-
సూర్య నమస్కారంతో సంపూర్ణ ఆరోగ్యం
నందిగామ: యోగా, ధ్యానం మన జీవితంలో అంతర్భాగం కావాలని కేంద్రమంత్రి శర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా విలేజ్లోని కాన్హా శాంతి వనంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హార్ట్ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హార్ట్ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ డి.పటేల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శర్భానంద హాజరయ్యారు. యోగా గురు రామ్దేవ్ బాబా, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి అంతర్జాతీయ యోగా అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..75 కోట్ల సూర్య నమస్కారాలు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామ్దేవ్ బాబా మాట్లాడుతూ.. సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. కమ్లేష్ డి.పటేల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా అకాడమీని స్థాపించడం ద్వారా అనేక మందికి ఉపయోగపడుతుందని అన్నారు. గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ..అంతర్జాతీయ స్థాయిలో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో యోగా సాధన చేయాలని, అలాంటి వాతావరణం మన రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. అంతకు ముందు వీరంతా కలసి ‘ది అథెంటిక్ యోగా’పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
హైదరాబాద్ వేదికగా.. 75 కోట్ల సూర్య నమస్కారాలు!
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా సరికొత్తగా 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్ జరగబోతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జరిగే ఈ ఆన్లైన్ చాలెంజ్కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. నందిగామ మండలంలోని కన్హా విలేజ్లో ఉన్న కన్హా శాంతి వనంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 3న మొదలై ఫిబ్రవరి 20 వరకు కార్యక్రమం కొనసాగనుంది. హార్ట్ ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్ తదితర జాతీయ స్థాయి సంస్థలు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాయి. రామ్దేవ్ బాబాతో పాటు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగానే అథెంటిక్ యోగా బుక్ ఆవిష్కరణ, హార్ట్ ఫుల్ నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీకి శంకుస్థాపన కూడా జరగనుంది. చదవండి: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపు.. మందు, బీర్లు తెగ లాగించేశారు.. 21 రోజులు.. రోజుకు 13 సర్కిల్స్ చాలెంజ్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులు క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరూ 12 సూర్య నమస్కారాల సర్కిల్ను రోజుకు 13 సార్లు చొప్పున సాధన చేస్తారు. ఫిబ్రవరి 20లోపు వీలును బట్టి 21 రోజుల్లో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసిన వారికి నిర్వాహకులు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. 30 లక్షల మంది విద్యార్థులు పాల్గొనేలా.. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లోని వెయ్యికి పైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకు పైగా కళాశాలలు ఈ 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్లో పాల్గొననున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చేసేందుకు కృషి జరుగుతోంది. చదవండి: సర్కారు తప్పిదాలతోనే విద్యుత్ మోత! -
ప్రణతోస్మి దివాకరం
సూర్య నమస్కారాలు వెన్నెముక మొత్తాన్ని చైతన్యవంతం చేసి, భావోద్వేగాలను అదుపులో ఉంచే శక్తి సూర్య నమస్కారాలకు ఉంది. వీటిని శ్వాసమీద ధ్యాస ఉంచి చేయాలి. సరిగ్గా సాధన చేస్తే హృద్రోగ సమస్యలు దరిచేరవు. వీటిని నిదానంగా ప్రారంభించి-వేగవంతం చేసి- తిరిగి నిదానంగా పూర్వస్థితిలోకి రావాలి. నేరుగా వేగం పెంచితే కీళ్లు పట్టేసే ప్రమాదముంది. ఈ ఆసనాలు వేసేటప్పుడు అవి శరీరంలోని ఏ భాగం మీద పనిచేస్తాయో అక్కడే మనసును కేంద్రీకరించాలి. అందరూ ఈ ఆసనాలన్నీ చేయవచ్చు. నడుం నొప్పి ఉన్నవాళ్లు కూడా చేయవచ్చు. ఏ వయసు వారైనా ఈ ఆసనాలను నిత్యం చేయవచ్చు. అయితే శాస్త్రీయంగా సాధన చేయడం అవసరం. ప్రాతఃకాలంలో వాతావరణంలో పాజిటివ్ డ్యూరో ట్రాన్స్మీటర్స్ ఉంటాయి. మనసును కేంద్రీకరించడానికి అది సరైన సమయం. జీవనశైలి ప్రకారం కుదరకుంటే ఏ సమయంలోనైనా చేయవచ్చు. కాని ఆహారం తీసుకున్న 4 గంటల తర్వాతే చేయాలి. కడుపు నిండా నీళ్లు తాగినట్లయితే కనీసం అరగంట విరామం ఇవ్వాలి. 1. ప్రణామాసనం: తూర్పుదిక్కుకు అభిముఖంగా నిల్చొని సూర్యుడికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉంటుందీ ఆసనం. శ్వాస, రక్తప్రసరణ వ్యవస్థకు మంచిది. ప్రారంభంలో 4 - 5 సాధారణ శ్వాసలు తీసుకొని వదలాలి. దీనిలో ప్రయత్నపూర్వకంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. 2. హస్త ఉత్థానాసనం: మోకాళ్లను కొద్దిగా ముందుకు వంచుతూ, చేతులను తల మీదుగా తీసుకుంటూ భుజాల వెనక్కి వెళ్లేలా ఉదరభాగాన్ని ముందుకు తీసుకోవాలి. ఈ భంగిమలో వెన్నెముక మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా నెమ్మదిగా గాలి పీల్చుతూ, వదులుతూండాలి. ఈ ఆసనం వల్ల వెన్ను, మెడ కండరాలు, నాడీ వ్యవస్థ చైతన్యవంతం అవుతాయి. 3. పాదహస్తాసనం: కాళ్లను నిటారుగా ఉంచి, గాలి వదులుతూ నిదానంగా ముందుకు వంగాలి. వెన్నెముక మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. తల మోకాలుకు ఆనేలా వీలయినంత వంగాలి. దీని వల్ల మూత్ర వ్యవస్థ, ప్రత్యుత్పతి వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. 4. అశ్వ సంచాలాసనం: గాలి నెమ్మదిగా పీల్చుకుంటూ చేతులను నేలకు ఆనించి, కుడికాలిని వెనక్కు తీసుకెళ్లి, ఛాతీని, తలని పెకైత్తాలి. హైపోథాలమస్ (మెదడులో భావోద్వేగానికి సంబంధించిన ఒక భాగం) మీద ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. ధ్యాసను కనుబొమల మధ్యనే ఉంచాలి. దృష్టిని కుడికాలి బొటన వేలి నుంచి కనుబొమల దాకా తీసుకురావాలి. కుడివైపు భాగానికి చేస్తున్నాం కాబట్టి ఆ వైపు అంతా చైతన్యవంతం అవుతుంది. 5. చతురంగాసనం: గాలిని వదిలేస్తూ ఎడమకాలిని కుడికాలికి జత చేయాలి. నడుం మీద బరువు పడకుండా చూసుకోవాలి. పొట్ట, ఛాతీ. ఇలా నెమ్మదిగా గొంత ుదాకా మనసును తీసుకురావాలి. ఇది నాడీ వ్యవస్థ మీద, ఉదరం మీద పనిచేస్తుంది. 6. అష్టాంగ నమనాసనం: శరీరంలో 8 భాగాలు నేలను తాకుతాయి కాబట్టి దీనికీ పేరు. గాలి తీసుకుని, వదిలేస్తూ నెమ్మదిగా మోకాలిని, ఛాతీని, గడ్డాన్ని నేలకు ఆన్చాలి. మెడనొప్పి ఉన్నవాళ్లు నుదురును నేలకు ఆనించాలి. నడుం భాగం పైకి ఎత్తిపెట్టి ఉంచాలి, నేలకు ఆనకూడదు. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 7. భుజంగాసనం: నెమ్మదిగా గాలి పీలుస్తూ చేతులు నేలకు ఆన్చి ఛాతీ, తలను పెకైత్తాలి. ఇది పునరుత్పత్తి, మూత్రవిసర్జన, రక్తప్రసరణ వ్యవస్థలపైనా, థైరాయిడ్ గ్రంథి మీద పనిచేస్తుంది. నడుమును బలోపేతం చేస్తుంది. 8. పర్వతాసనం లేదా అథోముఖ శ్వానాసనం: ఒత్తిడికి లోనైన వెన్నెముక విశ్రాంతి పొందేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ మీద పనిచేసే ఈ ఆసనం నడుం నొప్పికి ఔషధం అని చెప్పవచ్చు. ఈ ఆసనం వేసే సమయంలో నిదానంగా గాలిని వదులుతూ నడుమును పెకైత్తి, గాలిని లోపలికి తీసుకుంటూ యథాస్థానానికి రావాలి. 9. అశ్వసంచాలనాసనం: (నాలుగో ఆసనంలో కుడివైపు చేశాం) ఇప్పుడు ఈ ఆసనంలో ఎడమ వైపు చేయాలి. రెండు మోకాళ్లను నేలకు ఆన్చి నెమ్మదిగా ఎడమ కాలును వెనక్కు తీసుకుంటూ ఛాతీని, తలను పెకైత్తాలి. 10. పాదహస్తాసనం: (3వ ఆసనం లాంటిదే) ఎడమకాలుని కుడికాలికి జత చేసి నడుమును పెకైత్తాలి. 11. హస్త ఉత్థానాసనం: నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మోకాళ్లకు కొద్దిగా ముందుకు వంచి, చేతులను భుజాల వెనక్కి తీసుకె ళ్లాలి. శరీరాన్ని సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ చేయాలి. 12. ప్రణామాసనం: నిటారుగా నిల్చొనే స్థితికి వచ్చి, నెమ్మదిగా గాలిని వదిలేస్తూ రెండు చేతులను నమస్కార భంగిమలో హృదయస్థానం పైకి తీసుకురావాలి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement