-
Nidhi: బామ్మ మాట.... బిజినెస్ బాట
పెద్దల మాట పెరుగన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించే పెద్ద వ్యాపార సూత్రంగా మారింది. ముంబైకి చెందిన రజని, నిధి ‘గ్రాండ్మా సీక్రెట్’ పేరుతో సరదాగా ప్రారంభించిన హోమ్ మేడ్ హెయిల్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చుతోంది. దీనిని బట్టి ఏదైనా పాతకాలం నాటి కబుర్లు చెప్పినా, పాతపద్ధతులు పాటించినా, అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసే వారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో! ఎందుకంటే అప్పటి పాత ఫార్ములానే కదా... ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది. నిధి టుటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపటం అలవాటు. నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళవించి ఒక విధమైన తలనూనెను తయారు చేసేది. అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్తో నిధి తలకు మర్దనా చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది. అమ్మమ్మ చేతి నూనె మహాత్మ్యం వల్ల నిధికి తోటి విద్యార్థినులందరూ కుళ్లుకునేంత నల్లటి ఒత్తైన కేశనిధి ఉండేది. చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది. ఇంతలో దేశాన్నంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి గురుగ్రామ్ను కూడా వదల్లేదు. అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదల్లేదు. ఫలితంగా నిధి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడటం మొదలు పెట్టింది. క్రమంగా ఆమెను ఇతరులెవరూ పోల్చుకోలేనట్లు తయారైంది. అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది. తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములాను తెలుసుకుని, తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సాయం చేయగలరా అని అడిగింది. కోడలు చెప్పిన ఫార్మూలాను ప్రయత్నించింది అత్తగారైన రజని. ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్ను నిధి తలకు రాసి మర్దనా చెయ్యడం మొదలు పెట్టారు ఆ అత్తాకోడళ్లు. ఆశ్చర్యం! కొద్దిరోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాన్నిచ్చింది. పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది. ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్లు అది గమనించి, ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు. తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసి ఇమ్మని అడగడమే కాదు, అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అనిపించింది నిధికి. దాంతో తన నానమ్మ రజని సాయంతో, అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది. వీరి ఆయిల్ గురించి ఆ నోటా ఈ నోటా కాదు... కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూపులలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితం అయిన ఆయిల్ తయారీ పెద్దఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది. దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి, రజిని దువా కలిసి ‘నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్’ పేరుతో ఒక సరికొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఫలితంగా అందరి జుట్టు పెరగడం మాట ఎలా ఉన్నా, వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇప్పుడు నిధి, రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67,000 ఇళ్లకు చేరింది. నెలకు లక్ష బాటిళ్ల తయారీతో నెలకు సుమారు యాభై లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. అమ్మమ్మ ఫార్మూలా ప్రకారం ఇప్పుడు నిధి, ఆమెతో పాటు ఆమె నానమ్మగారు... స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటలపాటు మరగబెడుతూ, కలుపుతూ తయారు చేసిన ఈ హోమ్ మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిళ్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది. పాత కాలం నాటి ఫార్ములాను తేలికగా చూసే వాళ్లు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడటం సాధ్యం అవుతుందేమో! -
ACB raids: తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ తనిఖీలు..
జమ్మికుంట/వరంగల్క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి. ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్ఎన్రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. రూ.12కోట్ల అక్రమాస్తులు.. తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్ఎన్రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు. దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. -
‘ఫైవ్స్ వరల్డ్ కప్’లో భారత మహిళల జట్టు కెప్టెన్గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘హాకీ ఫైవ్స్’ ప్రపంచకప్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన యతిమరపు రజని కెప్టెన్గా వ్యవహరించనుంది. ఎఫ్ఐహెచ్ అధికారికంగా నిర్వహించే ఈ టోర్నీ ఒమన్లోని మస్కట్లో జనవరి 24నుంచి 27 వరకు జరుగుతుంది. గోల్కీపర్ రజని భారత్కు 96 మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించింది. భారత జట్టుకు మహిమా చౌదరి వైస్ కెప్టెన్గా ఎంపిక కాగా...బన్సారి సోలంకి, అక్షతా అబాసో ఢేకలే, జ్యోతి ఛత్రి, మరియానా కుజుర్, ముంతాజ్ ఖాన్, అజ్మినా కుజుర్, రుతుజ దాదాసొ పిసాల్, దీపిక సోరెంగ్ ఇతర జట్టు సభ్యులు. టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ ‘సి’లో భారత్తో పాటు నమీబియా, పోలండ్, అమెరికా ఉన్నాయి. ఫిజి, మలేసియా, నెదర్లాండ్స్, ఒమన్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా, న్యూజిలాండ్, పరాగ్వే, థాయిలాండ్, ఉరుగ్వే కూడా పాల్గొంటున్నాయి. ఆ తర్వాత జనవరి 28నుంచి 31 వరకు జరిగే పురుషుల ‘హాకీ ఫైవ్స్’ ప్రపంచకప్లో భారత సారథిగా సిమ్రన్జిత్ సింగ్ ఎంపికయ్యాడు. సూరజ్ కర్కేరా, ప్రశాంత్ కుమార్, మన్దీప్ మోర్, మంజీత్, రాహీల్, మణీందర్, పవన్ రాజ్భర్, గుర్జోత్ సింగ్, ఉత్తమ్ సింగ్ జట్టులో ఇతర సభ్యులు. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్లోని డాలస్లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
‘అభయ హస్తం’పై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రేవంత్రెడ్డి ‘అభయ హస్తం’ ఫైలుపై తొలి సంతకం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల హామీల అమలును సుగమం చేసేలా దానిని రూపొందించారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్కు చెందిన దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను సీఎస్ శాంతికుమారితో కలసి రేవంత్రెడ్డి అందజేశారు. మాట నిలబెట్టుకున్న సీఎం: హైదరాబాద్లోని న్యూ బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి కుమార్తె రజని. అక్టోబర్ 17న గాందీ భవన్కు వచ్చిన ఆమె.. తన వైకల్యం వల్ల ఉద్యో గం దొరకడం లేదని, ఆదుకోవాలని రేవంత్రెడ్డికి విన్నవించుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న రేవంత్.. అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు. గురువారం రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. రజనిని వేదికపైకి ఆహ్వనించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఆమెకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో ప్రాజెక్టు మేనేజర్గా నెలకు రూ.50వేల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. మాటను నిలబెట్టుకున్నారంటూ సీఎం రేవంత్కు రజని, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కాంగ్రెస్ ఎంపీ రజనీపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ కార్యకలాపాలను ఫోన్లో చిత్రిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రజనీ అశోక్రావ్ పాటిల్ను సభాధ్యక్షుడు జగదీప్ ధన్ఖడ్ శుక్రవారం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలయ్యే దాకా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీలపై ఆయన చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని మోదీ సమాధానమిస్తుండగా విపక్ష సభ్యుల నిరసనను పాటిల్ వీడియో తీశారు. ఆమెను సస్పెండ్ చేయాలంటూ రాజ్యసభ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ధన్ఖడ్ అన్ని పార్టీల నేతల అభిప్రాయం కోరారు. ఆమెపై చర్య తీసుకునే ముందు విచారణ జరిపితే బాగుంటుందని వారన్నారు. -
తెలుగులో ఫస్ట్ మూవీ.. పది పేజీల డైలాగ్: సీనియర్ నటి
రజని అంటే ఇప్పటి టాలీవుడ్ అభిమానులకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ అప్పటి తెలుగు సినిమా అభిమానులకు ఆమె సుపరిచితురాలు. ఆ కాలంలో ఆమె అందాల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరిగా నిలిచింది. దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఆగ్ర హీరోల సినిమాల్లోనూ కనిపించింది. ఎలాంటి సినీ నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 1985లో ‘బ్రహ్మముడి’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు రజనీ. తొలి సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. సీతారామ కల్యాణం, రెండు రెళ్ల ఆరు, అహ నా పెళ్లంట చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మజ్నులో నాగార్జున , సీతరాముల కల్యాణంలో బాలకృష్ణ సరసన నటించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజిని మాట్లాడుతూ..' దాసరి నారాయణరావు నుంచి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య దాసరి వద్దకు వెళ్లారు. ఈ సినిమాలో మీ చెల్లెలు హీరోయిన్ అని చెప్పారు. నాన్నను అడిగితే నీకు ఇష్టమైతే చేయి అన్నారు. నీ లైఫ్ నీ ఇష్టం అన్నారు. అప్పట్లో డీడీలో తెలుగు నెలకొకసారి వచ్చేది. నాకేమో తెలుగు రాదు. ఫస్ట్ డేనే కాలేజీ బ్యాక్గ్రౌండ్లో సీన్. ఈ డైలాగ్స్ అన్నీ మీవే అని ఒకాయన ఓ పది పేజీల నా చేతిలో పెట్టారు. అప్పుడే నాకు చాలా భయమేసింది. ఇక డైరెక్టర్ వస్తే బయటకు పో అనడం ఖాయమని ఫిక్స్ అయిపోయా. ఆయన చెప్పిన వెంటనే వెళ్లిపోదామనుకున్నా. నాకు తెలుగులో నమస్కారం తప్ప ఏమీ రాదు. కాసేపటికే దాసరి నారాయణరావు వచ్చారు. ఆ డైలాగ్ చెప్పడం రాదు సార్ అన్నా. వెంటనే డైలాగ్ పేపర్ ఇచ్చిన ఆయన్ను పిలిచి బయటకు పంపారు. ఆ డైలాగ్ పేపర్ తీసుకుని అవీ చదవడం నాకే కష్టంగా ఉంది నీకెలా వస్తాయన్నారు. ఆ క్షణం నాకు దేవుడిలా కనిపించారు. అప్పుడే ఆయనను గురువుగా భావించా. అంతవరకు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న నేను కాస్త కూల్ అయ్యా. 1234 వచ్చా అన్నారు. ఏ భాషలోనైనా చెప్పు.. ఏమీ రాకపోతే 1234 చెప్పు చాలు అన్నారు. నా ఫస్ట్ మూవీలో నంబర్స్తోనే నేను డైలాగ్స్ చెప్పా. బ్రహ్మముడి సినిమాతో నా కెరీర్లో తెలుగులో ప్రారంభమైంది. నేను తెలుగులో మాట్లాడాతుంటే నవ్వడం స్టార్ట్ చేస్తారు. ' అంటూ చెప్పుకొచ్చింది అలనాటి అందాల నటి రజినీ. -
Pydi Rajani: మిసెస్ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): రాజస్థాన్ రాష్ట్రం సిటీ ఆఫ్ టైగ్రేసెస్ రంతంపోర్ ప్రాంతంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి మిసెస్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీలకు ఆంధ్రా యూనివర్సిటీ స్కాలర్, ఏవీఎన్ కళాశాల ఇంగ్లిష్ విభాగాధిపతి, శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్(సేవ) అధ్యక్షురాలు పైడి రజని ఎంపికయ్యారు. గతేడాది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ టైటిల్ను ఈమె గెలుచుకున్నారు. ఆలిండియా డైరెక్టర్ దీపాలి ఫడ్నిస్ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్యం, ప్రాంతీయ నృత్యం, ప్రాంతీయ వంటకాలు, శాస్త్రీయ వేషధారణ, దేశంపై సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల నిర్వహణపై నాలుగు రోజుల పాటు జరగనున్న పోటీల్లో దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళలు పాల్గొననున్నారు. చదవండి: ఖైదీల బంక్.. రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు.. -
CM YS Jagan: సీఎం జగన్ను కలిసిన పీవీ సింధు, రజని
సాక్షి, అమరావతి: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసిన సింధు బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2022లో తాను గెలిచిన బంగారు పతకాన్ని చూపించారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్లో సాధించిన విజయాల పట్ల పీవీ సింధు, రజనీని సీఎం జగన్ అభినందించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను కలిసిన రాష్ట్రానికిచెందిన సుప్రసిద్ధ అంతర్జాతీయ క్రీడాకారులు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హాకీ క్రీడాకారిణి రజని. కామన్వెల్త్ గేమ్స్లో సాధించిన ఘనవిజయాలపట్ల అభినందనలు తెలియజేసిన సీఎం. @Pvsindhu1 #Andhrapradesh pic.twitter.com/ZH1Q4ot7Rx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 25, 2022 -
‘కామన్వెల్త్’ జట్టులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచకప్లో పాల్గొనే అవకాశం దక్కకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరుపు రజనికి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆడే ఛాన్స్ లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టులో గోల్కీపర్ రజనిని ఎంపిక చేశారు. అమ్మాయిల ప్రపంచకప్ హాకీ ముగిసిన 11 రోజుల వ్యవధిలోనే బర్మింగ్హామ్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతాయి. అయితే ఈ జట్టు కోసం పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫిట్నెస్ లేని స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఈ టోర్నీకి కూడా దూరమవగా, మూడు మార్పులతో కామన్వెల్త్ జట్టును ఎంపిక చేశారు. భారత మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), రజనీ ఎటిమార్పు, దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెపఎటన్), గుర్జిత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, నిషా, సుశీల చాను పుఖ్రంబం, మోనిక, నేహా, జ్యోతి, నవజోత్ కౌర్, సలీమా టేరియా, వందన కటరియా , లాల్రెమ్సియామి, నవనీత్ కౌర్, షర్మిలా దేవి, సంగీత కుమారి చదవండి: FIH Womens Hockey World Cup: ‘రాణి’ లేని జట్టుతో ప్రపంచకప్కు.. -
భారత మహిళల హాకీ ఫైవ్స్ జట్టు కెప్టెన్గా రజని
అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ఫైవ్స్ టోర్నీలో పాల్గొనే తొమ్మిది మంది సభ్యులుగల భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి రజని ఇటిమరపు కెప్టెన్గా వ్యవహరించనుంది. మహిమా చౌదరీ, రష్మిత మింజ్, అజ్మీనా, వైష్ణవి, ప్రీతి, మరియానా, ముంతాజ్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీ జూన్ 4, 5 తేదీల్లో స్విట్జర్లాండ్లో జరుగుతుంది. -
Savita Punia: హాకీ జట్టు కెప్టెన్గా సవితా పునియా.. గోల్కీపర్గా మన అమ్మాయి
Savita Punia To Lead Indian Women Hockey Team: సీనియర్ గోల్కీపర్ సవిత పూనియాను భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్గా నియమించారు. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అనుభవజ్ఞురాలైన సవితకు జట్టు పగ్గాలు అప్పగించారు. ఒమన్లోని మస్కట్లో ఈనెల 21 నుంచి 28 వరకు జరిగే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఇందులో 16 మంది టోక్యో ఒలింపిక్స్లో ఆడిన వారున్నారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి గోల్కీపర్ ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు Champions keep playing until they get it right. 🏋️🏃♀️🏑#WeareTeamIndia #SavitaPunia #IndianWomenHockeyTeam #HockeyIndia #gymtime #sportswomen pic.twitter.com/pKTiurTrV1 — Savita Punia (@savitahockey) November 24, 2021 -
జీహెచ్ఎంసీ లో ఉన్నత స్థాయి అధికారిణిగా స్వీపర్ రజనీ
-
గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన పీవీ సింధు, రజనీ
-
జాతీయ మహిళల హాకీ శిబిరానికి రజని
టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళల హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇటిమరపు రజని ఎంపికైంది. చిత్తూరు జిల్లాకు చెందిన రజని 2009 నుంచి భారత సీనియర్ జట్టుకు రెండో గోల్కీపర్గా వ్యవహరిస్తోంది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత జట్టులో రజని సభ్యురాలిగా ఉంది. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన మొత్తం 25 మంది క్రీడాకారిణులకు బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీలో శిబిరం నిర్వహిస్తారు., -
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే రజనీ
-
అన్న, వదిన గొడవ పడుతున్నారని..
జీడిమెట్ల: తన అన్న, వదినల మధ్య గొడవలు జరగడాన్ని తట్టుకోలేక మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చింతల్ చంద్రానగర్లో వజ్రాల రామకృష్ణారెడ్డి, రజని(34) దంపతులు నివాసం ఉంటున్నారు. రామకృష్ణా రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా, రజని గృహిణి. ఈ నెల 19న రామకృష్ణారెడ్డి ఉదయం డ్యూటీకి వెళ్లగా అతని కుమార్తె సహస్ర స్కూల్కు వెళ్లింది. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన సహస్ర తలుపు తట్టగా తల్లి ఎంతకూ తెరవకపోవడంతో కింది పోర్షన్లో ఉంటున్న వర్మకు విషయం చెప్పింది. ఆయన తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా రజని ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. రజని రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.’ తన అన్న వదినల మధ్య గొడవలు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు’ అందులో పేర్కొంది. మృతురాలి భర్త రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘నేను సవాల్ చేస్తున్నా..చంద్రబాబు'
పట్నంబజారు(గుంటూరు): ‘నేను సవాల్ చేస్తున్నా.. నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. నాపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా? నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటా.. మరి మీరేం చేస్తారో చెప్పండి.. నా సవాల్ను స్వీకరించే దమ్ముందా?’ అంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఉద్వేగభరితంగా మాట్లాడారు. చంద్రబాబు, ప్రత్తిపాటి చేసిన ఆరోపణలు నిరూపించకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లి కోటి అనే వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు, ప్రత్తిపాటిలు నీచరాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేగా తాను బరిలోకి దిగే సమయం నుంచి కోటి వ్యవహరించిన తీరు తనను మానసికంగా ఇబ్బందికి గురిచేసిందన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూనే ఉన్నాడని.. అతని చేష్టలు శృతిమించడంతో తమ పార్టీ కార్యకర్తలు పోలీసులకు íఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందుకే బీసీ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అన్యాయానికి అండగా నిలబడుతున్నారని మండిపడ్డారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో చంద్రబాబుకు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జిల్లాలో ముగ్గురు మహిళలకు సీట్లిచ్చిన ఘనత వైఎస్ జగన్ది అయితే.. ఒక్క సీటు కూడా ఇవ్వని చంద్రబాబుకు మహిళలపై ఉన్న గౌరవమేంటో తెలుస్తోందన్నారు. అనంతరం పిల్లి కోటి పెట్టిన పోస్టింగ్, అనుచిత వ్యాఖ్యలను మీడియాకు చూపారు. -
స్టోక్ కాంగ్రీపై మనోళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణలకు చెందిన విద్యార్థులు లదాఖ్ ప్రాంతంలోని 6,153 మీటర్ల స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని అధిహించారు. చిలకలూరిపేటకు చెందిన ఆలూరి సాయికిరణ్, తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా ఎల్లికల్ గ్రామానికి చెందిన మల్లికార్జున, హన్మకొండకు చెందిన ఆర్. అఖిల్లు ఈ పర్వతాన్ని అధిరోహించారు. ఈ యాత్రకు సంబంధించి తనకు ఆర్ఎస్ ప్రవీణ్ తోడ్పాటునందించారని మల్లికార్జున తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలపై అభిమానంతో సాయికిరణ్ బ్యానర్ ప్రదర్శించారు. -
వినియోగదారుల అక్కయ్య
80ల కాలంలో వినియోగదారులకు ఒక అక్కలా మార్గం చూపించిన పాత్ర రజని. తూనికల్లో, కొలతల్లో ఆటో చార్జీలలో, స్కూలు ఫీజుల్లోమధ్య తరగతివాడు ఎలా మోసపోతున్నాడో, నష్టపోతున్నాడో చూపించి, మేల్కొల్పిన పాత్ర రజని. వినియోగదారుల ఉద్యమందేశంలో ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ఈ పాత్ర, పోషించిన నటి ప్రియా టెండూల్కర్ ఎప్పటికీ గుర్తుండిపోతారు.రజని’ సీరియల్ అనగానే గంజిపెట్టిన చిన్న అంచు కాటన్ చీరలు, ముడివేసిన కొప్పు, నుదుటన పెద్దబొట్టు..‘ నాటి ప్రేక్షకుల మదిలో ఓ మధ్యతరగతి గృహిణి ఇమేజ్ అలాగే కళ్లముందు నిలిచిపోయింది. అలాగే, మొదటిసారి వినియోగదారుల హక్కుల విషయంలో అవగాహన కలిగించడానికి ‘రజని’ సీరియల్తో పెద్ద సాహసమే చేసింది దూరదర్శన్. సామాన్యుని పెన్నిధి ‘రజని’ దూరదర్శన్లో వచ్చే సీరియల్స్ నాడు విభిన్న తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవి. అలాంటి సమయంలో ముంబయ్ చిత్ర దర్శకుడు బసు ఛటర్జీకి ఒక ఆలోచన వచ్చింది. రచయిత కరన్ రజ్దాన్, అనిల్ చౌదరీలు ఛటర్జీ ఆలోచనను పంచుకున్నారు. సామాన్య మానవుడు ఎదుర్కొనే కష్టనష్టాలను రాసుకున్నారు. పిల్లాడికి స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా, ఇంటికి సమయానికి గ్యాస్ సిలిండర్ రావాలన్నా, నిత్యావసర సరుకుల కొనుగోలులో మోసాలున్నా, ఆటో–రిక్షా డ్రైవర్ల ఆగడాలను కట్టిపెట్టాలన్నా.. ఇవన్నీ సామాన్యుడు ఎదుర్కొనే సమస్యలే. ఇవన్నీ ఆ సామాన్యుడు ఎదురు తిరిగితేనే వాటికి అడ్డుకట్టవేయడం సాధ్యం. ఆ సామాన్యుడు మగ అవడం కంటే ‘ఇల్లాలు’ అయితే.. అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘రజని.’ ఏడాదికి సరిపడా కథనాలు సిద్ధమయ్యాయి. అవినీతి వ్యవస్థపై పోరాటం, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ముందుండే రజని 1985లలో బుల్లితెరపై ప్రతీ ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ప్రియా ‘రజినీ’ టెండూల్కర్ ప్రియ తన బాల్యం నుండే కళలు, సంస్కృతి పట్ల మొగ్గు చూపేవారు. ఆమె తండ్రి ప్రముఖ రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత విజయ్ టెండూల్కర్. ముంబయ్లోనే పుట్టి పెరిగారు. పద్నాలుగేళ్ల వయసులో మొదటిసారి మరాఠీ స్టేజీ మీద నటించింది. ఆ తర్వాతి కాలంలో .. ఫైవ్స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్, ఎయిర్ హోస్టెస్, పార్ట్–టైమ్ మోడల్, న్యూస్ రీడర్.. ఇలా భిన్నమైన ఉద్యోగాలు చేసింది.1974లో శ్యామ్ బెనెగల్ ‘అంకుర్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత వరసగా డజన్ మరాఠీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక కన్నడ సినిమాలోనూ నటించింది. 1985లో ‘రజని’ టీవీ సీరియల్ ద్వారా ఇండియా మొత్తం ప్రియ పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘స్వయంసిద్ధ’ అనే టీవీ సీరీస్లోనూ నటించింది. ప్రియ సహజంగానే స్వేచ్ఛావాది. సామాజిక కార్యకర్త కూడ. సామాజిక సమస్యల మీద ఎలాంటి భయం లేకుండా తన భావాలను బయటపెట్టేది. ప్రియా నిర్వహించే ‘జిమ్మెదార్ కౌన్’అనే టాక్ షోలో ఆమె ఒక మండే అగ్నికణంలా ప్రేక్షకులకు కనిపించేది. ‘పూజ న ఫూల్’ అనే గుజరాతీ సినిమాలోనూ ముఖ్యపాత్ర పోషించారు ప్రియ. ఆ మూవీ ద్వారా పెద్ద విజయాన్ని అందుకుంది. రజనీ సీరియల్లో సహనటుడైన కరణ్ రాజ్దాన్ను 1988లో పెళ్లి చేసుకున్న ప్రియ కుటుంబ కలహాలతో 1995లో విడిపోయింది. కొన్నేళ్లపాటు రొమ్ముక్యాన్సర్తో పోరాడిన ప్రియ అనే రజని 2002 సెప్టెంబర్లో గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. నిజాల నిగ్గు తేల్చే గృహిణి రజని ఒక ఆవేశపూరితమైన మహిళ. ఆమె దేనికీ భయపడదు. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరిస్తుంది. నిజాల నిగ్గు తేలుస్తుంది. ఆమె కుటుంబం మొదట కంగారుపడుతుంది తప్ప, ఎదురు చెప్పదు. తమ చుట్టుపక్కల పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా, టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఆటో, రిక్షా డ్రైవర్ల సమస్య అయినా.. జనం తరపున పోరాడటానికి రజని ముందుంటుంది. రాజకీయనాయకులు, పోలీసు అధికారులను సైతం హెచ్చరించడానికి ఆమె ఏ మాత్రం వెనుకాడదు. చెడును చూసినప్పుడు వెనకడుగువేసే ప్రసక్తేలేదు. ధైర్యంగా పోరాడుతుంది. వ్యవస్థతో పోరాడటానికి తన గొంతుకను వినిపించడానికి ఏ మాత్రం వెనుకంజవేయదు. ‘మగవాడు ఎంతటి కఠిన మార్గం మీదనైనా వెళతాడు, ఆడది అతణ్ణి అనుసరించాలి’ అని చెప్పే పెద్దల నీతి మాటలను రజని తప్పని చూపుతుంది. మార్గం ఎవరికైనా ఒకటే అని రుజువుచేస్తుంది. దారితీసిన ఉద్యమాలు ‘రజని’ ఆదివారం ఉదయం టిఫిన్ ముగించుకునే సమయానికి వచ్చేది. అరగంటపాటు అర్థవంతమైన సమస్యలపై సామాన్య మానవుడు పడే అగచాట్లను చూపేది. అన్ని ఎపిసోడ్లలో బాగా పాపులర్ అయిన ఎపిసోడ్స్..వంటకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ సమస్య. ఇప్పటిలాగా నాటి రోజుల్లో బుక్ చేసిన రెండు రోజుల్లోనే గ్యాస్ వచ్చేది కాదు. రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇల్లాళ్లు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అంతేకాదు, సిలండర్ డెలివరీచేసే ఏజెంట్లు సృష్టించే సమస్యలూ ఇన్నీ అన్నీ కావు. సామాన్య మానవుల కష్టాలు కాబట్టి ఇది అందరి నాడినీపట్టుకుంది. ముంబయ్కి చెందిన ‘ఆల్ ఇండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్’ ఈ షోకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. మరో ఎపిసోడ్లో.. టాక్సీ డ్రైవర్ల వేధింపులు. ‘తమవి చెడ్డ పాత్రలుగా సృష్టించారని, క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ముంబయ్లో 500 మంది టాక్సీ డ్రైవర్లు ఒక ఉద్యమంగా నడుస్తూ దూరదర్శన్ కార్యాలయానికి Ðð ళ్లారు. రజని ప్రభావం ఎంతటిదంటే ఓ నిశ్శబ్ద విప్లవానికి దారితీసింది. భారతీయ బుల్లితెర చరిత్రలో ‘రజని’ ఎప్పుడూ చెప్పుకోదగిన పాత్రగా మిగిలిపోతుంద’ని దర్శకుడు ఛటర్జీ గుర్తుచేసుకున్నారు. పద్మిని కొల్హాపూర్ – ప్రియా టెండూల్కర్ ప్రియా టెండూల్కర్కి ముందు ఈ షోకి బాలీవుడ్ నటి పద్మిని కొల్హాపురి అనుకున్నారట.‘అప్పటికే పద్మిని ఇండస్ట్రీలో పెద్ద తార. ఆమెతో ‘రజని’ పైలట్ ఎపిసోడ్ కూడా షూట్ చేశాం. కానీ, ఆ తర్వాత పద్మిని డేట్స్ దొరకడం గగనమైపోయింది. ఆప్పుడు యాక్టర్స్ అయిన అనితారాజ్, బిందియా గోస్వామి, ప్రియలతో విడివిడిగా పైలట్ ఎపిసోడ్స్ షూట్ చేశాం. ప్రియ ‘రజని’కి పర్ఫెక్ట్ అనుకున్నాం. అలా అందరినీ దాటుకొని ప్రియా టెండూల్కర్ని ‘రజని’ వరించింది. అది ఆమె కోసమే పుట్టిన సీరియల్ అయ్యింది’ అన్నారు బసు చటర్జీ.పదమూడు ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత ముంబయ్ చర్చిగేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో సీరియల్ టీమ్ అంతటినీ దూరదర్శన్ ఘనంగా సత్కరించింది. ఇంతటి ఘనవిజయం సాధించిన సీరియల్ కనీసం ఏడాది పాటు వస్తుందని ఆశించాం. 42 వారాలకు ఎపిసోడ్స్ రష్ సిద్ధం. కానీ, ప్రభుత్వం ఈ సీరియల్ని నిలిపివేయమని కోరింది. కారణం, సీరియల్ సామాన్యుడి వైపు ఉండటమే. ఈ సమాధానం మమ్మల్ని చాలా నిరాశపరిచింది’ అని గుర్తుచేసుకున్నారు దర్శకుడు ఛటర్జీ.‘రజని’ సీరియల్ వచ్చిన దాదాపు 27 ఏళ్లకు అమీర్ఖాన్ ‘సత్యమేవ్ జయతే’ అంటూ స్టార్ ప్లస్లో సామాజిక సమస్యల అవగాహనపై ఓ కార్యక్రమం చేశారు. బాలీవుడ్ స్టార్ని సైతం ‘రజని’ సీరియల్ ఈ విధంగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.– ఎన్.ఆర్ -
రజనీ 132
చార్మినార్: నగరంలో జీఓ నంబర్ 132 మళ్లీ తెరపైకి వచ్చింది. బోనాల ఉత్సవాల్లో రజనీ అనే ఏనుగు పాల్గొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. సోమవారం సచివాలయంలోని సి– బ్లాక్లో బోనాల జాతర ఉత్సవాలపై జరిగిన ఉన్నతస్థాయి అధికారులు, ఉత్సవాల నిర్వాహకుల సమీక్ష సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకువచ్చింది. సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులు కోరారు.నగరంలో జరిగే బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల సందర్భంగా రజనీ అనే ఏనుగునువినియోగించడం ఆనవాయితీగా వస్తుందన్న విషయాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,ఇంద్రకరణ్ రెడ్డిలకు అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు జి.నిరంజన్ వివరించారు. అమ్మవారి ఘటాలఊరేగింపులో ఆనవాయితీ.. బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి ఘటం ఊరేగింపు, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం అమ్మవారి ఘటం ఊరేగింపులతో పాటు పాతనగరంలో అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపులో జూపార్కుకు చెందిన రజనీని ప్రతి ఏటా వినియోగిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. బోనాల జాతర ఉత్సవాలతో పాటు పదో మొహర్రం సందర్భంగా జూపార్కుకు చెందిన రజనీని వినియోగిçస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాల జాతర ఉత్సవాలను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించినందున ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తిరిగి హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో ఏనుగు పాల్గొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏమిటీ జీఓ 132.. సెంట్రల్ జూ అథారిటీ విజ్ఞప్తి మేరకు మతపరమైన ఊరేగింపుల్లో రజనీ పాల్గొనరాదని 2009 డిసెంబర్ 22న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 132ను జారీ చేసింది. దీని ప్రకారం మతపరమైన ఊరేగింపుల్లో ఏనుగులు పాల్గొనడానికి అవకాశాలు లేకుండాపోయాయి. అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం కమిటీ ప్రతినిధులతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఫిర్యాదులు, చర్చలు, సంప్రదింపుల అనంతరం ఏటా బోనాల జాతర ఉత్సవాలతో పాటు మొహర్రం సంతాప దినాల్లో రజనీ ఏనుగు పాల్గొంటోంది. అప్పటి నుంచి జీఓ 132 కొనసాగుతున్నప్పటికీ.. ఏయేటికాయేడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఓ 132ను రిలాక్స్ చేస్తూ మెమోలు జారీ చేయడంతో మతపరమైన ఊరేగింపుల్లో జూపార్కుకు చెందిన ఏనుగు పాల్గొంటూ వస్తోంది. పాతబస్తీకి చెందిన ఓ ఉత్సవాల నిర్వాహకుడు తమకు ఏనుగును ఇవ్వడం లేదని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏ ఉత్సవాల్లో రజనీని వినియోగించరాదంటూ హైకోర్టు మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రజనీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొనేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అమ్మవారి భక్తులు కోరుతున్నారు. చర్యలు చేపట్టాలి.. రానున్న బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్నో దశాబ్దాలుగా బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపులో అంబారీని వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధిత ఉన్నతాధికారులు హైకోర్టును ఆశ్రయించి బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ ఏనుగు పాల్గొనేలా చర్యలు చేపట్టాలి. – జి.నిరంజన్, అక్కన్న మాదన్న దేవాలయ చైర్మన్ -
లేడీ బాండ్
ఈ రెండు నెలల్లో రజనీ ఎవరెవరి బ్యాక్గ్రౌండ్ను తవ్వుతున్నారో తెలుసు కునేందుకు ఆమెలా కొందరు గూఢచర్యం చేశారు కానీ.. రజనీ చిరునవ్వు నవ్వేందుకు తప్ప నోరు మెదపనేలేదు. చివరి విడత ఎన్నికల తర్వాత ఈ లేడీ బాండ్ తనకు అనువైన విశ్రాంతి విడిది కోసం రహస్యాన్వేషణ ప్రారంభించవచ్చు. ఇంగ్లండ్ రచయిత్రి అగాథా క్రీస్టీ నవలల్లో ‘మిస్ మార్పుల్’ అనే కల్పిత పాత్ర ఉంటుంది. మిస్ మార్పుల్ పెద్దావిడ. అవివాహిత. ‘సెయింట్ మేరీ మీద్’ అనే గ్రామంలో నివసిస్తుంటుంది. అదీ కల్పిత గ్రామమే. మార్పుల్ గూఢచారి. తొలిసారి ఆమె పాత్ర లండన్ నుంచి వెలువడే ‘ది రాయల్ మ్యాగజీన్’ 1927 డిసెంబరు సంచికలో వచ్చిన ‘ది ట్యూస్డే నైట్ క్లబ్’ ఒక చిన్న కథలో కనిపిస్తుంది. తర్వాత 1930లో క్రీస్టీ రాసిన ‘ది మర్డర్ ఎట్ ద వికారేజ్’ నవలలో కీలకమైన పాత్రగా కథను నడిపిస్తుంది. క్రీస్టీ ఇప్పుడు లేరు. నాలుగు దశాబ్దాల క్రితమే చనిపోయారు. మిస్ మార్పుల్ ఇప్పటికీ ఉంది. బహుశా ఎప్పటికీ! ప్రస్తుతం మిస్ మార్పుల్.. మన దగ్గర రజనీ పండిత్ రూపంలో ముంబైలో ఉంది! భారతదేపు తొలితరం ప్రైవేట్ మహిళా డిటెక్టివ్ రజని. అపరాధ పరిశోధనలో మాత్రమే కాదు, అంతుచిక్కని వ్యూహాలను ఛేదించడంలోనూ రజని ఎక్స్పర్ట్. ఎన్నో హత్యల్ని సాల్వ్ చేశారు. అపార్థాలతో నలిగిపోతున్న ఎందరో దంపతుల జీవితాలను చక్కబరిచారు. పేరున్న కంపెనీల్లో జరిగే విద్రోహాలను కనిపెట్టారు. ఇవన్నీ చేయడం కోసం ఆమె అనేక వేషాలు వేశారు. పనిమనిషిగా, చూపులేని మనిషిగా, గర్భిణిగా, మందమతిగా.. ఇలా అనేకం. అన్నీ కూడా తెర వెనుక ఉన్నదానిని, జరుగుతున్నదానిని బయటికి లాగేందుకే. కొన్నిసార్లు పరిస్థితులు ప్రాణాంతకం అయ్యేవి. అయినా ఆమె ధైర్యం వీడలేదు. ధైర్యం కాదు. తెగింపు అది. మిస్ మార్పుల్ లానే రజనీ కూడా అవివాహితగానే ఉండిపోయారు. ప్రస్తుతం ఆమెకు 57 ఏళ్లు. క్రీస్టీ పాత్ర మిస్ మార్పుల్తో రజనీని పోల్చడం ఎందుకంటే గూఢచర్యంలో ఆ పాత్రకు సరిసాటిగా రజనీ జీవితం నిరంతరం గుట్టు మట్లను వెలికి తీయడంలోనే గడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇంకా బిజీ. ఎన్నికల స్కెడ్యూలు మొదలైనప్పటి నుంచీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గురించి ఆరా తియ్యడానికీ, ఆ అభ్యర్థులకు పోటీగా నిలబడిన ప్రత్యర్థుల బలాలను, బలహీనతలను కూపీ లాగడానికి రజనీని ఆశ్రయిస్తూనే ఉన్నాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్.. వచ్చే ఆదివారంతో పూర్తవుతోంది కనుక రజనీ తయారు చేయబోయే రసహ్య నివేదికలు కూడా ఈ ఒకటీ రెండ్రోజుల్లో ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ‘‘ఆ తర్వాత కొంతకాలం ఏదైనా ఒక అజ్ఞాత ప్రదేశంలో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లొస్తాను’’ అంటున్నారు రజనీ పండిత్. -
అవును మేం విడిపోయాం!
చెన్నై, పెరంబూరు: అవును మేం విడిపోయాం అంటున్నారు నటుడు విష్ణువిశాల్. వెన్నెలా కబడ్డికుళ్లు చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగప్రవేశం చేసిన ఈయన విభిన్న కథా చిత్రాలతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ఇటీవల విష్ణువిశాల్ నటించిన రాక్షసన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఆయనకు నటుడు నటరాజన్ కూతురు రజనీకి 2011లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే విష్ణువిశాల్కు రజనీకి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇప్పుడు కోర్టు ద్వారా విడాకులు కూడా పొందారట. దీని గురించి నటుడు విష్ణువిశాల్ మంగళవారం తన ట్విట్టర్లో పేర్కొంటూ తాను, రజనీ ఏడాదిగా విడివిడిగా జీవిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు విడాకులు మంజూరయ్యారని తెలిపారు. తమకు ఒక కుమారుడు ఉన్నాడని, అతని మంచి భవిష్యత్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా తమ కుమారుడి బాగోగులు చూసుకుంటామన్నారు. రజనీ, తానూ చాలాకాలం సంతోషంగా జీవించామని, ఇప్పుడు అనివార్యకారణాలతో విడిపోయినా, స్నేహితులుగానే మెలుగుతామని అన్నారు. ఇది ఇరు కుటుంబాల మంచి కోసమే తీసుకున్న నిర్ణయం అని నటుడు విష్ణువిశాల్ పేర్కొన్నారు. -
రజత రజనికి స్వాగతం
రజని.. మన జిల్లా క్రీడారత్నం. హాకీలో రాణించి జిల్లాకు, దేశానికి పేరు తెచ్చిన ఆణిముత్యం. ఎర్రావారిపాళెం మండలం ఎనుములవారి పల్లె నుంచి అంతర్జాతీయ క్రీడా యవనికపై కీర్తి పతాకాన్ని ఎగరేసిన అమ్మాయి. పల్లె నుంచి ‘ఆట’ంకాలు అధిగమించి ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తూ తాజాగా ఆసియా క్రీడల్లోనూ అపూర్వ ప్రతిభ కనబరిచిందీమె. ఇండియా జట్టు కీపరుగా స్వర్ణావకాశం తప్పినా రజత పతకం సాధించడంలో కీలక భూమిక పోషించింది. జకార్తాలో జరిగిన క్రీడల్లో గెలిచాక శుక్రవారం తొలిసారి తిరుపతి చేరుకున్న ఈమెకు క్రీడాభిమానులు.. వివిధ సంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఈమెకు ప్రభుత్వం రూ.6 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. తిరుపతిలో స్వచ్ఛభారత్కు రజని బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. చిత్తూరు, తిరుపతి సిటీ: 2020లో జరిగే ఒలింపిక్స్లో భార త్ మహిళల హాకీ జట్టు తరఫున ఆడి, విజేతగా నిలిచి పతకం సాధించడమే లక్ష్యమని భారత్ మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ యతిమరపు రజని తెలిపారు. ఏషియన్ గేమ్స్లో పాల్గొని సి ల్వర్ మెడల్ సాధించి శుక్రవారం మొట్టమొదటి సారిగా తిరుపతికి విచ్చేసిన రజనికి జిల్లా క్రీడాపాధికార సంస్థ అధ్వర్యంలో అధికారులు, క్రీడా సం ఘాల ప్రతినిధులు శ్రీపద్మావతి మహిళ వర్సిటీలో పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ 20 ఏళ్ల తరువాత హాకీలో సిల్వర్ మెడల్ సాధించినట్లు తెలిపారు. 2016లో ఒకసారి మహిళా వర్సిటీకి వచ్చానని, తిరిగి 2020లో ఒలింపిక్స్లో పతకం సాధించి మళ్లీ ఇక్కడికి వస్తానని విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు ఏషియన్ గేమ్స్లో సిల్వర్ పతకం సాధించిన రజ నికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.6 లక్షలు జిల్లా కలెక్టర్ ప్రకటించారని జిల్లా క్రీడాపాధికార సంస్థ సీఈఓ లక్ష్మీ తెలిపారు. విద్యార్థులు రజనీని స్ఫూర్తిగా తీసుకుని చదువులో, క్రీడల్లో రాణిం చాలని కోరారు. తుడా చైర్మన్ నరసింహయాదవ్, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్రెడ్డి, మహిళ వర్సిటీ వీసీ దుర్గాభవాని, రెక్టార్ ఉమ మాట్లాడుతూ మారుమూల గ్రామానికి చెందిన రజని నేడు ఇండియా హాకీ జట్టులో స్థానం సంపాదించడం ఎంతో గర్వకారణమన్నా రు. అంతకు ముందు రజనీని మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు దుశ్శాలువతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ చీఫ్ కోచ్ సుదర్శనం నాయుడు, రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మిట్టపల్లి సురేంద్రరెడ్డి, ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్, బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పాండ్రవేటి గిరి, కబడ్డీ కోచ్ బాలాజీ, హాకీ కోచ్లు వెంకటరమణ, లక్ష్మీ నారాయణ, జూడో కోచ్ గోపి, రజనీ తల్లిదండ్రులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో ఘన స్వాగతం రేణిగుంట: భారత హాకీ జట్టు గోల్కీపర్ రజనీకి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒంటి గం టకు ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా క్రీడా సాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయా సంస్థల ప్రతినిధులు, విద్యార్థినులు పుష్పగుచ్ఛాలను అందించి స్వాగతం పలికారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తిని కనబరిచారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పతకం కోసం తాను పది సంవత్సరాల పాటు శ్రమించానన్నారు. ఈ స్థాయికి వచ్చాక అందరూ గుర్తిస్తున్నారే కానీ, కొన్నేళ్లపాటు తాను ఎన్నో ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. స్మార్ట్ సిటీ అంబాసిడర్గా రజని తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి స్మార్ట్ సిటీ బ్రాండ్ అంబాసిడర్గా అంతర్జాతీయ హాకీ ప్లేయర్ రజనీ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, కమిషనర్ విజయ్రామరాజు చర్చించి ఆమెను తిరుపతి స్మార్ట్ సిటీ బ్రాండ్ అం బాసిడర్గా నియమించారు. అలానే స్వచ్ఛ తిరుపతికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. హాకీలో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రజనీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై కమిషనర్ విజయ్రామరాజు హర్షం వ్యక్తం చేశారు. ‘సాక్షి’తో కమిషనర్ మాట్లాడుతూ రజనీని విద్యా ర్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తిరుపతి పరపతిని మరింత ఇనుమడింప చేసేందుకు, స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్య పరిచేందుకు రజనీ సేవలను వినియోగించుకుంటామన్నారు. -
బోనాలకు రజనీ రెడీ
చార్మినార్: బోనాల జాతర ఉత్సవాల్లో పాల్గొనడానికి రజనీ సిద్ధంగా ఉంది. ఉత్సవాల్లో రజనీ (ఏనుగు)కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అంబారిపై అమ్మవారి ఊరేగింపును కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో మావటీలు శిక్షణనిస్తున్నారు. నగరంలోని మూడు ప్రతిష్టాత్మకమైన అమ్మవారి దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతర ఊరేగింపులో రజినీ పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఎలాంటి అదురు బెదురు లేకుండా అత్యంత ఉత్సాహాంగా బోనాల జాతర ఉత్సవాల్లో రజనీ పాల్గొంటోంది. 30న ఊరేగింపు ఈ నెల 30న (సోమవారం) సికింద్రాబాద్ ఉజ్జాయినీ మహాంకాళి దేవాలయం అమ్మవారి జాతర ఊరేగింపులో రజనీ పాల్గొంటుంది. ఆగస్టు 5వ తేదీనా బోనాల సమర్పణ రోజు కార్వాన్లోని సబ్జిమండి నల్లపోచమ్మ మహాంకాళి దేవాలయం ఉత్సవాల సందర్భగా నిర్వహించే బోనాల జాతరలో రజనీ ఊరేగింపులో ఉంటుంది. 5న శ్రీ అక్కన్న మాదన్న మహాంకాళి దేవాలయం అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొననుంది. ఆరు దశాబ్దాలుగా అంబారీపై అక్కన్న మాదన్న అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతూ వస్తోందని దేవాలయం కమిటి అ«ధ్యక్షులు జి.నిరంజన్ తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement