-
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
భద్రాద్రిని టెంపుల్ సిటీగా మారుస్తాం
భద్రాచలంటౌన్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భద్రాచలం పట్టణాన్ని టెంపుల్ సిటీగా మారుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా బుధవారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలను, నిరుద్యోగులను, రైతులతో పాటు భారతావనికి ఆరాధ్యుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని కూడా మోసం చేశారని విమర్శించారు. రామాలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచిన ఒక్క పైసా విడుదల చేయలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి, తమ ఘనతగా టీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. శబరినదిపై హైడల్ పవర్ ప్రాజెక్టును, దానికి కింద శబరి, గోదావరి కలిసే ప్రాంతంలో దుమ్ముగూడెం వద్ద అద్భుతమైన ఇందిరాసాగర్ ప్రాజెక్టును రూపకల్పన చేసి 80 శాతం పనులను పూర్తి చేస్తే, ఆ ప్రాజెక్టును తీసేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు అడ్డాగా భద్రాచలం మారిందని, ఇసుక ర్యాంప్లన్నీ టీఆర్ఎస్ నాయకులవేనని అన్నారు. కేసీఆర్కు ప్రజలన్నా, రాముడన్నా, దేవుడన్నా, ఆచారాలు, సాంప్రదాయాలన్నా గౌరవం లేదన్నారు. సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాంబాబు, నాయకులు తోటకూర రవిశంకర్, బుడగం శ్రీనివాస్, బొలిశెట్టి రంగారావు పాల్గొన్నారు. -
చేతకాకుంటే వైదొలగండి
సాక్షి, యాదాద్రి: ‘‘మీకు చేత కాకపోతే చేసిన పనికి డబ్బులు తీసుకుని పక్కకు తప్పుకోండి. వారంలో మరొకరికి టెండర్ ఇస్తాం. చేతులతో పనులు చేస్తున్నారా లేక మిషన్లతో చేస్తున్నారా?... గోదావరి నదిపై వంతెనలు కడుతున్నారు. ఇలా అయితే 20 ఏళ్లయినా ఈ (యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ నిర్మాణం) పనులు పూర్తికావు’’ అంటూ కాంట్రాక్టర్లు, వైటీడీఏ అధికారులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యమవుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అలాగే ప్రధానాలయ నిర్మాణ పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఇలా అయితే బ్రహ్మోత్సవాల నాటికి ఎలా పూర్తి చేస్తారు? ముందుగా యాదాద్రికొండపై పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతు న్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సివిల్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, వైటీడీఏ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. సివిల్ కాంట్రాక్టర్ను పిలిపించి రిటైనింగ్ వాల్ పనుల జాప్యంపై నిలదీశారు. పనులు ఆల స్యంగా జరిగితే ముందుగా అనుకున్నట్లుగా మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాల నాటికి ఎలా పూర్తి చేస్తారని, అనుకున్న సమయానికి భక్తులకు ప్రధాన ఆలయంలోని స్వయంభూ దర్శనం ఎలా కల్పిస్తామని ప్రశ్నించారు. విస్తరణ పనులు ఇంత ఆలస్యంగా జరిగితే భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అనుకున్న సమయానికి ప్రధానాలయం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శిల్పి పనులు మరింత వేగంగా చేయాలన్నారు. పనులు జరుగుతున్న తీరు సరిగా లేదని ఇంకెంత కాలం పొడిగిస్తారని ఆర్కిటెక్ట్, స్థపతులను సీఎం ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం వద్ద నిర్మితమవుతున్న ఆళ్వార్ విగ్రహాలను, ప్రాకారం, తూర్పు, పడమటి రాజగోపురాలు, ప్రసాద విక్రయశాల, శివాలయం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణం, రథ మండపం, మెట్లదారి, పుష్కరిణిలను సీఎం పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రసాద విక్రయశాల నిర్మాణంలో కొన్ని మార్పులు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఇబ్బందుల్లేకుండా పనులు చేయాలని, ప్రతి పనికి డబ్బు చెల్లింపుల్లో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. టెంపుల్ సిటీ పనుల్లో వేగం పెంచాలి... పెద్దగుట్టపై టెంపుల్ సిటీ పనులు పరిశీలించారు. టెంపుల్ సిటిపై భక్తులకు ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పెంపొందించేలా గార్డెనింగ్ ఉండాలని, చిన్నారులు ఆడుకోవడానికి గార్డెనింగ్లో ఆట వస్తువులను ఏర్పాటు చేయాలన్నారు. టెంపుల్ సిటీ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయితే దాతలు గదులు నిర్మించడానికి వచ్చే వారన్నారు. ఈ సందర్భంగా పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్లు గొంగిడి సునీత, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, వేముల వీరేశం, గాదరి కిశోర్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్రావు, కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్రావు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, స్థపతి సుందర్రాజన్, ఆలయ శిల్పి ఆనందసాయి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. యాదాద్రి చుట్టూ ఓఆర్ఆర్... యాదాద్రి చుట్టూ ఏడు రోడ్లను కలుపుతూ ఏడు జంక్షన్లతో ఏడు కిలోమీ టర్ల మేర ఆరు లేన్ల ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ ఆర్) నిర్మించాలని సీఎం కేసీఆర్ అధికా రులను ఆదేశించారు. ఇందుకు అవసరమయ్యే రూ. 143 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే యాదగిరిగుట్టలో 100 నుంచి 150 మంది సాయుధ పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ హెడ్క్వార్ట ర్స్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యాదగిరిగుట్ట గ్రామాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
టెంపుల్ సిటీగా భద్రాద్రి
యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతాం ► ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి ► ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలి ► అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల సాక్షి, కొత్తగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని కూడా టెంపుల్ సిటీగా ఏర్పాటు చేసేందుకు టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్లోని తన చాంబర్లో గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాద్రి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు రూ. 100 కోట్లు కేటాయిస్తున్నారని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి నమూనా రూపకల్పనకు దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, ఆర్కిటెక్ ఆనందసాయితో చర్చలు జరిపారు. ఆలయ అభివృద్ధి డీపీఆర్లను ఆగస్టు వరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేయించుకొని, ఆగస్టులోగా టెండర్లు పిలవాలని, వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధి నమూనా విషయంలో చిన్నజీయర్ స్వామి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆర్కిటెక్ ఆనందసాయికి సూచించారు. నూతన నమూనాను రూపొందించి ఇప్పటికే చిన్నజీయర్ స్వామికి చూపించామని, ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారని, ఆ తర్వాతే డిజైన్ ఫైనల్ చేశామని ఆనందసాయి మంత్రికి వివరించారు. అలయ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను తుమ్మలకు వివరించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ గోపుర నమూనాలో ఎంటువంటి మార్పులు లేకుండా ఆలయ ప్రాకారం, మాడ వీధులలో మాత్రమే మార్పులు చేర్పులు చేపట్టామని వివరించారు. అలాగే స్వామి వారి కల్యాణ మండపం, బ్రహ్మత్సోవ మండపం, అన్నదాన సత్రాలను మాత్రమే పునఃనిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భక్త రామదాసు మెమోరియల్ ట్రస్ట్ డిజైన్ రూపొందించాలని ఆనందసాయికి సూచించగా, వారం రోజుల్లో డిజైన్ రూపొందిస్తామని ఆర్కిటెక్ చెప్పారు. భక్త రామదాసు మెమోరియల్ ట్రస్ట్కు సంబంధించి సీఎం కెసీఆర్ త్వరలోనే ఒక ప్రకటన చేస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని. ప్రధానమైన యాదాద్రి, వేములవాడ ఆలయాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి సైతం గతంలోనే పలు సూచనలు చేశారని తెలిపారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా భద్రాద్రి దేవాలయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని అదికారులను కోరారు. -
తెలంగాణ తిరుపతిగా ‘యాదాద్రి'
♦ అద్భుత టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందుతోంది: గవర్నర్ ♦ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నరసింహన్ దంపతులు సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానా లయ విస్తరణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్లను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గర్భాల యానికి మార్పులు చేర్పులు లేకుండా మిగతా విస్తరణ పనులు జరుగుతు న్నాయని పేర్కొన్నారు. అద్భుతమైన రీతిలో చేపట్టిన ఆలయ విస్తరణ పనులు పూర్తయితే యాదాద్రి పుణ్య క్షేత్రం టెంపుల్ సిటీగా, దేశంలోనే ప్రముఖ ఆలయంగా ప్రసిద్ధి చెందుతోందని గవర్నర్ తెలిపారు. యాదాద్రి క్షేత్రంలో నగదురహిత లావాదేవీలు నిర్వహించడం అభినందనీయ మని చెప్పారు. కాగా, గవర్నర్ రెండు దుకాణాల వద్ద ఆగి డిజిటల్ లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ పనులపై ‘పవర్ పాయింట్’ ప్రధానాలయ విస్తరణ, వివిధ అభివృద్ధి పనులను దేవస్థానం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్కు వివరించారు. ఎక్కడెక్కడ రాజ గోపురాలు వస్తున్నాయి, మాడ వీధులు ఏ విధంగా వస్తున్నాయి, దివ్యవిమాన గోపురం ఎలా ఉంటుంది, శివాలయం ఏ విధంగా రూపుదిద్దుకోబోతుంది అనే విషయాలను వారు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్వామి వారి అభిషేకానికి తిరుపతి తరహాలో బావి నుంచి నీటిని తెచ్చి అభిషేకం చేయాలన్నారు. రోడ్ల విస్తరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆలయ గోపురాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. ధ్వజస్తంభం ఎక్కడ, భక్తులు ఎటు వైపు నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని, ఆంజనేయస్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. భక్తులు క్షేత్ర పాలకుడిని దర్శించుకున్న తర్వాతే ఆలయంలోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. అలాగే శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి, శివాలయం ప్లానింగ్ను గవర్నర్కు చూపించారు. శివాలయ నిర్మాణానికి సంబంధించిన ప్లానిం గ్ పూర్తి అయిందని, త్వరలోనే టెండర్లు పిలు స్తామని అధికారులు గవర్నర్కు వివరించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీ.. 10 సిక్స్లతో! వీడియో వైరల్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement