-
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!
-
మహిళ చేతిలో నారా లోకేష్ చిత్తు చిత్తు..
-
వాళ్ల దగ్గర ఉన్నంత డబ్బు లేదు.. మంగళగిరి ముఖాముఖిలో చంద్రబాబు, లోకేష్ను ఏకేసిన సీఎం జగన్
-
బాబు బ్యాచ్ ఇళ్ల పట్టాలు ఆపారు.. ఓట్లకు వస్తే నిలదీయండి: సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. కాగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేది. దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్ అందించిన ప్రభుత్వం మనది. పెన్షన్ను రూ.3వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చింది. 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్ ఇవ్వరు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్ ఇచ్చాము. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసిన ప్రభుత్వం మనదిఅని తెలిపారు. పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా?. మేనిఫెస్టోలో చెప్పే ప్రతీ హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది. మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది చంద్రబాబే. అందుకే ఓటు వేయమని అడిగినప్పుడు చంద్రబాబును నిలదీయండి’ అని కోరారు. -
సత్తుపల్లి అమ్మాయి.. స్పెయిన్ అబ్బాయి
ఖమ్మం: వారి ప్రేమ ఖండాంతరాలు దాటి వివాహ బంధంతో ఏకమైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన విద్యాభారతి కళాశాల డైరెక్టర్ మందడపు సత్యనారాయణ – సుజని దంపతుల కుమార్తె లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ దేశంలోని బార్సిలోనలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో స్టాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన స్పెయిన్ దేశానికి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇరుపక్షాల తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. సత్తుపల్లిలోని శ్రీసాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో బుధవారం అర్ధరాత్రి 12.53 నిమిషా లకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఒకటయ్యారు. ఇవి చదవండి: శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు -
ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం
-
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
బెంగళూరు టు హైదరాబాద్
మణికొండ: లావణ్య ఫోన్ కాంటాక్ట్ లిస్ట్, కాల్ డేటా, సోషల్ మీడియా చాట్ల ఆధారంగా డ్రగ్స్ రాకెట్పై నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లావణ్యతోపాటు ఉనీత్రెడ్డిలపై 2022లో గుంటూరు జిల్లా పట్టాభిపురం, 2023లో మోకిల పోలీస్స్టేషన్లలో డ్రగ్స్ కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. లావణ్యకు పలువురు టాలీవుడ్ నటులు, వీఐపీలతో పరిచయాలు ఉన్నట్టు గుర్తించారు. లావణ్య, ఉనీత్రెడ్డిలు బెంగళూరులో రూ.1,500లకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్లో రూ.6,000 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. విజయవాడ నుంచి ఉన్నత చదువులకు హైదరాబాద్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్ చేసిన లావణ్య, ఆ రంగంలో స్థిరపడకుండా..మ్యూజిక్ నేర్చుకుంది. అదే క్రమంలో షార్ట్ ఫిలింలు, పలు చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టీస్ట్గా అవకాశాలు దక్కించుకుంది. మరిన్ని సినిమా చాన్స్ల కోసం ప్రయత్నిస్తోంది. ఉనీత్రెడ్డి కూడా షార్ట్ ఫిల్మ్లలో నటించాడు. ఉనీత్రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి లావణ్య,తోపాటు తన గర్ల్ ఫ్రెండ్. తదితరులు ఇచ్చేవాడు. వారు వాడటమే కాకుండా, ఇతరులకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. లావణ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆమెను తమ కస్టడీకి తీసుకొని లోతుగా విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుంచి అనుమతి రాగానే పూర్తిస్థాయి విచారణ చేస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఉనీత్రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడి ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. -
లావణ్య కథా చిత్రం
-
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ క్రమంలో అరెస్టైన నటి లావణ్య కస్టడీ కోరుతూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజులపాటు ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం లావణ్య హైదరాబాద్కు వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్ల కోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. షార్ట్ ఫిలిం, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె.. జల్సాలకు అలవాటు పడినట్లు తెలిసింది. కస్టడీ పిటిషన్లో పేర్కొన్న అంశాలు నార్సింగి డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ యువతి , ఉనీత్ రెడ్డి లను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుండి 4 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం యువతి హ్యాండ్ బ్యాగ్ లభ్యమైన డ్రగ్ సంగీతం టీచర్ పని చేస్తున్న లావణ్య టాలీవుడ్ హీరోకు ప్రేయసిగా ఉన్న యువతి ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్ ప్యాకెట్లు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపిన లావణ్య కొద్దీ రోజుల క్రితం ఉనీత్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన లావణ్య పక్క సమాచారం తో లావణ్య ను తనిఖీ చేసి SOT పోలీసులు NDPS 22బీ, రెడ్ విత్ 8సి కింద కేసులు నమోదు చేసిన నార్సింగి పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కి నిందితులు ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య.. అతనికి ప్రియురాలిగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులోఅనుమానితురాలిగా ఉంది. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో A3గా ఉన్న ఇందూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: సారీ, నేను ఓడిపోయాను..! అసలేం జరిగిందంటే.. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న యువతి వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. నార్సింగి నుంచి కోకాపేటకు వెళ్లే దారిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య అనే యువతి వద్ద ఆదివారం తనిఖీలు చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.50 వేల వరకు ఉండగా వాటితో పాటు ఓ సెల్ఫోన్, రెండు ట్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ర ఎడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు యువతి తెలిపింది. యువతిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 14 రోజులపాటు రిమాండ్కు పంపారు. -
డ్రగ్స్తో పట్టుబడ్డ టాలీవుడ్ హీరో ప్రేయసి!
రంగారెడ్డి: హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నార్సింగిలో సైబరాబాద్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్తో ఓ యువతి.. మరో వ్యక్తి పట్టుబడ్డారు. వాళ్ల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఆమె ఓ యువహీరో ప్రేయసిగా తేలింది. ఎస్ఓటీ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగీలో డ్రగ్స్ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్వోటీ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఓ యువతియువకుడి దగ్గరనుంచి 4 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఆ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. అయితే విచారించే క్రమంలో ఆ యువతి టాలీవుడ్కు చెందిన ఓ యంగ్ హీరో ప్రేయసి గుర్తించారు. షార్ట్ ఫిల్మ్స్తో పేరు దక్కించుకుని వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నాడు ఆ యువ హీరో. మొన్న సంక్రాంతికి ఓ అగ్రహీరో చిత్రంలోనూ ఆ హీరో చిత్రంలోనూ ఆ యంగ్ హీరో నటించాడని పోలీసులు చెబుతున్నారు. రిమాండ్ విధింపు సదరు యువతి మ్యూజిక్ టీచర్గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అనంతరం ఆమెను ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. -
చేగువేరా బయోపిక్ 'చే' ఎలా ఉందంటే..
టైటిల్: ‘చే’ నటీనటులు:లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్ తదితరులు నిర్మాణ సంస్థ: బ్యానర్: నేచర్ ఆర్ట్స్ నిర్మాతలు: సూర్య , బాబు, దేవేంద్ర రచయిత, దర్శకుడు: బి.ఆర్ సభావత్ నాయక్ సంగీతం: రవిశంకర్ సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి, జగదీష్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. విప్లవం బాట పట్టిన 'చే' (సభావత్ నాయక్) పలు దేశాలు తిరుగుతూ పీడిత జనాన్ని చైతన్య పరుస్తుంటాడు. ఓ సారి పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడతాడు. గాయపడిన 'చే'ను గిరిజన గ్రామస్తులు కాపాడుతారు. ఆ క్రమంలో సింగి (లావణ్య) 'చే'ను ప్రేమిస్తుంది. శరీరకంగానూ దగ్గరవుతుంది. ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం తదితర సమస్యలపై దృష్టిపెడతాడు. కేవలం కడుపు నింపుకోవటం కోసమే పని చేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపరచాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పోలీసుల చేతిలో తన దళ సభ్యులు చనిపోతారు. చివరికి 'చే' కూడా బొలీవియా సైనిక దళాలకు బందీగా చిక్కుతాడు. ఆ తర్వాత ఏమైందీ? తను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉంది? అనేదే ఈ సినిమా కథ. ఎవరెలా చేశారంటే.. చేగువేరా పాత్రలో బిఆర్ సభావత్ నాయక్ చక్కగా నటించాడు. ఈ తరం ప్రేక్షకులకు చేగువేరా ఎలా ఉంటాడో పూర్తిస్థాయిలో చూపించాడు. లీడ్ రోల్లో సభావత్ నాయక్ చెప్పిన డైలాగ్లు ఈ సినిమా హైలైట్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. చే కు జంటగా నటించిన లావణ్య తన పాత్రలో చక్కగా నటించింది. ఒక అందమైన అమాయకపు గిరిజన అమ్మాయిగా నటించి తన పాత్రకు పరిపూర్ణత తెచ్చింది. ఇక ఇతర పాత్రల్లో నటించిన పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్ తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ విప్లవం అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికి గుర్తొచ్చే పేరు చేగువేరా. అలాంటి వీరుడి జీవిత చరిత్రను తెరకెక్కించిన మూవీ ‘చే’.సాధారణ కథతో పాటు, చేగువేరా లైఫ్ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలను కూడా ఎంతో ఆసక్తిగా తెరకెక్కించాడు దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్. సినిమాలోని పాత్రలు ఇండియాలో మాదిరిగానే కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే గిరిజనులను పోలి ఉంటాయి. చేగువేరా బయోపిక్ను మన నెటివికి దగ్గరగా చూపించాలన్న ఉద్దేశంతోనే సినిమా తీసినట్టు మనకు అర్థమవుతుంది. చరిత్రను తెరపై చూపించడం చిన్న విషయం కాదు..ఉన్నది ఉన్నట్లు చూపించకపోతే చరిత్రకారులు ఒప్పుకోరు.. సినిమాటిక్ లిబర్టీ తీసుకోకపోతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ‘చే’ విషయంలో కూడా అదే జరిగింది. చాలా వరకు చేగువేరా జీవితాన్ని నేచురల్ గా చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. కమర్షియల్ హంగులకి పెద్దపీట వేయలేదు. చాలా నిజాయితీగా సినిమాను తెరకెక్కించాడు. టెక్నికల్ విషయాలకొస్తే..రవిశంకర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. సినిమాటోగ్రాఫర్లు కళ్యాణ్ సమి, జగదీష్ పనితీరు బాగుంది.ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు పర్వాలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ అతిసాధారణ వ్యక్తి ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించడం నిజంగా అభినందించాల్సిందే. -
Varun Lavanya Tripathi Konidela: ఈ జంట హనీమూన్ ఫోటోస్ చూశారా?
-
న్యూ లుక్ లో వైష్ణవ్ తేజ్..ఎందుకో తెలుసా..?
-
Varun Lavanya Pre Wedding Pics: ఘనంగా వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఏ సినిమానీ చిన్నది అనొద్దు
‘‘ఏ సినిమానీ చిన్నది అనొద్దు. కొత్త వాళ్ల సినిమా అనాలి. నేను రావడం వల్ల ఓ సినిమాకు మంచి జరుగుతుందంటే ప్రమోషన్కు వస్తాను.. అది నాకు తృప్తినిస్తుంది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘ఈ మూవీ హిట్ అవుతుందని ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది. యూనిట్కి మంచి సక్సెస్ రావాలి’’ అన్నారు.. -
‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ మూవీ రివ్యూ
టైటిల్: అన్నపూర్ణ ఫొటో స్టూడియో నటీనటులు: చైతన్య రావ్, లావణ్య,మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య నిర్మాణ సంస్థ: బిగ్ బెన్ సినిమాస్ నిర్మాత: యష్ రంగినేని దర్శకత్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ విడుదల తేది: జులై 21, 2023 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో మంచి ఫేం అందుకున్న చైతన్య రావ్, యూట్యూబ్ వీడియోలతో పాటు హిట్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించగా ఒక పిట్ట కథ లాంటి సినిమాతో అందరినీ ఆకట్టుకున్న చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిర, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించగా టీజర్ ట్రైలర్ వంటి వాటితో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. దీంతో సినిమాని ముందుగానే మీడియా కోసం స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. పచ్చటి పొలాలు, చుట్టూ గోదావరితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఒక గ్రామంలో సూసైడ్ చేసుకోబోయిన అదే ఊరికి చెందిన చంటి (చైతన్యరావ్)ను పోలీసులు ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. అతను రాసుకున్న సూసైడ్ నోట్ చదివే క్రమంలోనే ఈ సినిమా మొదలవుతుంది. చదువు పూర్తయి వయస్సు మీదపడినా పెండ్లికాని ప్రసాద్లా మిగిలిపోయినా తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు తన తల్లిపేరుతో అన్నపూర్ణ ఫొటో స్టూడియోను నడుపుతుంటాడు. ఊర్లో బేరాలు కంటే ఎక్కువగా స్నేహితులతో కలిసి సందడి చేస్తూ ఉంటాడు చంటి. అనుకోకుండా తన చెల్లిని కాలేజీలోనే కొత్తగా జాయిన్ అయిన గౌతమి (లావణ్య)తో ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా చంటిని ప్రేమిస్తుంది. ఇలా సాగిపోతున్న క్రమంలో అనుకోకుండా ఓ మర్డర్ కేసులో చంటి ఇరుక్కుంటాడు. ఎవరూ చూడలేదు కదా అనుకుంటే ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత చంటి ఏం చేశాడు? అసలు సింధు ఎవరు? లావణ్యతో చంటి ప్రేమ ఏమైంది? అసలు చంటి సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? చివరికి చంటి బతికి బట్ట కడతాడా? అనేది సినిమా కథ. ఎలా ఉందంటే.. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్. దానికి చిన్న క్రైమ్ టచ్ కూడా ఇచ్చారు. నిజానికి తెలుగు వారందరికీ ఇలా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఏ మాత్రం కొత్త కాదు. ఈ కథ కూడా కొత్తగా అనిపించదు కానీ నడిచినంత సేపు ఆద్యంతం ఆసక్తికరంగా వెళ్ళిపోతుంది. సినిమా మొదలైన వెంటనే ఇది పెద్ద వంశీ స్టైల్ లో తెరకెక్కించిన సినిమా అనే విషయం ఈజీగా అర్థమవుతుంది. వయసు మీద పడిన పెళ్లి కాక ఇబ్బందులు పడే హీరో తనకన్నా రెట్టింపు వయసు వాడితో ప్రేమలో పడే హీరోయిన్, ఎలాంటి బాధ్యతలు లేకుండా గాలికి తిరిగే తొట్టి గ్యాంగ్ ఇలా ఆసక్తికరంగా కథ కథనాలు రాసుకున్నాడు డైరెక్టర్. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. అయితే సినిమాలో కావాలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారనే విషయం రివిల్ చేసి కొంత ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా ఫ్యామిలీతో కలిస్ చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఎవరెలా చేశారంటే.. నటీనటుల విషయానికి వస్తే అటు చైతన్య రావు ఇటు లావణ్య వేరు వేరు సినిమాలలో అలాగే యూట్యూబ్ వీడియోలలో కనిపించిన ఇద్దరికీ ఇది హీరో హీరోయిన్లుగా మొదటి సినిమా కావడంతో చాలా ఫ్రెష్ ఫీల్ కలిగింది. వయసు పైబడిన పెళ్ళికాని ప్రసాదు లాంటి పాత్రలో చైతన్య రావు తనకన్నా రెట్టింపు వయసు వ్యక్తిని ప్రేమించే పాత్రలో లావణ్య జీవించారు, ఆమె నటన నేచురల్ గా ఉంది. సినిమాను మలుపు తిప్పే పాత్రను నిర్మాత యష్ రంగినేని పోషించి నిర్మాతగానే కాదు నటుడుగా కూడా ఆకట్టుకున్నారు. వైవా రాఘవ మినహా దాదాపు మిగతా పాత్రధారులు అందరూ కొత్తవారే అయినా తమ తమ పాత్రల పరిధి మీద ఆకట్టుకున్నారు. అయితే కామెడీ ఇంకాస్త వర్కౌట్ అయితే సినిమా వేరే లెవెల్ లో ఉండేది. టెక్నికల్ విషయాలు పరిశీలిస్తే చందు ముద్దు రాసుకున్న కథనాలు ఆకట్టుకున్నాయి కానీ కామెడీ విషయం మీద మరికొంత శ్రద్ధ పెడితే బాగుండేది. ప్రిన్స్ హెన్రీ సంగీతం ఆకట్టుకుంది అయితే నేపథ్య సంగీతం విషయంలో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. పంకజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోశాడు. పచ్చటి పొలాలను ప్రకృతి అందాలను ఒడిసిపట్టి ప్రతి ఫ్రేమ్ ని ఒక ఓ అందమైన పెయింటింగ్ ఏమో అనిపించేలా చూపించాడు. ఎస్.పి. చరణ్ పాడిన రంగమ్మ సాంగ్ చాలాకాలం గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమా ఎడిటింగ్ కూడా వంక పెట్టలేకుండా క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఫొటో స్టూడియోలో ప్రేమ
‘‘ప్రేక్షకులకు మనం ఎప్పటి కథ చెబుతున్నామన్నది ముఖ్యం కాదు. ఆ కథను ఎలా చెబుతున్నామన్నదే ముఖ్యం. ‘సీతారామం’ సినిమా 1960ల నేపథ్యంలో ఉన్నా ప్రేక్షకులు ఆదరించారు. అందుకే 1980ల నేపథ్యంలో రూ΄÷ందిన మా ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు చెందు ముద్దు అన్నారు. చైతన్యా రావ్, లావణ్య జంటగా యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు చెందు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘ఓ పిట్ట కథ’. ఇప్పుడు ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ తీశాను. ఈ చిత్రంలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను వినోదాత్మకంగా చూపిస్తున్నాం. మాలాంటి కొత్త వాళ్లను ప్రేక్షకులు ్ర΄ోత్సహించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలు వస్తాయి’’ అన్నారు. -
పల్లెటూరి ప్రేమ కథ
‘‘పల్లెటూరిలో జరిగే ప్రేమ కథే ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఒక అనూహ్య ఘటన వల్ల హీరో, హీరోయిన్ల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, పక్కా వాణిజ్య అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని నిర్మాత యష్ రంగినేని అన్నారు. చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ఈ నెల 21న విడుదలఅవుతోంది. చిత్ర నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ– ‘‘నాకు పాత తెలుగు సినిమాలంటే ఇష్టం. లండన్ వెళ్లినప్పుడు ఎన్టీఆర్గారి పాత సినిమాలు చూస్తుంటాను. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ ని చెందు బాగా తీశాడు. నేను కూడా ఓ పాత్ర చేశాను. విజయ్ దేవరకొండతో మేము నిర్మించిన ‘పెళ్ళి చూపులు, డియర్ కామ్రేడ్’ సినిమాలను త్వరలో రీ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
మనసుకు హత్తుకునే ప్రేమకథ
‘నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమా ట్రైలర్. చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన పీరియాడికల్ లవ్స్టోరీ ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ‘ఇచ్చట ఫోటోలు అందంగా తీయబడును’ అనేది క్యాప్షన్. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది. ఈ సినిమాను థియేటర్స్లో చూడండి. యూనిట్కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘1980–1990 నేపథ్యాన్ని మళ్లీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు చైతన్య రావ్. ‘‘ఫస్టాఫ్ ఫన్నీగా, సెకండాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ సినిమా కథనం సాగుతుంది’’ అన్నారు చెందు ముద్దు, యష్ రంగినేని. ‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ’, ‘చంటి జాతకంలో ప్రాణగండం ఉంది’, ‘ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో చావు తప్ప నాకు వేరే దారి లేదు’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. -
క్వాలిటీ ఫిల్మ్లా అనిపిస్తోంది: మారుతి
చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ సినిమా జూలై 21న రిలీజ్ కానున్న సందర్భంగా శుక్రవారం టీజర్ను రిలీజ్ చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘1980, 1990 బ్యాక్డ్రాప్లో ఆ నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే క్వాలిటీ ఫిల్మ్లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే మా చిత్రం భిన్నంగా ఉంటుంది’’ అన్నారు చెందు ముద్దు. -
పల్లెటూరి ప్రేమకథ
చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా యష్ రంగినేని మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో పీరియాడిక్ సినిమాగా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రి¯Œ ్స హెన్రీ, కెమెరా: పంకజ్ తొట్టాడ. -
తిరుపతిలో లావణ్య ఫోటో ఫ్రేమ్స్ షాపులో భారీగా మంటలు..!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement