-
ఒకే సిరంజీ.. హెచ్ఐవీ సోకడంతో బయటకు నెట్టేశారు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఓ డాక్టర్ పేషెంట్లందరికీ ఒకే సిరంజీతో సూది మందులు ఇవ్వగా.. ఓ బాలికకు హెచ్ఐవీ సోకింది. అయితే బాలికకు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యాక సిబ్బంది ఆమెను బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. బాధిత తల్లిదండ్రుల కథనం ప్రకారం.. యూపీ ఎటాహ్ జిల్లా రాణి అవంతి బాయి లోధా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ అప్పటికే కొందరు షేషంట్లకు వాడిన సిరంజీతో ఇంజెక్షన్ చేశాడు. ఆ సమయంలో పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సిబ్బంది పట్టించుకోకుండా ఇంజెక్షన్ వేశాడు. ఆ తర్వాత అదే సిరంజీని మరికొందరికి వాడాడు కూడా. ఆపై కొన్నిరోజులకు చిన్నారికి రక్త పరీక్షల్లో హెచ్ఐవీగా తేలింది. దీంతో రాత్రికి రాత్రే ఆస్పత్రి సిబ్బంది ఆ బాలికను బయటకు బలవంతంగా పంపించేశారు. ఈ ఘటనపై శనివారం ఆమె తల్లిదండ్రులు జిల్లా న్యాయాధికారి(కలెక్టర్) అంకిత్ కుమార్ అగర్వాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు విషయం వార్తల్లోకి ఎక్కడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ స్పందిస్తూ.. ఘటనపై సమగ్ర వివరణ కోరామని, డాక్టర్ది తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాల బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. मेडिकल कॉलेज,एटा में चिकित्सक द्वारा एक ही सिरिंज से कई मरीजों को इंजेक्शन लगाए जाने एवं एक बच्चे की जाँच रिपोर्ट एचआईवी पॉजिटिव मिलने संबंधी प्रकरण का तत्काल संज्ञान लेते हुए मेरे द्वारा प्रधानाचार्य,स्वशासी राजकीय मेडिकल कॉलेज एटा से उक्त संबंध में स्पष्टीकरण मांगा गया है (1/2) — Brajesh Pathak (@brajeshpathakup) March 4, 2023 -
హైదరాబాద్ను ఆగం చేస్తున్న బయో వ్యర్థాలు.. రోగాల కుంపటిగా..!
సూదిమందు.. వాడిపడేసిన కాటన్.. టానిక్ సీసా.. ఇతరత్రా ఆస్పత్రి వ్యర్థాలు మహానగరాన్ని ముంచెత్తుతున్నాయి. వాటిలోని బ్యాక్టీరియా, వైరస్లు వాతావరణంలో కలిసి నగరాన్ని రోగాల కుంపటిగా మారుస్తున్నాయి. ఇప్పటికీ అనేక ఆస్పత్రులు తమ వ్యర్థాలను ఆరు బయట తగులబెడుతుండడంతో అనేక మంది అంటురోగాల బారిన పడుతున్నారు. అత్యాధునిక వైద్యానికి, అనేక అరుదైన చికిత్సలతో మెడికల్ హబ్గా గుర్తింపు పొందిన గ్రేటర్ను ప్రస్తుతం ఆస్పత్రి వ్యర్థాలు దడ పుట్టిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. మెజారిటీ క్లినిక్లు, నర్సింగ్ హోమ్లకు పీసీబీ అనుమతులు, జీవ వ్యర్థాల నిర్వహణ సర్టిఫికెట్లు లేకపోవడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఉన్న 3,919 ఆస్పత్రుల్లో 60 వేలకుపైగా పడకలు ఉన్నట్లు అంచనా. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 300 నుంచి 400 గ్రాముల వరకు జీవవ్యర్థాలు వెలువడుతున్నట్లు పీసీబీ లెక్కవేసింది. గ్రేటర్ నుంచి నిత్యం 35 టన్నులు, శివారు పురపాలికల నుంచి మరో 15 టన్నుల వరకు ఆస్పత్రి వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా వేసింది. ఈ వ్యర్థాలను కార్పొరేట్ ఆస్పత్రులు మినహా ఇతర ఆస్పత్రులు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా సాధారణ చెత్తతో పాటే పడవేస్తుండడంతో బ్యాక్టీరియా, వైరస్లు గాలిలో కలిసి వివిధ రకాల వ్యాధులకు కారణమవుతున్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ చెత్తతోనే వ్యర్థాలు ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ చట్టం– 1998 ప్రకారం ఆస్పత్రుల్లో రోజువారీ ఉత్పత్తయ్యే చెత్తను వేర్వేరు రంగుల డబ్బాల్లో నింపాలి. 48 గంటలకు మించి ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదు. వీటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన కేంద్రాలకు తరలించాలి. రవాణాలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచరణలో ఈ నిబంధనలు అమలు కావడంలేదు. గాందీ, ఉస్మానియా, కోఠి ప్రసూతి ఆస్పత్రి, నిమ్స్ సహా పలు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతో పాటే ఆస్పత్రి వ్యర్థాలను గుట్టలుగా పోగుచేసి తగులబెడుతుండడంతో వాతావరణం కలుషితమవుతోంది. ఈ పొగ పీల్చుకున్న వారిలో 20 శాతం మంది అస్వస్థతకు గురవుతున్నారు. విదేశాల్లో ఇలా.. అమెరికా, ఆ్రస్టేలియా, ఇంగ్లాడ్ తదితర విదేశాల్లో ఆస్పత్రి వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవ వ్యర్థాల వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదకర రసాయనాలు, ఇతర ఉద్గారాలు గాలిలో కలువకుండా ఎప్పటికప్పుడు దహనం చేస్తున్నారు. వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో నింపి వాటిని నిర్వహణ కేంద్రాలకు జాగ్రత్తగా తరలిస్తున్నారు. అక్కడ ఆటో క్లీనింగ్, మైక్రోవేవింగ్, కెమికల్ ట్రీట్ మెంట్ నిర్వహించి వ్యర్థాల్లో బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులు లేకుండా చేస్తున్నారు. ఆ తర్వాత భూమిపై పెద్ద గుంత తీసి వాటిలో పూడుస్తున్నారు. ప్రస్తుతం మన కార్పొరేట్ ఆస్పత్రులు ఈ విధానాన్ని సొంతంగా అమలు చేస్తుండగా..మిగతావారు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతోనే అనర్థాలు తలెత్తుతున్నట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వ్యర్థాలతో అనర్థాలివే: హెచ్ఐవీ రోగులు వాడిపడేసిన సూదులు, బ్లేడులు ఆరుబయట పడేయడంతో ఇవి ఇతరులకు గుచ్చుకున్నప్పుడు వారికి ఆయా రోగాలు సోకే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి వంటి రోగాలు ప్రబలుతాయి. చీము తుడిచిన కాటన్ను వథాగా పడవేస్తుండడంతో అందులోని ఫంగస్ ఇతరులకు వ్యాపిస్తుంది. ఆస్పత్రి వ్యర్థాల్లోని బ్యాక్టీరియా, వైరస్ ఇతరులకు త్వరగా వ్యాపించి జీర్ణకోశ, శ్వాసకోశ, చర్మ వ్యాధులు ప్రబలుతాయి. ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు రోగుల రక్తంతో తడిసిన దుప్పట్లు, సర్జికల్ డ్రెస్సులు నగరంలోని శివారు చెరువుల్లో శుభ్రం చేస్తుండటంతో చెరువుల్లోని నీరు కలుషితమవుతోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆస్పత్రులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేకపోవడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వానికి, గవర్నర్కు ఫిర్యాదు చేశాం. అయినా జీవ వ్యర్థాల నిర్వహణ విషయంలో మార్పు కనిపించడం లేదు. – ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (చదవండి: మద్యం ‘మత్తు’లో ఎవరెవరు?) -
టీకా కలకలం: ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్.. ఆ తర్వాత..
Vaccinated 30 Students With One Syringe.. కరోనా కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు స్థాయిలో 200కోట్ల డోసులకుపైగా టీకాలను అందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ కేంద్రంలో జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా ఇవ్వడం కలకలం సృష్టించింది. అయితే, దీనికి ఆయన చెప్పిన సమాధానం విన్న స్థానికులు అవాక్కయ్యారు. తన పై అధికారులు ఆదేశాల మేరకే తాను ఇలా చేసినట్టు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం..సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. అది గమనించిన విద్యార్థులు పేరెంట్స్ ఇదేంటని ప్రశ్నిస్తే.. తమ పై అధికారులు ఒకే సిరంజీ పంపించారని, ఆ ఒక్క సిరంజీతోనే విద్యార్థులందరికీ టీకా వేయాలని ఆదేశించారని వెల్లడించారు. ఈ క్రమంలో ఇలా టీకా వేయడంలో తప్పు ఏముంది అంటూ వ్యాఖ్యలు చేయడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో, పిల్లల పేరెంట్స్ అతడిపై దాడి చేసినంత పనిచేశారు. Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX — Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022 ఈ విషయం.. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రాకేశ్ రోషన్ దృష్టికి చేరడంతో ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జితేంద్ర.. వన్ నీడిల్, వన్ సిరంజీ, వన్ టైమ్ అనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఉల్లఘించారని తెలిపారు. అందుకే జితేంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ స్పందిస్తూ.. జితేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘నేను ఏం చేస్తానో తెలుసా?’ ఎంపీ కూతురి సమాధానంతో.. -
న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని ఇంజెక్ట్ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి
Lawyer Accused of Injecting Blood Into Food: కొంతమంది పైశాచికంగా ఎదుటవాళ్ల మీద కోపంతోనూ లేదా ద్వేషంతోనూ వికృతమైన పనులకు ఒడిగడుతుంటారు. అలాంటి పలు ఘటనలు గురించి విన్నాం కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన దుశ్చర్యకు ఒడిగట్టాడు. అది కూడా ఎలా చేస్తున్నాడో వింటే కచ్చితంగా షాక్ అవుతారు. అసలు విషయంలోకెళ్తే...లండన్లోని వ్యక్తి సూపర్ మార్కెట్లోని ఆహార పదార్థాల్లోకి తన రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సూపర్ మార్కెట్లలోని ఆహార పదార్థాల్లోకి రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. ఈ మేరకు అతను చేస్తున్న పని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో సదరు షాపు వాళ్లు కస్టమర్లను పంపించేసి ఆహార పదార్థాలన్నింటిని పడేశారు. అంతేకాదు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుని నెట్టడం సిరంజీలు విసరడం వంటివి చేశాడు. పోలీసులు ఈ ఘటనల్లో సుమారు 21 సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందుతుడు లియోయాయ్ ఎల్గరీబ్గా గుర్తించారు. అతను స్వంతంగా లీగల్ కన్సల్టెన్సీని కూడా ఉంది. అయితే సూపర్ మార్కెట్లన్నీ సుమారు రూ.5 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ మేరకు పోలీసులో ప్రతి సీసీ ఫుటేజ్ని పరీక్షించి చూడాగా ..ఆపిల్లు, చికెన్ టిక్కా ఫిల్లెట్ల ప్యాకెట్లకు అతను రక్తాన్ని ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు విచారణలో అవన్నీ 37 ఏళ్ల క్రితం నాటి ఆహారంగా చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. పైగా ఆ సీసీ ఫుటేజ్లో అతను ఒక బకెట్లో హైపోడెర్మిక్ సూదులను మోస్తున్నట్లు కూడా కనిపించిందన్నారు. కానీ నిందుతుడు లియోయాయ్ ఎల్గరీబ్ మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు లండన్లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు ఆ వింత కేసును విచారించింది. అయితే నిందుతుడి తరుఫు న్యాయవాదులు మాత్రం అతని పిచ్చివాడని, మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. మరోవైపు సైక్రియార్టిస్ట్ డాక్టర్లు కూడా అతని మానసిక పరిస్థితి గందరగోళంగా ఉందని కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా చేసిన నేరంగా భావించలేకపోతున్నాం అని చెప్పారు. దీంతో లండన్ కోర్టు అతను ఈ నేరం చేసినప్పుడూ అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో విచారించమని ఆదేశించడం గమనార్హం. (చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!) -
Omicron Variant: సిరంజీలకు కొరత..!
కరోనా రెండోవేవ్లో వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు హాహాకారాలు చేశాయి. టీకాలు పంపండి మహాప్రభో అంటూ కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. ఉత్పత్తి పెరిగి ఇప్పుడు సమృద్ధిగా టీకా డోసులు అందుబాటులోకి వచ్చేశాయని స్థిమిత పడుతుంటే మరో సమస్య వచ్చిపడింది. ఒమిక్రాన్ వేరియెంట్, జనవరి– ఫిబ్రవరి నెలల్లో థర్డ్వేవ్ పీక్స్కు చేరొచ్చనే వార్తలనేపథ్యంలో సిరంజీలకు తీవ్ర కొరత రానుంది. కోవిడ్ వ్యాక్సినేషన్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఏం జరిగింది? మూలిగే నక్కపై తాటిపండు ప్రపంచంలోనే అతిపెద్ద సిరంజీ ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైసెస్ (హెచ్ఎండీ) సంస్థకు హరియాణాలోని ఫరీదాబాద్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్–ఎస్సీఆర్ పరిధిలోకి వస్తుంది) శివార్లలో ఎనిమిది ఆటోమేటెడ్ ప్లాంట్లు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించట్లేదు కాబట్టి ఇందులో ప్రధాన ప్లాంట్తో సహా మూడింటిని మూసివేయాల్సిందిగా హరియాణా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. లేదంటే చట్టపరమైన చర్యలు చేపడతామని, ప్లాంట్లను సీల్ చేస్తామని హెచ్చరించింది. డీజిల్ జనరేటర్లతో ప్లాంట్లను నడుపుతున్నారని, ఇది కాలుష్యానికి కారణమవుతోందనేది పీసీబీ ఆక్షేపణ. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినపుడే తప్పితే తాము పెద్దగా డీజిల్ జనరేటర్లు ఉపయోగించట్లేదని పీసీబీకి వివరించినా... వారిని ఒప్పించలేకపోయామని హెచ్ఎండీ పేర్కొంది. దాంతో వీటిని హెచ్ఎండీ మూసివేసింది. ♦భారత్ అవసరాల్లో మూడింట రెండొంతులు హెచ్ఎండీయే తీరుస్తోంది. ♦ఏడాదికి హెచ్ఎండీ ఉత్పత్తి సామర్థ్యం. భారత్లో 20 పైచిలుకు సిరంజీ ఉత్పత్తి సంస్థలు ఉండగా... వీటి ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 50 కోట్లు. అంటే ఏడాదికి 600 కోట్లు. ఇందులో హెచ్ఎండీ ఒక్కటే 450 కోట్లు ఉత్పత్తి చేస్తోందంటే... దాంట్లో ఉత్పత్తి నిలిచిపోతే ఎదురయ్యే కొరతను అంచనా వేయవచ్చు. ♦ ప్రతిరోజూ ఈ సంస్థ ఉత్పత్తి చేసే సిరంజీల సంఖ్య 1.2 కోట్ల పైచిలుకే ♦మూడు ప్లాంట్ల మూసివేత కారణంగా రోజులు 80 లక్షల సిరంజీలు, 1.5 కోట్ల నీడిల్స్ ఉత్పత్తి నిలిచిపోతుందని హెచ్ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్నాథ్ తెలిపారు. ఈ లెక్కన కంపెనీ ఉత్పత్తిలో నెలకు 24 కోట్లు, ఏడాది 288 కోట్లు కోత పడుతుంది. దీంతో భారత్లో సిరంజీలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదముంది. ఫలితంగా కోవిడ్ వ్యాకినేషన్ కార్యక్రమానికి తీవ్ర విఘాతం కలిగే ఆస్కారం ఉంది. ♦ భారత్లో ప్రతి వ్యక్తికి సగటున ఏడాదికి 2.9 సిరంజీల వాడకం జరుగుతున్నట్లు 2018 లెక్కలు చెబుతున్నాయి. దీని ప్రకారం 350–400 కోట్ల సిరంజీలు ఏడాదికి మన వినియోగానికి కావాలి. ♦తమ గోదాముల్లో రెండురోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని, సోమవారం నుంచి దేశీయ అవసరాలకు సరఫరా చేసే స్టాక్లో భారీగా కోత పడుతుందని హెచ్ఎండీ తెలిపింది. ఎగుమతులపై నిషేధం పరిస్థితి తీవ్రతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబరు 9న సిరంజీల ఎగుమతులపై 3 నెలల నిషేధం విధించింది. 0.5 మిల్లీలీటర్లు, 1, 2, 3 ఎంఎల్ సిరంజీల ఎగుమతిని నిషేధించింది. కోవిడ్ వ్యాక్సిన్ డోసు 0.5 ఎంఎల్ మాత్రమే. వృ«థాను అరికట్టాలంటే 0.5–1 ఎంఎల్ సిరంజీల వాడకం ఉత్తమం. 143 కోట్లు: 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలు విదేశాలకు ఎగుమతి చేసిన సిరంజీల సంఖ్య. అమెరికా, చైనాలే ప్రపంచంలో రెండు అతిపెద్ద ఎగుమతుదారుల. ప్రపంచ సిరంజీల విపణిలో మన వాటా స్వల్పమే. తేడా ఏంటి? ఆటో డిజేబుల్ సిరంజీలను ఒకసారి ఉపయోగిస్తే... ఇందులోని సేఫ్టీ లాక్ బ్రేక్ అవుతుంది. సిరంజీలో వ్యాక్సిన్ను నింపాక సూది ఇవ్వడానికి పైనుంచి బొటనవేలితో నొక్కుతాం. రెండోసారి నొక్కేందుకు వీలులేని సిరంజీలు ఆటో డిసేబుల్లో మరోరకం. పునర్వినియోగానికి పనికిరావు. సంప్రదాయ డిస్పోజబుల్ సిరంజీలు అయితే... వాడిన వెంటనే నీడిల్ (సూది)ని కట్ చేసేసి నిర్దేశించిన చెత్తబుట్టలో పారవేయాలి. అలాకాకుండా మళ్లీ వినియోగిస్తే ఇన్ఫెక్షన్లు ఒకరినుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (ఎన్డీఎంఏ) కింద సిరంజీలను అత్యావశ్యక వైద్య పరికరాలుగా ప్రకటించాలని (కోవిడ్–19 వ్యాక్సినేషన్ దృష్ట్యా) కోరుతూ హెచ్ఎండీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. తమ ప్లాంట్లలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉత్పత్తి జరిగేలా చూడాలని కోరింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement