-
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాలు ఇక్కడే!
-
Gyanavapi Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వే సందర్భంగా జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం మే17న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మసీదులో శివలింగాన్ని గుర్తించిన వాఘూఖానా ప్రాంతాన్ని సీజ్ చేయాలని, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. చదవండి: (Delhi MCD Election: పది కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్) -
దేశంలో ఏకైక పంచ బ్రహ్మలింగేశ్వర ఆలయం
కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడులో వెలసిన పంచబ్రహ్మలింగేశ్వర ఆలయం దేశంలోనే ఏకైక ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. వినాయకుడు, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణువు, బ్రహ్మ పూర్ణంగా(పంచబ్రహ్మలు) శివలింగాన్ని ప్రతిష్టించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ రోజున దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నది జలాలతో పంచబ్రహ్మలింగేశ్వరుడికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో నది నుంచి క్యానులో 25 లీటర్ల చొప్పున ఆరు క్యాన్లతో నది జలాలను తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు. ఇప్పటి వరకు గంగ, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, నర్మద నదుల నీటితో అభిషేకం నిర్వహించారు. అలాగే ఆలయం ఎదుట 14 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన 68 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం దేశంలోనే రెండవ అతిపెద్ద ధ్వజస్తంభంగా పేరుగాంచింది. కర్నాటక రాష్ట్రంలోని హోస్పెట్ నుంచి ఏకశిలా రాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. దేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం కర్నాటక రాష్ట్రంలో ఉండగా రెండవది ఆంధ్రప్రదేశ్లోని భీమునిపాడులో ప్రతిష్టించడం విశేషం. -
పరివార ఆలయాలు – దేవతలు
ఆలయానికి దేవాలయం.. దేవస్థానం అనే పేర్లు ప్రచారంలో ఉన్నా ఆగమం అందులో ఓ తేడాను చెప్తుంది. గర్భగుడి.. గుడిలో మూలమూర్తి లేదా శివలింగం.. ఎదురుగా నంది/వాహనం... ధ్వజస్తంభం..బలిపీఠం ఇవి మాత్రమే ఉంటే దాన్ని దేవాలయం అంటారు. అదే వీటితోపాటు దేవి, గణపతి, స్కందుడు, చండేశ్వరుడు, పరివార దేవాలయాలు, అనేక శాలలు, గోపురాలు ఉన్నదాన్ని దేవస్థానం అంటారు. శయనాలయం దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత తప్పనిసరిగా ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలను దర్శించుకోవాలి. వాటిలో ఉన్న దేవతలను పరివార దేవతలు అంటారు. పరివార దేవతలను తప్పక దర్శించాలి అన్నది ఆలయ నియమం. స్వామివారి దేవేరులు.. పిల్లలు...ద్వారదేవతలు... దిక్పాలకులు.. గణనాయకుడు.. సేనాపతి... ఋషులు.. భక్తులు వీళ్లంతా పరివారదేవతలుగానే పరిగణించబడతారు. పరివార దేవతలందరికీ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. రాజు ఒక పనిని తన పరివారం తోడ్పాటుతో పూర్తి చేసినట్లే... ఇక్కడ భగవంతుడు తన భక్తుల కోర్కెలను కూడా ఈ పరివార దేవతల ద్వారా తీరుస్తాడు. ఈ పరివార దేవతలనే ఆవరణ దేవతలు, ఉపదేవతలు అని కూడా అంటారు. వీరిని మూలమూర్తితో పాటు నిత్యం పూజిస్తారు. ఈ పరివారమూర్తులను ప్రతిష్ఠించడం దేవాలయానికి శోభను.. శాంతిని... మరింత పవిత్రతను.. తెచ్చిపెడుతుందని శ్రీ ప్రశ్నసంహిత చెబుతుంది. ఈ పరివార దేవతలు సామాన్యంగా ఎనిమిది మందితో మొదలై గరిష్టంగా అరవైనాలుగుమంది వరకూ ఉంటారు. మొదటి ప్రాకారంలో.. అంటే గర్భగుడి చుట్టూ ఎనిమిదిమంది ... రెండవ ప్రాకారంలో పదహారుమంది... మూడవ ప్రాకారంలో ముప్పైరెండుమంది పరివార దేవతలుండాలని మానసార శిల్పశాస్త్రం చెప్పింది. పన్నెండుమంది పరివారదేవతలుంటే ఉత్తమం అని సనత్కుమారసంహిత చెప్తుంది. వైఖానసాగమంలో ఎనిమిదిమందితో మొదలై.. ఏడుప్రాకారాలు.. నూటపన్నెండుమంది పరివారదేవతల వరకు ఉంది. అలా ఉన్న ఆలయమే ఉత్తమోత్తమమైనది అని చెప్తోంది. శివాలయానికి దేవి, నంది, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అగ్నిదుర్గా, అగస్త్యుడు, బ్రహ్మ, సప్తమాతృకలు, వీరభద్రుడు, విష్ణువు, శివసూర్యుడు, జ్యేష్ఠ పరివారదేవతలుగా ఉంటారు. విష్ణ్వాలయానికి దేవేరులు శ్రీదేవి–భూదేవి, గరుడుడు, విష్వక్సేనుడు, చక్రమూర్తి, దశావతారాలు, పంచమూర్తులు, నవమూర్తులు, ద్వాదశాదిత్యులు పరివారదేవతలు. శక్తి ఆలయానికి జయా, విజయా, అజితా, అపరాజితా, విభక్తా, మంగళా, మోహినీ, స్తంభినీ అనే ఎనిమిదిమంది దేవతలు. పరివారదేవతలను దర్శించి మూలమూర్తి దగ్గర కోరిన కోరికలు మరోమారు తలుచుకుంటే మన కోరికలు తప్పక నెరవేరుతాయన్నది ఆగమ శాస్త్రోక్తి. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
పరమపవిత్రం స్ఫటిక లింగం
సాక్షి, రాజాం : రాజాం పట్టణం అనగానే అందరికంటే ముందుగా గుర్తొచ్చేది తాండ్ర పాపారాయుడు. రాజాం కేంద్రంగా బొబ్బిలి రాజుల ప్రతినిధిగా ఆయన పాలన సాగించేవారు. ఇదే సమయంలో అక్కడ ఆయన పలు ఆలయాలను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఎక్కువుగా వైష్ణవ ఆలయాలు ఉండే ఈ ప్రాంతంలో ఆయన మాత్రం సారధిలోని కూరాకుల వీధిలో ప్రత్యేకంగా స్ఫటిక శివలింగాన్ని ప్రతిష్టించారు. లోక కల్యాణార్థం అప్పట్లో ఆయన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచి్చన రాతితో నిర్మించినట్లు చెబుతారు. మరోవైపు ఈ ఆలయంలో గర్భగుడి కుడి, ఎడమ వైపునున్న గుడుల్లో గణేశుని ప్రతిమతతో పాటు పార్వతిదేవి ప్రతిమలు ఉత్తర, దక్షిణ ముఖంగా ఉంటాయి. ఇలా ఈ రెండు విగ్రహాలు ఉత్తర, దక్షిణ ముఖాలుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. తాండ్ర పాపారాయుడు ప్రతిరోజు ఉదయం శివలింగ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేసేవారని తెలుస్తోంది. ఈ శివలింగానికి నిష్టతో పూజచేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement