-
రియోలో తంగం
సాక్షి, చెన్నై: రియోలో తమిళ తంగం (బంగారం) మెరిశాడు. తమిళ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో, భారత దేశ క్రీడాలోకానికి మరెంతో వన్నె చేకూర్చాడు. పారాలింపిక్లో హైజంప్ విభాగంలో మారియప్పన్ తంగవేల్ బంగారు పతకం కైవసం చేసుకున్న సమాచారంతో సేలం జిల్లా పెరియవడగం పట్టి గ్రామం ఆనంద సాగరంలో మునిగింది. తమిళ సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన మారియప్పకు అమ్మ జయలలిత రూ. రెండు కోట్లు ప్రకటించారు. తరగతి స్థాయిలో క్రీడల్లో ప్రేక్షకుడిగా ఓ మూలన కూర్చుని, ఇప్పుడు రియో పతకంతో హీరోగా అవతరించిన ఈ తంగంకు అభినందనలు, ప్రశంసలు హోరెత్తుతున్నాయి. రియో వేదికగా గత నెల భారతవనితలు షట్లర్ పీవీ సింధు రాకెట్ వేగంతో వెండి, రెజ్లింగ్లో సాక్షి మాలిక్ కంచు మోత మోగించి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. వీరిని అభినందనలతో ముంచెత్తే రీతిలో తమిళనాట అభిమానులు ఆనంద తాండ వం చేశారు. తాజాగా, తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు ఏకంగా బంగారం తన్నుకు వస్తుండడంతో తమిళులకు గర్వకారణంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఆ క్రీడాకారుడెవరో కూడా తెలియని వాళ్లు, ఇప్పుడు మా బంగారమే అని గొప్పలు చెప్పుకునే పనిలో పడడం గమనార్హం. మా బంగారం : రియో వేదికగా ప్రస్తుతం పారాలింపిక్ పోటీలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన హైజంప్లో తమిళనాడుకు చెందిన ఇరవై ఏళ్ల వయసు కల్గిన క్రీడాకారుడు మారియప్పన్ తంగవేల్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడన్న సమచారం తమిళనాట ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపింది. ప్రధానంగా మారియప్ప స్వగ్రామం సంబరాల్లో మునిగింది. చిన్న పాటి గ్రామంలో బాణా సంచాల మోత రాష్ట్రాన్ని తాకింది. రాష్ట్ర వ్యాప్తంగా మారియప్పన్ను అభినందించే వాళ్లే. చొక్క తంగం (స్వచ్ఛమైన బంగారం) అని మారియప్పన్ను ప్రశంసలతో ముంచెత్తే వాళ్లే అధికం. రాష్ర్ట గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో తదితర పార్టీల నాయకులు అభినందనలతో ముంచెత్తే పనిలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు మారియప్పన్ అంటే, ఎవరో తెలియని వాళ్లకు ఇప్పడు ఆ బంగారం హీరో అయ్యాడు. ఏ నోట విన్నా, బంగారం మాటే. సోషల్ మీడియాల్లో, వాట్సాప్లలో మారియప్పన్ స్పెషల్ అట్రాక్షన్గా మారడం విశేషం. అమ్మ రూ. రెండు కోట్లు : మారియప్పన్కు బంగారం దక్కిందన్న సమాచారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. అభినందనలు తెలుపుతూ, రూ. రెండు కోట్లు ప్రకటించారు. తమిళనాడు ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన మారియప్పన్, క్రీడాలపై ఉత్సాహాన్ని చూపుతున్న ఇక్కడి పిల్లలకు ఆదర్శంగా నిలిచే స్థాయి ఎదిగాడని అభినందించారు.ప్రేక్షకుడి నుంచి : సేలం నగరానికి యాభై కిమీ దూరంలో పెరియవడగం పట్టి గ్రామం ఉంది. ఇది ఓమలూరు డివిజన్ పరిధిలో కుగ్రామం. మారియప్పన్ తండ్రి తంగవేలు, తల్లి సరోజ. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద వాడైన మారియప్పన్ ఐదో ఏట స్కూల్కు వెళ్తూ, జరిగిన ప్రమాదంలో కుడి కాలు పాదం కోల్పోవాల్సి వచ్చింది. కూలి పనులకు వెళ్తే గానీ పూట గడవని ఆ కుటుంబాన్ని ఈ ప్రమాదం కృంగ దీసింది. బిడ్డను రక్షించుకునేందుకు అప్పట్లో ఆ కుటుంబం తీవ్రంగానే కష్ట పడింది. పాదం కోల్పోయినా బిడ్డ తమకు ప్రాణాలతో దక్కడం ఆనందమే. తాను దివ్యాంగుడు కావడంతో ఆటల్లో ఎవ్వరూ అక్కున చేర్చుకోక పోవడంతో తరగతి స్థాయిలో ఓ మూలన కూర్చుని ప్రేక్షకుడి పాత్ర పోషించే వాడు. ఆరో తరగతిలో మారియప్పన్ క్రీడాస్ఫూర్తిని పీఈ మాస్టర్ రాజేంద్రన్ గుర్తించారని చెప్పవచ్చు. హైజంప్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటుంటే, ఓ మూలన కూర్చుని తదేకంగా వారి ఎత్తుగడలను వీక్షించడమే కాకుండా, ఎవ్వరూలేని సమయంలో తాను సైతం అంటూ హైజంప్ చేస్తుండడం రాజేంద్రన్ కంట పడింది. రియోకు : మారియప్పన్లో ఉన్న ఉత్సాహానికి ప్రోత్సాహం లభించినట్టు అయింది. తాను దివ్యాంగుడు అన్న విషయాన్ని మరచే స్థాయిలో అతడికి రాజేంద్రన్ శిక్షణ ఇచ్చినట్టుగా పెరియవడగం పట్టి వాసులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు, అతడి మిత్రులు ఇచ్చిన సహకారం ప్రోత్సాహం మండల స్థాయిలో పతకాలను, తదుపరి జిల్లా స్థాయిలో, తదనంతరం రాష్ట్ర స్థాయి నుంచి విదేశీ స్థాయి పోటీలకు చేర్చాయని చెబుతున్నారు. కడు పేదరికంలో పుట్టిన మారియప్పన్ అనేక సార్లు కూలి పనులకు సైతం వెళ్లినట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు అందరి సహకారంతో రియోలో అడు పెట్టి బంగారంతో తిరిగి వస్తున్న మారియప్పన్కు తమ గ్రామంలో ఘన స్వాగతం పలికేందుకు అక్కడి యువత సిద్ధం అవుతున్నది. తనయుడు బంగారం పట్టాడన్న సమాచారంతో తల్లి సరోజ ఉద్వేగానికి గురి అయ్యారు. తన బిడ్డ ఈ స్థాయికి చేరడంలో అందరి సహకారం ఉందని, అమ్మ రూ. రెండు కోట్లు ప్రకటించడం ఆనందంగా ఉందంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక, రియో నుంచి మారియప్పన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ జయలలిత క్రీడాకారులకు మంచి సహకారం అందించారని, అందిస్తూనే ఉన్నారని పేర్కొంటూ, అమ్మతో పాటు అందరికీ తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. -
రియో మళ్లీ వెలిగింది
ఘనంగా పారాలింపిక్స్ ప్రారంభోత్సవం రియో డి జనీరో: ఒలింపిక్స్కు ఏమాత్రం తీసిపోని రీతిలో పారాలింపిక్స్ ప్రారంభ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. భారత కాలమానప్రకారం గురువారం తెల్లవారుజామున మరకానా స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో సాంబా నృత్యాలతో పాటు భారీ బెలూన్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులతో రియో నగరం జిగేల్మంది. ఒలింపిక్స్ ముగిసిన అనంతరం సంప్రదాయంగా ఈ గేమ్స్ జరిగే విషయం తెలిసిందే. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులను సాంబా కళాకారులు ఉర్రూతలూగించగా స్టేడియం మధ్యలో రియో బీచ్ దృశ్యాలను సృష్టించడం అబ్బురపరిచింది. ‘ప్రతి ఒక్కరికీ హృదయం ఉంటుంది’ అనే పేరిట చేసిన ప్రదర్శన అమితంగా అలరించింది. ఈనెల 18 వరకు ఈ క్రీడలు జరుగుతాయి. మరోవైపు నూతనంగా అధ్యక్ష పదవిని అలంకరించిన మైకేల్ టెమెర్ను వ్యతిరేకిస్తూ కొందరు ప్రేక్షకులు ప్లకార్డులు ప్రదర్శించారు. శారీరక వైకల్యం, పాక్షిక అంధత్వం, పక్షవాతం కలిగిన అథ్లెట్లు ఈ గేమ్స్లో పాల్గొంటారు. ఓవరాల్గా 159 దేశాల నుంచి ఈ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా 4,342 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో ఇద్దరితో కూడిన అంతర్జాతీయ శరణార్ధి జట్టు కూడా ఉంది. భారత్ నుంచి ఎన్నడూ లేని విధంగా 17 మంది అథ్లెట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నారు. డోపింగ్ ఆరోపణలతో రష్యా అథ్లెట్లను ఇందులో పాల్గొనకుండా బహిష్కరించారు. 154 దేశాల్లో ఈ క్రీడలు ప్రసారం కాబోతున్నాయి. అంగవైకల్యం కలిగిన వారిపై ఉన్న దృష్టికోణాన్ని ఈ క్రీడల ద్వారా తమ అథ్లెట్లు పటాపంచలు చేస్తారని అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం వీటి టిక్కెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. అయితే 1984 అనంతరం ఐఓసీ చీఫ్ లేకుండానే ఈ గేమ్స్ ప్రారంభమయ్యాయి. పశ్చిమ జర్మనీ మాజీ అధ్యక్షుడు వాల్టర్ షీల్ అంత్యక్రియల్లో పాల్గొన్న థామస్ బాచ్ ఈ వేడుకలకు గైర్హాజరయ్యారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement