-
ప్రజా కోర్టులో చంద్రబాబు దోషి
- ఎన్నికల హామీలను విస్మరించిన సీఎంకు గుణపాఠం తప్పదు - రాజధాని అభివృద్ధి అంటూ ప్రజా ధనం దుర్వినియోగం - కాటసాని రామిరెడ్డికి ప్రజాదరణ పెరుగుతోంది - బనగానపల్లె ప్లీనరీలో గౌరు వెంకటరెడ్డి బనగానపల్లె: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా కోర్టులో దోషిగా నిలబడాల్సి వస్తుందని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు 600 అబద్దపు హామీలు ఇచ్చి విస్మరించిన సీఎంకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బనగానపల్లె హరిహర జూనియర్ కళాశాల సమీపంలో శుక్రవారం బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ప్లీనరీని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గౌరు మాట్లాడుతూ 2014లో జిల్లాలో వైఎస్సార్సీపీ 11 సీట్లతో పట్టు సాధించిందన్నారు. 2019 ఎన్నికల్లో పత్తికొండ నుంచి చెరకులపాడు నారాయణరెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డిలు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయని చెప్పారు. దీంతో రాజకీయంగా ఎదుర్కోలేకనే పత్తికొండ నియోజకవర్గ నాయకుడు చెరకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమం కనుమరుగైందన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు కాగా, టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుతమ్ముళ్లకే ఇళ్లు కేటాయిస్తుందని విమర్శించారు. బనగానపల్లె నియోజకవర్గంలో కాటసాని కుటుంబం 30 సంవత్సరాలుగా ప్రజలకు అండగా ఉంటుందన్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా బనగానపల్లె ప్లీనరీకి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలిరావడం చూస్తే వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు. కుట్రలతో అడ్డుకోలేరు: బీవై రామయ్య, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ఆర్సీపీని అడ్డుకోలేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు దోచుకోవడం, దాచుకోవడం, అధికారులను బెదిరించడం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తప్ప చేసేందేమి లేదు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీల మధ్య చిచ్చు పెడుతూ నిధులు మంజూరు చేయడం లేదు. ముస్లిం మైనార్టీ శాసనసభ్యులు ఉన్నప్పటికి ఒక్క ముస్లిం ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. టీడీపీపై అసంతృప్తికి ఇదే నిదర్శనం : బుడ్డా శేషారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ పాలనలో అమలుపరిచిన అభివృద్ధి పథకాలను నేడు చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చినా విజయవంతంగా అమలు చేయలేకపోయారు. టీడీపీపై రోజురోజుకు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్లీనరీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలే ఇందుకు నిదర్శనం. లోకేష్ మంత్రిగా అనర్హుడు : రాజగోపాల్రెడ్డి , నంద్యాల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే లోకేష్ ఓటమి చెందుతాడన్న భయంతోనే ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి కట్టబెట్టారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్ మంత్రిగా అనర్హుడు. ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రజల్లో నుంచి వస్తారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సార్లు తన పదవులకు రాజీనామా చేసి అఖండ మెజార్టీతో గెలిచారు. -
ప్రజా కోర్టులో మోదీని శిక్షించాలి
తిరుపతి (అలిపిరి) : ఆర్థిక ఎమర్జెన్సీకి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని, ప్రజా కోర్టులో ఆయనను శిక్షించాలని సీపీఐ జాతీ య కార్యదర్శి నారాయణ అన్నారు. నోట్ల రద్దుకు నిరసనగా ఆయన మంగళవారం కార్యకర్తలతో కలిసి తిరుపతిలోని ఎస్బీఐ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో ప్రజా జీవనం అస్తవ్యస్తమైందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేసి, సామాన్యులను కష్టాల పాలు చేసిన మోదీ శిక్షార్హుడని అన్నారు. కరెన్సీ కష్టాలతో 50 మందికిపైగా మృత్యువాతపడినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మోదీ తక్షణం పదవికి రాజీనామా చేసి వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన ఆర్బీఐ గవర్నర్ ప్రజా అవసరాల దృష్ట్యా రూ.50, రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నారాయణ అరెస్ట్తో ఉద్రిక్తత.. ఎస్బీఐ పరిపాలన భవనం ఎదుట ధర్నా అనంతరం సీపీఐ నారాయణ కార్యకర్తలతో కలిసి అక్కడున్న ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈస్ట్ పోలీసులు అక్కడికి చేరుకుని నారాయణతో పాటు పార్టీ జిల్లా నాయకులను అరెస్ట్ చేసి, వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు. వారిని తోసుకుంటూ పోలీసులు నారాయణను ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకయ్య, జయమ్మ, పెంచులయ్య, రవి, రాధాకృష్ణ, చంద్రశేఖర్ నాయుడు, శివారెడ్డి, సత్తి, కత్తి రవి ఉన్నారు. -
ప్రజా కోర్టులో బాబు ఖైదీ
- ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు - ప్రత్యేక హోదా కావాలో.. వద్దో టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలి - 29న రాష్ట్ర బంద్కు అందరూ మద్దతు ఇవ్వాలి - వైఎస్ఆర్సీపీ జిల్లా విస్తృత సమావేశంలో పరిశీలకుడు మేరుగ నాగార్జున కడప కార్పొరేషన్ : ఇచ్చిన హామీలన్నీ మాఫీ చేసి, ప్రత్యేక హోదాపై డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా కోర్టులో ఖైదీగా నిలబడక తప్పదని వైఎస్ఆర్సీపీ జిల్లా పరిశీలకుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. కడపలోని అపూర్వ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలు విస్మరిస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులను ఆ పార్టీ నేతలు దోచుకుంటున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను నాశనం చేశారని, పరిపాలన గాలి కొదిలేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలా.. వద్దా అనేది టీడీపీ ఎంపీలు, మంత్రులు తేల్చి చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా అంటే తనకు తెలీదని ఒక ఎంపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఈ నెల 29వ తేదీన కనీ, వినీ ఎరుగని రీతిలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. మరో పరిశీలకుడు, నగర మేయర్ కె.సురేష్బాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే కేంద్ర నిధులన్నీ గ్రాంటు రూపంలో వస్తాయన్నారు. ఆ నిధులను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ను కాదని, బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1.25 లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించడం దారుణం అన్నారు. జెడ్పీ చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ పచ్చచొక్కాలు వేసుకొన్నవారికే ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదన్నారు. శవ రాజకీయాలు చేసింది ఎవరు? గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకొని శవ రాజకీయాలు చేసిందెవరని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును జైల్లో పెడతారనే ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు, మంత్రులు మాట్లాడటం లేదన్నారు. ప్రధాని న రేంద్ర మోదీ తీరు చంద్రబాబును మరిపిస్తోందని దుయ్యబట్టారు. కడప శాసన సభ్యుడు ఎస్బి అంజద్బాషా మాట్లాడుతూ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం బుట్టదాఖలు చేస్తోందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన వాగ్దానాలు, చేసిన బాసలు మర్చిపోయాయని, కర్రు కాల్చి వాత పెడితేనే వాటిలో చలనం వస్తుందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ బంద్ను నిర్వీర్యం చేయాలనే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ నెల 29న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలనే పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల నారాయణ కళాశాలలో నందిని, మనీషాల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీసీ సీనియర్ నాయకులు నవనీశ్వర్రెడ్డి, గౌసులాజం, జిల్లా అధికార ప్రతినిధులు టీకే అఫ్జల్ఖాన్, జి. రాజేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు పులిసునీల్, వేణుగోపాల్నాయక్, నాగేంద్రారెడ్డి, బంగారు నాగయ్య, కరిముల్లా, చల్లా రాజశేఖర్, షఫీ, ఖాజా, ఏ. సుబ్బరాయుడు, త్యాగరాజు, ఆదిత్య, సాయిచరణ్, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. బంద్ను విజయవంతం చేయాలి తుపాకులు ఎక్కుపెట్టినా, బుల్లెట్ల వర్షం కురిసినా ఈ నెల 29న బంద్ను విజయవంతం చేయాలి. రాష్ట్ర విభజనకు మూల కారణం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలే. ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని ప్రకటిస్తే, ఐదేళ్లు సరిపోదు.. పదేళ్లు కావాలని అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. నేడు వారు కేంద్ర మంత్రులై ఉండీ ప్రత్యేక హోదాపై నోరుమెదపడం లే దు. గట్టిగా మాట్లాడితే జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు మౌనం విహ స్తూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఓసీటీఎల్ కార్మికులకు అన్యాయం చేస్తే
* ప్రజాకోర్టులో శిక్ష తప్పదు * మంత్రులు నాయిని, హరీశ్లకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ తెలంగాణ కార్మికులను రోడ్డున పడేస్తున్నారని సీపీఐ మావోయిస్టు తెలంగాణ కమిటీ, విప్లవ కార్మిక సమాఖ్య (వికాస)లు ఆరోపించాయి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి సమీపంలో ఉన్న ఓసీటీఎల్ సంస్థ యాజమాన్యం మోచేతి నీళ్లు తాగి 500 మంది కార్మికుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాల కార్మిక వైఖరిని ఖండిస్తున్నామని వికాస రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ పేరుతో కరపత్రాలు వెలువడ్డాయి. ఈ కరపత్రాలను బుధవారం ‘సాక్షి’ కార్యాలయానికి పంపారు. గత 28 ఏళ్లుగా ఓసీటీఎల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.8 వేల కనీస వేతనం కూడా ఇవ్వడం లేదంటూ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంలకు ఎన్నిసార్లు కార్మికులు మొరపెట్టుకున్నా వారి సమస్యలను పరిష్కరించలేదని ఆ కరప్రతంలో పేర్కొన్నారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కుమ్మక్కయి కార్మికులకు ద్రోహం తలపెడుతున్న ఈ కార్మిక ద్రోహులను ఎండగట్టాలని పిలుపునిస్తున్నామని, కార్మికులకు అన్యాయం చేస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓసీటీఎల్ సీఎండీ కామినేని సూర్యనారాయణ, మేనేజర్ వేణుబాబు తమ పద్ధతులు మార్చుకోకపోతే కార్మిక ద్రోహులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. -
ఢిల్లీ అబ్ బహుత్ దూర్ హై!!
ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజా కోర్టు ఇప్పటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించింది. ఇక కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడటానికి ఉన్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయ సలహాదారులూ పగలూ రాత్రి మేధోమథనం చేస్త్తున్నారు. ప్రజాజీవితంలో బాధ్యతగల స్థానాల్లో ఉన్నవాళ్ల మీద ఆరో పణలు రావడం కొత్తకాదు. అలాంటప్పుడు వాళ్ళు రెండు పనులు చేయాలి. మొదటిది, తమను నమ్మి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించి న ప్రజలకు ఘటనల పూర్వా పరాలను వివరించి, తమవల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగిన తప్పులకు క్షమాప ణలు కోరడం. రెండోది, న్యాయప్రక్రియకు సిద్ధపడటం. తన మీద, తన పార్టీ మీద బలమైన ఆరోపణలు వచ్చిన పుడు నిర్వర్తించాల్సిన ప్రాణప్రదమైన కర్తవ్యాల్ని ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజా కోర్టు ఇప్పటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించింది. ఇక కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడటానికి ఉన్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయ సలహాదారులూ పగలూ రాత్రి మేధోమథనం చేస్త్తున్నా రు. న్యాయకోవిదులు కోర్టుల్లో సకల మోళీలను, గారడీ లను ప్రదర్శించి సూది బెజ్జమంత రంధ్రంలోంచి ఏను గుల్లాంటి దోషుల్ని బయటపడేస్తుంటారు. ఈ కథను చాలా మంది చదివే ఉంటారు. మహారాణి తప్ప మరె వరూ ఏడు గుర్రాల బగ్గీని వాడకూడదని ఇంగ్లండులో ఒక చట్టం ఉండేది. ఒకడెవరో ఏడు గుర్రాల బగ్గీలో లం డన్ వీధుల్లో తిరిగితే, అరెస్టు చేసి బోనెక్కిస్తారు. తెలివైన అతని లాయరు ఏడోది గుర్రం (హార్స్) కాదనీ, ఆడ గుర్రం (మేర్) అని నిరూపించి తన కక్షిదారుడ్ని నిర్దోషి గా బయటపడేస్తాడు. చట్టంలో ఇలాంటి ఏ సాంకేతిక రంధ్రాన్నయినా కనిపెట్టి కేసు నుండి బయటపడాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లాయర్ల సలహాల మేరకు కొందరు నిందితులు బోనెక్కాక అనేక ప్రశ్నలను ‘కాదు’ ‘తెలీదు’ వంటి జవా బులతో, మౌనంతో దాటవేస్తారు. లీగల్ కోర్టులో చేసి నట్టు ప్రజాకోర్టులోనూ టెక్నికల్గా వ్యవహరించడమే చంద్రబాబు ప్రత్యేకత. ఆయన అచ్చమైన హైటెక్కు నేత! రేవంత్ రెడ్డి వీడియో క్లిప్పింగుల మీద, వాటిలో ప్రస్తావనకు వచ్చిన రాజకీయ, ప్రాంతీయ, కులసమీకర ణల మీద రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆ అంశాలపై నోరు తెరవడానికి బాబు సిద్ధంగా లేరు. మౌనం అర్థాంగీకారం అవుతుందని గుర్తించే స్థితిలోనూ లేరు. ఆ క్లిప్పింగుల పుట్టుక చట్టబద్ధంగానే సాగిందా? ఒక సీఎం మీద ఏసీబీ స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ ట్యాపిం గులు చేయడం చట్టసమ్మతమా? వగైరా సాంకేతిక అంశాల మీదనే ఉంది వారి ధ్యాసంతా. ఏపీకి రావల సిన రాయితీలు, సౌకర్యాలు, వెసులుబాటులు, జాతీయ స్థాయి విద్యా, వైద్య, సాంకేతిక సంస్థలు, మౌలికరంగ పథకాలు చాలా ఉన్నాయి. రాయలసీమను, ఉత్తరాం ధ్రలో మూడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది. వీటి సాధనకు చంద్రబాబు పోరాటం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా వారి పోరాటం తనను గెలిపించిన ఏపీ ప్రజల కోసం కాదు... హైదరాబాద్లో గవర్నర్కు విశేషాధికారాల సాధన కోసం. ఇదో రాజకీయ వైచిత్రి! ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఇప్పుడు రెండు విరుద్ధ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒకైవైపు, ఏపీ సీఎం గవర్నర్ తన విశే షాధికారాలను ప్రయోగించాలని ప్రాధేయపడుతుంటే, మరోవైపు, తెలంగాణ సీఎం గవ ర్నర్ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఢిల్ల్లీలోనూ దాదాపు ఇదే సీన్. ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లినా జరగని పనులు తెలం గాణ సీఎం ఢిల్లీ వెళ్లకపోయినా జరిగిపోతున్నాయి. బాబు ఢిల్ల్లీ పర్యటనలో ఉండగానే తెలంగాణలోని యాదాద్రి-వరంగల్ నాలుగు లేన్ల రోడ్డు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది! ప్రధాని నరేంద్ర మోదీ అచ్చమైన గుజరాతీ వ్యాపా రి. చంద్రబాబు ఆస్థి ఖాతా అనుకుంటే ఎదురొచ్చి స్వాగ తం పలుకుతారు... వ్యయం ఖాతా అనుకుంటే పలక రించడానికీ ఆసక్తి చూపరు. ఇలాంటి విషయాలను రాష్ర్టస్థాయిలోనే పరిష్కరించుకోవాలేగానీ ఢిల్లీ వరకు తేకూడదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అనడం ఢిల్లీలోని కొత్త పరిణామాలకు ఒక సంకేతం. మోదీ ప్రభుత్వానికి ఏపీ రాయబారిగా ఉంటున్న వెంకయ్య నాయుడు కూడా ఈ కష్టకాలంలో బాబుతో అంటీ ముట్టనట్ట్టుగా ఉంటున్నారు. ఢిల్లీలో మోదీతో చంద్ర బాబు ఏం మాట్లాడారో గానీ.. హైదరాబాద్ తిరిగి రాగానే ప్రధానికి సుదీర్ఘ లేఖ రాశారు. ప్రధానితో ఎక్కు వగా మాట్లాడే అవకాశం బాబుకు దక్కలేదనే ఇది సూచి స్తోంది. చంద్రబాబుకు ఢిల్ల్లీ అబ్ బహుత్ దూర్ హై!! చంద్రబాబు లేఖ ప్రధాని కార్యాలయానికి చేరక ముందే...హైదరాబాద్లో ఆంధ్రులకు భద్రత లేదనడం చంద్రబాబు అపోహేనంటూ ఆ లేఖలోని ప్రధాన అం శాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్రెడ్డి ఖండించా రు. కేసీఆర్తో పాటు చంద్రబాబు కూడా యోగా శిబిరా నికి వచ్చి మానసిక వత్తిడిని దూరం చేసుకోవాలని హితవు చెప్పారు. యోగముద్రలో ఉన్న జనసేన అధి నేత పవన్ కల్యాణ్ స్పందించలేదు. ఒకవేళ స్పందిం చినా అది బాబుకు ప్రతికూలంగా ఉండే అవకాశాలే ఎక్కువ. మిత్రపక్షాలు కూడా చంద్రబాబుకు దూరం అవుతున్నాయనడానికి ఇవన్నీ సంకేతాలు కావచ్చు. (రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు) మొబైల్: 9010757776
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement