-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు.. అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న భారత క్రికెటర్! (ఫొటోలు)
-
పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం. గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు. నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు. వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు. మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి. పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
ఇంటి వద్ద ఓటింగ్ నేటి నుంచే..
జైపూర్: రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 5) నుంచి ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటి వద్ద ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో 58,000 మందికి పైగా ఓటర్లు ఇంటి వద్ద ఓటింగ్ను ఎంచుకున్నారని, వీరిలో 35,542 మంది మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదు చేసుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ గుప్తా ఇటీవల తెలిపారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి ఓటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. రాజస్థాన్లో మొదటి దశ లోక్సభ ఎన్నికల కోసం నమోదైన 35,542 మంది ఓటర్లలో 26,371 మంది సీనియర్ సిటిజన్లు ఉండగా 9,171 మంది దివ్యాంగులు ఉన్నారు. "ఇప్పటి వరకు, 58,000 మంది అర్హతగల ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 43,638 మంది సీనియర్ సిటిజన్లు, 14,385 మంది దివ్యాంగులు ఉన్నారు" అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రాజస్థాన్లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీలలో పోలింగ్ జరుగుతుంది. -
హోమ్ ఓటింగ్.. పోలింగ్ స్టేషన్..
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కుపైన, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్స్టేషన్కు వచ్చిగానీ, ఇంటివద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్కు సన్నద్ధత, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై సోమవారం సచివాలయం నుంచి మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా రిటర్నింగ్ ఆఫీసరుకు ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకసారి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతారన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేవారి కోసం వీడియో గ్రాఫర్తో, అయిదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవో ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు. -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్లో ఓ లగ్జరీ హౌస్ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
ఆ గ్రామం.. హోలీకి దూరం!
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? బీహార్లోని ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు. -
స్మృతి ఇరానీ ఇంట శుభకార్యం.. 20 వేల అతిథులు!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ పరిధిలో గల మెదన్ మావాయి గ్రామంలో కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. నేటి (గురువారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీ స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు నూతన గృహంలో పూజలు నిర్వహించనున్నారు. సొంత ఇంటి గృహప్రవేశం సందర్భంగా స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని 20 వేల మందికి గురువారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఎంపీ స్మృతి ఇరానీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, మంత్రి ధరంపాల్ సైనీ, స్వతంత్ర దేవ్ సింగ్, అమేథీ ఇన్ఛార్జ్ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. స్మృతి ఇరానీ నూతన నివాసంలో సేవకులు, అతిథులకు పత్యేక గదులతో పాటు విలేకరుల సమావేశ గది కూడా ఉంది. ఎంపీ స్మృతి ఇరానీ నూతన గృహం సిద్ధమైన తరుణంలో గ్రామాభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. -
లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!
ఇంటీరియ్లో వుడెన్ వర్క్ గురించి తెలిసిందే. ఇప్పుడు ఆకులు కూడా కొత్త పాత్ర పోషిస్తున్నాయి. రాలిన ఆకులను కొన్ని రోజుల పాటు నానబెట్టి, వాటి పలచని పొరను కూడా ఉపయుక్తంగా మార్చి, ఇంటి అలంకరణకు ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. లీఫ్ ఆర్ట్గా పేరొందిన ఈ కళ ఇంటికి కొత్త శోభనిస్తోంది. బర్డ్స్గా, ఫెదర్స్గా, బెడ్ ల్యాంప్స్గా, ఎంబ్రాయిడరీ వర్క్తోనూ ఆకులుకొత్త సింగారాన్ని నింపుకుంటున్నాయి. స్కెలిటన్ లీవ్స్ తయారీకి.. 1. ఒక గిన్నెలో పది ఆకులను తీసుకొని, అందులో కప్పు సోడా వాటర్ పోయాలి. ఆకులు మునిగేలా నీళ్లు పోసి, సన్నని మంట మీద నీళ్లను మరిగించాలి. ఆకులు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. 2. ఆకులను బయటకు తీసి, చల్లని నీళ్లలో వేయాలి. 3. ఒక్కో ఆకు తీసుకొని, తడి ఆరాక టూత్ బ్రష్తో మెల్లగా రబ్ చేస్తూ, పై పొట్టును తీసేయాలి. 4. పొట్టు తీసేసిన ఆకులన్నిటినీ బ్లీచ్ నీళ్లలో వేసి రెండు గంటలు ఉంచాలి. 5. తర్వాత నీళ్లు పోయేలా ప్రతి ఆకును టిష్యూ పేపర్తో అద్ది, పక్కనుంచాలి. దీని వల్ల ఆకు పైపొర పూర్తిగా పోయి, స్కెలిటన్ భాగం తయారవుతుంది. 6. ఈ ఆకులను ఎండబెట్టి, అలంకరణకు తగినట్టుగా తయారుచేసుకోవచ్చు. -
కొద్ది స్పేస్లోనే హ్యాపీగా చేసుకునే 'హోమ్ జిమ్ మెషిన్'!
‘తిండి కలిగితే కండగలదోయ్’ వాక్యానికే పరిమితం కాలేదు ఈ నలుగురు మిత్రులు. ‘కండకు జిమ్ కూడా కావాలోయి’ అంటున్నారు. ‘రోజూ జిమ్కు వెళ్లడానికి తిరిగి అక్కడి నుంచి రావడానికి బోలెడు సమయం తీసుకుంటుంది. అలా అని ఇంట్లోనే జిమ్ సెట్ చేసుకుందామా అంటే స్పేస్ ప్రాబ్లం’ అనుకునేవాళ్లకు ‘అరోలీప్ ఎక్స్’ రూపంలో పరిష్కారం చూపారు దిల్లీ, ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అమన్రాయ్, అనురాగ్ డానీ, రోహిత్ పటేల్, అమల్జార్జ్. చిన్న స్థలాలలోనే ఏర్పాటు చేసుకునే స్మార్ట్ హోమ్ జిమ్ను తయారుచేసి, ఈ టెక్నాలజీపై పేటెంట్ పొందారు. ‘అరోలీప్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలు పెట్టి విజయం సాధించారు. అంతర్జాతీయ విపణిలోకి అడుగు పెట్టనున్నారు... కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్(ఐఐటీ, దిల్లీ) అయిన అమన్ రాయ్ అల్ట్రా మారథాన్లు నిర్వహించడంలో దిట్ట. అయితే కెరీర్ ప్రారంభించిన తరువాత ఉద్యోగ బాధ్యతలు, జిమ్కు వెళ్లడం మధ్య సమన్వయం కుదరడానికి కష్టపడాల్సి వచ్చేది. బెంగుళూరులోని అద్దె ఇంట్లో స్థల సమస్య వల్ల ఎక్సర్సైజ్కు సంబంధించి లిమిటెడ్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉండేది. ఇక అనురాగ్ డానీకి ఆఫీసు పనిభారం వల్ల జిమ్కు వెళ్లడం అనేది కుదిరేది కాదు. రోబోటిక్ గ్రాడ్యుయెట్స్ అయిన రోహిత్ పటేల్, అమల్ జార్జ్ల పరిస్థితి కూడా అంతే. రకరకాల సమస్యలకు పరిష్కారాలు వెదకడానికి రకరకాల ప్రయోగాలు చేసేవారు. ఛత్తీస్గఢ్లోని భిలాయ్ ప్రాంతానికి చెందిన అమన్, అనురాగ్, రోహిత్, అమల్లు జిమ్కు వెళ్లడానికి తాము ఎదుర్కొంటున్న సమస్యపై దృష్టి పెట్టారు. హోమ్ జిమ్ ఎక్విప్మెంట్లు పెద్దవిగా ఉంటాయి. ఖరీదైనవి. తగినంత స్థలం కావాలి. ‘ఇంట్లో వ్యాయామాలు చేయడానికి వేర్వేరు బరువులు ఉన్న ఎక్విప్మెంట్ కొనుగోలు చేస్తూ ఉండాలి. ఇవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. అద్దె ఇండ్లలో, చిన్న అపార్ట్మెంట్లలో ఇది కష్టం. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకున్నాం’ అంటారు నలుగురు మిత్రులు. కొత్తగా డిజిటల్–వెయిట్స్ టెక్నాలజీ ఊపందుకుంటున్న టైమ్ అది. ఫిజికల్ వెయిట్స్ను రిప్లేస్ చేసే డిజిటల్ టెక్నాలజీ కోసం ప్రయోగాలు ప్రారంభించారు. రకరకాల ప్రోటోటైప్లు బిల్డ్ చేయడం కోసం పాతిక లక్షల వరకు వెచ్చించారు. మూడు సంవత్సరాలు కష్టపడి ఈ నలుగురు మిత్రులు లిమిటెడ్ స్పేస్లో ఉపయోగించుకోగలిగే రూపొందించారు. పదిహేను ప్రోటోటైప్ల తరువాత వారి కృషి ఫలించింది, ఈ స్మార్ట్, వాల్–మౌంటెడ్ జిమ్ ఎక్విప్మెంట్ ‘అరోలీప్ ఎక్స్’లో వందగంటల ఫిట్నెస్ కంటెంట్ ఉంటుంది. మూమెంట్స్ను ట్రాక్ చేస్తుంది. సంబంధిత డాటాను మ్యాపింగ్ చేస్తుంది. డాటా–డ్రైవెన్ వర్కవుట్స్ కోసం ఈ స్మార్ట్ ఎక్సర్సైజ్ మెషిన్ మోటర్–పవర్డ్ ఎలక్ట్రోమాగ్నటిక్ రెసిస్టెన్స్ను ఉపయోగిస్తుంది. జిమ్లో చేసే ప్రతి వర్కవుట్కు ఈ మెషిన్ను ఉపయోగించవచ్చు. ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ డిజైన్ చేసిన గోల్–బేస్డ్ వర్కవుట్ ప్రోగ్రామ్స్ను ఈ మెషిన్ అందిస్తుంది. ‘అరోలీప్ ఫిట్నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కంపెనీ మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ను ఆహ్వానించి ట్రయల్స్ మొదలుపెట్టారు. తమ ప్రాడక్ట్ తాలూకు వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియోలకు మంచి స్పందన లభించడంతో వ్యాయామ ప్రేమికులను దృష్టిలో పెట్టుకొని మంత్లీ సబ్స్క్రిప్షన్లు మొదలుపెట్టారు. కొన్ని నెలల తరువాత ఫస్ట్ కస్టమర్స్ తమ ఫీడ్బ్యాక్ను కంపెనీ ఫౌండర్లకు ఇచ్చారు. తమ ప్రాడక్ట్లో మార్పులు, చేర్పులు చేయడానికి, మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఫీడ్బ్యాక్ వారికి ఉపయోగపడింది.ప్రాడక్ట్కు పాజిటివ్ టాక్ రావడం మాట ఎలా ఉన్నా ఇన్వెస్టర్లు దొరకడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ ‘జెరోదా’ సీయివో నిఖిల్ కామత్కు మెసేజ్ పెట్టాడు. వీరు ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చి ప్రోటోటైప్లను పరిశీలించి ఇంప్రెస్ అయ్యాడు నిఖిల్ కామత్. ఫస్ట్ ఏంజెల్ ఇన్వెస్టర్ అయ్యాడు. ఆ తరువాత మరో ముగ్గురు ఇన్వెస్టర్లు వచ్చారు. మాన్యుఫాక్చరింగ్ కోసం బెంగుళూలో చిన్న స్థలం ఏర్పాటు చేసుకొని ‘అరోలీప్ ఎక్స్’లను అమ్మడం మొదలుపెట్టారు. దేశీయంగా విజయం సాధించిన ‘అరోలీప్ ఎక్స్’ ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనుంది. ‘ఫిట్నెస్ సింపుల్ అండ్ యాక్సెసబుల్ అనేది మా నినాదం. లక్ష్యం’ అంటున్నారు నలుగురు మిత్రులు. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
తేనెని నేరుగా వేడిచేస్తున్నారా?
మనం నిత్యం కొన్ని పదార్థాలను నిల్వ చేసేటప్పుడు పలు సమస్యలు ఎదుర్కొంటాం. ఒకవేళ పాడైతే ఎండలో పెట్టడమో లేక ఓ సారి మంటపై వేడిచేయడమో చేస్తాం. కానీ అలా అన్ని వేళలా అన్ని రకాల పదార్థాలకు పనికిరాదు. ఏవీ వేడి చేస్తే మంచిది? వేటిని నేరుగా వేడి చేయకూడదు వంటి ఆసక్తికర ఇంటి చిట్కాలు తెలుసుకుందామా! తేనె కొంతకాలం వాడకుండా ఉంచేస్తే సీసా అడుగున గడ్డకట్టుకుపోతుంటుంది. అలాంటప్పుడు తేనెను కరిగించడానికి ఓ అరగంట పాటు తేనె సీసాను ఎండలో ఉంచాలి. తేనెను ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు. ఎండ లేకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి అందులో తేనె సీసాను ఉంచాలి. నీటి వేడితో ఐదు – పది నిమిషాల్లో తేనె కరుగుతుంది. ఒకవేళ తేనెను నేరుగా వేడిచేస్తే పోషక విలువలు పోయి పాయిజన్గా మారిపోతుందట. పైగా నేరుగా వేడి చేయడం వల్ల జిగురు వంటి పదార్థంలా మారిపోతుంది. దాన్ని గనుక ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని, అమా అనే టాక్సిన్గా మారుతుంది. దీంతో మనకు కడుపు నొప్పి రావడం, శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగుటం వంటి దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పాల ప్యాకెట్లు ఫ్రిజ్లో పెట్టుకునేటప్పుడు ఆ ప్యాకెట్లను నేరుగా పెట్టకూడదు. ప్యాకెట్ మన వాకిటి ముందుకు వచ్చే లోపు రకరకాల ప్రదేశాలను తాకి ఉంటుంది. కాబట్టి ప్యాకెట్ని నీటితో కడిగి ఫ్రిజ్లో పెట్టడం మంచిది. వెల్లుల్లి రేకలు పొట్టు సులువుగా వదలాలంటే... వెల్లుల్లి రేకను కటింగ్ బోర్డు మీద పెట్టి చాకు వెనుక వైపు (మందంగా ఉండే వైపు, ఈ స్థితిలో చాకు పదును ఉన్న వైపు పైకి ఉంటుంది) తిప్పి వెల్లుల్లి రేక చివర గట్టిగా నొక్కితే వెల్లుల్లి రేక తేలిగ్గా విడివడుతుంది. పైనాపిల్ను కట్ చేయడానికి పెద్ద చాకులను (షెఫ్స్ నైఫ్) వాడాలి. ముందుగా కాయ పై భాగాన్ని, కింది భాగాన్ని తొలగించాలి. ఇప్పుడు కాయను నిలువుగా పెట్టి చెక్కును పైనుంచి కిందకు తొలగించాలి. ఆ తర్వాత మీడియం సైజ్ చాకుతో కాయను చక్రాలుగా తరగాలి. బటర్ను వంట మొదలు పెట్టడానికి ఓ అరగంట లేదా గంట ముందు ఫ్రిజ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒకవేళ మర్చిపోతే వేడి పాలగిన్నె మూత మీద లేదా ఉడుకుతున్న వంట పాత్ర మూత మీద పెడితే పది నిమిషాల్లో మెత్తబడుతుంది. అలా కుదరకపోతే స్టవ్ మీద బర్నర్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. ఐస్క్రీమ్ సర్వింగ్ స్పూన్లు ఇంట్లో ఉండవు. పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు దానిని పలుచగా కట్ చేయాలంటే చాకును మరుగుతున్న వేడి నీటిలో ముంచి తీయాలి. ఒక స్లయిస్ కట్ చేయగానే చాకు చల్లబడిపోతుంది. కాబట్టి ప్రతి స్లయిస్కూ ఓ సారి వేడి నీటిలో ముంచాలి. (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
ట్రక్కునే మొబైల్ హౌస్గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు!
..అవును, ఇళ్లు కదులుతాయి. ఉద్యోగ విరమణ చేశాక హాయిగా పొలం దున్నుతూ వ్యవసాయం చేయాలనో... ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చిన్న ఫాంహౌస్ నిర్మించుకోవాలనో... ప్రతిచోటా ఆఫీస్ పెట్టడం కుదరడం లేదనో...ఎక్కడికంటే అక్కడికి ఆఫీస్ను తరలించే సదుపాయం ఉంటే బాగుండనో అనుకుంటారు. ఇలా ఆలోచించే వారి కోసమే ఈ కంటైనర్ హోమ్లు. కొన్నిరోజులు లేదా నెలలు ఒకే ప్రదేశంలో ఉండి తర్వాత ఉంటున్న ఇంటిని వేరే చోటుకు మార్చాలనుకునేవారికి కంటైనర్హోమ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెద్దగా నిర్మాణ వ్యయం లేకపోవడంతో 200 నుంచి 500 చదరపు అడుగుల్లోనే వీటిని నిర్మించుకునే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఎండా, వానల నుంచి రక్షణనివ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా వీటిని తయారుచేస్తున్నారు. దాంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు రెండురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఫాంహౌస్లు, కాఫీషాపులు, టీస్టాళ్లు.. ఇలా ఎక్కడ చూసినా ఇవి తారసపడుతున్నాయి. ఓ చోట పని ముగియగానే అక్కడి నుంచి వీటిని తరలించే వెసులుబాటు ఉండటం వీటిలో ప్రత్యేకం. ఖర్చు కూడా చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండటంతో చిన్నపాటి గూడును నిర్మించుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. తయారీ ఇలా.. కంటైనర్ హోమ్ అనగానే ప్రధానంగా ఇవి ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయి. ఎండా, వానల నుంచి రక్షణ ఉంటుందా. పైకప్పు, ఫ్లోర్ తుప్పుపడతాయేమో..విద్యుదాఘాతం జరిగితే.. ఇలా అందరి మదిలో మెదిలే ప్రశ్నలు ప్రధానంగా ఉంటాయి. వీటికి స్పష్టమైన సమాధానాలున్నాయని తయారీదారులు హామీ ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని, అయితే నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరని తయారీదారులు సూచిస్తున్నారు. సౌకర్యాలు ఇలా.. గాల్వనైజింగ్ స్టీల్, ఎండీఎఫ్ బోర్డులను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. గ్రిడ్ వేస్తూ బైసన్ బోర్డుతో మూడు లేయర్లుగా ఫ్లోర్ను తీర్చిదిద్దుతున్నారు. నచ్చినవారు టైల్స్ వేసుకోవచ్చు. ఫ్లోర్ అంతా వాటర్ఫ్రూఫ్ మెటీరియల్ వేయడంతో నీటి వల్ల పాడైపోతుందనే సమస్య లేదు. అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులు సూచిస్తున్నారు. టీవీ యూనిట్, ఏసీ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, స్విచ్బోర్డులు, ఎల్ఈడీ బల్బులు అన్నింటినీ తయారీదారులే ఇవ్వడంతో కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం కలిగినట్టే. విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కోసం పకడ్బందీగా పవర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. షార్ట్సర్క్యూట్కి అవకాశం లేకుండా పైపులను అమర్చుతూ అందులోంచి వైర్లను పవర్ యూనిట్కు అనుసంధానిస్తున్నారు. పైన 50 ఎంఎం ఇన్సులేషన్ చేయడంతో షార్ట్సర్క్యూట్కి అవకాశం ఉండదు. నీటి ట్యాంక్ కోసం ప్రత్యేకమైన స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు. 1000 నుంచి 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటైనర్ హోమ్లకు సుమారు రూ.2.5లక్షలు, వీటికి అదనంగా వాష్రూమ్, కిచెన్ అమర్చితే సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంకా అదనపు హంగులు జోడిస్తే అనుగుణంగా ధరలున్నాయని చెబుతున్నారు. పై అంతస్తులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మరికొంత మంది చెబుతున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా.. ఖర్చు తక్కువ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవడం లేదు. అదే కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్లో డబుల్ బెడ్ రూమ్ ఇంటినే సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. పైగా హాల్, కిచెన్, బెడ్రూమ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చే కంటైనర్ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రియల్టీ వర్గాలు అంటున్నాయి. -
ఓట్ ఫ్రమ్ హోం
సాక్షి, నరసరావుపేట: చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు.. ఆటోలో ఓ ముసలవ్వ.. ఇలా అనేక మంది ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు పడే తిప్పలు గతంలో కనిపించేవి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారి కష్టాలకు చెక్ పెట్టింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40%కి మించి వైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సీఈసీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే.. ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే ‘ఓట్ ఫ్రమ్ హోం’కు అవకాశం కల్పిస్తాయి. బూత్ లెవల్ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి.. వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. పోలింగ్ బూత్ తరహా ఏర్పాట్లు ఇంటి నుంచే ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు రాదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. ఇంటి నుంచి ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మందికి ఓటు హక్కు కల్పించారనే వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారమిస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. మంచి అవకాశం... 80 ఏళ్లు నిం.డిన మా లాంటి వారు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించి ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశముంది. – యెన్నం వెంకట నర్సిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. ఉప్పలపాడు, పల్నాడు జిల్లా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక కొంతమంది తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతమైంది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అర్హులైన వారు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్ శివశంకర్, పల్నాడు జిల్లా కలెక్టర్ -
కుకింగ్ టు కామెడీ క్వీన్స్..
ఒకరు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అయ్యారు.. మరొకరు హెల్త్ కోచ్ అయ్యారు ఇంకొకరు పాకశాస్త్ర ప్రావీణ్యతను చాటుతున్నారు. పై చదువులు చదివి ఇంట్లో కూర్చున్న మహిళలు ఇంటర్నెట్లో ప్రభావశీలురుగా మారారు. ఇంటినుంచే వ్యాపారాన్ని అభివృద్ధి వైపుగా పరుగులు తీయిస్తున్నారు. సాధారణంగా గృహిణి జీవితం ఉదయం 4–5 గంటలకు నిద్రలేచి, ఇల్లు–వాకిలి శుభ్రం చేసుకొని, పిల్లలను స్కూల్కు పంపించి, అందరికీ అవసరమైనవి చేసి పెడుతుండగానే సాయంత్రం అవుతుంది. తిరిగి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. సాయంత్రం టీ, టిఫిన్లు, పిల్లల హోంవర్క్లు, రాత్రి భోజనం సిద్ధం చేయడం. రాత్రి పది–పదకొండు గంటలలోపు అన్నీ శుభ్రం చేసి అలసిపోయి అదే చిరునవ్వుతో అందరికీ గుడ్నైట్ చెప్పి నిద్రపోవడం. ఇలా ఇల్లు, పెద్దలు, భర్త, పిల్లల గురించి ఆలోచిస్తూ తమని తాము విస్మరించుకునే మహిళలకు ఇప్పుడు ఇంటినుంచే పని చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. మంగళూరుకు చెందిన లిండా ఫెర్నాండేజ్ క్రెస్టా గృహిణి. నాలుగేళ్లుగా కామిక్ రీల్స్ చేస్తూ ప్రజాదరణ పొందింది. క్రెస్టాకు ఇన్స్టాగ్రామ్లో 2.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనేక బ్రాండ్లు ఆమెను సంప్రదిస్తూనే ఉన్నాయి. ఈ రోజు మంగళూరు వీధుల్లో ఆమె హోర్డింగులు కూడా పెట్టారంటే ఆమెకున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ‘గృహిణిగా ఉండటం ఎప్పుడూ కష్టమనిపించలేదు. కానీ, నా కొడుకుకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకున్నాను. దీంతో పాటు ఇంటి బాధ్యతనూ నిర్వర్తించాలనుకున్నాను. అందుకు మా కుటుంబమూ మద్దతు ఇస్తూ వచ్చింది’ అని చెబుతుంది క్రెస్టా. హోమ్ చెఫ్ నాజ్ అంజుమ్ హైదరాబాద్లో నివాసముంటున్న హోమ్ చెఫ్. ఏడేళ్ల క్రితం అంజుమ్ తన పేరుతో హోమ్ కిచెన్ను ప్రారంభించింది. ఈ రోజుల్లో గృహిణుల ఆలోచనే మారిపోయింది అనడానికి అంజుమ్ ఒక ఉదాహరణ. కాలంతో పాటు సమాజం ఆలోచనా విధానం కూడా మారింది. ఇంట్లో కూర్చున్నా నాకు సోషల్మీడియా చాలా ఆర్డర్లు తెచ్చిపెడుతోంది అని చెబుతుంది అంజుమ్. ‘నాకు ముగ్గురు పిల్లలు. ఉదయం 4 గంటలకు నిద్రలేచి, వారిని స్కూల్కి రెడీ చేసి, పంపించిన తర్వాత కిచెన్ బాధ్యత తీసుకుంటాను. 80 రూపాయలతో నా పని ప్రారంభించాను. మా చుట్టూ ఉన్నవారు నా వంటలు తిని మెచ్చుకునేవారు. మా అపార్ట్మెంట్ వాసులు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయమని సలహా ఇచ్చారు. అలా చేసిన వంటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. ఆర్డర్లు వరుసగా రావడం ప్రారంభించాయి. ఈ రోజు సోషల్మీడియాలో హైదరాబాద్ ఫుడ్ సూపర్ హిట్గా పేరొందింది. దీంతో ఒక గృహిణిగా ఉన్న నేను ఉద్యోగినిగా మారిపోయాను’’ అని ఆనందంగా చెబుతుంది అంజుమ్. గృహిణి నుంచి ఒక మహిళ గృహ నిర్వాహకురాలిగా మారింది. ఈ ౖహె టెక్ ప్రపంచంలో గృహిణి తనకంటూ కొత్త బిరుదును సంపాదించుకుంటుంది. ఇప్పుడు తనను తాను పని చేసే గృహిణి అని పిలవడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదిస్తూ, బాధ్యతలను నెరవేర్చడంలో తనదైన ప్రత్యేక శైలిని కలిగి ఉంది. మారుతున్న కాలంలో ఈ తరహా ఆలోచన గృహిణితో పాటు ఇంట్లో అందరికీ నచ్చుతోంది. చేతి కళకు ఆదరణ నేటి యాంత్రిక యుగంలో చేతితో తయారు చేసిన వస్తువులు దొరకడం కష్టం. నాణ్యమైన సంప్రదాయ పనితనం కోసం అన్ని వైపుల నుండి డిమాండ్ వస్తోంది. ప్రావీణ్యం కలిగిన మహిళలు తమ నైపుణ్యాలను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో చాలా మంది గృహిణులు తమ జ్ఞానం ఆధారంగా హోమ్ ట్యూషన్, బ్యూటీపార్లర్ వంటి సేవలను కూడా అందిస్తున్నారు. జర్నల్ ఆఫ్ కల్చరల్ ఎకానమీలో ప్రచురించిన ఒక అధ్యయనం సోషల్ మీడియాలో లైక్లు, షేర్లు గృహిణిని ‘అందం’ గా మార్చేశాయి అని నిర్వచించింది. సంప్రదాయ గృహిణులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లతో ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా కూడా మారారు. ఈ చిన్న ఆరంభం మహిళను ఉద్యోగ గృహిణిని చేసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2020–21లో దేశంలో కేవలం 32 శాతం వివాహిత మహిళలు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. వివాహిత మహిళల్లో 68 శాతం మంది గృహిణులుగా ఉన్నారు. మారిన కాలంలో ఇప్పుడు గృహిణిగా ఇంట్లో ఉంటూనే ఆర్థిక స్వావలంబన సాధిస్తోంది. ఇది ‘ఆమె’ నైపుణ్యాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంలో చాలా మహిళలు నైపుణ్యం ఉన్నవారే. కొందరు కుట్లు–ఎంబ్రాయిడరీ చేయడంలో, కొందరు వంటలలో, మరికొందరు పెయింటింగ్లో నిష్ణాతులు. పనిచేసే గృహిణికి ఆమె ప్రతిభే ఆదాయ వనరుగా మారుతోంది. గృహిణి నిర్వచనంలోనే మార్పు.. కరోనా లాక్డౌన్ కారణంగా సోషల్ మీడియా గృహిణులకు డబ్బు సంపాదించే శక్తిని ఇచ్చింది. ఇప్పుడు అదే రోజువారీ దినచర్యగా మారిపోయింది. యుఎస్ జనరల్ సోషల్ సర్వే 1972 నుండి 2020 వరకు ఒక సర్వే నిర్వహించింది. ఇందులో శ్రామిక మహిళలు, పని చేసే గృహిణులు ఎంతో సంతోషంగా ఉన్నారని భావించారు. వీళ్లలో ఎక్కువ మంది మధ్య, ఉన్నత తరగతికి చెందిన 40 ఏళ్ల పైబడిన వారు. ఉద్యోగరీత్యా గృహిణిగా ఉన్నా ఇంటి నిర్వహణ, సంపాదనతో పాటు భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నామనే విషయాలను ఈ సర్వే వెల్లడి చేసింది. -
CM Jagan: పేద అక్కచెల్లెమ్మలకు అండగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆరి్థక సాయం చేయడంతోపాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని గురువారం రీయింబర్స్మెంట్ చేయనున్నారు. పేదలకు పావలా వడ్డీ.. ఆపై భారం భరిస్తున్న ప్రభుత్వం సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అందించనుంది. -
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
ఈ రోబో ఇంటి పనులన్నీ సులభంగా చేసేస్తుంది!
ఇంటి పనులన్నీ చేసే రోబోలను సినిమాల్లోనూ లేదా కార్టూన్ షోల్లోనే చూశాం. నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకోసం ఇప్పటికే పరిశోధనలు చేయడమే గాక పలు రూపాల్లో రోబోలను తీసుకొచ్చారుగానీ. ఎలా రోబోలతో పనిచేయించుకోవాలనేది కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఏం చేయాలన్నిది రోబోకి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోబోకు సాధారణ ఇంటి పనులను ఎలా నిర్వహించాలో సులభంగా నేర్చుకుని చేసేస్తుంది. ఈ మేరకు రోబోని ట్రైయిన్ చేసేలా డాబ్ ఈ అనే కొత్త ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉంటే పనులను పరిగణలోకి తసుకుని ఓ డేటాని రూపొందించారు న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. ఈ డాబ్ ఈకి మనం సాధారణంగా వినయోగించే రీచర్ గ్రాబర్ స్టిక్కి జోడించిన ఐఫోన్ను ఉపయోగిస్తే చాలు. రోబో ఈజీగా అన్ని పనులను నేర్చుకుంటుంది. ఈ ఐఫోన్ దేనికంటే మనమిచ్చిన ఇన్స్ట్రక్షన్లను డాబ్ ఈ డేటా రోబోకి ఎలా చేయాలో రికార్డు చేసిన వీడియోల ద్వారా తెలుపుతుంది. దీంతో రోబో ఆటోమేటిగ్గా సులభంగా ఆ పనిని చేసేస్తుంది . ఈ సరికొత్త సాంకేతికతో కూడిన రోబో వర్కింగ్ గురించి న్యూయార్క్లోని దాదాపు 22 ఇళ్లల్లో టెస్ట్ చేయగా చక్కటి ఫలితం వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ డాబ్ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా మరింత ఎక్కువగా ఉంటే కొత్త ఇంటిని చూడగానే ఆ రోబోని ట్రైయిన్ చేయాల్సిన పని కూడా ఉండదనేది పరిశోధకులు ఆలోచన. ప్రతి ఇంట్లో ఉండే పనులన్నీ రోబోలకు ఇప్పటికే తెలుసు, నేర్చుకున్నాయి కూడా అన్నారు. ఇక్కడ రోబో స్టిక్సిస్టమ్లను వినియోగిస్తుంది. వీటినన్నంటిని కలిపి డాబ్-ఇ అని పిలుస్తారు. ఈ రోబో ఇల్లు తుడవడం దగ్గర నుంచి లాండ్రీ వరకు అన్నింటిని చేసేస్తుంది. (చదవండి: భారత రెస్టారెంట్కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్గా అరోరా) -
ఇంపుసొంపుల ఇత్తడి
ఇత్తడి .. పుత్తడి ఒక్కటేనా అంటారు. కాని ఇంటి అలంకరణ విషయంలో మాత్రం ఇత్తడి.. పుత్తడి కన్నా మిన్న.. నాడు.. నేడూనూ! ఆ కళావైభవం ఎట్టిదనిన.. పూజా సామాగ్రే కాదు ఇప్పుడు సెంటర్ కన్సోల్ టేబుల్స్, సోఫా సెట్స్, కార్నర్ స్పేస్లలోనూ ఇత్తడి అందాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఇంటీరియర్ పట్ల అత్యంత శ్రద్ధ కనబరచేవాళ్లు ఖరీదు గురించి పట్టించుకోకుండా ఇంటికి ఇత్తడి తెచ్చే కళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆధునిక డిజైన్స్ ఇంటీరియర్లో మోడర్న్ మెరుపు కావాలనుకుంటున్న వారు బ్రాస్ వెస్ట్రన్ డిజైన్స్ పట్లే మక్కువ చూపుతున్నారు. ల్యాంప్స్, వాల్ డెకర్ సెట్స్ మాత్రమే కాదు పార్టిషన్ వాల్స్, రూమ్ డివైడర్స్కీ బ్రాస్మెటల్ డిజైన్స్నే ఎంచుకుంటున్నారు. అంతేకాదు ఇత్తడిని ఇతర లోహాలైన రాగి, వెండి, అల్యూమినియం వంటివాటితో జతచేసి ఇంటి అలంకరణకు అదనపు సోయగాన్ని అద్దుతున్నారు. ఇలా డోర్ నాబ్స్ నుంచి వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్, రూఫ్ డెకర్ వరకు ఇంచ్ ఇంచ్కు ఇత్తడి ఇచ్చే సొంపు ఎంత చెప్పినా తక్కువే! మరింకెందుకు ఆలస్యం.. ఇంట్లో పాత ఇత్తడి సామానును అటక మీద నుంచి కిందకు దించండి.. ఇంటీరియర్లో భాగం చేయండి!! -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్తోపాటు బయటకు కనిపించే వాటికిసైతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయిస్తుంటారు. వంటగది ఎక్కడ రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్ ఎలా ఉంటే బావుంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలో స్థలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆధునిక భవన డిజైన్లలో కీలకం. అయితే చాలా మంది జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా భవనాల డిజైన్లో ఈ అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన ఇంటి విస్తీర్ణంతో దాని ధర కూడా పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల స్థలాన్ని లివింగ్ రూంకు వదిలిపెడుతుంటారు. అందుకు బదులుగా కొంత అదనంగా మరో 100 చదరపు అడుగుల స్థలాన్ని కలిపి భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరాల్లో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ‘ఎఫెక్టివ్ మల్టిపుల్’ అధికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటున కొన్ని సర్వేల ప్రకారం వంటగది, హాల్, కిచెన్.. వంటి గదుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తే ఎఫెక్టివ్ మల్టిపుల్ బావుంటుంది. ఎఫెక్టివ్ మల్టిపుల్ విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్ రూం విస్తీర్ణం పెంచుకోవాలి. ఇంటిని సమర్థంగా వాడుకోవానుకున్నా, విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్ వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో కొంతమేర కరెంట్ బిల్లు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. -
క్యారట్లు వాడిపోకుండా తాజాగా ఉండాలంటే..ఇలా చేయండి!
కొన్న రకాల కాయగూరలు నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. ఫ్రిజ్లో ఉన్నా కూడా పాడైపోతుంటాయి. అలాగే పాల గిన్నెలు లేదా డబ్బాలు ఓ పట్టాన వాసన పోవు అలాంటప్పుడు సింపుల్గా ఉంటే చిట్కా ఏదైనా ఉంటే బావుండననిపిస్తుంది. అలాంటి వారికి కోసం ఈ హోం రెమిడ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి. క్యారట్స్ ఎండిపోయినట్లు, వాడిపోయినట్లుగా ఉంటే ఒక గిన్నెలో వేసి, క్యారట్స్ మునిగేలా నీళ్లు పోయాలి. ఈ గిన్నెమీద మూతపెట్టి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. పన్నెండు గంటల తరువాత నీటిలో నుంచి క్యారట్స్ తీసి చూస్తే తాజాగా ఉంటాయి. ఇప్పుడు తొక్క తీసి చక్కగా వాడుకోవచ్చు. క్యారట్ మీద నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడు కూడా ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఎంత కడిగినా పాల బాటిల్స్ వాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు పాల బాటిల్లో టేబుల్ స్పూను వంటసోడా, కొన్ని నీళ్లు పోసి రాత్రంతా ఉంచాలి. ఉదయం బాటిల్ను షేక్ చేసి కడిగితే పాల వాసన పోతుంది. ఇదే విధంగా పాల బాటిల్లో కొద్దిగా వెనిగర్ వేసి షేక్ చేసి పక్కన పెట్టాలి. ఆరు గంటల తరువాత వేడి నీటితో కడగాలి. పాల వాసన పోతుంది. 200 ఎమ్ఎల్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలపాలి. ఈ నీటిని కుండీల్లోని మొక్కల మట్టిపైన, ఆకులపైన చల్లాలి. ఈ నీరు కీటక నివారిణిగా పనిచేయడమేగాక, మొక్కలకు పునరుజ్జీవాన్ని ఇస్తుంది. (చదవండి: ఐస్వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!) -
పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..
నవ్వుతోనే ముఖం ఆకట్టుకుంటుంది. తెల్లని పలువరుస ఆ నవ్వును ప్రభావితం చేస్తుంది. కానీ పళ్లపై పసుపు గారలు.. నోటి దుర్వాసన వల్ల నవ్వు సంగతి అటుంచి అసలు నోరు తెరవడానికే భయపడుతుంటారు ఆ సమస్యలున్న వాళ్లు. అలాంటి వాళ్లు ఈ హోం రెమిడ్సి పాటిస్తే చాలా ఈజీగా ఆ సమస్యకు చెక్ పెట్టొయొచ్చు. అవేంటంటే.. వీటికి ఓ చిన్న చిట్కాతో చెక్ పెట్టొచ్చు. రసం తీసిన నిమ్మతొక్కతో పళ్ళను రుద్దుకుంటే క్రమంగా పసుపు మరకలు పోవడమే కాదు.. నోటి దుర్వాసనా తగ్గుతుంది. అయితే నిమిషం కంటే ఎక్కువసేపు రుద్దకూడదు. ఎక్కువ రుద్దితే పళ్ళు బలహీనమవుతాయి. ఏదైనా అతి మంచిది కాదుకదా! సో.. తులసి ఆకులు- ఎండిన నారింజ తొక్కలు: ముందుగా 7 తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఎండిన నారింజ తొక్కను కొద్ది మొత్తంలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే త్వరితగతిన దంతాలు తెల్లగా మారతాయి. బేకింగ్సోడా నీరు: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బేకింగ్సోడాల నీరు పోసి పేస్ట్లా చేసి దీన్ని పళ్లకు అప్లై చేసి రుద్దిన పసుపు మచ్చలు పోతాయి. అలాగే ఉప్పు నిమ్మరసం కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. ఈ చక్కటి ఇంటి చిట్కాలను పాటించి స్థైర్యంగా నవ్వండి. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
క్యాండిల్ సిస్టర్స్: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!
వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. కానీ, అహ్మదాబాద్ వాసులైన ప్రియాంషి, యశ్వి అక్కాచెల్లెళ్లు ఐదేళ్ల క్రితం తల్లి ఇచ్చిన పాకెట్మనీ 2,500 రూపాయలతో జార్ క్యాండిల్స్ తయారీని ప్రారంభించారు. నేడు ఏడాదికి 25 లక్షల టర్నోవర్ని సాధిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటూనే జాయిస్ బీమ్ క్యాండిల్ వ్యవస్థాపకులుగా, వ్యాపారవేత్తలుగా మారిన ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘మా జీవితాల్లో మేమే వెలుగులను నింపుకుంటున్నాం’ అని తమ వెంచర్ గురించి ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచుతున్నారు. అక్కా చెల్లెళ్లలో ముందుగా యశ్వి మాట్లాడుతూ – ‘అహ్మదాబాద్లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివాను. కోర్సులో పారిశ్రామిక శిక్షణా యూనిట్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. ఇందులో మెలకువలు నేర్చుకున్నాను. ఏడాది పొడవునా సీజన్కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే వాళ్లం. వీటి ద్వారా మొదట్లో నెలకు వెయ్యి రూపాయలే వచ్చేది. ఆ తర్వాత ఈ పనే ప్రధానంగా చేసుకున్నాం. దీపావళి సమయంలో కొవ్వొత్తులతో పాటు సోప్ సొల్యూషన్స్, లిప్ బామ్లు అమ్మేవాళ్లం. చాలా సార్లు పెద్ద కంపెనీలకు, ఇంటింటికీ వెళ్లి ఉత్పత్తులను డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేదానిని. ఈ సమయంలో మా స్వంత కలను గుర్తించాం. కాలేజీ సమయంలో మూడేళ్ల పాటు చేసిన ఈ ప్రయత్నానికి మా అక్క ఆలోచనలు కూడా తోడయ్యాయి. అమ్మ కూడా మాకు సపోర్ట్గా నిలిచింది. ఐదుగురితో క్యాండిల్స్ తయారీ ప్రారంభించి, 50 కొవ్వొత్తులను మాత్రమే తయారు చేశాం. వాటిని ఒక ఫెయిర్లో ప్రదర్శించాను. అన్ని ఖర్చులు తీసివేస్తే 700 రూపాయల లాభం వచ్చింది. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మా నాన్నకు నచ్చలేదు. ఇరవై ఏళ్లు దాటుతూనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడమే ప్రధానంగా భావించేవారు. ఆడపిల్లలు సొంతంగా ఆలోచించడానికి వీలు లేని చోటు. దీంతో నాన్న మమ్మల్ని ఆదుకోలేదు. కానీ, ఈ రోజు మమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. మొదట్లో మా బంధువుల్లో ఫలానా వాళ్ల కూతుళ్లు ఇంట్లో టైమ్ పాస్ చేస్తున్నారు అనుకునేవారు. కానీ, ఈ రోజు మా ఎదుగుదల చూసి బంధువులకు కూడా మా బలం ఏంటో అర్థమైంది. ఆంక్షలు ఉన్నప్పటికీ సాధించాలన్న మా తపనకు అవేవీ అడ్డంకి కాలేదు’ అని వివరిస్తుంది. నిశితంగా పరిశీలన ముడిపదార్థాలను కలపడం, మ్యాజికల్ ఫార్ములాను సెట్ చేయడం యశ్వి చూస్తుంటే, ఆన్లైన్–ఆఫ్లైన్ ప్రచారాల మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించే బాధ్యత అక్క ప్రియాంషి తీసుకుంది. తమ ఉత్పత్తుల గురించి ప్రియాంషి మాట్లాడుతూ – ‘మా చేతితో తయారుచేసిన జార్ కాండిల్స్ మాకో ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఆర్గానిక్, నాన్ టాక్సిక్ ముడి పదార్థాలను మాత్రమే ఈ తయారీలో ఉపయోగించడం వల్ల పర్యావరణ అనుకూలమైనవని మా అభిప్రాయం. ఇందుకు మేం గర్వపడుతున్నాం. తయారీ నుంచి ప్యాకేజ్, కస్టమర్లకు మా ఉత్పత్తులను చేర్చడం వరకు ప్రతి దశను నిశితంగా పర్యవేక్షిస్తాం. కచ్చితమైన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మా జాడీలను ఎనిమిదిసార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. దీని వల్ల కస్టమర్లకు నాణ్యమైన జార్ క్యాండీలను అందించగలుగుతున్నాం. కొవ్వొత్తులు కేవలం కాంతిని మాత్రమే అందించవు. మేం తయారు చేసే క్యాండిళ్లలోని కంటికి ఇంపైన రంగులు, హాయి గొలిపే పరిమళాలు మనసును ఆనందానికి లోను చేస్తాయి. ఈ పనిలో శ్రద్ధ చాలా కీలకం. నమ్మి చేస్తాం కనుక ఫలితం కూడా చూస్తున్నాం’ అని ఆనందంగా వివరిస్తుంది. ఒక చిన్న ఆలోచనను అమలులో పెట్టి, దానికి సృజనాత్మకతను జోడించి అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. (చదవండి: కేరళ నుంచి ట్రినిటీ కాలేజీకి) -
ఇంటి పంటగా కుంకుమ పువ్వు!
కశ్మీర్లోని చల్లని ప్రదేశాల్లోనే సహజంగా ఆరుబయట పొలాల్లో కుంకుమ పువ్వు పండుతుంది. అయితే, కృత్రిమ శీతల వాతావరణం సృష్టించిన గదుల్లో కూడా ఈ పంటను పండిస్తున్నారు. నీలిరంగులో ఉండే పూలకు మధ్యలో ఈ ఎరట్రి దారాల్లాంటి కేసరాలు ఉంటాయి. వాటిని సేకరించి జాగ్రత్తగా నీడన ఎండబెట్టి భద్రపరిచి వాడుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్యోగం చేస్తున్న కె. శైలజారెడ్డి తన ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వును ఇంటిపంటగా పండిస్తున్నారు. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గర్భవతులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంటారు. స్వీట్లు, ఖీర్, బిర్యానీ, ఫ్రూట్ సలాడ్లలో దీన్ని వాడుతుంటారు. శ్రీఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీనిధి అనే యువతి కుంకుమ పువ్వు సాగు చేస్తున్న వీడియోలు యూట్యూబ్లో చూసి స్పూర్తి పొందిన శైలజారెడ్డి తన ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు చేపట్టారు. ఇండియా మార్ట్ ద్వారా కుంకుమ పువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం అక్కడ రైతులకు, విత్తనాలను సేకరించి అమ్మే వారికి మధ్య వివాదం రావడంతో ప్రభుత్వ అనుమతితోనే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని శైలజారెడ్డి తెలిపారు. రూ. 4 లక్షల పెట్టుబడి శైలజారెడ్డి తన మూడు బెడ్రూమ్లతో కూడిన ఇంట్లోనే.. 12“12 అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక గదిలో ఇనుప ర్యాక్లలో ఫైబర్ టబ్లు, కృత్రిమ వెల్తురు సదుపాయాలను సమకూర్చి కుంకుమ పువ్వు పండిస్తున్నారు. విత్తనాలకు, ఈ ఏర్పాట్లకు రూ. 4 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. చల్లని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనువైనది. మనం గదిలో కృత్రిమ శీతల వాతావరణాన్ని కల్పించి నిశ్చింతగా సాగు చేయవచ్చని శైలజారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గదిలో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. గాలిలో తేమ శాతం 80% ఉండాలి. ఇందుకోసం గదిలో చిల్లింగ్ యంత్రాన్ని, హ్యుమిడిఫయర్ను ఏర్పాటు చేశారు. కృత్రిమ కాంతితో కూడిన తగుమాత్రపు వేడి కోసం గదిలో 20 వరకూ గ్రోలైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ లైట్లు వెలిగిస్తే సరిపోతుంది. పూత దశలో తప్ప ఇతర కాలాల్లో గది పగటి ఉష్ణోగ్రత 16–17 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్న శైలజారెడ్డి ఇటీవలే తొలి పంట తీశారు. ఇప్పటి వరకూ 1441 పువ్వులు పూస్తే అందులో నుంచి 10 గ్రాముల కుంకుమ పువ్వు కేసరాల దిగుబడి వచ్చింది. గ్రాము రూ. ఏడు వందల చొప్పున ఆరు గ్రాములను అమ్మారు. మిగిలిన కుంకుమ పువ్వును తనతోపాటు పనిచేసే వారికి కొంచెం కొంచెం బహూకరించాలని నిర్ణయించుకున్నట్లు శైలజారెడ్డి చెప్పారు. తాను గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుగోలు చేసిన కుంకుమపువ్వును ఇప్పుడు తాను పండించిన కుంకుమ పువ్వుతో పోల్చి పరిశీలించినప్పుడు, అది కల్తీది అని స్పష్టంగా అర్థమైందన్నారు. గ్రోలైట్ల వెలుగులో కుంకుమ పూల సాగు వాడకానికి సిద్ధమైన కుంకుమ పువ్వు ఎయిరోపోనిక్స్..? కుంకుమ పువ్వు విత్తన దుంపలను ట్రేలలో పోసిన మట్టి మిశ్రమం (మట్టి 50%, ఇసుక 40%, వర్మీ కంపోస్టు పది మట్టి%)లో నాటుకొని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు. అంటే.. విత్తన దుంపలను ట్రేలో పక్క పక్కనే పెడితే సరిపోతుంది. మట్టిలో గాని, నీటిలో గాని వాటిని పెట్టాల్సిన పని లేదు. గాలిలో తేమ 80%తో పాటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొక్క పెరిగి, 30–45 రోజుల్లో పూత వస్తుంది. వేరే పోషణ ఏమీ అవసరం లేదు. 7 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉన్న విత్తన దుంపలు వాడితేనే ఆ సీజన్లో పూలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏరోపోనిక్స్ పద్ధతిలో పెంచే దుంపలను కూడా పూత కాలం పూర్తయిన తర్వాత మట్టి మిశ్రమంలో విధిగా నాటుకోవాల్సిందే. నవంబర్– డిసెంబర్లో మట్టి మిశ్రమంలో నాటుకోవాలని శైలజారెడ్డి వివరించారు. వారం/పది రోజులకోసారి నీటిని కొంచెం పిచికారీ చేస్తే సరిపోతుంది. నానో యూరియా లేదా ఎన్పికెను నెలకోసారి పిచికారీ చేస్తే చాలు. ప్రతి దుంపకు అనుబంధంగా మూడు, నాలుగు దుంపలు పుట్టుకొస్తాయి. ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ దశలో వాటికి ఆహారం, కాంతి, చల్లని వాతావరణం, గాలిలో 80% తేమ అవసరం లేదు. కుంకుమ పువ్వు దుంపలను జూలైలో మట్టిలో నుంచి తీసి 7 గ్రాములు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న పిల్ల దుంపలను వేరు చేసి, తిరిగి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు. లేదా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకొని ఏరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ నిద్రావస్థ వరకు నిరంతరాయంగా 8 నెలలు శీతల వాతావరణం ఉండేలా చూసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుందని శైలజారెడ్డి వివరించారు. మొదటి ఏడాదే పెట్టుబడి! ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వు సాగు చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి సంవత్సరమే పెట్టుబడి అవసరమవుతుంది. రెండో సంవత్సరం నుంచి విత్తన ఖర్చు ఉండదు. నాలుగైదు సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వు సాగును ఇంటిపంటగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. నాణ్యమైన కుంకుమ పువ్వును మనమే పండించుకోవచ్చు. ఈ అనుభవాలను ఇతరులకు పంచాలని ‘శాన్వి శాఫ్రన్ ఫార్మ్స్’ పేరిట యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేశాను. – కె. శైలజారెడ్డి, కుంకుమ పువ్వు సాగుదారు, తాడేపల్లి, గుంటూరు జిల్లా . మొబైల్: 94912 33492. (సా. 7 గం. తర్వాత ఫోన్ చేయొచ్చు) www.youtube.com/ @ShanviSaffronFarms – దాళా రమేష్ బాబు, సాక్షి, బ్యూరో ఇన్చార్జ్, గుంటూరు (చదవండి: టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement