-
‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’ దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందడానికి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2014, జూన్ 2 తర్వాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలన్నారు. దరఖాస్తుల్ని కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.5–9–166, చాపెల్ రోడ్డు, నాంపల్లి, హైదరాబాదు–500001కు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు. ఇతర వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 040–23298672, 23298674లను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను http://ipr.tg.nic.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.30 కోట్లు
‘జనహిత’లో సీఎం కేసీఆర్ వెల్లడి ⇒ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా ⇒ రూ.లక్ష చెక్కుల పంపిణీ.. మూడేళ్ల పాటు పెన్షన్ ⇒ ఇళ్లు లేనివారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తన జన్మదినం సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరాలు ప్రకటించారు. ప్రతి ఏటా బడ్జెట్ నుంచి జర్నలిస్టు సంక్షేమ నిధికి ఇచ్చే నిధులను ఈసారి మూడింతలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.10 కోట్ల చొప్పున రెండేళ్లుగా సంక్షేమ నిధికి జమ చేశామని, ఈసారి బడ్జెట్లో రూ.30 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. శుక్ర వారం సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లో తొలిసారి ‘జనహిత’ కార్యక్రమం నిర్వహించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో సీఎం ఈ సందర్భంగా సమావేశ మయ్యారు. వారి బాధలు, దుఃఖాన్ని పంచుకున్నారు. ఎలాంటి ఆధారం లేని కుటుంబా లను ఆదుకుంటామని, సమస్యలను పరిష్క రిస్తామన్నారు. ఈ సందర్భంగా 84 మంది బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆర్థికసాయం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. బాధ్యతగా తీసుకొంటాం... ‘భారత జవాన్లకు దేశానికి కాపలా కాస్తుంటే మనం ఇక్కడ సంతోషంగా బతుకుతున్నాం. వారి సంక్షేమానికి రూ.80 కోట్లతో నిధిని పోగు చేశాం. జవాను బతికినా..చనిపోయినా వారి కుటుంబానికి అండగా ఉండే బాధ్యతను తీసుకున్నాం. సమాజాన్ని చైతన్య పరుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కూడా బాధ్యతగా స్వీకరించాలి. రెండేళ్లలో రూ.10 కోట్ల చొప్పున రూ.20కోట్లు ఇచ్చాం. వచ్చే నెలలో ప్రవేశపె ట్టే బడ్జెట్లో మరో రూ.30 కోట్లు మంజూరు చేస్తాం. దీంతో ఈ నిధి రూ.50 కోట్లు అవుతుంది. రక్షణ కవచంగా మిగులుతుంది. తిరుపతికి వెళితే దేవుడి దగ్గర హుండీలో డబ్బులు వేస్తాం. అవి సత్కార్యానికి సద్విని యోగమవుతాయనే విశ్వాసం. తిరుపతి హుండీలాగే అల్లం నారాయణకు డబ్బులిస్తే నమ్మకం నాకుంది. భవిష్యత్తులో సంక్షేమ నిధి మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దేశానికే తలమానికంగా ఉంటాం’’ అని సీఎం అన్నారు. జర్నలిస్టులకు ఆర్థిక భారమైన ఆరోగ్య సమస్యలుంటే ప్రెస్ అకాడ మీని సంప్రదించి వారి ద్వారా తన దృష్టికి తేవాలని సీఎం సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ హరికిషన్రెడ్డి గుండె మార్పిడికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే కార్యక్రమం ద్వారా ‘జనహిత’ ప్రారంభించాలనుకున్నామని, మొట్టమొదటే ఇంతమంచి కార్యక్రమం చేప ట్టినందుకు ప్రెస్ అకాడమీకి కృతజ్ఞతలు తెలి యజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ మల్లారెడ్డి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, జర్నలిస్టు సంఘం నేతలు పల్లె రవికుమార్, క్రాంతి కిరణ్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన సాక్షి టీవీ స్పోర్ట్స్ జర్నలిస్టు శ్రీనివాసులు కుటుంబానికి సీఎం రూ.4లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పెళ్లీడు అమ్మాయిలుంటే రూ.3 లక్షలు ‘‘ఎంతో కష్టపడి, పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.తెలంగాణ పేద రాష్ట్రం కాదు. ధనిక రాష్ట్రం కాదు. రాష్ట్రంలో పేదరికం, దుఃఖం అంతం కావాలి. జర్నలిస్టు కుటుంబాల విజ్ఞప్తులు విన్న తర్వాత చాలా హృదయ విదారకంగా అనిపించింది. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.లక్ష కాకుండా గౌరవంగా బతకడానికి ఐదేళ్ల పాటు రూ.3 వేల పెన్షన్, చదువుకునే పిల్లలుంటే నెలకు వెయ్యి చొప్పున ప్రెస్ అకాడమీ తరపున ఇస్తున్నాం. కొంతమందికి ఇళ్లు లేవని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తాం. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల్లో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలుంటే వారి పెళ్లి ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయం తక్షణమే అందిస్తాం’’ అని సీఎం ప్రకటించారు. సీఎం జర్నలిస్టుల పక్షపాతి: టీయూడబ్ల్యూజే మరణించిన జర్నలిస్టుల కుటుంబాలతో జనహిత మొట్టమొదటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా సీఎం మరోసారి జర్నలిస్టు పక్షపాతి అని నిరూపించుకున్నారని టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ అన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన వారికి ఆర్థిక సాయాన్ని అందజేయడం పట్ల శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలు ఎంతో ఓపికతో విని, వాటన్నింటినీ పరిష్కారిస్తానని వేదికపైనే ప్రకటించడం, వెల్ఫేర్ ఫండ్కు రూ.30 కోట్లు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నామని క్రాంతి తెలిపారు. -
జర్నలిస్టుల కుటుంబాలకు సాయం
నేడు 84 మందికి సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు చనిపోయిన 69 మంది జర్నలిస్టు కుటుంబాలు, పనిచేయలేని స్థితిలో ఉన్న 15 మంది జర్నలిస్టు కుటుం బాలకు శుక్రవారం జనహిత కార్యక్రమంలో సీఎం కె.చంద్రశేఖర్రావు చెక్కులు అందజేయనున్నారు. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ ఏటా రూ.10 కోట్ల చొప్పున రెండేళ్లుగా రూ.20 కోట్లు డిపాజి ట్ చేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన పుట్టినరోజును పురస్కరిం చుకుని ఈ ఆర్థిక సాయం చేయనున్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పెన్షన్, ఆ కుటుంబంలో పదోతరగతి లోపు విద్యార్థులుంటే అదనంగా మరో రూ.1,000 చొప్పున ఇస్తారు. గాయపడిన, అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అధ్యక్షతన పాలకమండలి జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంబంధించి ప్రత్యేకంగా పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండలికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మల్లేపల్లి లక్ష్మయ్య, సీఆర్ గౌరీశంకర్, యం.నారాయణరెడ్డి, ఎన్.వేణుగోపాల్, కె.అంజయ్య, పౌర సంబంధాల శాఖ నుంచి నాగయ్య కాంబ్లే, ఎల్ఎల్ఆర్ కిశోర్బాబు, ఎస్ఆర్ హాష్మీ ప్రతినిధులుగా, సభ్యకార్యదర్శిగా ప్రెస్ అకాడమీ కార్యదర్శి బి.రాజమౌళి, మేనేజర్గా జి.లక్ష్మణ్కుమార్లను నియమించారు. -
'పాత్రికేయుల సంక్షేమ నిధి రూ. కోటికి పెంచుతాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పి. రఘునాథారెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారి ఆలయానికి రూ. లక్ష విరాళం అందజేశారు. అనంతరం ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ... పాత్రికేయుల సంక్షేమ నిధిని రూ. కోటికి పెంచుతామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టే పథకాలు ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తామని రఘునాథరెడ్డి వెల్లడించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement