-
సెమీస్లో భారత్ను ఓడించి.. కట్చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్గా
అండర్-19 ఆసియాకప్ 2023 ఛాంపియన్స్గా బంగ్లాదేశ్ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. తొలిసారి అండర్-19 ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్(60), అరిఫుల్ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్ ఆహ్మద్ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్ రెహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా... ఇక్భాల్, షేక్ ఫవీజ్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్ను బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. చదవండి: IND VS SA 1st ODI: ఏ భారత కెప్టెన్కు సాధ్యం కాని ఘనతను సాధించిన కేఎల్ రాహుల్ -
ఒకే రోజు రెండు సంచలనాలు.. పసికూనల చేతిలో భారత్, పాక్లకు పరాభవం
అండర్-19 ఆసియా కప్లో ఒకే రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. పసికూనలైన బంగ్లాదేశ్, యూఏఈల చేతుల్లో మాజీ ఛాంపియన్లు భారత్, పాకిస్తాన్ ఓటమిపాలయ్యాయి. ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో తొలుత యూఏఈ పాకిస్తాన్ను మట్టికరిపించగా.. ఆతర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్ టీమిండియాకు షాకిచ్చింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్కు చేరాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ల విషయానికొస్తే.. పాకిస్తాన్తో జరిగిన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ పేసర్ ఉబెయిద్ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్లో కెప్టెన్ అయాన్ ఖాన్ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సాద్ బేగ్ (50), అజాన్ అవైస్ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్ అహ్మద్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్, ధృవ్, బదామీ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత్.. 42.4 ఓవర్లలో 188 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ (50), మురుగన్ అభిషేక్ (62) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్ మరూఫ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. అరీఫుల్ ఇస్లాం (94) చెలరేగడంతో 42.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అరీఫుల్కు అహ్రార్ అమీన్ (44) సహకరించాడు. నమన్ తివారీ (3/35), రాజ్ లింబానీ (2/47) చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టీమిండియాను గెలిపించలేకపోయారు. -
ఈనెల 10న భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
ఇటీవలికాలంలో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య బాగా పెరిగింది. వన్డే వరల్డ్కప్, అంతకుమందు ఆసియాకప్ టోర్నీల్లో టీమిండియా పాక్తో తలపడింది. ఈ రెండు టోర్నీలకు ముందు (2023, జులై) ఇరు దేశాల ఎమర్జింగ్ జట్లు ఆసియా కప్ ఫైనల్లో తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్లో భారత్పై పాక్ 128 పరుగుల తేడాతో గెలుపొంది ఛాంపియన్గా నిలిచింది. అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్-పాక్లు మరోసారి తలపడనున్నాయి. ఈనెల 10న దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వన్డే ఫార్మాట్లో సాగనున్న ఈ టోర్నీ ఇవాల్టి (డిసెంబర్ 8) నుంచే మొదలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్, ఆఫ్ఘనిస్తాన్.. నేపాల్, పాకిస్తాన్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో భారత్, పాక్తో పాటు మొత్తం ఎనిమిది జట్లు (ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, జపాన్) పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ తొలి దశలో భారత్ మూడు మ్యాచ్లు ఆడుతుంది. డిసెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్, 10న పాకిస్తాన్, 12న నేపాల్ జట్లతో యంగ్ ఇండియా తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ డిసెంబర్ 17న జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరుగనున్నాయి. భారత అండర్-19జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), అరవెల్లి అవనీష్ రావు (వికెట్కీపర్), సౌమీ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ -
వన్డే ఫార్మాట్లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్, 450 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ఏ అండర్-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2002లో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్కు ముందు వరకు అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్లో యూఎస్ఏ.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసి, అండర్-19 వన్డే ఫార్మాట్లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్గా లిస్ట్-ఏ క్రికెట్లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు టీమ్ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో అతి భారీ విజయం.. యూఎస్ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్-19 క్రికెట్ వన్డే ఫార్మాట్లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్గా (లిస్ట్-ఏ క్రికెట్) చూసినా యూఎస్ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో భవ్య మెహతా (136), రిషి రమేశ్ (100) సెంచరీలతో.. ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్ఏ టీమ్ రికార్డు స్కోర్ చేసింది. యూఎస్ఏ టీమ్లో అమోఘ్ ఆరేపల్లి (48), ఉత్కర్ష్ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్ సతీశ్ (2), పార్థ్ పటేల్ (1), ఆర్యన్ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్లో థియో (18) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 68 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
తొట్టతొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్కప్లో టీమిండియా సంచలన ప్రదర్శనలతో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించడంతో, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో నియామ్ హోలాండ్ (10), ర్యానా మెక్డొనాల్డ్ గే (19), అలెక్సా స్టోన్హౌస్ (11), సోఫీ స్మేల్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా కూడా ఆరంభంలోనే తడబడుతుంది. 3.4 ఓవర్లలోనే భారత జట్టు ఫామ్లో ఉన్న ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 27/2గా ఉంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియా చరిత్ర సృష్టించేనా..?
ICC Under 19 Womens T20 World Cup 2023: సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొట్టతొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్,ఇంగ్లండ్ జట్టు తుది సమరానికి అర్హత సాధించాయి. ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను, భారత్.. న్యూజిలాండ్ను సెమీస్లో మట్టికరిపించి ఫైనల్కు చేరాయి. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జనవరి 29) సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. టోర్నీలో భారత, ఇంగ్లండ్ జట్ల ప్రస్థానాన్ని గమనిస్తే.. ఇరు జట్లు పోటాపోటీగా ప్రత్యర్ధులపై పైచేయి సాధించి, తుది సమరానికి అర్హత సాధించాయి. గ్రూప్ దశలో ఇరు జట్లు ఆడిన అన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించి, సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించాయి. ఈ దశలోనూ ఇరు జట్లు గ్రూప్ టాపర్లుగా నిలిచి సెమీస్కు చేరుకున్నాయి. సెమీస్లో యువ భారత జట్టు న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా.. ఇంగ్లండ్ అతికష్టం మీద ఆసీస్ను 3 పరుగుల తేడాతో ఓడించింది. ఇక వ్యక్తిగత ప్రదర్శనల విషయానికొస్తే.. టీమిండియా ఓపెనర్లు శ్వేత సెహ్రావత్, షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వీరిద్దరు పోటాపోటీగా పరుగులు సాధించి, టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో 1 (శ్వేత, 6 మ్యాచ్ల్లో 146 సగటున 3 అర్ధసెంచరీల సాయంతో 292 పరుగులు), 4 (షెఫాలీ, 6 మ్యాచ్ల్లో ఒకఅర్ధసెంచరీ సాయంతో 157 పరుగులు) స్థానాల్లో నిలిచారు. బౌలింగ్లోనూ భారత లెగ్ స్పిన్నర్ పర్షవి చోప్రా అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ అమ్మాయి 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. మరో స్పిన్నర్ మన్నత్ కశ్యప్ కూడా ఈ టోర్నీలో అదరగొడుతోంది. ఈ అమ్మాయి ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టింది. -
మటన్ రోల్స్ తినేందుకు వెళ్లి చిక్కుల్లో పడిన విరాట్ కోహ్లి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని అతని చిన్ననాటి మిత్రుడు, భారత అండర్ 19 జట్టు మాజీ సభ్యుడు ప్రదీప్ సాంగ్వాన్ ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు రాసిన వ్యాసంలో షేర్ చేసుకున్నాడు. జూనియర్ క్రికెట్లో కోహ్లికి రూమ్ మేట్ అయిన సాంగ్వాన్.. 2008 అండర్19 ప్రపంచకప్కు ముందు జరిగిన ఓ సంఘటనను తన వ్యాసంలో ప్రస్తావించాడు. చిన్నతనంలో కోహ్లి స్ట్రీట్ ఫుడ్ను చాలా ఇష్టంగా తినేవాడని.. కూర్మా రోల్స్, చికెన్ రోల్స్ ఇలా కనిపించిన ప్రతి ఐటెంను వదిలేవాడుకాదని, 2008కి ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో(అండర్ 19 జట్టుతో) కూడా ఇలానే స్ట్రీట్ ఫుడ్ (మటన్ రోల్స్) కోసం వెళ్లి లైఫ్ను రిస్క్ చేశాడని, అందులో నేను కూడా బాధితుడినేనని గుర్తు చేసుకున్నాడు. తమ జట్టు బస చేసే హోటల్కు దగ్గర్లో రుచికరమైన మటన్ రోల్స్ దొరుకుతాయని తెలిసిన వ్యక్తి చెప్పడంతో కోహ్లి తనను వెంటతీసుకు వెళ్లాడని, ఆ స్ట్రీట్ ఫుడ్ దొరికే ప్రాంతం అంత సురక్షితం కాదని, కొన్ని రోజుల ముందే అక్కడ పెద్ద గొడవ జరిగిందని తమ డ్రైవర్ వారించినా కోహ్లి వినలేదని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడి వెళ్లి మటన్ రోల్స్ను టేస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టాడని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఎట్టకేలకు తాము ఆ ప్రాంతానికి వెళ్లి రుచికరమైన మటన్ రోల్స్ను ఆరగించామని, అయితే తిరుగు ప్రయాణంలో కొందరు దుండగులు తమ కారును వెంబడించారని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. కాగా, విరాట్ కోహ్లి టీమిండియాలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2012 నుంచి కోహ్లి తన ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్నెస్ పై దృష్టి సారించాడు. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఎప్పుడూ ఫిట్గా ఉండేలా కష్టపడుతుంటాడు. అత్యుత్తమ ఫిట్నెస్ ప్రమాణాలు పాటిస్తూ సమకాలీకులతో పాటు నేటి తరం క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు. చదవండి: పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్ల్లో 3 సెంచరీలు -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో లంకేయులపై ఘన విజయం
దుబాయ్: ఆసియా కప్ అండర్-19 విజేతగా యువ భారత్ నిలిచింది. వరుణుడి ఆటంకాల నడుమ 38 ఓవర్లకు కుదించిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక యువ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి టైటిల్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగుల స్వల్ప స్కోర్కే పరిమితమయ్యారు. లంక ఇన్నింగ్స్లో యాసిరు రోడ్రిగో(19 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలువగా.. భారత బౌలర్లు విక్కీ ఓస్వాల్(3/11), కౌశల్ తాంబే(2/23), రాజ్ బవా(1/23), రవికుమార్(1/17), రాజవర్ధన్(1/26) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 38 ఓవర్లలో 102 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ భారత్.. కేవలం 21.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రఘువంశీ(56 నాటౌట్), గుంటూరు కుర్రాడు షేక్ రషీద్(31 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. కాగా, ఈ టోర్నీ నిర్వహించిన 9 పర్యాయాల్లో టీమిండియా 8 సార్లు విజేతగా నిలవడం విశేషం. 2017లో యువ అఫ్గాన్ జట్టు.. పాక్ను ఓడించి అండర్-19 ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత టోర్నీలో భారత యువ జట్టు సెమీస్లో బంగ్లాదేశ్పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరగా.. లంకేయులు పాక్ యువ జట్టుకు షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించారు. చదవండి: విదేశీ లీగ్ల కోసం రెండేసి నెలలు దూరంగా ఉంటారు.. కానీ.. టెస్టులు ఆడరా? -
‘బాగా ఆడింది వారైతే నాకెందుకు ఆ క్రెడిట్’
బెంగళూరు: ఇటీవల ఆసీస్ గడ్డపై టీమిండియా సాధించిన సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువ ఆటగాళ్లను భారత జట్టు మాజీ సారధి, ప్రస్తుత భారత అండర్-19, ఇండియా-ఏ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆకాశానికెత్తాడు. ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్లో యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణించి టీమిండియాకు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించారు. వారి ఆ స్థాయి ప్రదర్శన వెనుక 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ కృషి ఉందన్నది బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. రాహుల్ మాత్రం దాంతో ఏకీభవించడం లేదు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో కుర్రాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనకు క్రెడిట్ మొత్తం వారికే దక్కాలని ఓ స్పోర్ట్స్ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మైదానంలో కుర్రాళ్లు చూపిన తెగువ, ధైర్యం, ఆట పట్ల నిబద్ధత ఎంతో అద్భుతమని, వారి వ్యక్తిగత ప్రతిభ కారణంగానే కుర్రాళ్లు ఈ స్థాయికి చేరారని ద్రవిడ్ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత సీనియర్ జట్టులో సభ్యులైన కుర్రాళ్లకు అండర్-19 జట్టు సభ్యులుగా ఉన్నప్పుడు తాను కోచింగ్ ఇచ్చానన్న కారణంగా కుర్రాళ్లు సాధించిన ఘనతను తనకు ఆపాదించడం సమంజసం కాదని అన్నాడు. క్రెడిట్ మొత్తానికి వారు మాత్రమే అర్హులని పేర్కొన్నాడు. కాగా, యువకుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసి, ఆటలో వారికి మెళకువలు నేర్పించి, కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనకు కారకుడైన ద్రవిడ్పై యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ద్రవిడ్ పైవిధంగా స్పందించాడు. -
పదికి పది వికెట్లు
కడప స్పోర్ట్స్: దేశవాళీ మహిళల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్–19 వన్డే టోర్నీలో భాగంగా కేఎస్ఆర్ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్లో చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే, దులీప్ ట్రోఫీ మ్యాచ్లో దేబాశిష్ మొహంతి, రంజీ మ్యాచ్లో రెక్స్ సింగ్ గతంలో ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. అయితే బోర్డు గుర్తింపు పొందిన ఒక వన్డే మ్యాచ్లో ఇలాంటి ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. చండీగఢ్ కెప్టెన్ కూడా అయిన కశ్వీ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్ను ఒంటి చేత్తో పడగొట్టింది. 4.5 ఓవర్లు వేసిన ఆమె ఒక ఓవర్ మెయిడిన్ సహా 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది. తన రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. కశ్వీ బౌలింగ్ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ 25 పరుగులకే కుప్పకూలింది. జట్టులో 8 మంది డకౌట్ కాగా... ముగ్గురు 10, 4, 3 చొప్పున పరుగులు చేశారు. మరో 8 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. అంతకుముందు 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసిన చండీగఢ్ 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో కూడా కశ్వీ (68 బంతుల్లో 49; 6 ఫోర్లు)నే టాప్ స్కోరర్గా నిలిచింది. -
‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు
దుబాయ్: జెంటిల్మెన్ క్రికెట్కు తమ దురుసు ప్రవర్తనతో మచ్చ తెచ్చిన భారత్, బంగ్లాదేశ్ యువ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్కు చెందిన ఆకాశ్ సింగ్కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
ప్రియమ్ గార్గ్ శతకం: భారత్ శుభారంభం
డర్బన్: నాలుగు దేశాల అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 66 పరుగులతో నెగ్గి శుభారంభం చేసింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సారథి ప్రియమ్ గార్గ్ (110; 9 ఫోర్లు, 2 సిక్స్లు) శతకంతో కదంతొక్కాడు. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసి ఓడింది. భారత బౌలర్ సుశాంత్ మిశ్రా 4 వికెట్లతో రాణించాడు. -
36 ఏళ్ల తర్వాత పవన్ షా
హంబన్టోటా: శ్రీలంకతో జరుగుతున్న అండర్-19 రెండో యూత్ టెస్టులో భారత ఆటగాడు పవన్ షా కదం తొక్కిన సంగతి తెలిసిందే. పవన్ షా 332 బంతుల్లో 33 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 282 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ యూత్ టెస్టు మ్యాచ్ల్లో రెండో అత్యధిక స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంచితే, ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. ఈకేవీ పెరీరా వేసిన 108 ఓవర్లో వరుస ఆరు బంతుల్ని ఫోర్లగా మలచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా ఒక ఓవర్లో ఆరు బంతుల్ని ఆరు ఫోర్లుగా కొట్టిన రెండో భారత ఆటగాడిగా షా అరుదైన రికార్డును లిఖించాడు. చివరిసారి 1982లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో సందీప్ పాటిల్ ఒక ఓవర్లో ఆరు ఫోర్లుగా కొట్టగా, 36 ఏళ్ల తర్వాత ఆ ఘనతను పవన్ షా అందుకున్నాడు. కాగా, ఆనాటి టెస్టు మ్యాచ్లో నో బాల్ సాయంతో ఏడు బంతుల్ని ఎదుర్కొని సందీప్ పాటిల్ ఆ ఘనత సాధించగా, పవన్ షా వరుస బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టడం విశేషం. చదవండి: పవన్ షా డబుల్ సెంచరీ -
పవన్ షా డబుల్ సెంచరీ
హంబన్టోటా: రెండో రోజూ బ్యాట్స్మెన్ కదంతొక్కడంతో... శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతోన్న నాలుగు రోజుల రెండో యూత్ టెస్టులో భారత అండర్–19 జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. పవన్ షా (332 బంతుల్లో 282; 33 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అంతర్జాతీయ అండర్–19 మ్యాచ్ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. దీంతో భారత్ 128.5 ఓవర్లలో 613/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక బుధవారం ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 428/4తో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్ పవన్ షా దూకుడుకు తోడు నేహల్ వధేర (64; 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో భారీ స్కోరు చేయగలిగింది. వీరిద్దరు ఐదో వికెట్కు 160 పరుగులు జోడించారు. లంక సీమర్ విచిత్ర పెరీరా వేసిన ఇన్నింగ్స్ 108వ ఓవర్లో పవన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. తొలి బంతిని బౌండరీగా మలచడం ద్వారా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న పవన్ అదే జోరులో మిగతా ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. ట్రిపుల్ సెంచరీకి సమీపంలో పవన్ ఔటవడంతో భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (18 బంతుల్లో 14; 2 ఫోర్లు) రనౌటయ్యాడు. -
అరంగేట్రంలో సచిన్ వారసుడు డకౌట్
-
అరంగేట్రంలో సచిన్ వారసుడు డకౌట్
కొలంబో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ అండర్-19 అరంగేట్రం మ్యాచ్లో నిరాశపరిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భాగంగా అర్జున్ తొలి ఇన్నింగ్స్లో పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. 11 బంతులు ఆడిన అర్జున్ డకౌట్గా ఔటయ్యాడు. అంతకుముందు కమిల్ మిషారాను ఔట్ చేయడం ద్వారా తన తొలి అంతర్జాతీయ వికెట్ను ఖాతాలో వేసుకున్న అర్జున్.. బ్యాటింగ్లో మాత్రం కనీసం పరుగు చేయకుండానే నిష్క్రమించాడు. సచిన్ టెండూల్కర్ తన వన్డే అరంగేట్రంలో మ్యాచ్లో సైతం డకౌట్గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. 1989లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సచిన్ పరుగులేమీ చేయకుండా ఔట్ కావడం గమనార్హం. చదవండి: అర్జున్ టెండూల్కర్ బోణీ కొట్టాడు.. -
అండర్ 19 వరల్డ్ కప్: కివీస్ శుభారంభం
తౌరాంగా(న్యూజిలాండ్):అండర్ 19 వరల్డ్ కప్లో భాగంగా వెస్టిండీస్తో శనివారం జరిగిన ఆరంభపు మ్యాచ్లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న న్యూజిలాండ్ శుభారంభం చేసింది. వెస్టిండీస్ నిర్దేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 39.3 ఓవర్లలో రెండు వికెట్లతో ఛేదించి సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో అలెన్(115 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అంతకుముందు ఓపెనర్ భులా(83) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. సిమ్మన్స్(92 నాటౌట్), మెలియస్(78) మినహా ఎవరూ ఆకట్టకోలేకపోవడంతో విండీస్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. -
శ్రీలంక 'మిస్టరీ' స్పిన్నర్!
కొలంబో: పాల్ ఆడమ్స్ గుర్తున్నాడా?, 1995 కాలంలో పాల్ ఆడమ్స్ బౌలింగ్ యాక్షన్ ఒక సంచలనం. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ చైనామన్ బౌలర్ తన యాక్షన్ తో విశేషంగా ఆకట్టుకునేవాడు. కనీసం పిచ్ను చూడకుండా అతనెలా బౌలింగ్ చేస్తున్నాడో అని అంతా ఆశ్చర్యపోయేవారు. దాదాపు దశాబ్దపు కాలం పాటు టెస్టు క్రికెట్ ఆడిన ఆడమ్స్ 45 టెస్టు మ్యాచ్ ల్లో 134 వికెట్లు తీసాడు. ఇదిలా ఉంచితే, ఇప్పుడు అతన్ని మైమరిపించే బౌలర్ శ్రీలంకలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుడిచేతి వాటం స్పిన్నర్ కెవిన్ కొత్తిగొడ.. ఆడమ్స్ను తలపించే బౌలింగ్ యాక్షన్తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. మలేసియాలో జరుగుతున్న అండర్-19 ఆసి యా కప్లో కెవిన్ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహిస్తున్న కెవిన్.. శ్రీలంక జాతీయ జట్టుకు త్వరలోనే ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ 'మిస్టరీ' స్పిన్నర్ ఎంతవరకూ రాణిస్తాడనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. -
ప్రజ్ఞయ్ రెడ్డి డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్మెన్ సెంచరీల మోత మోగించారు. కెప్టెన్ ప్రజ్ఞయ్ రెడ్డి (285 బంతుల్లో 212; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విజృంభించగా, ఎ. వరుణ్ గౌడ్ (233 బంతుల్లో 165; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ బ్యాటింగ్లో చెలరేగడంతో హైదరాబాద్ రెండోరోజు ఆటలో భారీస్కోరును సాధించింది. ఓవర్నైట్ స్కోరు 308/2తో సోమవారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన హైదరాబాద్ 155 ఓవర్లలో 4 వికెట్లకు 633 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. 69 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఓవర్ నైట్ బ్యాట్స్మన్ ప్రజ్ఞయ్ రెడ్డి 147 బంతుల్లో సెంచరీని, 276 బంతుల్లో డబుల్ సెంచరీని అందుకున్నాడు. వరుణ్ గౌడ్ 171 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 360 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 603 పరుగుల వద్ద రోహిత్ సింగ్ బౌలింగ్లో ఎస్ఎస్ పాల్కు క్యాచ్ ఇచ్చి వరుణ్ అవుటయ్యాడు. మరో 3 పరుగుల్లోపే ప్రజ్ఞయ్ రెడ్డి కూడా వెనుదిరిగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన త్రిపుర రెండోరోజు ఆట ముగి సే సమయానికి 25 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. తన్మోయ్ దాస్ (26 బ్యా టింగ్), డీబీ దేబ్బర్మ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో సి. రక్షణ్ రె డ్డి, అజయ్దేవ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. -
మరోసారి చెలరేగిన శుభ్మాన్
ముంబై: అండర్ -19 వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డేలోనూ భారత ఓపెనర్ శుభ్మాన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయాడు. గత వన్డేల్లో శతకంతో మెరిసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్మాన్... నాల్గో వన్డేలో భారీ శతకం సాధించాడు. 120 బంతుల్లో 23 ఫోర్లు, 1 ఫోర్ సాయంతో 160 పరుగులు చేశాడు. అతనికి జతగా పృథ్వీ షా (105;89 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడి రెండో వికెట్ కు 231 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఇప్పటికే ఈ ఐదు వన్డేల సిరీస్లో భారత్ 2-1 తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి వన్డేల్లో ఇంగ్లండ్ గెలవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ తో గెలిస్తే సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ ఫలితం కోసం చివరి వన్డే వరకూ వేచి చూడాలి. -
విజేత హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాజీవ్ గాంధీ స్మారక అండర్-19 జాతీయ, అంతర్జాతీయ టి20 క్రికెటఖ టోర్నమెంట్ లో హైదరాబాద్ జట్టు చాంపియన్ గా నిలిచింది. రాజస్థాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ ను కైవసం చేసుకుంది. ట?స గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థానఖ జట్టు 19.3 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ (21) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో మిక్కీ జైశ్వాల్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 74 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 11.1 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 78 పరుగులు చేసి గెలిచింది. సాగర్ (25) వేగంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో బహత్ 2 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ ఆసాంతం రాణించిన రోహిత్ ‘బెస్ బ్యాట్స్ మన్ ’ పురస్కారాన్ని గెలుచుకోగా... అజయ్ దేవ్ బెస్త్ బౌలర్’, సాగర్ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డులను దక్కించుకున్నారు. సాయి ప్రతీక్, సాయి ప్రణయ్లకు ‘బెస్ట్ కీపర్’ పురస్కారం దక్కింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు భట్టి విక్రమార్క, హనుమంతరావు పాల్ఠ్గని విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ , క్రికెటఖ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడు సాజిద్ పాషా, జనరల్ సెక్రటరీ అమర్జీత్ కుమార్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ విజయం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రాజీవ్ గాంధీ అండర్-19 జాతీయ, అంతర్జాతీయ టి20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్కు చేరుకుంది. శుక్రవారం తెలంగాణ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు 16 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది. సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (35) వేగంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రత్యూష్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం తెలంగాణ జట్టు 15.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. చరణ్ (24) పోరాడాడు. హైదరాబాద్ బౌలర్లలో ఆశిష్, అంకేత్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ, రాజస్తాన్, జట్లు కూడా సెమీస్లో అడుగుపెట్టాయి. -
హైదరాబాద్ విజయానికి 73 పరుగులు
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ విజయం దిశగా సాగుతోంది. మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ)తో రేవా జిల్లాలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో బుధవారం ఆటముగిసే సమయానికి హైదరాబాద్ 78 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు చేసింది. పి. సారుు వికాస్ రెడ్డి (83) ఆకట్టుకున్నాడు. మికెల్ జైశ్వాల్ (22 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో రితేశ్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 159/7తో మూడోరోజు రెండో ఇన్నింగ్సను కొనసాగించిన ఎంపీసీఏ 71.1 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స ఆధిక్యం 78 పరుగులు కలిపి మొత్తం 265 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ముందుంచింది. ప్రస్తుతం హైదరాబాద్ విజయం కోసం మరో 73 పరుగులు చేయాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నారుు. తొలి ఇన్నింగ్సలో మధ్యప్రదేశ్ 245 పరుగులకు అలౌటవ్వగా... హైదరాబాద్ 186 పరుగులు చేసింది. -
హైదరాబాద్, జార్ఖండ్ మ్యాచ్ డ్రా
కూచ్ బెహర్ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో భాగంగా జార్ఖండ్తో జరిగిన మ్యాచ్ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. 402 పరుగుల లక్ష్య ఛేదనలో... 55/0 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు రెండో ఇన్నింగ్సను కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 132 ఓవర్లలో 7 వికెట్లకు 297 పరుగులతో నిలిచింది. నితీశ్ రెడ్డి (63), సారుు వికాస్ రెడ్డి (78) అర్ధసెంచరీలు చేయగా... భగత్ వర్మ (37 నాటౌట్) రాణించాడు. జార్ఖండ్ బౌలర్లలో వినాయక్ విక్రమ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో జార్ఖండ్ తొలి ఇన్నింగ్సలో 194 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సను 350 /6 వద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 143 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స ఆధిక్యం కారణంగా జార్ఖండ్కు 3 పాయింట్లు లభించగా, హైదరాబాద్కు 1 పాయింట్ దక్కింది. -
హైదరాబాద్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: మహిళల క్రికెట్ అండర్-19 జోనల్ లీగ్లో హైదరాబాద్ జట్టు మరో విజయాన్ని సాధించింది. తమిళనాడుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 135 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. త్రిష (35), కీర్తి (37), పూజ (32), చిత్ర (40) బ్యాటింగ్లో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో శ్వేత 3 వికెట్లతో రాణించింది. అనంతరం 205 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన తమిళనాడు జట్టు 37.2 ఓవర్లలో 69 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో ఫ్లవియా పెరీరా, శ్రవీణ, లక్ష్మిప్రసన్న, పూజ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు ఆంధ్ర: 253/7 (దుర్గ 32, అనూష 74, పద్మజ 23, పుష్పలత 71నాటౌట్; దీక్ష 4/62), గోవా: 63 (ప్రవళిక 2/16, భావన 2/16, శ్రీలేఖ 2/13). కర్నాటక: 230/7 (శుభ 102, కె. ప్రత్యూష 30, సి. ప్రత్యూష 57; మిన్ను మణి 4/42), కేరళ: 192/6 (అక్షయ 60, దృశ్య 42, ప్రత్యూష 4/23).
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
MI: అర్జున్ టెండుల్కర్ ‘ఓవరాక్షన్’.. ఆ తర్వాత ఇలా డగౌట్లో!
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
జూన్ 4న జగన్ ప్రభంజనం..
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్తో భేటీ
అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు...
అందుకే సీఎం జగన్ విక్టరీ వ్యాఖ్యలు!
మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు
తప్పక చదవండి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- చివరి బెర్త్ ఎవరిదో?
Advertisement