-
ఉమెన్.. డబుల్ డిజిట్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ దఫా అత్యధికంగా గెలుపొంది తమ సంఖ్యాబలాన్ని డబుల్ డిజిట్కు చేర్చారు. ప్రస్తుతం గెలుపొందిన పది మందిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో మహిళల గెలుపు ఆరుకు పరిమితమైంది. తాజాగా వారి సంఖ్య 10కి చేరుకోవడం శుభపరిణామని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గెలుపొందిన మహిళల్లో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు ఎస్సీ, మరో ఇద్దరు ఎస్టీ, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. -
సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించి చరిత్ర సృష్టించిన మహిళా ఎమ్మెల్యేలు
కోహిమా: 60 ఏళ్ల నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అధికార ఎన్డీపీపీ టిక్కెట్పై పశ్చిమ అంగామీ స్థానం నుంచి హెకాని జకాలు, దిమాపూర్–3 స్థానం నుంచి సల్హోటనో క్రుసె విజయం సాధించారు. వారిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓడించడం విశేషం. నాగాలాండ్లో ఎన్డీపీపీ–బీజేపీ హవా నాగాలాండ్లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)–బీజేపీ కూటమి మళ్లీ అధికార పీటం దక్కించుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని ఎన్డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు దక్కాయి. ఇతర పార్టీ లేవీ రెండంకెల సీట్లు సాధించలేకపోయాయి. ఎన్సీపీ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) 5 సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ(రామ్విలాస్ పాశ్వాన్) 2, ఆర్పీఐ(అథవాలే) 2, ఎన్పీఎఫ్ 2 సీట్లలో గెలుపొందాయి. జేడీ(యూ) ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కి ఒక్కటంటే ఒక్కటి కూడా దక్కలేదు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీ ల అభ్యర్థులకు ఎన్డీపీపీ నేత, సీఎం రియో అభినందనలు తెలిపారు. -
మహిళా ఎం.ఎల్.ఏలు చరిత్ర సృష్టించారు
నాగాలాండ్ ఏర్పడి 60 ఏళ్లు. 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఇప్పటి వరకూ ఒక్క మహిళ కూడా అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆ ఘనతను ఇద్దరు ఎం.ఎల్.ఏలు దక్కించుకొని చరిత్ర సృష్టించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హెకాని జకాలు, సల్హౌటనో క్రుసె విజయం సాధించారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగగా డిమాపూర్–3 నుంచి హెకాని, పశ్చిమ అంగమె నుంచి క్రుసె విజయం సాధించారు. అక్కడి పాలనాధికారంలో స్త్రీలప్రాతినిధ్యం మొదలైంది. ఇది ఆగదు. మహిళలను ‘ఆకాశంలో సగం’ అంటాం. వారికి అవకాశాలలో సగం దక్కాలన్న ఉద్యమాలు బయలుదేరి చాలా కాలం అయ్యింది. కాని ఇంకా కొన్నిచోట్ల వారికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. పురుష భావజాలం స్త్రీలలో కూడా నాటుకు పోయి స్త్రీకి స్త్రీయే ప్రతికూలత సృష్టించేవరకూ వెళుతోంది. ఉదాహరణకు నాగాలాండ్లో పా లనాధికారంలో స్త్రీలు ఉండటాన్ని మొదటినుంచీ వ్యతిరేకించారు. అక్కడి మొత్తం ఓటర్లు 13 లక్షలు ఉంటే వారిలో దాదాపు ఆరున్నర లక్షల ఓటర్లు మహిళలే అయినా వారు ఒక్క మహిళనూ గెలిపించుకోలేదు. దానికి కారణం అక్కడ ఇంటి పెద్ద, సమూహం పెద్ద, ఊరి పెద్ద ఎవరికి ఓటెయ్యమంటే స్త్రీలు వారికే ఓటు వేయాలి. పురుషులే సంపా దనపరులు కనుక పురుషుల మాట వినాలని స్త్రీలు అనుకుంటారు. పురుషులు సహజంగానే స్త్రీల ్రపా తినిధ్యాన్ని అంగీకరించరు. కనుక 1963లో నాగాలాండ్ ఏర్పడితే... 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం 20 మందికే సీట్లు దక్కాయి. కాని ఎవరూ గెలవలేదు. డిపా జిట్లు కూడా రాలేదు. 2018లో 5 మంది స్త్రీలు పోటీ చేస్తే వారిలో ఎవరూ గెలువలేదు. కాని ఈ ధోరణిలో ఇప్పుడు మార్పు వచ్చిందనే సంకేతాలు అందుతున్నాయి. 2023 ఎన్నికలలో మొత్తం 183 మంది అన్ని పా ర్టీల నుంచి బరిలో దిగగా వీరిలో నలుగురు స్త్రీలు ఉన్నారు. ఈ నలుగురిలో నేషనల్ డెమొక్రటిక్ ప్రో గ్రెసివ్ పా ర్టీ (ఎన్.డి.పి.పి) నుంచి ఇద్దరు మహిళలు హెకాని, క్రుసె గెలిచారు. బి.జె.పితో కలిసి ఎన్.డి.పి.పి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అందువల్ల ఈ ఇరువురిలో ఎవరైనా మంత్రి అయితే అదీ మరో చరిత్ర కాగలదు. ఏడు ఓట్లతో గెలిచిన క్రుసె నాగాలాండ్లోని పశ్చిమ అంగమి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరకు ఎన్.డి.పి.పి అభ్యర్థి, 56 సల్హౌటనో క్రుసె ఏడంటే ఏడే ఓట్లతో విజయం సాధించింది. పశ్చిమ అంగమెలో ఆమెకు ప్రత్యర్థిగా నిలిచిన నఖ్రో గతంలో నాగా పీపుల్స్ పా ర్టీలో ఉండేవాడు. ఆ తర్వాత ఎన్.డి.పి.పికి జంప్ చేశాడు. కాని ఈ ఎన్నికల్లో ఎన్.డి.పి.పి టికెట్ ఇవ్వక పోయేసరికి ఇండిపెండెంట్గా రంగంలో దిగాడు. అతణ్ణి ఓడించడానికి క్రుసె సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి వచ్చింది. హోటల్స్ రంగంలో ఉన్న క్రుసె నాగాలాండ్లోని సామాజిక సంస్థలకు కలిసి పని చేస్తోంది. తన గిరిజన తెగ మహిళా విభాగానికి నాయకురాలిగా కూడా ఉంది. ఈమె గెలుపుతో అంగమిలో భారీ వేడుకలు మొదలయ్యాయి. జనం బారులు తీరి అభినందనలు తెలుపుతున్నారు. మొదటి విజేత హెకాని నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం జరిగిన ఫలితాల లెక్కింపులో ఆ రాష్ట్రంలో గెలిచిన మొదటి మహిళా ఎం.ఎల్.ఏగా ఎన్.డి.పి.పి అభ్యర్థి హెకాని జకాలు (47) మొదట డిక్లేర్ అయ్యింది. ఆ తర్వాతే రెండో మహిళా అభ్యర్థి క్రుసె గెలుపు ప్రకటితమైంది. అందువల్ల హెకాని విజయం విశేషంగా మారింది. డిమాపూర్–3 నియోజకవర్గంలో సిట్టింగ్ ఎం.ఎల్.ఏ జిమోమిని 1536 ఓట్లతో ఓడించింది హెకాని. అయితే ఈమెకు ఈ గెలుపు ఊరికే రాలేదు. సుదీర్ఘ కృషి ఉంది. డిమాపూర్లో పుట్టి పెరిగిన హెకాని ఢిల్లీలో చదువుకుంది. ఆ తర్వాత అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో లా చదివింది. నాగాలాండ్లో ‘యూత్నెట్ నాగాలాండ్’ అనే ఎన్.జి.ఓను స్థాపించి యువతీ యువకుల చదువుకు,ఉపా ధికి మార్గం చూపింది. ‘మేడ్ ఇన్ నాగాలాండ్’ పేరుతో వస్తు ఉత్పత్తి, ఆవిష్కరణల కోసం కోహిమాలో ఒక సెంటర్ నడుపుతోందామె. అందుకే ఆమెకు నారీశక్తి పురస్కారం లభించింది. ఈ ఎన్నికలలో ఆమె తన విజయం కోసం గట్టిగా పోరాడింది. స్త్రీల విద్య, ఉపా ధికి హామీలు ఇచ్చింది. ఆమె కోసం అస్సాం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ప్రచారం చేశాడు. -
యూపీ ఉభయసభల్లో ఒక్క రోజు మహిళలకే!
లక్నో: ఉత్తరప్రదేశ్ ఉభయ సభల్లో గురువారం కేవలం మహిళా ప్రజాప్రతినిధులు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. బీజేపీకి చెందిన అనుపమ జైస్వాల్ సభకు అధ్యక్షత వహించారు. మహిళా ప్రతినిధుల ప్రసంగాలను అసెంబ్లీ గ్యాలరీలో నుంచి మహిళా వైద్యులు, విద్యార్థినులు, బాలికలు ప్రత్యక్షంగా వీక్షించారు. ముందుగా సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ల ప్రసంగించారు. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా మహిళా ఎమ్మెల్యేలు సూచనలు అందజేయాలని సీఎం యోగి కోరారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయాలని అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి సూచించారు. యూపీ అసెంబ్లీలోని 403 మంది సభ్యులకు గాను 47 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. 100 మందితో కూడిన శాసనమండలిలో ఆరుగురు ఎమ్మెల్సీలున్నారు. -
కొత్త అసెంబ్లీల్లో పెరిగిన మహిళా ప్రాతినిథ్యం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల ప్రాతినిథ్యం పెరిగింది. గత అసెంబ్లీలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య పెరిగిందని పీఆర్ఎస్ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2017లో యూపీ అసెంబ్లీలో 42 మంది మహిళా ఎంఎల్ఏలు ఉండగా ప్రస్తుతం వీరి సంఖ్య 47కు పెరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో మహిళా ఎంఎల్ఏల సంఖ్య 5 నుంచి 8కి, మణిపూర్లో 4 నుంచి 8కి పెరిగింది. ఎంఎల్ఏలుగా ఎన్నికైన వారిలో 55 సంవత్సరాలు నిండినవారి సంఖ్య పెరిగింది. మరోవైపు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్లో వయసులో పెద్దవారైన ఎంఎల్ఏల సంఖ్య పెరిగింది. 55 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఎంఎల్ఏల సరాసరి 2017లో 64.7 శాతం ఉండగా, 2022కు 59.5 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. కనీసం డిగ్రీ అర్హత ఉన్న ఎంఎల్ఏల వాటా యూపీలో 72.7 నుంచి 75.9 శాతానికి పెరగ్గా, ఉత్తరాఖండ్లో 77 నుంచి 68 శాతానికి, మణిపూర్లో 76 నుంచి 68 శాతానికి తగ్గిందని సంస్థ వెల్లడించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement