-
నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త
-
నిరుద్యోగులకు ఏపీపీ ఎస్సీ మరో గుడ్ న్యూస్
-
ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..!
పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న సమర్థులకు ఉపాధి లభించకపోవడమే నిరుద్యోగమని ప్రపంచ కార్మిక సంస్థ నిర్వచించింది. ప్రపంచం ఏళ్లుగా నిరుద్యోగ సంక్షోభం ఎదుర్కొంటోంది. కొవిడ్ దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ వేగంగా పుంజుకోలేకపోతున్నాయి. చాలా దేశాల్లో సరిపడా ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం లభించక, స్వయం ఉపాధి పొందేంత స్థోమతలేక దొరికిన పనులు చేస్తూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. పారిశ్రామికీకరణకు ముందు సంప్రదాయ పనుల వల్ల ఉపాధి సమస్య ఉండేది కాదు. యంత్రాల రాకతో వస్తూత్పత్తి పెరిగినా చాలామందికి పని దొరకడం కష్టం అవుతోంది. పారిశ్రామిక దేశాలు దశాబ్దాల తరబడి దీన్నొక సమస్యగానే గుర్తించలేదు. క్రమంగా నిరుద్యోగం తీవ్రరూపం దాలుస్తోందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఇదీ చదవండి: విమానాశ్రయానికి బెదిరింపు... రూ.8.3 కోట్లకు డిమాండ్! నూటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారన్నది లెక్కతేల్చే ‘నిరుద్యోగిత రేటు’ నిత్యం మారుతోంది. భారత్లో ఈ ఏడాది నిరుద్యోగిత రేటు 7.1 శాతంగా ఉన్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. ప్రపంచంలోనే స్విట్జర్ల్యాండ్లో తక్కువగా 2 శాతం నిరుద్యోగితరేటు ఉంటే గరిష్ఠంగా దక్షిణాఫ్రికాలో 31.9 శాతం ఉంది. Unemployment rate: 🇿🇦 South Africa: 31.9% 🇪🇸 Spain: 11.84% 🇹🇷 Turkey: 9.1% 🇧🇷 Brazil: 7.7% 🇮🇹 Italy: 7.4% 🇫🇷 France: 7.4% 🇮🇳 India: 7.1% 🇦🇷 Argentina: 6.2% 🇩🇪 Germany: 5.8% 🇨🇦 Canada: 5.7% 🇮🇩 Indonesia: 5.32% 🇨🇳 China: 5% 🇸🇦 Saudi: 4.9% 🇬🇧 UK: 4.2% 🇺🇸 US: 3.9% 🇦🇺 Australia:… — World of Statistics (@stats_feed) November 23, 2023 -
నిరుద్యోగులకు శుభవార్త
-
కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్
ఒక దేశ ప్రగతికి అవరోధంగా నిలిచే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఓ కంపెనీ వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుందనే సమాచారంతో పెద్దఎత్తున యువత ఒక్కసారి రావడంతో గేట్లు మూసివేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కొవిడ్ కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల వృద్ధిరేటు తగ్గిపోయింది. దానికితోడు అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల బ్యాంకింగ్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాలో సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దాంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయింది. గ్లోబల్గా నెలకొన్ని యుద్ధభయాల వల్ల కొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. సిబ్బందికి లేఆఫ్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు వందల్లో ఉద్యోగార్థులు వస్తున్నారు. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM — Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023 -
APPSC: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: తత్తరపాటు.. బిత్తర చూపులు! -
‘అమ్మా.. నాకు నౌకరొస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయమ్మా’....
‘అమ్మా.. నాకు నౌకరొస్తుంది. మన కష్టాలు తొలగిపోతాయమ్మా’.... భువనగిరికి చెందిన శ్రీశైలం కొద్దికాలం క్రితం తన తల్లికి చెప్పిన మాటలివి. శ్రీశైలం ఎల్ఎల్బీ చదివాడు. టెట్ అర్హతా పొందాడు. అతని తండ్రి సన్నకారు రైతు. అయినా కొడుకు గ్రూప్–1 కోచింగ్ కోసం అప్పు చేసి మరీ డబ్బులు పంపాడు. తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకం వారిలో ఉండేది. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన శ్రీశైలంలోనూ ఆ ధైర్యం నెలకొంది. కానీ ఇప్పుడు అతనిలో భయం, ఆందోళన కన్పిస్తున్నాయి. ‘పర్లేదులేయ్యా.. ఇంకేదైనా ఉద్యోగం చూసుకోవచ్చు..’ అని తండ్రి బుజ్జగిస్తుంటే తట్టుకోలేకపోతున్నానంటూ బావురుమన్నాడు. వరంగల్ జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన సంజయ్కుమార్ది దయనీయ స్థితి. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి కూలీ పని చేస్తోంది. ఆమె కూడా దీర్ఘకాల వ్యాధికి గురైంది. ఆ విషయాన్ని కొడుకు దగ్గర దాచి పెట్టింది. పీజీ చేసిన కొడుకుకు మంచి ఉద్యోగం వస్తుందనేది ఆమె ఆశ. మందులకు వాడాల్సిన సొమ్మును కొడుకు కోచింగ్ కోసం పంపేది. సంజయ్ కూడా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మరీ గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యాడు. మెయిన్స్ దాకా వచ్చాడు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దవ్వడంతో దిగాలుపడ్డాడు. ‘నాకు ఉద్యోగం కాదు.. అమ్మ కష్టం గుర్తుకొస్తోంది’ అంటూ గుండె పగిలేలా ఏడ్చాడు. సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లగానో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు..షడ్రుచుల ఉగాది ఒట్టి చేదునే పంచుతోంది. వేలాది మంది తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు కావడం, వాయిదా పడటం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్తో తమ ఏళ్ల తరబడి కష్టం వృథా అయిందంటూ కుమిలిపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్–1 కోచింగ్ కోసం చేసిన అప్పులు, కుదవబెట్టిన ఆస్తులు గుర్తుకొచ్చి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అమ్మానాన్నల కలలు చెదిరిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయంటూ తల్లడిల్లిపోతున్నారు. చిన్నా చితక ఉద్యోగాలొదిలిపెట్టి, ఉన్న ఉపాధిని కోల్పోయి.. సర్కారీ కొలువే లక్ష్యంగా కఠోర దీక్ష బూనిన నిరుపేద నిరుద్యోగుల బరువెక్కిన గుండెల్లోంచి ఆవేదన ఉప్పొంగుతోంది. దిగాలు పడ్డ పిల్లలను ఓదార్చేందుకు తమ వద్ద మాటల్లేవంటున్న తల్లిదండ్రుల వ్యథ వర్ణనాతీతంగా ఉంది. అమ్మ పుస్తెను అమ్మేసి ఇస్తున్నా.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నీలేశ్ మాటలు గుండెను పిండేసేలా ఉన్నాయి. ‘30 ఏళ్ల క్రితం మీ అమ్మకు కట్టిన పుస్తె కొడుకా.. అమ్మేసి ఇస్తున్నా. ఉద్యోగం తెచ్చుకో బిడ్డా..’ అంటూ కోచింగ్కు డబ్బులిచ్చేప్పుడు తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గుక్క తిప్పుకోకుండా ఏడ్చాడు. ఇప్పుడేం చేయాలి? అంటూ నిస్సహాయంగా ప్రశ్నించాడు. ఉపాధి పోయే.. భరోసా కరువాయే ఎమ్మెస్సీ చేసిన ప్రశాంతి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కాలేజీలో మేథ్స్ లెక్చరర్గా పనిచేస్తూ నెలకు రూ. 50 వేలకు పైనే సంపాదించేది. ప్రభుత్వ నోటిఫికేషన్ల తర్వాత ఉన్న ఉద్యోగం వదిలేసింది. ఏడాదిగా గ్రూప్స్పైనే దృష్టి పెట్టింది. మెయిన్స్కు అర్హత సాధించింది. పరీక్ష రద్దవ్వడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉంది. ఇప్పుడామె గర్భిణి కూడా. ‘పుట్టబోయే బిడ్డ కోసం దుఃఖాన్ని దిగమింగుతున్నా. మళ్లీ సన్నద్ధమవ్వడం కష్టమే..’ అంటూ కన్నీటి పర్యంతమైంది. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బులు.. పీజీ తర్వాత భద్రాచలానికి దగ్గర్లోని ఓ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగం తెచ్చుకున్నాడు వీరబోయిన నరేంద్ర. తండ్రి చనిపోవడంతో ఇంటికి పెద్ద దిక్కడయ్యాడు. కానీ గ్రూప్స్ కోసం ఉద్యోగం మానేసి హైదరాబాద్లో కోచింగ్ కోసం వచ్చాడు. చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు ఖర్చు చేశాడు. ‘ఇప్పుడు ప్రభుత్వ కొలువు ఎండమావిగా మారింది. ఉన్న ఇంటిని అమ్మేయడమే దిక్కు’ అంటూ వాపోయాడు. ఎవరిని కదిపినా..ఉప్పొంగే ఆవేదనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లతో లక్షలాది మంది నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇళ్ళను వదిలేసి, వ్యక్తిగత బాధలన్నీ పక్కన బెట్టి కొలువు కొట్టే లక్ష్యంతో లక్షల మంది కోచింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకొందరు ఇళ్లల్లోనే ఉండి చదువుతూ బయటి ప్రపంచాన్ని మరిచిపోయారు. నిద్రాహారాలు మానుకుని పరీక్షల కోసం సన్నద్ధమయ్యారు. ఈ దశలో బాంబులా పేలింది..రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్. తీగలాగితే డొంక కదిలినట్టు ఒక పరీక్షతో ఆగిపోలేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా ఏకంగా నాలుగు పరీక్షలు రద్దు అయ్యాయి. మరో రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. నిరుద్యోగ యువతలో అయోమయాన్ని నింపాయి. మెడలోని పుస్తెనో, ఇంట్లోని గొర్రెనో.. బర్రెనో.. ఉన్న కుంట భూమినో.. తాతల నుంచి వచ్చిన ఇంటినో అమ్మేసి కన్న బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరై పోయాయి. మళ్లీ గ్రూప్–1కు సన్నద్ధమవడమనే ఊహే వారిని తీవ్రంగా బాధిస్తోంది. ఊహించని ఈ పరిణామంపై ‘సాక్షి’ వారి ప్రతిస్పందన కోరినప్పుడు.. ఎంతో ఆందోళన..ఆవేదన, మరెంతో నిరాశా నిస్పృహలు వారిలో స్పష్టంగా కన్పించాయి. ఎంఏ చేసినా అమ్మకు భారంగానే.. నాన్న చనిపోతే అమ్మే కూలి పనిచేసి పెంచింది. ఎంఏ చేసినా ఇంకా అమ్మకు భారంగానే ఉన్నా. టీఎస్పీఎస్సీ పరీక్షల ద్వారా ఉద్యోగం వస్తుందని, అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాననే నమ్మకం తగ్గిపోతోంది. పరీక్షల పట్ల ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? – కాదిరాబంద్ పాండు (ఆందోల్, సంగారెడ్డి జిల్లా) మళ్లీ సన్నద్ధమవ్వడం ఎలా? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా కష్టపడి బీఎస్సీ, బీఈడీ చేశా. గ్రూప్స్ కోసం మూడేళ్లు కష్టపడ్డా. నేను, నా స్నేహితు లు నిద్రహారాలు మానేసి చదివాం. పరీక్ష రద్దు మనసు కకావికలం అయిపోయింది. మళ్లీ ఎలా సన్నద్ధమవ్వాలో అర్ధం కావడం లేదు. – దుర్గం శ్రావణి బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి.. కొంతకాలంగా ఇంటివద్ద పిల్లల్ని సైతం వదిలేసి.. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ పరీక్షకు సిద్ధమవుతున్నా. ఈ సమయంలో పరీక్ష రద్దు చేయడం బాధించింది. లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి. మాలాంటి వారిని ఆదుకోవాలి. ఈసారైనా పకడ్బందీగా ప్రక్రియను పూర్తి చేయాలి. – సంధ్య గ్రూప్–1 అభ్యర్థి, మహబూబ్నగర్ నష్టపోయిన వారికి చేయూతనివ్వాలి కోచింగ్ కోసం ఉన్నవన్నీ అమ్ముకుని వచ్చిన వాళ్ళున్నారు. తప్పు ప్రభుత్వానిదైతే శిక్ష పరీక్ష రాసిన వాళ్లెందుకు అనుభవించాలి? దరఖాస్తు చేసిన వారికి ప్రభుత్వం ఆర్థిక పరమైన చేయూతనివ్వాలి. – చెన్నగాని దయాకర్ గౌడ్ (పీహెచ్డీ విద్యార్థి, నకిరేకల్, నల్లగొండ జిల్లా) -
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
పోలీసునంటూ నిరుద్యోగులకు టోకరా! భారీగా వసూళ్లు
గుంతకల్లు: ఖాకీ యూనిఫాం ధరిస్తాడు. బుల్లెట్ బండిపై సవారీ చేస్తాడు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉన్నతాధికారి వద్ద ఏఆర్ కానిస్టేబుల్నంటూ అందరినీ నమ్మించాడు. ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ మభ్యపెట్టాడు. పోలీస్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేశాడు. చివరకు మోసం బట్టబయలై పోలీసులకు దొరికిపోయాడు. ఇదీ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కథలవీధిలో నివాసముంటున్న పృథ్వి బాగోతం. ఇతను పృథ్వి, చింటూ, హర్షారెడ్డి తదితర పేర్లతో నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఉన్నతాధికారి వద్ద కానిస్టేబుల్గా పనిచేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇతని మాటలు నమ్మి గుంతకల్లు పట్టణంలో హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్ముకునే ఓ మహిళ ఏకంగా రూ.17 లక్షల దాకా ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపు యజమాని రూ.8 లక్షలు, తిమ్మాపురం గ్రామానికి చెందిన సంగమేష్ రూ.4.5 లక్షలు, ఓ మహిళా పోలీస్ కూడా తన చెల్లెలి ఉద్యోగం కోసం రూ.లక్ష సమరి్పంచుకున్నారు. ఇంకా ఇతని గాలానికి చిక్కి ఎందరో నిరుద్యోగులు రూ.లక్షల్లో మోసపోయినట్లు సమాచారం. ఆఫీసులకు తీసుకెళ్లి..అందరినీ నమ్మించి.. నిరుద్యోగులను పృథ్వి నమ్మించి మోసగించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలని అడిగారో ఏకంగా ఆ శాఖ కార్యాలయానికి నిరుద్యోగులను తీసుకెళ్లేవాడు. వారిని కార్యాలయం వద్ద కూర్చోబెట్టి ఒక్కడే లోపలికి వెళ్లేవాడు. కాసేపటికి బయటకు వచ్చి పై అధికారితో అంతా మాట్లాడానంటూ నమ్మబలికేవాడు. ఇలా ఒక నిరుద్యోగిని గుంతకల్లు సెబ్ కార్యాలయంలో ఉద్యోగం ఉందని పిలుచుకెళ్లి అక్కడే అడ్వాన్స్గా రూ.లక్ష తీసుకున్నాడు. వాస్తవంగా ఇతనికి ఎక్సైజ్ శాఖలో ఎవరూ తెలీదు. ప్రస్తుతం ఇతను గుంతకల్లు టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. (చదవండి: కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?) -
Good News: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు
-
అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన: సీఎం కేసీఆర్
నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం.. నేడు అసెంబ్లీ వేదికగా అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు పెట్టుకొని చూడండి – వనపర్తి సభలో సీఎం కేసీఆర్ ‘‘తెలంగాణలో ఎన్నో పనులు ప్రజలు అడగక ముందే చేసుకున్నాం. ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నాం. బుధవారం అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల కోసం అద్భుత ప్రకటన చేయనున్నాం. ఉదయం పది గంటలకు అందరూ టీవీలు పెట్టుకుని చూడండి. తెలంగాణ ప్రగతి కోసం చివరి ఊపిరి, రక్తం బొట్టు దాకా టీఆర్ఎస్ పని చేస్తుంది..’’ మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామంటారా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ఎప్పుడో మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారా? ఎంత ఇస్తారు? అనే చర్చకు తెరతీసింది. రాజకీయ వర్గాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. అయితే 60 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ల జారీపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయవచ్చనే చర్చ జరుగుతోంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఇచ్చిన హామీని సైతం ప్రస్తావించే అవకాశముందని చెబుతున్నారు. ఉపాధ్యాయ, పోలీసు కొలువులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2020 డిసెంబర్ 13న కేసీఆర్ ప్రకటన చేశారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించిన తర్వాత ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా అప్పట్లో ఆదేశించారు. అయితే పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత నియామకాల అంశం మరుగున పడిపోయింది. గతేడాది కరోనా రెండోవేవ్ రావడం, ఆ తర్వాత కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల పునర్విభజన చేపట్టాల్సి రావడంతో ఆ ప్రక్రియకు ఫుల్స్టాప్ పడింది. అయితే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం బదిలీల ప్రక్రియ సైతం ఇటీవల పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీకి అన్ని అడ్డంకులు తొలగినట్టయింది. కమిటీతో మళ్లీ మొదటికి.. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటన కోసం నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, కేడర్ స్ట్రెంగ్త్ అవసరాలు, ఖాళీల భర్తీపై అధ్యయనానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గత జనవరి 16న కేసీఆర్ ప్రకటించడంతో నియామకాల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చినట్టు అయింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించడంతో పాటు ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి? కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో పని ఒత్తిడికి తగ్గట్టు కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం వంటి అంశాలపై అధ్యయనం జరపాలని అప్పట్లో కమిటీకి సూచించారు. ఈ నేపథ్యంలో కొలువుల భర్తీపై ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించే పనిని ఈ కమిటీ ప్రారంభించింది. కానీ నిర్దిష్టమైన కాలవ్యవధి నిర్ణయించకపోవడం, విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాలయాపనకే ఈ కమిటీని వేశారనే విమర్శలు సైతం వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ముఖ్యమంత్రి నిరుద్యోగులు గురించి చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఈ కమిటీ ఆగమేఘాల మీద నివేదిక సమర్పించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా..నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టడానికి రాష్ట్ర బడ్జెట్ 2022–23లో ఎలాంటి నిధులను ప్రతిపాదించకపోవడంతో దీనిపై సీఎం ప్రకటన ఉండే అవకాశాలు లేనట్టేనని సమాచారం పునర్విభజన తర్వాత 85 వేల ఖాళీల గుర్తింపు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 1.32 లక్షల పోస్టులను భర్తీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తెలంగాణ వచ్చాక తొలి నాలుగేళ్లలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయగా, దాదాపుగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు జారీ కాలేదు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం పోస్టుల పునర్విభజన పూర్తైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 85 వేల వరకు ఖాళీలను గుర్తించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. 1.91 లక్షల పోస్టులు ఖాళీ అన్న తొలి పీఆర్సీ రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గతేడాది ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూ శాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
యువతకు ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనేక చర్యలు
-
ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం
సాక్షి, శంకరపట్నం(కరీంనగర్): ఓ యువకుడు తనను ఉద్యోగంలోకి తీసుకోలేదని మనస్తాపానికి గురై, ఆత్మహత్యాయత్నం చేశాడు. కేశవపట్నం ఎస్సై ప్రశాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని అర్కండ్ల గ్రామానికి చెందిన యేమునూరి నవీన్ బీటెక్ వరకు చదువుకొని, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బీటెక్లో ఒక సబ్జెక్ట్ ఫెయిలవడంతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి బుధవారం కంపెనీకి వెళ్లగా యాజమాన్యం అతన్ని ఉద్యోగంలోకి తీసుకోలేదు. దీంతో నవీన్ కేశవపట్నం వచ్చాడు. తండ్రికి ఫోన్ చేసి, తాను విషపు గుళికలు మింగినట్లు చెప్పాడు. కంగారు పడిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఎస్సై ప్రశాంత్రావు సూచన మేరకు బ్లూకోల్డ్స్ సిబ్బంది భాస్కర్రెడ్డి, రవిలు నవీన్ను పోలీస్ వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: గాంధీ ఆస్పత్రికి కోవిడ్ బాధితుల క్యూ -
ఇది ‘ఆత్మగౌరవ’ జంగ్ సైరన్
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో లక్షలాది విద్యా ర్థులు లాఠీలకు, తూటాలకు, భాష్ప వాయువులకు ఎదురొడ్డి, ఆఖరికి తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కున్నారు. కానీ జీవితాలు బాగు పడతాయని కలలుగన్న విద్యార్థి నిరుద్యోగులకు, వారిని కన్న తల్లి దండ్రులకు ఈనాడు నిరాశే మిగిలింది. ఉద్యమకాలంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తానని నమ్మబలికిన కేసీఆర్, తెలం గాణ వచ్చినంక ఉద్యమ లక్ష్యాలను మరచి, విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాలపై నిర్దిష్టమైన పాలసీలు లేకుండా పాలిస్తు న్నారు. ‘అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏడున్నాయి? జనా భాలో రెండు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమం’టూ నాలుగు కోట్ల సబ్బండవర్గాల సమున్నత పోరాటాన్ని, ఆశలను, ఆకాంక్షల్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ లక్ష్యం దారితప్పింది. లక్షలమంది విద్యార్థ్ధి, నిరుద్యోగుల బతు కులు నాశనం అయినాయి. అటు తల్లిదండ్రులకు మొఖం చూపించుకోలేక, ఉద్యోగ వయోపరిమితి పెరుగుతూ పెళ్లిళ్లు చేసు కోలేక, నిరాశానిస్పృహలకు లోనై తెలంగాణ నిరుద్యోగ యువత ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. ఉద్యోగం రాకపోవడంతో ఆత్మబలిదానం చేసుకొన్న కాక తీయ యూని వర్సిటీకి చెందిన సునీల్ నాయక్ మరణ వాంగ్మూలం వింటే కన్నీళ్లు ఆగవు... ‘నా చావుతోనైనా మన ఉద్యోగాలు మనకు రావాలి’ అంటూ నినదించిన ఆ గొంతు ఇంకా సజీవంగా మన గుండెల్లో మోగుతూనే ఉంది.. ఉద్యోగుల పీఆర్సీ కోసం వేసిన కమిటీ రాష్ట్ర ప్రభు త్వంలో ఉద్యోగ ఖాళీలు లక్షా 91 వేలు అని తేల్చింది. కానీ ప్రభుత్వం మాత్రం 56 వేల ఖాళీలే అని చెప్పి నిరుద్యోగు లను దగాచేస్తోంది. ఏడేళ్ళలో మొత్తం 85 వేల ఉద్యోగాలే భర్తీ చేసి లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీచేసినామని పచ్చి అబద్ధాలాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తా యని నమ్మి 2009 నుండి 2014 వరకు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వయోపరిమితి దాటిపోయి అన్నిరకాలుగా నష్టపోయారు. గత ఏడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 12 విశ్వ విద్యాలయాల్లో 2,500 పైచిలుకు బోధనా సిబ్బందిని, 12 వేల పైచిలుకు బోధనేతర సిబ్బందిని భర్తీ చేయకుండా విద్యార్థి ఉద్యమాలపై అనేక ఆంక్షలు పెట్టి పోలీసు అడ్డాలుగా మార్చారు. అంతేగాక రాష్ట్రంలో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ విశ్వవిద్యా లయాలను నీరుగార్చేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే 4,500 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేసి, వేలకొద్దీ టీచర్ల ఖాళీలను భర్తీచేయకుండా ప్రభుత్వ విద్యని సర్వనాశనం చేశారు. పదిజిల్లాలు ఉన్న పాత తెలంగాణ రాష్ట్రంలో 2014 నాటికే విభజన చట్టం ప్రకారం బడ్జెట్ శాంక్షన్ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షల 70 వేల ఉద్యోగాలు ఉంటే, 33 జిల్లాల ప్రస్తుత కొత్త తెలంగాణలో ఎన్ని కొత్త ఉద్యో గాలు కల్పించాలి? 23 కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివి జన్లు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త కార్పొరేషన్లు ఏర్పర్చిన ప్రభుత్వం, కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా, ప్రభుత్వ ఉద్యోగులపై మరింత పనిభారం మోపుతోంది. స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీ టీచర్ ఉద్యోగాలు సుమారు 25 వేలపైన ఖాళీలు భర్తీ చేయకుండా, ఈ ఏడేళ్ళలో కేవలం 2 సార్లు టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నిర్వహించి 5 లక్షలమంది పైచిలుకు నిరుద్యోగుల జీవితాలను సర్వనాశనం చేసింది. వైద్య ఆరోగ్యశాఖలో వివిధ అత్యవసర సర్వీసుకు చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు సుమారు 35 వేల ఖాళీలున్నాయి. కోవిడ్–19 తీవ్రంగా ఉన్న సందర్భంలో ఏకంగా 50 వేల ఉద్యోగాలు వైద్యశాఖలో వెంటనే భర్తీ చేస్తానని కేసీఆర్ చేసిన వాగ్దానం ఇంకా అమలుకాలేదు. న్యాయశాఖలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూనియర్ సివిల్ ఇతర న్యాయసిబ్బంది ఖాళీలు వేలల్లో ఉన్నాయి. పోలీసుశాఖలోనూ వేలాది పోస్టులు ఖాళీలు న్నాయి. ప్రభుత్వంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తజిల్లాల నేపథ్యంలో మరో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించి, మొత్తం 5 లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగులను ఆదుకోవచ్చు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయకుండా, మరోవైపు చాలా ఏళ్లుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని 21,200 మంది సర్వశిక్షా అభియాన్; 16,400 విద్యా వలంటీర్లు; 7,651 మహాత్మాగాంధీ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్, 2,000 పంచాయతీ కార్యదర్శులు; 709 మిషన్ భగీరథ; 315 హార్టికల్చర్ డిపార్ట్మెంట్, 2,640 సోషల్ వెల్ఫేర్, ఆర్టీసీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 1,640 నర్సులు మొత్తంమీద దాదాపు 55 వేల మందిని ఉద్యోగా ల్లోంచి తీసివేసి, వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసి, భవిష్యత్తును నాశనం చేశారు. ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు కేటీఆర్. కానీ పొరుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా స్థానికులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన, ప్రైవేట్ ఉద్యోగాలలో, ముఖ్యంగా ఐటీ రంగంలో తెలంగాణ స్థానిక విద్యార్థి నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. 2018 వరకు టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు దాదాపు 26 లక్షలమంది ఉన్నారు. ఈ రెండేళ్ల కాలంలో దాదాపు మరో 4 లక్షలమంది ఈ జాబితాలో చేరి ఉంటారని అంచనా. అయినా సరే కేసీఆర్కు నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చాలనే సోయి లేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళుతెరిచి నిరుద్యోగు లను నిండా ముంచకుండా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల క్యాలెండర్ను రూపొందించి క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ప్రతి సంవ త్సరం ఖాళీలు భర్తీచేయాలి. విద్యార్థి నిరుద్యోగుల హక్కుల సాధన కోసం, రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకు చెందిన విద్యార్థులు, నిరుద్యోగులను కూడగట్టుకొని మన విద్య కోసం, మన ఉద్యోగాల కోసం, మన స్వయం ఉపాధి కోసం, అన్నింటికీ మించి మన ఆత్మగౌరవం కోసం జంగ్ సైరన్ మోగిద్దాం. డా.శ్రవణ్ దాసోజు వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ మొబైల్: 98850 39384 -
ఉద్యోగాల పేరుతో కిలేడీ చీటింగ్.. కోట్లు కొట్టేసి మాస్టర్ ప్లాన్..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): ఉద్యోగాలిప్పిస్తానని పలువురిని మోసం చేసి సుమారు రూ.కోటి వసూలు చేసిన మండలంలోని రాముడువలసకు చెందిన కిలేడీ బుట్ట సరస్వతి ఎట్టకేలకు అరెస్టు అయ్యింది. అసలు పేరును కాదని విజయరాణిగా చలామణి అవుతూ పలువురిని మోసగించింది. తనకు పెద్దలతో పరిచయాలున్నాయని ఒకొక్కరి నుంచి రూ.50వేల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసింది. అంగన్వాడీ కార్యకర్త, మండల కో ఆర్డినేటర్, 104 అంబులెన్సు డ్రైవర్, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, ఫార్మాసిస్టు, కార్యదర్శి తదితర ఉద్యోగాల పేరు చెప్పి సుమారు 13 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈమెను పట్టణంలోని గుర్తించిన బాధితులు డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీయడంతో శనివా రం రాత్రి గొడవ జరిగిన విషయం పాఠకులకు తెలిసిందే. ఎస్ఐలు వెలమల ప్రసాదరావు, చదలవాడ ప్రసాదరావు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. ఆదివారం రిమాండ్ నిమిత్తం తరలించినట్టు చెప్పారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటి?: నిరంజన్రెడ్డి
సాక్షి, నాగర్కర్నూల్: చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, హమాలీ పని రూపంలో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని బాధత్యరాహిత్యంగా వ్యాఖ్యానించారు. వరల్డ్ స్కిల్ యూత్ డే రోజు మంత్రి నిరంజన్రెడ్డి నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావటం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
కేసీఆర్ రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించారు
హైదరాబాద్: రాష్ర్టంలో నిరుద్యోగులు, కౌలు రైతులు, ప్రయివేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అతిపెద్ద నియంత కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకులు భట్టి విక్రమార్క మల్లు. తెలంగాణా రాష్ర్ట సమితి శానససభా పక్షం లో తెలంగాణా తెలుగుదేశం శాసనసభా పక్షం విలీనం అత్యంత దుర్మార్గం, ప్రజస్వామ్యాన్ని పతానికి తీసుకువెళ్లే అడుగుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించారని , ప్రతిపక్షమే లేకుండా చేస్తూ దేశంలో 29 రాష్ర్టంగా ఆవిర్భవించిన తెలంగాణా రాష్ర్టాన్ని ఫిరాయింపుల పర్వంలో అగ్రస్థానంలో నిలబెట్టి సంపూర్ణ నియంత పాలన కింద కు తీసుకువచ్చాడని ,ఒకవైపు ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ, మరోవైపు ప్రతిపక్షాలను లేకుండా చేస్తూ దేశంలోనే అతిపెద్ద నియంతగా కేసీఆర్ అవతరించారని భట్టి విమర్శించారు. నిరుద్యోగుల పరిస్థితేంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటి గురించి మాట్లాడకుండా, పట్టించుకోకుండా ఇతర పార్టీల బి ఫామ్ లపై గెలిచిన వారిని తమ పార్టీలోకి ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించడం అత్యంత దుర్మార్గమన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించి వందలమంది తల్లుల కడుపుకోత కు కారణమైన కేసిఆర్ ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువత ఆత్మహత్య లు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారని, వారి తల్లుల కడుపుకోత కేసిఆర్ కు తగలక మానదని, ఎలక్షన్ కలెక్షన్ ఉంటే చాలు అనుకునే కెసిఆర్ కు కౌలు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు కనపడటం లేదా అని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. ఫిరాయింపుల ప్రమాదాలను గుర్తించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆనాడే ప్రతిపక్షం వుంటేనే అభివృద్ధి, రాజ్యాంగం సంరక్షించబడుతుందని చెప్పారన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం డబ్బు ఎరవేసి శాసనసభ్యులను కేసీఆర్ కొట్టున్నాడని, గతంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలచిన ఎంఎల్ ఎ లను ఇదే విధంగా డబ్బు ఎరవేసి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ లో చేర్చుకున్నారన్నారు. ప్రజాస్వామ్య పతనానికి దారి తీసే అన్ని అడుగులను కేసీఆర్ వేస్తున్నాడన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారిని నిసిగ్గుగా పార్టీలో విలీనం చేసుకుంటున్నాడని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం అత్యంత దుర్మార్గంమని, పార్టీల విలీనం అనేది ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని, రెండు పార్టీల అధ్యక్షల అంగీకారంతో వారు ఇచ్చే లేఖ ఆధారంగా ఆ ప్రక్రియ జరగాలని , ఒక పార్టీ అధ్యక్షుడు ఇచ్చే బి ఫామ్ మీద గెలిచిన ఎం ఎల్ ఏ లు తమ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ కు లెటర్ ఇస్తే సరిపోదన్నారు. ఏ విధంగా కూడా దీనికి చట్టబద్ధత లేదని, చెల్లదని, విలీనం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో లేదని, ఎన్నికల కమిషన్ ధృవీకరించిన తరువాతే అసెంబ్లీలో కూడా అది వర్తిస్తుందని, వీటన్నింటిపై ప్రజాస్వ్యామ వాదులంతా ఆలోచన చేయాలన్నారు భట్టి విక్రమార్క. కేసిఆర్ నిరంకుశ నిజాం నవాబును తలపిస్తున్నాడు అధికార దాహంతో ఉన్న కేసిఆర్ నిరంకుశ నిజాం నవాబును తలపిస్తున్నాడని, తన మీద ప్రజలలో రోజు రోజు కు పెరుగుతున్న వ్యతిరేకతతో ప్రతిపక్షాలకు రాజకీయంగా లాభ జరుగుతుందనే కుట్ర తో వారిని బలహీన పరచాలనే ఆలోచనతోనే ఇతర పార్టీల ఎం ఎల్ ఏ లను ప్రలోభాలకు, భయభ్రంతాలకు గురిచేస్తూ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నాడని భట్టి అన్నారు. ఎంతమంది ఎంఎల్ ఎలను , నాయకులను కలుపుకున్నా, చేర్చుకున్నా ప్రజలు అన్ని గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని, ప్రజల్లో మీ పై వ్యస్తున్న వ్యతిరేకతను ఆపలేరని, దీనిని గమనించాలని రాష్ర్ట ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నానన్నారు భట్టి విక్రమార్క. ( చదవండి: తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం ) -
ఘరాన మోసం... సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటు యువతకు టోకరా!
ఖమ్మం: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు, వాటాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న అంకిరెడ్డి నరేష్కుమార్రెడ్డిని బుధవారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన అంకిరెడ్డి నరేష్కుమార్రెడ్డి గత ఏడాది ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విసన్నపేటలో టిమాటిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించి, అందులో నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు పలువురు వద్ద కంపెనీలో వాటాలు ఇస్తానంటూ నమ్మబలికి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేశాడు. విసన్నపేటకు చెందిన తిరుమల జయరాం అనే బాధితుడు రూ.15 లక్షలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి, మోసపోవడంతో వీఎం బంజర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థి వద్ద రూ.3.5లక్షలు మోసం చేయడంతో అక్కడ కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి నరేష్కుమార్రెడ్డి వీరితోపాటు పలువురిని మోసగించి మలేషియాకు పారిపోయాడు. ఇటీవల ఇండియాకు తిరిగొచ్చి, తిరిగి మలేషియా వెళ్తుండగా పోలీసులు లుక్ అవుట్ జారీ చేసి ఉండటంతో తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు గుర్తించి వీఎం బంజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై తోట నాగరాజు, కానిస్టేబుళ్లు కనకారావు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావులతో కలిసి తిరుచురాపల్లి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ప్రాంషీట్ వారెంట్తో ఇక్కడికి తరలించి సత్తుపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్టాప్, సెల్ఫోన్, కొన్ని బ్యాంక్ అకౌంట్్లను సీజ్ చేసి, పోలీస్ కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని సీఐ తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని కోరారు. -
వామ్మో.. ‘ఖతర్’నాక్ మోసం!
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ప్లస్ సంస్థ తరఫున ఖతర్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల్ని నిండా ముంచారు. దీనిపై ఆ సంస్థ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేట కేంద్రంగా పని చేసే ఏపీ ప్లస్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రాంచ్లు ఉన్నాయి. ఈ కంపెనీకి సంబంధించిన ఖతర్ బ్రాంచ్లో ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో ప్రకటనలు చేశారు. అనేక మందిని ఫోన్లో ఇంటర్వ్యూలు కూడా చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. కొందరు బాధితులు ఖతర్లోని సంస్థ కార్యాలయాన్ని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఇలా విషయం తెలుసుకున్న ఆ బ్రాంచ్ అధికారులు హైదరాబాద్లోని సంస్థ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఆరా తీసిన ఇక్కడి అధికారులు నగరానికి చెందిన నలుగురికి అలాంటి లెటర్లు అందినట్లు గుర్తించారు. వీరి నుంచి రూ.13,500 చొప్పున వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు మరో రూ.35 వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఆ సంస్థ ప్రతినిధులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
ఏ ఏటికాయేడు అయితేనే..!
సాక్షి, హైదరాబాద్: ఖాకీ యూనిఫాం వేసుకోవాలి.. పోలీస్ అని పిలిపించుకోవాలి.. అని లక్షలాదిమంది యువతీ యువకుల కల. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా..? ఎప్పుడు పోలీస్ అవుదామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి స్వప్నం నెరవేర్చేందుకు మూడేళ్ల తర్వాత మరోసారి పోలీస్ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరో 20 వేల పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇటీవల హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటన చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ కూడా మరో ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, ప్రస్తుత పోలీసులు, విశ్రాంత ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)కు విన్నపాలు చేస్తున్నారు. భవిష్యత్తులో గంపగుత్తగా భారీ స్థాయిలో రిక్రూట్మెంట్లు వద్దని, ఎప్పటివి అప్పుడే భర్తీ చేయాలని కోరుతున్నారు. 3 వేల పోస్టులు సరెండర్.. రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. వాటిలో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, 1,162 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, దాదాపు 4 వేల టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లను కలుపుకొంటే 15 వేల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలినవి డీజీపీకి సరెండర్ చేశారు. కాగా, 2018 మేలో నోటిఫికేషన్ రాగానే.. లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్లో దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగానే.. ఏకంగా 7 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్ దరఖాస్తుకు రూ.800 ఫీజు కాగా, ఎస్సైకి రూ.వెయ్యిగా ఉంది. పోలీస్ బోర్డుకు ఏకంగా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. అర్హత కోల్పోయిన మూడు బ్యాచ్లు! గతంలో మాదిరిగా ఈసారి గంపగుత్త నోటిఫికేషన్లు వద్దని, ఏటా కొలువుల భర్తీ చేపట్టాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. వయోపరిమితి కారణంగా ఏటా లక్షలాది మంది అర్హత కోల్పోతున్నట్లు వాపోతున్నారు. 2018 నోటిఫికేషన్కు త్వరలో రాబోయే నోటిఫికేషన్కు మధ్య దాదాపు మూడు బ్యాచ్లకు చెందిన వేలాది మంది వయోపరిమితి కారణంగా అనర్హులయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీస్ బోర్డు చేపట్టిన నియామకాల్లో 2015లో వయోపరిమితిపై మూడేళ్ల మినహాయింపు ఇచ్చింది. 2018 రిక్రూట్మెంట్ సమయంలో రెండేళ్ల మినహాయింపు ఇచ్చింది. దీంతో వేలాదిమంది అభ్యర్థులకు ఊరట లభించింది. ఈసారి ఎంతమందికి ఊరట దక్కుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, భారీ రిక్రూట్మెంట్ల కారణంగా ప్రతీసారి పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తడం, అందరికీ పదోన్నతులు కల్పించలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి. పైగా వేలాదిమంది ఒకేరోజు జాయిన్ అయితే.. ఒకేసారి రిటైర్ కావడం వంటి ఇబ్బందులు డిపార్ట్మెంట్ను భవిష్యత్తులో ఇబ్బంది పెడతాయి. అందుకే ప్రత్యేక కేలండర్ రూపొందించుకుని ఏటా రిక్రూట్మెంట్లు చేపడితే అభ్యర్థులందరికీ అవకాశం దక్కుతుందని రిటైర్డ్ ఉద్యోగులు చెబుతున్నారు. -
ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిర్వచనం క్రమంగా మారుతోందని.. ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అభివర్ణించారు. మంగళవారం కరీంనగర్లో అర్బన్ మిషన్ భగీరథ కింద రూ.110 కోట్లతో చేపట్టిన ‘ప్రతిరోజూ తాగునీటి సరఫరా’పథకాన్ని, ఎల్ఎండీ సమీపంలో నిర్మించిన ఐటీ టవర్ను మంత్రి గంగుల కమలాకర్తో కలసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నైపుణ్యం ఒకరి సొత్తు కాదని ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతో నైపుణ్యం ఉన్న మేధావులు వస్తున్నారని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాస్తా ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారడంతో నైపుణ్యం గల వారందరికీ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కేవలం హైదరాబాద్కే పరిమితమైన ఐటీ రంగాన్ని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వరంగల్లో ఐటీ సెంటర్ను ప్రారంభించామని, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఐటీ టవర్కు కరీంనగర్ కేంద్ర స్థానం అయిందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. ఒకప్పుడు రూ.56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని, ప్రసుత్తం రూ.1.28 లక్షల కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లో విద్యను అభ్యసిస్తున్న వారు ఉద్యోగాల కోసం ఇతర పట్టణాలకు వలస పోకుండా, స్థానికంగా ఐటీ ఉద్యోగాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ చుట్టు పక్కన ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఇక్కడి ఐటీ టవర్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన నైపుణ్యాన్ని మార్చుకుంటూ వెళ్లాలని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వారికి ప్రభుత్వం తరఫున రాయితీలు కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్లో మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు. కాగా, కరీంనగర్ ఐటీ సెంటర్లో ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం కరీంనగర్ ఐటీ కంపెనీలో 432 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగా.. వారికి మంగళవారం నియామక పత్రా లు కేటీఆర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కేబుల్ బ్రిడ్జిని పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. -
‘నిరుద్యోగ భృతి’ని ప్రారంభించండి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ‘నిరుద్యోగ భృతి’పథకాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు రంగ ఉద్యోగులను తొలగించకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని బుధవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘అనేక ఐటీ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. అనేక ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు విధించాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. లాక్డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనీసం ఒక సంవత్సరం వరకు పరిస్థితి మెరుగుపడకపోవచ్చు. ఈ సమయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి కింద ఇవ్వాలి’అని ఆ ప్రకటనలో ఉత్తమ్ కోరారు. చదవండి: ‘టిమ్స్’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్: రేవంత్ రెడ్డి లాక్డౌన్ తర్వాత తెలంగాణలో నిరుద్యోగ యువకుల సంఖ్య రెట్టింపు అవుతుందని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదైన దాదాపు 24 లక్షలతో సహా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువతతో.. తెలంగాణ రాష్ట్రం రాబోయే కొద్ది నెలల్లో నిరుద్యోగ గణాంకాలలో భారీ పెరుగుదలను చూడబోతోందని, ఈ పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండవ దశ లాక్డౌన్ ముగియడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఉత్తమ్ ఆ ప్రకటనలో కోరారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం తీసుకురావాలని, తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితిపై నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
పోలీసు పిల్లలకూ ‘జాబ్ కనెక్ట్’
సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా నగర పోలీసు విభాగం నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తోంది. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వీరికి దగ్గర చేయడానికి జాబ్ కనెక్ట్ పేరుతో కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని డిజైన్ చేసిన నగర పోలీసులు కాలనీలు, బస్తీలకు వెళ్లి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు. తొలిసారిగా పోలీసు పిల్లల కోసం బుధవారం జాబ్ కనెక్ట్ నిర్వహించారు. పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్–క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ మేళాలో మూడు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చాయి. మరోపక్క సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ ప్రాంగణంలో సిబ్బంది కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన క్యాంటీన్ను పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు సీపీ టి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!
సాక్షి, విశాఖపట్నం : నిరుద్యోగులే టార్గెట్... ఉద్యోగం కోసం ఆశగా నిరీక్షిస్తున్న వారు కనిపించగానే అక్కడ వాలిపోయాడు... డీఆర్ఎం ఆఫీసులో తను పనిచేస్తున్నానని, ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి రూ.కోటికిపైగా వసూలు చేసేశాడు... అనంతరం అదుగో ఉద్యోగాలు.. ఇదిగో ఉద్యోగాలు.. అంటూ కాలం గడిపేశాడు.. చివరకు బండారం బయటపడుతుందని అనుమానం రాగానే నగరం నుంచి ఉడాయించేశాడు. దీంతో మోసపోయిన 30 మందికిపైగా బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నమ్మించి టోకరా నగరంలోని అక్కయ్యపాలెంలో ‘వైజాగ్ హోమ్స్’ పేరిట ఎయిర్ కూలర్ సర్వీస్ సెంటర్ను శ్రీకాకుళం జిల్లాకు చెందిన మురహరి సాయి సంతోష్ నిర్వహించేవాడు. అందులో నష్టాలు రావడంతో తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటి నుంచి గట్టెక్కేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడువుగా నిరుద్యోగులను తన టార్గెట్గా పెట్టుకున్నాడు. గత ఏప్రిల్ నెలలో రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు నమ్మించాడు. వారు తెలియనప్పటికీ సంతోష్ నేరుగా వెళ్లి పరిచయం చేసుకునేవాడు. డీఆర్ఎం కార్యాలయంలో హెచ్ఆర్ విభాగంలో రిక్రూట్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాను... రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. అనంతరం అతని భార్య మురహరి సుజాతని రంగంలోకి దింపేవాడు. ఆమె చాకచక్యంగా మాట్లాడుతూ నిరుద్యోగులను అక్కయ్యపాలెం పరిధి లలితానగర్లోని ఎంకే కైలాస్ టవర్స్లో అద్దెకు ఉంటున్న తమ నివాసానికి తీసుకొచ్చి నమ్మకం కలిగించేది. మరికొందరిని డీఆర్ఎం కార్యాలయానికి రమ్మని అక్కడి పరిచయాలతో నమ్మకం కలిగించేవాడు. పూర్తిగా నిరుద్యోగులను నమ్మించిన తర్వాత డబ్బులు అకౌంట్లో వేయాలని చెప్పేవాడు. ఇలా మొత్తం ఐదు అకౌంట్లలో బాధితుల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నాడు. అలా సుమారు 30 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షలు చొప్పున రూ.కోటికి పైగా వసూలు చేశాడు. సెంటర్లోని ఫర్నిచర్ తరలింపు బాధితుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వారిని నమ్మించేందుకు భువనేశ్వర్కు వెళ్లేందుకు రైలు రిజర్వేషన్ చేయించుకోమనేవా డు. ఈ క్రమంలో వారు సిద్ధమైతే వాయిదా వేసేవాడు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు అప్పట్లోనే నగరంలోని నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని ఇల్లు, వైజాగ్ హోమ్స్ సర్వీసు సెంటర్పై పోలీసులు నిఘా పెట్టారు. అయినప్పటికీ వారి కళ్లుగప్పి గురువారం రాత్రి అందులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని మురహరి సాయి సంతోష్ తరలించుకుపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న బాధితులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సంతోష్ను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదేవిషయాన్ని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 30 మందికిపైగా బాధితులు మురహరి సంతోష్ బాధితులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో 30 మందికిపైగా ఉన్నా రు. వారిలో శ్రీనివాస్, నక్కరాజు వెంకట సింహాద్రి, నక్కరాజు శివ, కర్రి సత్యారావు, గరికిన స్వర్ణ, గుర్రం అనిల్కుమార్, నక్కా రమణ, గెడ్ల మోహన్రెడ్డి, జి.వెంకట సతీష్, వళ్లు సూర్యనారాయణ, ఎల్లా త్రీనాథమ్మ, రేగిడి పద్మలతో కలిసి 30 మందికి పైగా బాధితులున్నారు. -
మంచిర్యాలలో మాయలేడి
సాక్షి, మంచిర్యాలక్రైం/బెల్లంపల్లి: ఉద్యోగాల కల్పన పేరుతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమాయకులైన నిరుద్యోగులను తన మాయమాటలతో నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసింది. ఊరు, పేరు తెలియకపోయినా.. కేవలం పరిచయమైతే చాలు.. బుట్టలో వేసుకోవడంలో ఆమెకామె సాటి. ఏం ఉద్యోగం చేస్తున్నావని, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆత్మీయురాలిగా కుశలప్రశ్నలు వేసి ఆకట్టుకోవడంలో దిట్ట. ఇలా ఆ మహిళ ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మందిని బోల్తాకొట్టించింది. రూ.కోట్లు వసూలు చేసి చివరికి ఐపీ పెట్టింది. నోటీసులు అందుకున్న బాధితులు మంచిర్యాల డీసీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిగ్రీ చదివిన ఓ ఇల్లాలు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి కన్నాల బస్తీ (ఇందిరమ్మ కాలనీ)కి చెందిన సుమలత డిగ్రీ చదువుకుంది. ఓ కొడుకు జన్మించాక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. అప్పటినుంచి సదరు మహిళ మోసాలు చేయడం అలవా టు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి బజారుఏరియా, గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఓ ఇద్దరు యువకులను అసిస్టెంట్లుగా పెట్టుకుని దందాకు తెరతీసినట్లు ప్రచారంలో ఉంది. నిరుద్యోగులే టార్గెట్ సుమలత దూర ప్రాంతాల నిరుద్యోగులను ఎంచుకుంది. ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు.. ఆమె పంట పండినట్లే. అసిస్టెంట్లతో కలిసి అద్దెకారులో బయల్దేరి నిరుద్యోగులను వెదికేవారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నట్లు అసిస్టెంట్లు నిరుద్యోగులకు పరిచయం చేసి.. సింగరేణి, ఏసీసీ, జైపూర్ విద్యుత్ ఫ్లాంట్, దేవాపూర్ ఓసీసీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైనా ఉద్యోగమైనా సరే ఉన్నతాధికారులతో మాట్లాడి పెట్టిస్తుందని, ఆమె తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నమ్మించి వలలో వేసుకునేవారు. అలా ఒక్కొక్కరి నుంచి కని ష్టంగా రూ.లక్ష.. గరిష్టంగా రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను వంచించడంలో ఆమె ఎంతగానో ఆరితేరింది. అవసరాలకు అనుగుణంగా నేతల పేర్లు సుమలత ఏమాత్రం అనుమానం రాకుండా నిరుద్యోగుల వద్ద రాజకీయ నాయకుల పేర్లు ఎన్నోసార్లు వాడుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. అధికార పార్టీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మబలికేది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల పేర్లనూ వదలలేదని సమాచారం. బాధితుల సంఖ్య పెరగడం, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీంతో సదరు కిలేడీ ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. డీసీపీని కలిసిన బాధితులు గురుకులంలో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి సదరు సుమలత 132 మంది నిరుద్యోగులను మోసం చేసి చివరికి ఐపీ నోటీసులు పంపడంతో న్యాయం చేయలంటూ బాధితులు మంచిర్యాల డీసీపీని కలిశారు. డబ్బులు తీసుకుని కొంతకాలం ఉద్యోగాల విషయం కోర్టుకేసులో ఉందని, ఎన్ని కల కోడ్ ఉందని కాలయాపన చేసి ఇప్పుడు నిం డా ముంచిందని, తీసుకున్న డబ్బులకు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్పేపర్పై అగ్రిమెంట్ కూడా రాసిచ్చిందని విన్నవించారు. ఈనెల14న ఐపీ నోటీసులు పంపిన సుమలత తన సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని పేర్కొన్నారు. పుస్తెలతాడు అమ్మిచ్చి డబ్బులు తీసుకుంది.. గురుకులంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్లి కలిశాం. నేను ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్న. ఉద్యోగానికి రూ.లక్ష అవుతుందని నమ్మిచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తామంటే ఇప్పుడే ఇవ్వాలంది. లేదంటే పనికాదంది. డబ్బుల్లేవంటే నీ మెడలో పుస్తెలతాడు, రింగులున్నయి కదా.. అవి అమ్మియ్యుమని దగ్గరుండి మరీ మార్కెట్లో అమ్మిచ్చి డబ్బులు తీసుకొని వెళ్లిపోయింది. నా బంగారం పోయింది. ఉద్యోగం రాలే. – రత్నం భారతి, బెల్లంపల్లి అప్పులపాలయినం... ఉద్యోగం వస్తుందంటే నాలుగు పైసల వడ్డీకి తెచ్చి రూ.4లక్షలు అప్పు చేసి ఇచ్చినం. రెండున్నరేళ్లుగా వడ్డీలు కట్టలేక అప్పులపాలైనం. ఉద్యోగం ఇప్పించకపోగా.. మాపేనే కేసులు పెట్టింది. ఉన్నతాధికారులు స్పందించి సుమలతపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – రామటెంకి తిరుపతి, కాసిపేట
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
లేఆఫ్స్కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement