-
ఇక కిలోమీటరు దూరంలో ఉన్న వై-ఫై కనెక్ట్ అవ్వొచ్చు!
ప్రస్తుత ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకి వేగంగా పెరుగుతుంది. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీ మాయం అయిపోయింది. అయితే, చాలా దూరంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను కనెక్ట్ చేయాలంటే వైర్ ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే, ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. తక్కువ విద్యుత్ వినియోగంతో 1 కిలోమీటరు దూరం వరకు సిగ్నల్ వచ్చే Wi-Fi HaLow టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్త కంపెనీల నెట్వర్క్ Wi-Fi కూటమి ఈ విషయాన్ని దృవీకరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాల వినియోగం భారీగా పెరుగుతున్న తరుణంలో Wi-Fi HaLow రూపొందించబడింది. పరిశ్రమలు, గృహాలలో IoT అప్లికేషన్లు పెరుగుతున్నందున మరిన్ని ఎక్కువ పరికరాలకి ఇంటర్నెట్ నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. Wi-Fi కూటమి తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ Wi-Fi కొత్త రూపం ప్రస్తుత Wi-Fiతో పోలిస్తే విద్యుత్ శక్తిని భారీగా ఆదా చేస్తుంది. వై-ఫై ఉన్న స్థానం నుంచి 1 కిలోమీటరు దూరంలో మీ కనెక్షన్లకు కనెక్ట్ అవ్వవచ్చు. అలాగే, Wi-Fi HaLow ఇప్పటికే ఉన్న వై-ఫై ప్రోటోకాల్ల ఆధారంగా రూపొందించబడింది. ప్రస్తుత వై-ఫై పరికరాలతో కూడా పనిచేస్తుంది. Wi-Fi HaLow ఎలా పని చేస్తుంది? సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడానికి ఎక్కువగా 2.4GHz నుంచి 5GHz రేడియో ఫ్రీక్వెన్సీ గల వై-ఫై వాడుతాము. ఇవి తక్కువ సమయంలో అధిక మొత్తంలో డేటాను ప్రసారం చేస్తాయి. Wi-Fi HaLow భారీ రేడియో ఫ్రీక్వెన్సీ బదులుగా సబ్-1 గిగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్లో పని చేస్తుంది. తక్కువ-ఫ్రీక్వెన్సీ వేవ్ ఎక్కువ తరంగదైర్ఘ్యాన్ని అనుమతిస్తుంది. అంటే సిగ్నల్లు సాధారణంగా స్పెక్ట్రమ్లతో పోలిస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకే, ఒక Wi-Fi HaLow యాక్సెస్ పాయింట్ నుంచి 1 కిలోమీటరు వ్యాసార్ధం వరకు విస్తరిస్తుంది. అయితే, దీని వల్ల కలిగే ప్రధాన నష్టం డేటా స్పీడ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ, అటువంటి అప్లికేషన్ IoT పరికరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా స్పీడ్ వచ్చే ఇంటర్నెట్ అవసరం. స్మార్ట్ డోర్ లాక్లు, కెమెరాలు, ఎయిర్ కండిషనర్లు మొదలైన వాటిని ఎక్కడ ఉన్న ఆపరేట్ చేయాలంటే IoT అప్లికేషన్ అవసరం. వీటికి తక్కువ ఇంటర్నెట్ అవసరం. ఈ Wi-Fi HaLow కిలోమీటరు దూరంలో ఉన్న 80 ఎంబీపీస్ వరకు వస్తుంది. (చదవండి: ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?) -
భారత్లో గూగుల్ పబ్లిక్ వై–ఫై!
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో వై–ఫై సర్వీసులు అందించే దిశగా టెలికం ఆపరేటర్లు సహా ఇతరత్రా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. భారత్లో కొన్ని రైల్వే స్టేషన్స్లో వై–ఫై సేవలు ప్రారంభించిన స్ఫూర్తితో ఇండోనేషియా, మెక్సికో దేశాల్లో కూడా ’గూగుల్ స్టేషన్’ను ప్రవేశపెట్టినట్లు సంస్థ భారత విభాగం డైరెక్టర్ కె. సూరి తెలిపారు. రైల్టెల్ భాగస్వామ్యంతో ప్రారంభించిన వై–ఫై సేవలతో యూజర్లు సగటున 300 ఎంబీ మేర డేటాను వినియోగించుకున్నట్లు ఆయన వివరించారు. వైజాగ్, విజయవాడ, అలహాబాద్, గోరఖ్పూర్ మొద లైన స్టేషన్స్లో అత్యధికంగా డేటా వినియోగం ఉంటోందన్నారు. రిలయన్స్ జియో సర్వీసులు ప్రారంభమైనప్పటికీ డేటా వినియోగం గణనీయంగానే ఉందన్నారు. వాస్తవానికి పబ్లిక్ వై–ఫై సర్వీసుల వల్ల.. టెల్కోలపై డేటా ట్రాఫిక్ భారం తగ్గుతుందని చెప్పారు. పబ్లిక్ వై–ఫైతో 2019 నాటికి 4 కోట్ల మంది పైగా కొత్త యూజర్లు.. ఇంటర్నెట్కు చేరువ కాగలరని, జీడీపీ మరో 20 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడగలదని నివేదికలు చెబుతున్నాయని సూరి వివరించారు. -
శ్మశానంలో ఉచిత వైఫై
కొరుక్కుపేట(చెన్నై): చెన్నై అన్నానగర్, న్యూ ఆవడి రోడ్డులోని వేలాంగాడు శ్మశాన వాటికలో శనివారం నుంచి ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు శ్మశానవాటికలో శనివారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యూవో), గ్రేటర్ చైన్నై కార్పొరేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ మీనంబాక్కం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైఫై సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైఫై ద్వారా అంత్యక్రియలను విదేశాల్లోని ఆప్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. అంత్యక్రియలకు రాలేని వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వివరించారు. -
చౌక పబ్లిక్ వై–ఫైకి బూస్ట్!
⇒ కేంద్రానికి ట్రాయ్ ప్రతిపాదనలు ⇒ పీడీవో, పీడీవోఏలు ఏర్పాటు చేయాలని సూచన ⇒ వై–ఫై ఉపకరణాలపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వై–ఫై సేవలను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ భావిస్తోంది. దీనికోసం పలు ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే మాత్రం అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వై–ఫై ఉపకరణాలపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ట్రాయ్ సూచించింది. అలాగే చౌక ధరలకే పబ్లిక్ వై–ఫై సర్వీసులను అందించేలా ‘పీడీవో’, ‘పీడీవోఏ’లకు వెసులుబాటు కల్పించాలని కోరింది. ‘పబ్లిక్ డేటా ఆఫీస్’ (పీడీవో)ల ఏర్పాటుకు నియమ నిబంధనలను రూపొందించాలి. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్స్ (పీడీవోఏ)తో భాగస్వామ్యమైన పీడీవోలను పబ్లిక్ వై–ఫై సేవలను అందించడానికి అనుమతించాలి’ అని పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల కేవలం పబ్లిక్ హాట్స్పాట్స్ సంఖ్య పెరుగడమే కాకుండా దేశంలో ఇంటర్నెట్ సర్వీసులు మరింత అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వై–ఫై యాక్సెస్ పాయింట్ ఉపకరణాలపై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల ఇంటర్నెట్ సర్వీసులను అందించడానికి అయ్యే వ్యయాలు తగ్గుతాయని పేర్కొంది. ‘ఎలాంటి ప్రత్యేకమైన లైసెన్స్ అవసరం లేకుండానే పీవోడీఏలను వై–ఫై సర్వీసులను అందించడానికి అనుమతించే అవకాశముంది. అయితే ఇవి టెలికం డిపార్ట్మెంట్ సూచించిన రిజిస్ట్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది’ అని తెలిపింది. దీంతో గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్షిప్కి ఊతమిచ్చినట్లు అవుతుందని, గ్రామాల్లో బలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. వై–ఫై నెట్వర్క్లో ఒక ఎంబీ డేటా ఖర్చు 2 పైసల కన్నా తక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన ట్రాయ్.. 2జీ, 3జీ, 4జీ వంటి సెల్యులర్ నెట్వర్క్స్లో యూజర్లు ఒక ఎంబీ డేటా కోసం సగటున 23 పైసలు వెచ్చిస్తున్నారని పేర్కొంది. పీడీవో, పీడీవోఏ అంటే.. ట్రాయ్ ఒక విధానాన్ని సూచించింది. ఇక్కడ చిన్న ఎంట్రప్రెన్యూర్లు, దుకాణం యజమానులు మల్టీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్పీ) నుంచి బ్యాండ్విడ్త్ను తీసుకుంటారు. దీన్ని తిరిగి వై–ఫై హాట్స్పాట్స్ ద్వారా డేటా రూపంలో చౌక ధరకు యూజర్లకు విక్రయిస్తారు. అంటే పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లను (పీడీవోఏ) ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. వీళ్లు ఐఎస్పీల నుంచి బ్యాండ్విడ్త్ను తీసుకొని దాన్ని పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో–హాట్స్పాట్ ఏర్పాటు చేసేవారు) యజమానులకు అందిస్తారు. -
విమానంలో వై-ఫైకు అనుమతి!!
న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో ఉన్నప్పుడు ఫేస్బుక్లో సమయాన్ని వెచ్చించడం, ట్వీట్ చేయడం మిస్ అవుతున్నారా.? అయితే ప్రయాణికులకు త్వరలోనే ఓ గుడ్న్యూస్ అందనుంది. విమానాలు భారత గగనతలంలో ఎగురుతున్నప్పుడు వై-ఫై వాడుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయించిందట. 10 రోజుల్లో దీనిపై ఓ శుభవార్తను అందించనున్నట్టు పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. భారత గగనతలంలో వై-ఫై ఆపరేట్కు అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడకాన్ని అనుమతించేవారు కాదు. ఎవరైనా ఫోన్ను వాడితే అది నేరంగా పరిగణించేవారు. ప్రస్తుతం పౌర విమానయానం తీసుకునే ఈ నిర్ణయంతో కాల్స్ చేసుకునే అవకాశం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ వాగ్దానంతో, 'అచ్చే దిన్' ఫైనల్గా విమాన ప్రయాణికుల ముందుకు విచ్చేస్తుందట. ఈ ప్రతిపాదన అమలుకు కేబినెట్ అనుమతి అవసరం లేదని, 10 రోజుల్లో ప్రయాణికుల ముందుకు ఈ అవకాశాన్ని తీసుకురానున్నట్ట చౌబే తెలిపారు. భారత గగనతలంలో ఎగిరే భారత, విదేశీ విమనాలన్నింటికీ ఈ సౌకర్యం అనుమతించనున్నట్టు వెల్లడించారు. ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏపీఏఐ) నిర్వహించిన అవార్డు ఫంక్షన్లో చౌబే ఈ విషయాన్ని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement