-
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
-
ప్రముఖ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
-
పొత్తూరి కన్నుమూత : సీఎం జగన్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. ప్రముఖ పత్రికల్లో విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. పీవీ గురించి రాసిన ‘ఇయర్ ఆఫ్ పవర్’కు సహ రచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆయన విధులు నిర్వర్తించారు. పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. కాగా పొత్తూరి వెంకటేశ్వరావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు.. తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శప్రాయులు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా పని చేసిన ఆయన.. ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: విజయసాయిరెడ్డి ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా... తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాల పాటు ఆయన అందించిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మా గురువు ఆయన.. పొత్తూరి వెంకటేశ్వర్ రావు మా గురువు. పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. భావప్రకటన స్వేచ్ఛ కోసం నిబద్ధతగా పని చేశారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా పత్రికలను నడపాలన్నారు. ప్రజలకు పత్రికలు సేవలందించాలని దృఢంగా కోరుకున్నారు. వృద్ధాప్యంలో కూడా అడవుల్లో నడిచి నక్సలైట్లతో చర్చలు జరిపారు - దేవుళపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పొత్తూరి మృతికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రప్రభ మాజీ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్ధనరెడ్డి మాట్లాడుతూ పొత్తూరి వెంకటేశ్వరరావు జర్నలిజానికి వెన్నెముక లాంటి వారన్నారు. ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటన్నారు. తెలుగు జర్నలిజం పెద్దదిక్కును కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. -
ప్రజా సంఘాలపై దాడులు సరికాదు
పొత్తూరి వెంకటేశ్వర్రావు హైదరాబాద్: ప్రజా సంఘాలపై ప్రభుత్వం దాడులకు పాల్పడటం సరికాదని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర్రావు అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం ప్రజా కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీజ్ చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టీయూఎఫ్) కార్యా లయాన్ని తెరిపించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమా వేశం నిర్వహించారు. పొత్తూరి మాట్లాడుతూ ఇలాంటి చర్యల ద్వారా పోలీసులు సాధించేదేమీ లేదన్నారు. కళా కారులు, కవులు, రచరుుతల జోలికి వెళితే ప్రజలు తిరగ బడతారన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇంకా పాత పద్ధతినే అను సరిస్తున్నాయని, పోలీసులు అనుకుంటే ఎవరినైనా నేర స్తుల్ని చేస్తారని ఆరోపించారు. సీనియర్ సంపాదకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ విమలక్క పాట లేకుం డా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించ లేమన్నారు. విమలక్క మాట్లాడుతూ తన కార్యాలయాన్ని సీజ్ చేశారు.. అనటం కంటే పోలీసులు కబ్జా చేశారంటే బాగుంటుం దన్నారు. పీవోడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ లేకుండా పోలీసులు ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బిక్షమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్దన్, సీపీఐ నేత కందిమల్ల ప్రతాప్రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ కాసీం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ లోక్సత్తా నాయ కుడు మన్నారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement