద్ధి తగ్గొచ్చు సూక్ష్మ రుణ పరిశ్రమలో వృద్ధి ఇక ముందూ కొనసాగుతుందని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 28 శాతానికి పరిమితం కావచ్చని కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. సగటు రుణ టికెట్ సైజు పెరగడం, జాయింట్ రుణాలకు బదులు, విడిగా వ్యక్తులకు రుణాలు ఇవ్వడం అనేవి రిస్క్లుగా కేర్ రేటింగ్స్ పేర్కొంది. రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల వల్ల కుదుపులకు లోనయ్యే తత్వం వీటికి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రుణ రేటుపై పరిమితులను ఆర్బీఐ ఎత్తివేయడంతో, రిస్క్ ఆధారంగా రేటు విషయంలో ఎంఎఫ్ఐలు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. ఇది వాటి నికర వడ్డీ మార్జిన్లను (నిమ్) పెంచుతున్నట్టు వివరించింది. 2020–21లో గరిష్ట స్థాయికి వెళ్లిన రుణ వ్యయాలు సైతం అక్కడి నుంచి తగ్గాయని, అయినప్పటికీ కరోనా ముందున్న నాటితో పోలిస్తే అధిక స్థాయిలోనే ఉన్నట్టు తెలిపింది. పునరుద్ధరించిన కొన్ని రుణాలు ఎన్పీఏలుగా మారడాన్ని ప్రస్తావించింది. నిమ్ 2023–24లో 3.8 శాతానికి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. -
నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయబోయి..
క్రైమ్: కర్ణాటకలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యంగా తన ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఓ బైకర్ ఘోరంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్ తుక్కు తుక్కు కాగా, తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. కర్ణాటక ముద్బిద్రిలో ఆల్వా కాలేజీ దగ్గర గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లోంచి బస్సు బయటకు రాగా.. ఆ వెనకాలే వస్తున్న బైకర్, బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. ఇంతలో మరో పక్క నుంచి కారు దూసుకువచ్చింది. బైకర్ను బలంగా ఢీ కొట్టి కారు దూసుకెళ్లింది. బైక్ ఎత్తులో ఎగిరి తునాతునకలై దూరంగా పడిపోగా.. అతను రోడ్డు మధ్యలో పడిపోయాడు. కదలకుండా పడిపోయిన అతన్ని స్థానికులు కొందరు పక్కకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా ఓవర్ టేక్ చేయడమే కాదు.. కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఆ బైకర్. సీసీటీవీ ఫుటేజీలో యాక్సిడెంట్ దృశ్యాలు నమోదు అయ్యాయి. Shocking visual from #Karnataka. A #CCTV footage from Alva's college near Mudbidri shows a horrific accident where a biker rams into an oncoming car. @dpkBopanna reports pic.twitter.com/BTCTwFdPJu — Mirror Now (@MirrorNow) April 1, 2023 Video Credtis: Mirror Now
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement