-
Archery: ‘టాప్స్’లోకి దీపిక కుమారి
రెండేళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ‘ట్రిపుల్’ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు కల్పించారు. ఫామ్లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను ‘టాప్స్’ నుంచి తొలగించింది.2022 డిసెంబర్లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గి సత్తా చాటుకుంది.ఇవి చదవండి: బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్ -
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్
భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ స్టేజ్ 1 పోటీల్లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ సౌత్ కొరియాకు ఊహించని షాకిచ్చింది. 🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్కప్లో 14 ఏళ్ల తర్వాత భారత్కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై (చైనా): ఆర్చరీ సీజన్ తొలి ప్రపంచకప్ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో భారత క్రీడాకారుల గురి అదిరింది. మహిళల, పురుషుల టీమ్ విభాగాల్లో భారత జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి రెండు స్వర్ణ పతకాల రేసులో నిలిచాయి. బుధవారం జరిగిన టీమ్ విభాగాల నాకౌట్ మ్యాచ్ల్లో భారత జట్లు నిలకడగా రాణించాయి.ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 235–230 పాయింట్ల తేడాతో టర్కీ జట్టును ఓడించింది. అనంతరం సెమీఫైనల్లో సురేఖ బృందం 235–230 పాయింట్ల తేడాతోనే ఎస్టోనియా జట్టుపై గెలిచింది.శనివారం జరిగే ఫైనల్లో ఇటలీతో భారత మహిళల జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన సురేఖ జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ లభించింది.మరోవైపు అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్లతో కూడిన భారత పురుషుల జట్టు తొలి రౌండ్లో 233–227తో ఫిలిప్పీన్స్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 237–234తో డెన్మార్క్ జట్టుపై, సెమీఫైనల్లో 235–233తో టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టుపై విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్తో టీమిండియా పోటీపడుతుంది. -
జ్యోతి సురేఖకు రెండో స్థానం
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కొత్త సీజన్లో భాగంగా ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 711 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్కే చెందిన అదితి 704 పాయింట్లతో 8వ స్థానంలో, పర్ణీత్ కౌర్ 703 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ స్కోర్లతో కలిపి భారత బృందం 2118 పాయింట్లతో టీమ్ విభాగంలో టాప్ ర్యాంక్ను పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
శీతల్ దేవి అద్భుతం: సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ!
న్యూఢిల్లీ: ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి ‘అర్జున’ అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులు కూడా లేని శీతల్ ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడి రజత పతకం సాధించడం విశేషం. జూనియర్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీల్లో స్వర్ణం గెలుచుకోగా... ఫైనల్లో ఏక్తా చేతిలో 140–138 తేడాతో శీతల్ ఓడింది. ‘ఫోకోమెలియా’ అనే అరుదైన వ్యాధి బారిన పడి రెండు చేతులు కోల్పోయిన శీతల్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. పారా ఈవెంట్లలో కాకుండా సాధారణ పోటీల్లో పాల్గొంటే తగిన సాధన లభించడంతో పాటు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఈ ప్రయత్నం చేశామని శీతల్ కోచ్ అభిలాష వెల్లడించారు. -
స్పోర్ట్స్: ఆ ఆర్చర్ పేరు 'బొమ్మదేవర ధీరజ్'!
అక్టోబర్ 2023.. హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి. ఆర్చరీ రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ కుర్రాడొకడు పోటీ పడుతున్నాడు. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. రెండో సెట్లో మొదటి బాణంతో సున్నా స్కోరు.. నాలుగో సెట్ రెండో బాణంతో సున్నా స్కోరు.. మొత్తం ఎనిమిది బాణాల వ్యవధిలో రెండు 0, 0 స్కోర్లు.. ఎవరూ ఊహించని రీతిలో అతి ఘోరమైన ప్రదర్శన.. ఆ కుర్రాడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. నవంబర్ 2023.. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఆర్చరీ కాంటినెంటల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్... ఈ కీలక పోరులో అదే కుర్రాడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.. ఈసారి ఒక్క బాణం కూడా గురి తప్పలేదు. తన ప్రతిభనంతా ప్రదర్శిస్తూ అతను చెలరేగిపోయాడు. ఫలితంగా ఈ ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్లో భారత్ పాల్గొనేందుకు అవసరమైన తొలి అర్హత (కోటా)ను అందించాడు. తనతో పాటు సహచరులందరిలోనూ సంతృప్తి. ఆసియా క్రీడల్లో వైఫల్యంతో చోకర్ అంటూ అన్నివైపుల నుంచి విమర్శలపాలై ఆపై ఒలింపిక్స్కు అర్హత సాధించడం వరకు నెల రోజుల వ్యవధిలో అతను జీరో నుంచి హీరోగా మారాడు. ఆ ఆర్చర్ పేరు బొమ్మదేవర ధీరజ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పించింగ్’.. దీరజ్ చేసిన పొరపాటుకు సాంకేతిక నామమిది. ఆర్చర్ లక్ష్యం దిశగా బాణాలు విసురుతున్న సమయంలో ఆటగాడి ప్రమేయం లేకుండా మూడో వేలు పొరపాటున బాణం చివరన తగిలితే అది దిశ లేకుండా ఎక్కడితో దూసుకెళ్లిపోతుంది. ఇది సాంకేతికంగా జరిగిన తప్పే కావచ్చు. కానీ ఫలితం చూస్తే ఆర్చర్దే పెద్ద వైఫల్యంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అతడిని మరీ పేలవమైన ఆటగాడిగా చూపిస్తుంది. ఇలాంటి అనుభవమే ధీరజ్కు ఎదురైంది. ఆర్చరీలో 9 పాయింట్లు సాధించిప్పుడు, ఆపై పర్ఫెక్ట్ 10 సాధించలేని సందర్భాల్లో కూడా ఆర్చర్లు తీవ్రంగా నిరాశ చెందుతారు. అలాంటి సున్నా పాయింట్లు అంటే పెద్ద వైఫల్యం కిందే లెక్క. ఈ స్థితిలో ధీరజ్ అసలు తన లోకంలో తాను లేనట్లుగా కుప్పకూలిపోయి పోటీ నుంచి ఓటమిపాలై నిష్క్రమించాడు. జట్టు సహచరులు ‘నీ తప్పేం లేద’ంటూ ఓదార్చే ప్రయత్నం చేసినా అతని బాధ తగ్గలేదు. ‘క్రికెట్లో అంటే సాధారణ అభిమానులకు ఎక్కడ తప్పు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆర్చరీలో సాంకేతికాంశాలను నేను ఎలా వివరించగలను. ఇలాంటివి ఏమీ తెలియకుండా నన్ను ఆన్లైన్లో చాలామంది తీవ్ర పదజాలంతో దూషించారు. మాటల్లో చెప్పలేనంత వేదన అనుభవించాను’ అని ధీరజ్ నాటి ఘటనను గుర్తు చేసుకుంటాడు. బలంగా పైకి లేచి.. క్రీడల్లో కింద పడటం కొత్త కాదు కాని, పడ్డ ప్రతిసారి పైకి లేచేందుకు క్రీడలు అవకాశం కల్పిస్తాయి. ఘోర వైఫల్యం ఒకటి ఎదురైతే, ఆ తర్వాత మళ్లీ దానిని సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ధీరజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. కేవలం నాలుగు రోజుల్లోనే అతను తన తప్పును దిద్దుకొని సత్తా చాటేందుకు అదే ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్ వేదికగా మారింది. ‘నా వల్ల కాదు’ అంటూ ధీరజ్ సహచరులకు చెప్పినా, ‘నువ్వు బాణాలు సంధించు చాలు అంతా బాగుంటుంది’ అంటూ వారు ధైర్యం చెప్పారు. చివరకు భారత జట్టు టీమ్ విభాగంలో సగర్వంగా ఫైనల్ చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. అతాను దాస్, తుషార్ షెల్కే, ధీరజ్లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీలో ఆల్టైమ్ గ్రేట్ టీమ్ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓటమిపాలైనా, ఓవరాల్ ప్రదర్శన భారత్కు సంతృప్తినిచ్చింది. ధీరజ్ కూడా కీలక సమయాల్లో పర్ఫెక్ట్ స్కోర్లతో తన వంతు పాత్ర పోషించాడు. అలా మొదలై.. ధీరజ్ స్వస్థలం విజయవాడ. చాలామంది చిన్నపిల్లల్లాగే బాణాలతో ఆడుకునే సరదా ఆ తర్వాత అసలైన ఆట వైపు మళ్లించింది. ఐదేళ్ల వయసులో అతను ఈ ఆటవైపు బాగా ఆకర్షితుడై విల్లును అందుకున్నాడు. ఉపాధ్యాయుడైన తండ్రి తన కుమారుడిని నిరుత్సాహపరచకుండా ఆర్చరీలో ప్రాథమిక శిక్షణ వైపు తీసుకెళ్లాడు. నగరంలోని ప్రముఖ ఓల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ ఓనమాలు నేర్చుకున్నాడు. కోచ్లు చెరుకూరి లెనిన్, చెరుకూరి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో అతని ఆట పదునెక్కింది. అకాడమీలో జార్ఖండ్ నుంచి వచ్చిన ఇతర కోచ్లు కూడా అతని ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దారు. దాంతో స్థానికంగా, చిన్న స్థాయి టోర్నీల్లో విజయాలు సాధిస్తూ ధీరజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే మలుపు.. వరుస విజయాలతో దిగువ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకుంటూ వచ్చిన ధీరజ్కు కెరీర్లో మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అయితే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. ఇలాంటి సమయంలో క్రీడా ఎన్జీఓ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఓజీక్యూ) ధీరజ్ ఆటను గుర్తించడం అతని కెరీర్లో కీలకమైన మలుపు. 2017లో ప్రతిభాన్వేషణలో భాగంగా నిర్వహించిన సెలక్షన్స్లో ఓజీక్యూ ప్రతినిధి అనుకూల్ భరద్వాజ్ దృష్టిలో పడ్డాడు. తమ జూనియర్ ప్రోగ్రామ్లో ధీరజ్ను చేర్చుకొని వారు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యుత్తమ స్థాయిలో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ఎక్విప్మెంట్తో ధీరజ్ తన ఆటకు పదును పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని పరాజయాలు ఎదురైనా, అవి అతని కెరీర్కు ప్రతిబంధకం కాలేదు. 2018 యూత్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత జట్టులో అతనికి స్థానం దక్కలేదు. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్లో కూడా నాలుగో స్థానంలో నిలవడంతో ఆ అవకాశమూ పోయింది. అయితే ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకంటూ ధీరజ్ ఇతర టోర్నీల్లో సత్తా చాటుతూ వచ్చాడు. ఆర్మీ అండదండలతో.. 2017లో ఆసియా అవుట్డోర్ చాంపియన్షిప్లో వ్యక్తిగత రజతం, 2018లో ఆసియా గ్రాండ్ ప్రి టీమ్ ఈవెంట్లో రజతంతో ధీరజ్కు తగిన గుర్తింపు దక్కింది. అయితే అతని కెరీర్ గత రెండేళ్లలో మరింతగా దూసుకుపోయింది. ఈ క్రమంలో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అతని ఆటకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం కల్పించింది. అక్కడ చేరిన అనంతరం కొరియా కోచ్ కిమ్హగ్యాంగ్ శిక్షణలో ధీరజ్ రాటుదేలాడు. ఇది అతని ప్రదర్శనలలో, ఫలితాల్లో కనిపించింది. వరుసగా పెద్ద విజయాలు ధీరజ్ ఖాతాలో చేరాయి. వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో టీమ్ స్వర్ణం, వరల్డ్ కప్లో 1 స్వర్ణం, 3 రజతాలు, ఆసియా గ్రాండ్ ప్రిలో 2 స్వర్ణాలతో పాటు గత ఆసియా క్రీడల్లో రజతంతో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో భాగంగా అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. కోల్కతాలో జరిగిన ఈవెంట్లో మొత్తం 1140 పాయింట్లతో అమెరికాకు చెందిన బ్రాడీ ఎలిసన్ గత రికార్డు (1386)ను అతను సవరించాడు. ఆర్మీలో సుబేదార్ హోదాలో ఉన్న ధీరజ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం మరో పెద్ద అవకాశాన్ని కల్పించింది. ఆర్చరీలో అతి కష్టమైన, బాగా ఉండే ఈవెంట్ పురుషుల రికర్వ్ విభాగం. అయితే ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 14వ స్థానంలో ఉన్న ధీరజ్ చూపిస్తున్న ఫామ్, ఆత్మవిశ్వాసం భారత్కు ఒలింపిక్స్ చరిత్రలో తొలి ఆర్చరీ పతకాన్ని అందించవచ్చు. — మొహమ్మద్ అబ్దుల్ హాది -
అనిరుద్కు రజతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక లాస్ వేగస్ షూట్ అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్లో భారత సంతతి కుర్రాడు పింజల అనిరుధ్ కల్యాణ్ రజత పతకంతో మెరిశాడు. హైదరాబాద్లోని లంగర్హౌస్ ప్రాంతానికి చెందిన అనిరుధ్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. లాస్ వేగస్లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన అనిరుధ్ రికర్వ్ కబ్ కేటగిరీ లో పోటీపడి రెండో స్థానంలో నిలిచాడు. అనిరుధ్ మొత్తం 547 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గాడు. ఇదే టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ 898 పాయింట్లతో పదో ర్యాంక్లో నిలిచింది. -
ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ బెర్తు తెచ్చిన ధీరజ్
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో తొలి ఒలింపిక్స్ కోటా బెర్తును తెచ్చి పెట్టాడు. బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో ధీరజ్ రజతం సాధించాడు. ఫైనల్లో స్వర్ణ పతకంపై గురిపెట్టిన 22 ఏళ్ల తెలుగు కుర్రాడు 5–6తో జి సియాంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి... రజతంతో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు క్వార్టర్స్లో ధీరజ్ 6–0తో సాదిగ్ అష్రాఫి బవిలి (ఇరాన్)పై, సెమీ ఫైనల్లో 6–0తో మొహమ్మద్ హొస్సేన్ గొల్షాని (ఇరాన్)పై విజయం సాధించాడు. ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్ కోటా బెర్తు లభిస్తుంది. మహిళల విభాగంలో అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడంతో బెర్తు దక్కలేదు. -
రెండు స్వర్ణాలపై జ్యోతి సురేఖ గురి
బ్యాంకాక్: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాల కోసం విజయం దూరంలో నిలిచింది. విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీ ఫైనల్లో జ్యోతి సురేఖ 148–145తో హువాంగ్ జౌ (చైనీస్ తైపీ)పై నెగ్గింది. నేడు జరిగే ఫైనల్లో భారత్కే చెందిన పర్ణీత్ కౌర్తో సురేఖ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో పర్ణీత్ కౌర్ 147–145తో విక్టోరియా లియాన్ (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి ప్రిక్వార్టర్ ఫైనల్లో 145–146తో బొన్నా అక్తర్ (బంగ్లాదేశ్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మహిళల కాంపౌండ్ టీమ్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత జట్టు 228–217తో థాయ్లాండ్ జట్టును ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుతో సురేఖ బృందం ఆడుతుంది. మరోవైపు పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిõÙక్ వర్మ, ప్రియాంశ్, ప్రథమేశ్లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం గెలిచింది. -
చికిత ‘పసిడి’ గురి...
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ గ్రామానికి చెందిన చికిత ఫైనల్లో 143–142తో ప్రియా గుర్జర్ (రాజస్తాన్)పై గెలిచింది. మరోవైపు మహిళల టెన్నిస్ ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో పతకాన్ని దక్కించుకుంది. మహిళల టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గిన రష్మిక... డబుల్స్ విభాగంలో శ్రావ్య శివానితో రజతం సాధించింది. ఆదివారం జరిగిన సింగిల్స్ విభాగంలో రష్మిక రజత పతకం సొంతం చేసుకుంది. వైదేహి (గుజరాత్)తో జరిగిన టైటిల్ పోరులో రష్మిక 5–7, 6–7 (3/7)తో పోరాడి ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ 3 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 22వ స్థానంలో ఉంది. -
జ్యోతి సురేఖకు అపూర్వ స్వాగతం పలికిన శాఫ్ ప్రతినిధులు
సాక్షి, విజయవాడ: హాంగ్ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు. భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్ గేమ్స్ కాంపౌండ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్లో మూడు స్వర్ణాలు సాధించింది. -
మన బాణం బంగారం
ఆసియా క్రీడల్లో పన్నెండో రోజు భారత క్రీడాకారులు పసిడి ప్రదర్శనతో అలరించారు. ఆర్చరీ టీమ్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్పాల్ సింగ్ జోడీ బంగారు పతకంతో అదరగొట్టింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రజతం నెగ్గి వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకం సంపాదించడం విశేషం. మహిళల రెజ్లింగ్లో రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకంతో రాణించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖరారు చేసుకున్నారు. పన్నెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 21 స్వర్ణాలు, 32 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి 86 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్ చెన్, హువాంగ్ ఐజు, లు యున్ వాంగ్లతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్గా అవతరించింది. సెమీఫైనల్లో భారత్ 233–219తో ఇండోనేసియా జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 231–220తో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, పూర్వాషా షిండేలతో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గగా... 2018 జకార్తా ఏషియాడ్లో జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన టీమిండియా రజతం కైవసం చేసుకుంది. మూడో ప్రయత్నంలో భారత్ ఖాతాలో స్వర్ణం చేరడం విశేషం. ఈ మూడుసార్లూ జ్యోతి సురేఖ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ‘ఆసియా క్రీడల్లో తొలిసారి టీమ్ స్వర్ణం నెగ్గినందుకు సంతోషంగా ఉన్నాం. శనివారం నా వ్యక్తిగత విభాగం ఫైనల్ కూడా ఉంది. ఆ ఈవెంట్లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్ జూ, జేవన్ యాంగ్, కింగ్ జాంగ్హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్ 235–224తో చైనీస్ తైపీపై, క్వార్టర్ ఫైనల్లో 235–221తో భూటాన్పై, తొలి రౌండ్లో 235–219తో సింగపూర్పై గెలుపొందింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్లో రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు తొలిసారి పసిడి పతకం గెలిచింది. సురేఖ బృందానికి సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: తమ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. విజయ వాడకు చెందిన జ్యోతి సురేఖ సాధించిన విజయంపట్ల తనతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడుతోందన్నారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ సీఎం వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. -
Asian Games: అదరగొట్టేశారు.. మన అమ్మాయికి ‘మరో’ స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో భారత్ అదరగొట్టింది. చైనాలోని హెంగ్జూ వేదికగా గురువారం నాటి ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణం గెలిచింది. బంగారు తల్లులు వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్ ఈ మేరకు దేశానికి మరో పసిడి పతకం అందించారు. మన అమ్మాయికి మరో స్వర్ణం తైపీ ప్లేయర్లు యీ- సువాన్ చెన్, ఐ- జో హాంగ్, లూ- యన్ వాంగ్లను 230-229తో ఓడించి గోల్డ్ మెడల్ సాధించారు. కాగా భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖకు 19వ ఆసియా క్రీడల్లో ఇది రెండో స్వర్ణం కావడం విశేషం. ఓజస్ ప్రవీణ్ దేవ్తలే (భారత్)తో కలిసి ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో సురేఖ పసిడి పతకం అందుకున్న విషయం తెలిసిందే. 19 స్వర్ణాలు బుధవారం నాటి ఫైనల్లో జ్యోతి సురేఖ–ఓజస్ ప్రవీణ్ జంట 159–158తో సో చేవన్–జేహూన్ జూ (దక్షిణ కొరియా) ద్వయంపై గెలుపొందింది. అంతకుముందు సురేఖ–ఓజస్ సెమీఫైనల్లో 159–154తో కజకిస్తాన్ జోడీపై, క్వార్టర్ ఫైనల్లో 158–155తో మలేసియా జంటపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ గెలుపుతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 83(19 గోల్డ్, 31 సిల్వర్, 32 బ్రాంజ్) మెడల్స్ ఇండియా ఖాతాలో ఉన్నాయి. చదవండి: Gautam Gambhir: వన్డేల్లో ఇదే చివరి ప్రపంచకప్ టోర్నీ? ఆ బద్దకస్తులంతే! సిరాజ్, బుమ్రా సూపర్.. -
కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ వెన్నమ్, ఓ జూస్ డియోటాలే జోడీ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది. కాగా ఆసియా క్రీడల్లో ఇది భారత్కు 16 స్వర్ణం. ఓవరాల్గా ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 71 పతకాలు కైవసం చేసుకుంది. చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్జంప్లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్వాల్ట్లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
క్వాలిఫయింగ్లో జ్యోతి సురేఖ ‘టాప్’
Asian Games 2023- Archery: ఆసియా క్రీడల ఆర్చరీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ టాప్ ర్యాంక్లో నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్లో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్కే చెందిన ప్రపంచ చాంపియన్ అదితి స్వామి 696 పాయింట్లతో నాలుగోర్యాంక్ను దక్కించుకుంది. టీమ్ విభాగంలోనూ భారత్కు టాప్ ర్యాంక్ దక్కింది. టీమిండియా 2087 పాయింట్లు స్కోరు చేసి నేరుగా క్వార్టర్ ఫైనల్లో పోటీపడనుంది. ధీరజ్కు ఆరో ర్యాంకు పురుషుల కాంపౌండ్ క్వాలిఫయింగ్లో ఓజస్ ప్రవీణ్ దేవ్తలే 709 పాయింట్లతో మూడో ర్యాంక్లో, అభిషేక్ వర్మ 708 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో నిలిచారు. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్లో అతాను దాస్ 678 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ 675 పాయింట్లతో ఆరో ర్యాంక్లో నిలిచారు. మహిళల రికర్వ్ క్వాలిఫయింగ్లో అంకిత 649 పాయింట్లతో పదో ర్యాంక్లో, భజన్ కౌర్ 640 పాయింట్లతో 14వ ర్యాంక్లో నిలిచారు. -
పౌరాణిక సినిమాలు చూసి ఆకర్షితుడై.. గోల్డ్ మెడల్! ఒలింపిక్స్ లక్ష్యంగా..
చాట్ల అక్షయ్.. విలువిద్యలో సత్తా చాటుతున్నాడు. గురితప్పని సాధనతో విజయాలను తన విలువిద్యతో సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. సాధారణంగా పౌరాణిక సినిమాలు చూసే అలవాటున్న అక్షయ్ ఆ సినిమాల్లోని బాణాల వైపు ఆకర్షితుడయ్యాడు. అది గమనించిన తండ్రి ఆర్చరీలో శిక్షణను ఇప్పించడంతో అతనిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసింది. నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన చాట్ల రాజేష్, సుమలకు ఇద్దరు మగ పిల్లలు. ఇద్దరూ విలువిద్యల్లో రాణిస్తున్నారు. పెద్దబ్బాయి చాట్ల అక్షయ్ మహదేవ్ 2019లో విలువిద్య సాధన ప్రారంభించారు. 3వ తరగతిలో ప్రారంభమైన విలువిద్య 8వ తరగతికి వచ్చేసరికి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రారంభించిన ఏడాది నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రాణించడం మొదలు పెట్టారు. ఐదేళ్లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. విలువిద్యలో మూడు సెగ్మెంట్లు ఉంటాయి. ఇండియన్ రౌండ్ సెగ్మెంట్ జాతీయ స్థాయిలో, రికార్వ్ సెగ్మెంట్ ఒలింపిక్స్లో, కాంపౌండ్ సెగ్మెంట్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తుంటారు. ఆకాష్ మహదేవ్ క్లిష్టతరమైన రికార్వ్ సెగ్మెంట్లో రాణించడం విశేషం.- నెల్లూరు (స్టోన్హౌస్పేట) కాస్ట్లీ క్రీడ... అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో రాణించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. నెల్లూరులో ఆర్చరీకి తగిన ఆదరణ లేని సమయంలో అక్షయ్ మాధవ్ తాత చాట్ల నర్సింహారావు స్కూల్ డైరెక్టర్గా తన స్కూలు కోసం ఒక ఆర్చరీ అకాడమీని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక విల్లు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటుంది. బాణాలు రూ.12 వేలు, రూ.40 వేలు వరకు విలువ చేస్తాయి. ఇక టార్గెట్ పేస్లు, టార్గెట్ బట్టర్స్ ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడినవే. ఇప్పటి వరకు విజయవాడ, హైదరాబాదులకు పరిమితమైన ఈ ఆర్చరీ శిక్షణ నెల్లూరులో ప్రారంభం కావడంతో అక్షయ్కు కలిసి వచ్చింది. ఖర్చు అధికమైనప్పటికీ ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.40 నుంచి 6.30 గంటల వరకు సాధన చేస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతూ పాల్గొన్న ప్రతి పోటీల్లో పతకం సాధించేవాడు. ఖర్చు అధికమైనప్పటికీ స్కూల్లో పిల్లలు సైతం విలు విద్యలో రాణిస్తారని, ఏకాగ్రత సాధించగలుగుతారని స్కూల్ డైరెక్టర్ చాట్ల నర్సింహారావు తెలిపారు. అక్షయ్ మహదేవ్లో విలువిద్య క్రీడా ఆసక్తిని గమనించిన తండ్రి రాజేష్ శిక్షణ ఇప్పించేందుకు జార్ఖండ్ నుంచి దివ్య ప్రకాష్ను ఎంపిక చేసుకున్నారు. కోచ్ దివ్య ప్రకాష్ ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం సాధనలు చేస్తున్నాడు. జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి పావురాల వేణు, రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చేకూరి సత్యనారాయణలు మంచి సహాయ సహకారాలను అందచేస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు బాటలు వేస్తున్నారు. పతకాలిలా... 2022వ సంవత్సరం నుంచి జరిగిన ప్రతి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అక్షయ్ ప్రతిభ కనపరిచారు. 2023 జూలైలో శ్రీలంకలో జరిగిన కొలంబో ఓపెన్ ఆర్చరీ ఇంటర్నేషనల్ పోటీల్లో అండర్–12 రికార్వ్ విభాగంలో గోల్డ్ మెడల్ను, 30 మీటర్ల ఓపెన్ రికార్వ్ పోటీల్లో సిల్వర్ మెడల్ను సాధించి అబ్బుర పరిచారు. గోల్డ్ మెడల్ లక్ష్యం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి దేశానికి పేరు తెస్తాను. చదువుల్లో రాణించి ఐఏఎస్ అధికారి కావాలన్నది కోరిక. ఉదయం సాయంత్రం సాధన చేస్తూ చదువుల్లో కూడా రాణిస్తాను. పోటీల్లో పాల్గొనడం వల్ల వివిధ క్రీడాకారుల ఆట తీరు, పలు ప్రాంతాల పరిస్థితులు అవగాహన చేసుకోవచ్చు. చదువుకుంటూనే ఇష్టమైన క్రీడల్లో రాణించవచ్చు. తాతయ్య, అమ్మ నాన్నలు, కోచ్లు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. – చాట్ల అక్షయ్ మహదేవ్ చదవండి: అక్క చేసిన ఆ పని వల్లే.. ఇలా! ఆ తల్లికేమో ‘భయం’.. అందుకే తండ్రితో పాటు! -
చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్.. వరల్డ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం
World Archery Championships-Berlin: భారత మహిళా ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా (17) ప్రపంచ రికార్డు నెలక్పొంది. బెర్లిన్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ కాంపౌండ్ మహిళల విభాగంలో స్వర్ణం గెలవడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఆర్చరీలో భారత్ తరఫున మొదటి వ్యక్తిగత ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. Aditi Swami gets the FIRST individual WORLD TITLE for India. The 17-year-old prodigy is now the world champion. 🏆#WorldArchery pic.twitter.com/oBbtgxyzq3 — World Archery (@worldarchery) August 5, 2023 ఇవాళ (ఆగస్ట్ 5) జరిగిన ఫైనల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాను 149-47 ఓడించడం ద్వారా జగజ్జేతగా నిలిచి, విశ్వ వేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. ఇదే పోటీల్లో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, పర్ణీత్ కౌర్లతో కలిసి మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన అదితి.. గంటల వ్యవధిలో భారత్కు మరో స్వర్ణం అందించింది. Kudos to #KheloIndia Athlete Aditi Gopichand Swami on being crowned World Champion in the Women's Individual Compound Final at the #ArcheryWorldChampionships🇩🇪🏹 and bagging the🥇 for 🇮🇳 with a near perfect score of 149 points💪👏 With this victory she has become the first… pic.twitter.com/m6kd0Y9ifK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2023 ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న అదితి.. గత నెలలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలను సాధించింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ఫైనల్ షూట్-ఆఫ్లో నెదర్లాండ్స్కు చెందిన సన్నె డి లాట్ను ఓడించిన అదితి.. సెమీఫైనల్లో సహచరి, ఆంధ్ర అమ్మాయి జ్యోతి సురేఖపై విజయం సాధించి ఫైనల్కు చేరింది. -
క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లిన జ్యోతి సురేఖ
బెర్లిన్ (జర్మనీ): గురి తప్పని ప్రదర్శనతో భారత స్టార్ ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది. క్వాలిఫయింగ్లో రెండో ర్యాంక్లో నిలిచిన జ్యోతి సురేఖకు నేరుగా మూడో రౌండ్కు ‘బై’ కేటాయించారు. మూడో రౌండ్ మ్యాచ్లో జ్యోతి సురేఖ 139–136తో లికోఅరెలో (అమెరికా)పై, నాలుగో రౌండ్లో 148–145తో ఓ యూహున్ (దక్షిణ కొరియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ధీరజ్ పరాజయం పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6తో రికార్డో సాటో (చిలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. -
అమన్–ప్రగతి జోడీకి పసిడి పతకం
World University Games: ప్రపంచ విశ్వ విద్యాలయాల క్రీడల్లో భారత్కు నాలుగో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన ఆర్చరీ ఈవెంట్లో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అమన్ సైని–ప్రగతి (భారత్) జోడీ పసిడి పతకం సాధించింది. ఫైనల్లో అమన్ సైని–ప్రగతి ద్వయం 157–156తో సువా చో–సెయుంగ్హున్ పార్క్ (కొరియా) జోడీపై గెలిచింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో భారత్కు కాంస్యం, మహిళల టీమ్ విభాగంలో భారత్కు రజత పతకం లభించాయి. ఎదురులేని సౌత్జోన్ పుదుచ్చేరి: దేవధర్ ట్రోఫీ దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ లో సౌత్జోన్ జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. ఈస్ట్జోన్ జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్లో సౌత్జోన్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా ఈస్ట్జోన్ 46 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. విరాట్ సింగ్ (49; 4 ఫోర్లు, 1 సిక్స్), శుభ్రాన్షు సేనాపతి (44; 5 ఫోర్లు), ఆకాశ్దీప్ (44; 3 ఫోర్లు, 4 సిక్స్లు), ముక్తార్ హుస్సేన్ (33; 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. సౌత్జోన్ బౌలర్లు సాయికిశోర్ (3/45), వాసుకి కౌశిక్ (3/37), విద్వత్ కావేరప్ప (2/40) ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. అనంతరం సౌత్జోన్ 44.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, 1 సిక్స్), సాయి సుదర్శన్ (67 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించి సౌత్జోన్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇతర మ్యాచ్ల్లో సెంట్రల్జోన్ ఎనిమిది వికెట్ల తేడాతో నార్త్ఈస్ట్ జోన్ జట్టుపై, వెస్ట్జోన్ ఆరు వికెట్ల తేడాతో నార్త్జోన్పై విజయం సాధించాయి. -
బుడతా..! నీ టాలెంట్కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్ను గురి చూసి కొడుతున్నాడు. దూరంలో ఉన్న లక్ష్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rudra Pratap singh (@littleyogaguru) ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్కు హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన్నోడు టాలెంట్ చూసేయండి. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
అడవి రాముడు లింబా రామ్.. గురి పెట్టాడో..!
వెదురుతో చేసిన విల్లు, బాణాలు.. అడవిలో సరదాగా పోటీలు.. చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం..15 ఏళ్ల వయసు వచ్చే సరికి కూడా అతనికి అదే జీవితం.. ఏనాడూ అతను తన విలువిద్యతో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అంది పుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు. సరైన మార్గనిర్దేశనంతో అతను ఏకంగా ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్గా మారి తర్వాతి రోజుల్లో భారత్లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. ఒక దశలో ఆ క్రీడలో అతని పేరు మినహా ఇంకెవరినీ.. సాధారణ క్రీడాభిమాని గుర్తు పట్టలేని స్థాయికి చేరిన ఆ వ్యక్తి లింబా రామ్. అతిసాధారణ గిరిజన నేపథ్యం నుంచి ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు పొందిన ఆర్చర్. 1987.. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఐఏఎస్ అధికారి బియ్యాల పాపారావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ‘సాయ్’లో వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ‘సాయ్’లో ఒక రకమైన ప్రత్యేక టైమ్టేబుల్తో పాటు అక్కడ శిక్షణ కోసం ఎంపికయ్యేందుకు దాదాపు ఒకే తరహా పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనేది పాపారావు ఆలోచన. సహజ ప్రతిభను వెలుగులోకి తెచ్చి తగిన రీతిలో శిక్షణ ఇస్తే సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సత్తా చాటగలరనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన దృష్టి్ట గిరి పుత్రులపై పడింది. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్కి చెందిన వ్యక్తి కావడంతో వారి గురించి ఆయనకు అవగాహన ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ‘స్పెషల్ ఏరియా గేమ్స్’ పేరుతో కొత్త తరహా సెలక్షన్స్కి శ్రీకారం చుట్టారు. ఆర్చరీలో కూడా ఇదే తరహాలో సెలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు అడవిలో విల్లు, బాణాలతో వేటకే పరిమితమైనవారికి ఇలా ఓపెన్ సెలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. కొందరు మిత్రులు ఇచ్చిన సమాచారంతో లింబా రామ్ కూడా దీనికి హాజరయ్యాడు. అతనిలోని సహజ ప్రతిభను అధికారులు గుర్తించి వెంటనే ఎంపిక చేశారు. అక్కడినుంచి లింబా రామ్ ప్రయాణం ఢిల్లీలోని ‘సాయ్’ కేంద్రానికి సాగింది. అది ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే వరకు చేరింది. అడవి బిడ్డ నుంచి ఆర్చర్గా.. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ జిల్లా సరాదీత్ గ్రామం లింబా రామ్ స్వస్థలం. ఐదుగురు సంతానంలో అతనొకడు కాగా, తండ్రి వ్యవసాయ కూలీ. వారి కుటుంబం ‘అహారి’ అనే గిరిజన తెగకు చెందింది. పేదరికం కారణంగా లింబా రామ్.. తన సోదరుల్లాగే కూలీ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. స్నేహితులతో కలసి సరదాగా వేటకు కూడా వెళ్లేవాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ‘అర్జున్ రామ్’ అనే పేరు పెట్టారు. అయితే చిన్న వయసులో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైన అతను దాదాపు మృత్యువుకు చేరువగా వెళ్లాడు. అదృష్టవశాత్తు కోలుకోవడంతో అర్జున్ అనే పేరు తీసేసి స్థానిక దేవత పేరు మీద ‘లింబా’ అని చేర్చారు. అలా ఆ పేరులోంచి అర్జునుడు పోయినా.. ఆ తర్వాత భవిష్యత్తులో అతను అభినవ అర్జునుడిలా బాణాలు సంధిస్తూ విలువిద్యలో నేర్పరి కావడం దైవానుగ్రహమే కావచ్చు! వెదురు బాణాలతో వేటాడటం, స్థానికంగా కొన్ని పోటీల్లో పాల్గొనడం మినహా ఆర్చరీ అనే ఒక అధికారిక క్రీడ ఉందని, అందులో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చనే విషయం అప్పటికి లింబా రామ్కి అసలు తెలీదు. అయితే ‘సాయ్’ సెలక్షన్స్ అన్నీ మార్చేశాయి. సరైన చోట, సరైన శిక్షణతో.. స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో కొత్త విద్యార్థిగా చేరిన లింబా రామ్కి అక్కడి ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వెదురు విల్లుకే పరిమితమైన అతని చేతికి తొలిసారి ఆధునిక విల్లు, బాణాలు వచ్చాయి. భారత కోచ్ ఆరెస్ సోధీ పర్యవేక్షణలో శిక్షణ మొదలైంది. రష్యా కోచ్ అలెగ్జాండర్ నికొలయ్ జట్టుకి కోచ్గా కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ‘నువ్వు ఈ ఆట కోసమే పుట్టావురా’ అంటూ సోధీ చెప్పిన మాట లింబా రామ్లో స్ఫూర్తి నింపి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ ఎంపికకు కారణమైన పాపారావు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లింబా రామ్ని ప్రోత్సహించారు. దాని ఫలితాలు కొన్ని నెలలకే కనిపించాయి. బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్స్లో విజేతగా నిలవడంతో లింబా రామ్పై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాతా అదే జోరును కొనసాగించిన అతను సంవత్సరం తిరిగే లోపే జాతీయ స్థాయి సీనియర్ చాంపియన్గా కూడా మారాడు. దాంతో 16 ఏళ్ల వయసులోనే భారత ఆర్చరీ టీమ్లో లింబా రామ్కి చోటు దక్కింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు భారత ఆర్చరీపై తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో ఘనతలను తన ఖాతాలో లిఖించుకున్నాడు. ప్రపంచ రికార్డు కూడా.. 1989లో స్విట్జర్లాండ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్ షిప్ తొలిసారి లింబా రామ్కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును అందించింది. ఈ ఈవెంట్లో అతను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆసియన్ కప్లో చక్కటి ప్రదర్శనతో లింబా ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టీమ్ ఈవెంట్లో భారత్కి రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాతి ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్కి నాలుగో స్థానం దక్కడంలో అతనిదే ప్రధాన భూమిక. మరో రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియన్ ఆర్చరీ చాంపియన్ షిప్ లింబా రామ్ కెరీర్లో అత్యుత్తమ దశ. బీజింగ్లో జరిగిన ఈ పోటీల వ్యక్తిగత విభాగంలో అతను స్వర్ణం సాధించడంతో పాటు 358/360 స్కోరుతో అప్పటి ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ఆర్చరీ చాంపియన్ షిప్లో కూడా అతను ఒక స్వర్ణం, ఒక రజతంతో మెరిశాడు. కెరీర్ చివర్లో కుర్రాళ్ల మధ్య మరోసారి జాతీయ చాంపియన్గా నిలిచి లింబా తన ఆటను ముగించాడు. అచ్చిరాని మెగా ఈవెంట్.. ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒలింపిక్స్ పతకం సాధించడం ఒక కల. లింబా రామ్కి వరుసగా మూడు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం వచ్చినా పతకం మాత్రం దక్కలేదు. ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు తెచ్చుకున్నా, మూడుసార్లూ నిరాశే ఎదురైంది. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్లో ఆడినా.. అందులో అతని అనుభవరాహిత్యం కనిపించింది. 1992 బార్సిలోనా సమయంలోనైతే అతను మంచి ఫామ్లో ఉన్నాడు. తాజా వరల్డ్ రికార్డుతో అతనిపై మంచి అంచనాలూ ఉన్నాయి. తనపై మెడల్ గురించి ఉన్న ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. ‘నువ్వు పతకం గెలవడం ఖాయం. ఇక్కడి నుంచే మెడలో పతకంతో తీసుకెళ్లి భారత్లో మా భుజాలపై ఊరేగిస్తాం’ అంటూ ఫెడరేషన్ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. చివరకు అక్కడ నిరాశే ఎదురైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో కూడా ఆటగాడిగా మెరుగైన స్థితిలోనే ఉన్నా.. ఒలింపిక్స్ కొద్ది రోజుల ముందు ఫుట్బాల్ ఆడుతున్న అతని భుజానికి తీవ్ర గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. లింబా రామ్ ఘనతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో అతనిని గౌరవించింది. ఈతరం ఆధునిక ఆటగాళ్ల ప్రదర్శనలతో పోలిస్తే లింబా రామ్ సాధించిన విజయాలు తక్కువగా అనిపించవచ్చు. కానీ భారత్లో ఆర్చరీకి గుర్తింపు తెచ్చి కొత్త బాట చూపించినవాడిగా అతని పేరు ఎప్పటికీ నిలిచిపోంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
గురి తప్పని బాణాలు
పిఠాపురం: మనసును.. దృష్టిని లక్ష్యంపై కేంద్రీకరించి వంద శాతం ఏకాగ్రతతో ఆడాల్సిన ఆట విలువిద్య. సనాతన భారత ఇతిహాసాలలో కనిపించే విలు విద్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆర్చరీ క్రీడను నేర్చుకునేందుకు చిన్నారులు క్యూ కడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, ఆలమూరు, రాజోలు, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో వేసవి విలు విద్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్రీడాకారులు 200లకు పైగా ఉండగా.. రిజిస్టర్ కాని క్రీడాకారులు వెయ్యి మందికి పైగా ఉన్నారు. వీరిలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పతకాలు సాధించిన క్రీడాకారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విలు విద్యా క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడంతో ఆర్చరీకి డిమాండ్ పెరిగింది. వేసవి శిబిరాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఏమంటున్నారంటే.. దేశానికి పేరు తెస్తా చిన్నప్పటి నుంచి విలువిద్య అంటే ప్రాణం. 2016లో జిల్లాస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం, 2022లో సీనియర్స్ విభాగంలో స్వర్ణ పతకం, సీనియర్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఇంటర్ చదివిన నేను ప్రస్తుతం తాపీ పని చేసుకుంటూ ఆర్చరీలో మరింతగా శిక్షణ పొందుతున్నాను. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే మరిన్ని పతకాలు సాధించి దేశానికి.. రాష్ట్రానికి మంచి పేరు తేవాలన్న సంకల్పంతో ఉన్నాను. – పి.కృష్ణ, పిఠాపురం జాతీయ స్థాయిలో రాణిస్తా పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్నా. చిన్నప్పటి నుంచి పుల్లలతో బాణాలు తయారు చేసుకోవడం సరదా. దానిని చూసిన మా స్కూల్ పీడీ మంగయ్యమ్మ నన్ను విలువిద్య నేర్చుకోమని చెప్పారు. అందుకే.. శిక్షణ పొందుతున్నాను. 2016లో కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొన్నాను. 2023 కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. – పి.మహాలక్ష్మి, పిఠాపురం శిక్షణ బాగుంది నేను 3వ తరగతి చదువుతున్నాను. బాణాలంటే చాలా ఇష్టం. అది చూసి అమ్మానాన్న విలువిద్య నేర్పించారు. కాకినాడ జిల్లా సర్పవరంలో జరిగిన జిల్లాస్థాయి ఆర్చరీ పోటీల్లో రజత పతకం సాధించా. జాతీయ స్థాయిలో రాణించాలన్న సంకల్పంతో శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ శిక్షణ బాగుంది. – ఎస్.కృష్ణ అభిరామ్, పిఠాపురం ఆసక్తి పెరిగింది విలువిద్యపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఏటా క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాలు సాధించడమే ధ్యేయంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో విలువిద్య క్రీడాకారులకూ ఉద్యోగావకాశాలు కల్పిస్తుండటంతో ప్రోత్సాహం పెరిగింది. – పి.లక్ష్మణరావు, ఆర్చరీ కోచ్, పిఠాపురం -
ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం అర్హత
ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ ప్రపంచకప్ ఫైనల్స్కు భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్లో మెక్సికోలో జరుగుతుంది. తుర్కియేలో గతవారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనతో సురేఖకు మరో మూడు ప్రపంచకప్లు మిగిలి ఉండగానే ఫైనల్స్కు బెర్త్ దక్కింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ కొలంబియాలో జూన్ 13 నుంచి 18 వరకు జరుగుతుంది. -
ప్రపంచ ర్యాంకింగ్స్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి.. ఏకంగా 7 స్థానాలు ఎగబాకి..!
ప్రపంచకప్లో రెండు స్వర్ణాలు సాధించి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లో సురేఖ 4వ స్థానానికి (కాంపౌండ్) చేరుకుంది. ఇప్పటి వరకు 11వ ర్యాంక్లో ఉన్న ఆమె తాజా ప్రదర్శనతో ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకటం విశేషం.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement