-
టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!
ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి. అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే. ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్ చేయాలంటే.. అక్కడ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!. టమాటాలకు అల్ట్రనేటివ్గా వేటిని ఉపయోగించాలంటే.. ►టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే ఆ కూర రుచి అదర్స్ అనే చెప్పాలి. ►మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. ►ఇక రెడ్ బెల్ పెప్పర్ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ►ఇంకోకటి ఆలివ్లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్లు అయితే టమాటకు బెస్ట్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు ►అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది. గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. (చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు) -
లిక్విడిటీ బూస్ట్ : మార్కెట్ల హై జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు దూకుడు పదర్శిస్తున్నాయి.తొలుత కొన్నినిముషాలపాటు ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తరువాత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం సెన్సెక్స్550 పాయింట్లు జంప్చేసి 33,922వద్ద నిఫ్టీ 150 పాయింట్ల ఎగసి 10,180 వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ ఇచ్చిన లిక్వడిటీ బూస్టప్తోపీఎస్యూ బ్యాంక్స్ జోరుగా ఉన్నాయి. ఓపెన్మార్కెట్ ద్వారా రూ. 40వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నామన్న ఆర్బీఐ ప్రకటన రుపీ, బాండ్, ఈక్విటీ మార్కెట్లకు జోష్నిచ్చింది. ముఖ్యంగా ఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ 6.6 శాతం దూసుకెళ్లింది. అలాగే ఫార్మా 4.5 శాతం జంప్చేసింది. రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, ఐటీ షేర్లు సహా ఇమిగతా అన్ని రంగాలూ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసీఐసీఐ 10శాతం ఎగిసి బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ విన్నర్గా ఉంది. ఓబీసీ,యూనియన్, కెనరా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్, పీఎన్బీ, బీవోబీ, ఎస్బీఐ, విజయా, సెంట్రల్ బ్యాంక్ భారీలా లాభపడుతున్నాయి. ఇక ఫార్మా కౌంటర్లలోనూ దివీస్ 14 శాతం దూసుకెళ్లగా.. అరబిందో, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా, సన్ ఫార్మా, కేడిలా హెల్త్కేర్, బయోకాన్, గ్లెన్మార్క్ కూడా ఇదే బాటలో ఉన్నాయి. అలాగే రియల్టీ షేర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, సన్టెక్, ఇండియాబుల్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్, హెక్సావేర్, ఇన్ఫీబీమ్, భారత్ ఫైనాన్స్, ఈక్విటాస్, దాల్మియా భారత్, భారత్ ఎలక్ట్రానిక్స్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అటు రూపీ కూడా డాలరు మారకంలో లాభాలతో కొనసాగుతోంది. -
దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పైకి ఎగబాకింది. జూన్ మాసంలోఇది 1.62 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మే నెలలోని 0.79 శాతంతో పోలిస్తే అంచనాలకు మించి మరింత పైకి దూసుకుపోయింది. ఆహార ద్రవ్యోల్బం 8.18శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టాన్ని తాకడం దీనికి కారణంగా అంచనావేస్తున్నారు. కూరగాయలకు, పళ్లు,తృణ ధాన్యాల ధరల్లో పెరడతంతో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదం చేసిందన్నారు. జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. గతేడాది జూన్లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉంది. మరో వైపు ఇదే ఏడాది మే నెలలో 5.76 శాతంగా ఉంది. ఆగస్టు 2014లో వినియోగదారు(రిటైల్) ద్రవ్యోల్బణం 7.8 శాతంగా నమోదయిన తర్వాత మళ్లీ దాదాపు ఆ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టానికి, పారిశ్రామిక ఉత్పత్తి విభాగాల వారీ చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 7.47 శాతం ఉండగా, జూన్లో 7.79 శాతానికి పెరిగింది. కూరగాయలకు సంబంధించిన ధరల్లో పెరుగుదల మే నెలలో 10.77 శాతం ఉండగా జూన్లో 14.74 శాతానికి పెరిగింది. మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 31.57 శాతం ఉండగా జూన్ నెలకు 26.86 శాతానికి తగ్గింది. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 1.2 శాతం వృద్ది తో ఉత్సాహకరంగా నిలిచింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement