-
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్లో కివీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ICC WC 2023- Ind vs Pak: ఆటను ఆటలాగే చూడాలి.. న్యాయం ఒక్కొక్కళ్లకు ఒక్కో విధంగా ఉండదు.. ఎదుటివాళ్లపై నిందలు వేసే ముందు.. మనం ఎలాంటి వాళ్లమో! మన వల్ల ఎదుటివాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి! అంతేతప్ప... అవతలి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడంలో అర్థం ఉండదు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంచుమించు ఇదే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాక్పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. జరిగిన దాయాదుల సమరంలో రోహిత్ సేన సమిష్టి ప్రదర్శనతో బాబం ఆజం బృందాన్ని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అతడు కాస్త భిన్నం నీలి వర్ణంతో నిండిపోయిన స్టేడియంలో చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుని అభిమానులకు సంతోషం పంచింది. ఇదిలా ఉంటే.. పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మిగతా ఆటగాళ్లకు కాస్త భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఉద్దేశించి కొంతమంది టీమిండియా ఫ్యాన్స్.. రిజ్వాన్ రీతిలోనే అతడికి కౌంటర్లు ఇచ్చారు. పెవిలియన్కు వెళ్తున్న క్రమంలో రిజ్వాన్ను ట్రోల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్కాగా భారత జట్టు అభిమానులపై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. భారత్- పాక్ మ్యాచ్ అంటే వినోదం మాత్రమే కాదు ఇందుకు బదులుగా.. భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం.. కాబట్టి పరస్పరం కౌంటర్లు విసురుకోవడం సహజమే అని మరికొందరు దీనిని చిన్న విషయంగా కొట్టిపారేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ షమీని పాక్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాళ్ల వల్లే ఓడిపోయాం.. అది కూడా ఓ కారణమే అభిమానుల సంగతి ఇలా ఉంటే.. పాక్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలిపై బురదజల్లే ప్రయత్నం చేశాడు. సొంతగడ్డపై ఏ జట్టుకైనా ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి.. ఇది ఐసీసీ ఈవెంట్లా కాదు బీసీసీఐ ఈవెంట్లా అనిపిస్తోందని విమర్శించాడు. ఇండియా- పాక్ మ్యాచ్ సందర్భంగా తాను ఒక్కసారి కూడా దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినలేదని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఓటమికి ఒక విధంగా టీమిండియాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మద్దతే కారణమని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు. పాక్ ఆటగాళ్లు స్పందించనే లేదు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా అభిమానులను ట్రోల్ చేస్తున్నవాళ్లు, మిక్కీ ఆర్థర్కు తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘మిక్కీ ఆర్థర్ తప్ప పాకిస్తాన్ ఆటగాళ్లెవరూ స్పందించలేదు. అయినా, కేవలం ఒక్క ఆటగాడి(రిజ్వాన్) విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందని అతడు ఆలోచించలేకపోయాడా? మిగతా వాళ్లు చక్కగా తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారు కదా! కొంతమంది 20-30 సెకన్ల వీడియోను ఆధారంగా చూపి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. భారత్ ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉన్న వాళ్లు. శ్రీలంక విషయంలో ఎందుకిలా? సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు.. సగం సగం వీడియోలతో అసలు నిజాన్ని దాచేసే ప్రయత్నాలు జరుగుతాయి. దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినిపించనేలేదని మిక్కీ ఆర్థర్ అంటున్నాడు. కొంతమందేమో ప్రేక్షకులు ఇరు జట్లకు మద్దతుగా నిలవాలని సూక్తులు చెబుతున్నారు. మరి శ్రీలంక విషయంలో ఎందుకలా మాట్లాడలేదు? హైదరాబాద్లో జరిగిన దానికి లంక జట్టు కూడా పాక్లాగ ఫిర్యాదులు చేయవచ్చు కదా! హైదరాబాద్లో జీతేగా భాయ్ జీతేగా అని డీజే పెట్టినపుడు.. ప్రేక్షకులంతా పాకిస్తాన్ జీతేగా అని పాక్ టీమ్కు మద్దతు పలికారు. శ్రీలంకకు అసలు సపోర్టు లేదు. అఫ్గనిస్తాన్కు ఢిల్లీ ప్రేక్షకుల మద్దతు అదే విధంగా ఢిల్లీలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా చాలా మంది అఫ్గనిస్తాన్కు మద్దతుగా నిలిచారు. మరి అఫ్గన్ జలేబి గురించి ఇంగ్లండ్ కంప్లైట్ చేయొచ్చా’’ అంటూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలను సమర్థించుకున్నాడు. కొంతమంది చర్యను మొత్తంగా భారత జట్టు అభిమానులకు ఆపాదించడం సరికాదని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు.. ‘నిజం చెప్పారు.. టీమిండియా వరకు వచ్చే సరికే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు ఎందుకో? అందరిని సమానంగా చూడాలన్న వారు అందరి పట్ల ఒకే రీతిలో ఆలోచించాలి’’ అని ఆకాశ్ చోప్రాకు మద్దతు పలుకుతున్నారు. మరికొందరేమో ఇలాంటి సున్నిత అంశాల పట్ల ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరుతున్నారు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: రిజ్వాన్ వివాదస్పద ట్వీట్! ఆటను వదిలి ఇతర అంశాల్లోకి!
WC 2023 Pak Vs SL: పాకిస్తాన్ వికెట్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వివాదాస్పద ట్వీట్తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఆటతో సంబంధంలోని విషయంలో తలదూర్చి నెటిజన్ల చేతికి చిక్కాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో రిజ్వాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో లంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(113)తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి పాకిస్తాన్కు రికార్డు విజయం అందించాడు. 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో చెలరేగి.. 131 పరుగులతో రాణించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. అజేయ ఇన్నింగ్స్తో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎక్స్ వేదికగా రిజ్వాన్ చేసిన పోస్టు విమర్శలకు కారణమైంది. గాజాలో ఉన్న నా సోదర, సోదరీమణుల కోసం ‘‘జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇది సమిష్టి విజయం. అబ్దుల్లా షఫీక్, హసన్ అలీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వాళ్ల వల్లే గెలుపు సులువైంది. హైదరాబాద్ ప్రజలకు మేము రుణపడి ఉంటాం. మీ ఆతిథ్యానికి.. మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు’’ అని రిజ్వాన్ రాసుకొచ్చాడు. అయితే, పోస్ట్ ఆరంభంలో.. ‘‘ఇది గాజాలో ఉన్న మా సోదర, సోదరీమణుల కోసం’’ అంటూ ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని షేర్ చేయడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నువ్వు ఎవరికి సపోర్టు? ‘‘నువ్వు గాజా ప్రజలకు సపోర్టు చేస్తున్నావా? లేదంటే.. హమాస్ మిలిటెంట్లకు మద్దతు ప్రకటిస్తున్నావా? చర్యకు ప్రతి చర్య ఉంటుందనే విషయం తెలియదా?’’ అంటూ కొంతమంది ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో.. ‘‘నీ సెంచరీ గాజా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది. కనీసం ఈ మ్యాచ్ను చూసే స్థితిలో కూడా లేరు అక్కడి వాళ్లు. అయినా వరల్డ్కప్ లాంటి ఐసీసీ ఈవెంట్ ఆడుతున్నపుడు రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే.. నీ మ్యాచ్ ఫీజులు, రెమ్యునరేషన్లు గాజా ప్రజల కోసం విరాళంగా ఇవ్వు’’ అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రతిసారి ఆటలోకి ఇలాంటివి లాగడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. కాగా గాజాలో తిష్టవేసిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడికి దిగడంతో యుద్ధానికి తెరలేచింది. పరస్పర దాడుల నేపథ్యంలో ఇటు గాజా.. అటు ఇజ్రాయెల్లో కలిపి మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. చదవండి: నవీన్ ఉల్ హక్ రనౌట్ మిస్.. రాహుల్పై కోహ్లి సీరియస్! వీడియో వైరల్ -
CWC 2023: కోహ్లి-రాహుల్, రిజ్వాన్-షఫీక్.. ఎవరి భాగస్వామ్యం గొప్పది..?
ప్రస్తుత ప్రపంచకప్లో పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పలు ఆసక్తికర మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదటిది భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో ఆసక్తికర మ్యాచ్ ఏదంటే.. పాకిస్తాన్, శ్రీలంక మధ్య హైదరాబాద్లో నిన్న జరిగిన మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో పాక్ సైతం అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి చారిత్రక విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ల్లో ఓ కామన్ థింగ్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లి-కేఎల్ రాహుల్.. మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్లు నెలకొల్పిన మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రెండు భాగస్వామ్యాల్లో ఏది గొప్పది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భారత అభిమానులు సహా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్-రాహుల్ పార్ట్నర్షిప్కు ఓటేస్తుంటే, పాక్ ఫ్యాన్స్ మాత్రం రిజ్వాన్-షఫీక్ భాగస్వామ్యం గొప్పదని డప్పుకొట్టుకుంటున్నారు. ఇరు భాగస్వామ్యాలపై ఓ లుక్కేస్తే.. ఆసీస్తో మ్యాచ్లో భారత్ స్వల్ప లక్ష్య ఛేదనలో (200 పరుగులు) 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. విరాట్ (85)-రాహుల్ (97 నాటౌట్) జోడీ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను గెలిపించింది. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. లంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్ను రిజ్వాన్ (131 నాటౌట్)-షఫీక్ (113) జోడీ 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు పార్ట్నర్షిప్స్లో నలుగురు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పరుగులు సాధించి, తమతమ జట్లను గెలిపించారు. రెండు సందర్భాల్లో వారు ఒక్కో పరుగు పేరుస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయాలకు దోహదపడ్డారు. వాస్తవానికి ఈ రెంటిని ఒకదానితో ఒకటి పోల్చలేని పరిస్థితి. ఇరు భాగస్వామ్యాలు తీవ్రమైన ఒత్తిడిలో నెలకొల్పివనే. దేని ప్రత్యేకత దానికుంది. దీన్ని అంశంగా తీసుకుని డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఈ రెంటిలో గొప్ప భాగస్వామ్యం ఏదని చెప్పాల్సి వస్తే మాత్రం మెజార్టీ శాతం అభిప్రాయంతో వెళ్లాల్సి ఉంటుంది. గత మ్యాచ్ల విషయాలను పక్కన పెడితే.. భారత్-పాక్లు అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత టోర్నీలో ఇరు జట్ల ప్రదర్శనను చూసిన తర్వాత ఈ మ్యాచ్పై మరింత హైప్ పెరిగింది. దీనికి ముందు భారత్ ఇవాళ (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. న్యూఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
CWC 2023: పాపం మతీష పతిరణ! జూనియర్ మలింగగా పేరొచ్చినా...
శ్రీలంక యువ పేసర్ మతీష పతిరణకు ప్రపంచకప్ 2023 అంతగా అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఆడింది రెండు మ్యాచ్లే కానీ... సమర్పించుకున్న పరుగులు మాత్రం 180కిపైగానే. పోనీ వికెట్లయినా ఎక్కువ తీశాడా? ఊహూ అదీ లేదు. రెండు మ్యాచ్లలోనూ చెరో వికెట్ మాత్రమే దక్కింది. దీంతో టోర్నీలోనే అత్యంత ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మొత్తం పది ఓవర్లలో 95 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన పతిరణ నిన్నటి పాకిస్తాన్ మ్యాచ్లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ తీసి 90 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో డికాక్, డస్సెన్, మార్క్రమ్ పతిరణకు బౌలింగ్లో పరుగుల వరద పారిస్తే... పాక్తో జరిగిన మ్యాచ్లో అబ్దుల్లా షఫీక్, మొహమ్మద్ రిజ్వాన్ అతని బౌలింగ్ను తుత్తునియలు చేశారు. ఈ వరుస దారుణ ప్రదర్శనల నేపథ్యంలో లంక జట్టులో పతిరణ స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. ఒక రకంగా అతడి కెరీరే ప్రమాదంలో పడిందని చెప్పాలి. బౌలింగ్ కట్టుదిట్టం చేసుకోకుంటే కేవలం బౌలింగ్ యాక్షన్ ద్వారా జూనియర్ మలింగగా పొందిన పేరు కూడా అతడి కెరీర్ను కాపాడలేదని విశ్లేషకులు అంటున్నారు. యువ బౌలర్.... ఇరవై ఏళ్ల పతిరణ కెరీర్లో ఇప్పటివరకూ 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. తన స్వల్ప వన్డే కెరీర్లో 7.28 సగటున పరుగులు సమర్పించుకుని భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నా... తగినన్ని వికెట్లు తీసుకోవడంతో మంచి బౌలర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ... మున్ముందు పతిరణ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో పాకిస్తాన్ శ్రీలంకపై చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో లంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ప్రపంచకప్లో 300కు పైగా లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన తరువాత 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113)లు తమ సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమర విక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement