-
భారత మహిళల ఓటమి
సాంటియాగో (చిలీ): హాకీ మహిళల జూనియర్ ప్రపంచకప్లో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్కు తర్వాతి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. టోర్నీ రెండో పోరులో జర్మనీ 4–3 గోల్స్ తేడాతో భారత మహిళల జట్టును ఓడించింది. భారత్ తరఫున అన్ను (11వ నిమిషం), రోప్నీ కుమారి (14వ ని.), ముంతాజ్ ఖాన్ (24వ ని.) గోల్స్ కొట్టగా...జర్మనీ తరఫున లౌరా ప్లూత్ (21వ నిమిషం, 36వ ని.), సోఫియా స్వాబ్ (17వ ని.), కరోలిన్ సీడెల్ (38వ ని.) గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్లోనే 2 గోల్స్ సాధించి ముందంజలో నిలిచిన భారత్ మ్యాచ్ అర్ధ భాగం ముగిసే సరికి కూడా 3–2తో ఆధిక్యంలోనే ఉంది. అయితే అనూహ్యంగా పుంజుకున్న జర్మనీ రెండో అర్ధభాగంలో రెండు నిమిషాల వ్యవధిలో 2 గోల్స్ కొట్టింది. ఆఖరి క్వార్టర్లో ఇరు జట్లూ పోరాడినా ఒక్క గోల్ నమోదు కాకపోగా, జర్మనీ తమ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకుంది. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో బెల్జియంతో తలపడుతుంది. -
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ప్రీతి
ఈనెల 29 నుంచి డిసెంబర్ 10 వరకు చిలీలో జరిగే జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హరియాణాకు చెందిన ప్రీతి కెపె్టన్గా వ్యవహరించనుంది. భారత జట్టు: ప్రీతి (కెప్టెన్), రుతుజా (వైస్ కెప్టెన్), ఖుష్బూ, మాధురి కిండో (గోల్కీపర్లు), నీలమ్, జ్యోతి, రోప్ని కుమారి, మహిమా టెటె, మంజూ చోర్సియా, జ్యోతి ఛత్రి, హీనా బానో, సుజాత కుజుర్, సాక్షి రాణా, ముంతాజ్ ఖాన్, అన్ను, దీపిక సోరెంగ్, మోనిక టొప్పో, సునెలితా. రిజర్వ్: నిరూపమా దేవి, ఈదుల జ్యోతి. -
ఔటయ్యానన్న కోపంతో బ్యాట్ను నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్!
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా పరాజాయం పాలైన సంగతి తెలిసిందే. కీలక మ్యాచ్లో 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఏడో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. హర్మన్ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేసింది. ఊహించని రీతిలో.. కాగా ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ను దురుదృష్టం వెంటాడింది. కీలక సమయంలో ఊహించని రీతిలో హర్మన్ రనౌట్గా వెనుదిరిగింది. 15వ ఓవర్ వేసిన జార్జియా వేర్హామ్ బౌలింగ్లో మొదటి రెండు బంతులకు హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫోర్లను బాదింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 4వ బంతిని హర్మన్ డీప్ మిడి వికెట్ దిశలో స్వీప్ షాట్ ఆడింది. బంతి బౌండరీకి చేరుతుందనే క్రమంలో గార్డనర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ ఆపింది. అయితే సింగిల్ను ఇదే సమయంలో హర్మన్, రిచా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే క్రీజును చేరుకునే క్రమంలో హర్మన్ బ్యాట్ కాస్త ముందు ఇరుక్కుపోయింది. వెంటనే బంతిని అందుకున్న వికెట్ కీప్ హీలీ బెయిల్స్ పడగొట్టడంతో హర్మన్ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరింది. దీంతో మ్యాచ్ ఒక్క సారిగా ఆసీస్ వైపు మలుపు తిరిగింది. ఇక అనూహ్యరీతిలో ఔటైన హర్మన్ అసహనానికి గురైంది. ఈ క్రమంలో డగౌట్ వైపు వెళ్తూ కోపంతో తన బ్యాట్ను నేలకేసి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా' pic.twitter.com/D1bYu3qogq — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) February 23, 2023 -
అండర్–19 మహిళల టీ20 వరల్డ్కప్ విజేత భారత్ (ఫొటోలు)
-
మహిళల క్రికెట్ జట్టు వరల్డ్కప్ సాధించడంపై సీఎం జగన్ హర్షం
తాడేపల్లి: భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు టీ 20 వరల్డ్కప్ సాధించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించి వరల్డ్కప్ను సొంతం చేసుకున్న భారత జట్టును సీఎం జగన్ అభినందించారు. భవిష్యత్తులో జరిగే టోర్నీల్లోనూ విజయాల పరంపర కొనసాగించాలని ఆకాంక్షించారు. కాగా, తొట్టతొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇవాళ (జనవరి 29) జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు ఇంగ్లండ్ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. 69 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. షెఫాలీ వర్మ (15), శ్వేత్ సెహ్రావత్ (5), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (24) పెవిలియన్కు చేరగా.. సౌమ్య తివారి (23), హ్రిషత బసు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, కెప్టెన్ గ్రేస్ స్కీవెన్స్, అలెక్సా స్టోన్హౌస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 68 పరుగులకే చాపచుట్టేసింది. టిటాస్ సాధు, అర్చనా దేవీ, పర్శవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరచగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి తమ పాత్రకు న్యాయం చేశారు. టీ20 ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్కప్ను భారత అమ్మాయిలు కైవసం చేసుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement