-
పండగొస్తోంది...మిక్సర్ గ్రైండర్ క్లీనింగ్ టిప్స్ : కొత్తగా మెరుస్తుంది
పూర్వకాలంలాగా రోళ్లు, కలం, తిరగళ్లు ఇపుడు పెద్దగా వాడటం లేదు. అవి ఎలా ఉంటాయో, ఎలా పనిచేస్తాయో కూడా ఈ తరం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇపుడంతా మిక్సీలు, గ్రైండర్లు మయమే. అటు ఉగాది పండుగ సమీపిస్తోంది. ఉగాది నుంచి వరుసగా పండుగలు షురూ అవుతాయి. చుట్టాలు, పక్కాలు.. కొత్త అల్లుళ్లు.. హితులు..స్నేహితులు ..ఈ సందడి మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో మన వంట ఇంటిలో అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మిక్సీ గ్రైండర్. మిక్సర్ గ్రైండర్ లేకుండా వంటను ఊహించుకోవాలంటేనే కష్టం. ఒక్కోసారి జార్స్ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరిగ్గా పని ఉన్నపుడో, చుట్టాలొచ్చినపుడో పని చేయనని మొరాయిస్తుంటాయి. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పచ్చళ్లు, రకరకాల పొడులు, పొడులు, అల్లం వెల్లుల్లి, ఇతర పేస్ట్లు చేసేందుకు మిక్సీ గ్రైండర్ వాడతాం. వాడిన తరువాత ఎప్పటికపుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి. గాస్కట్ (జార్ మూత చుట్టూ ఉండే రబ్బరు) బ్లేడ్లు కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. లేదంటే మిక్సీజార్తో పని ఎంత సులువో, అది మొరాయిస్తే అంత కష్టం. ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా ఉంచుకుంటేనే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఎక్కువరోజులు మన్నుతాయి. మిక్సీని, జార్స్ని ఎలా క్లీన్ చేయాలి? వంటసోడా: మురికి పట్టి, మొరాయించిన మిక్సీ జార్ సరిగ్గా పనిచేయాలంటే.. బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ పౌడర్లో కొద్దిగా వేడి నీరు పోసి పేస్టులా చేయండి. దీంతో జార్స్ని అప్లై చేసి, కొద్దిగా జార్లో వేసిన రెండు సార్లు తిప్పాలి. ఈ తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి. వెనిగర్: వెనిగర్, నీళ్లు కలిపి జార్స్లో వేసి కాసేపు అలానే ఉండనివ్వండి. ఒక్కసారి మిక్సీ వేయండి. తరువాత నీటితో క్లీన్ చేస్తే బ్లేడ్లు, జార్ మొత్తం శుభ్రంగా తయారవుతుంది. పిండి , జార్లో పేరుకుపోయిన వ్యర్థాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. నిమ్మ తొక్కలు: నిమ్మ తొక్కలతో కూడా జార్స్ని చక్కగా క్లీన్ చేయొచ్చు. నిమ్మతొక్కలు, కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కొద్దిగా నీరు వేసి మిక్సీని ఆన్ చేయండి. ఒకటి రెండు నిమిషాలు తిప్పండి. అలాగే మిక్సీని మొత్తాన్నికూడా జాగ్రత్తగా మెత్తని క్లాత్తోగానీ, స్పాంజితో గానీ క్లీన్ చేసుకుంటే.. చక్కగా కొత్తదానిలా మెరిపోతుంది. నోట్ : మిక్సీని క్లీన్ చేసేటపుడు బ్లేడుల కారణంగా మన చేతి వేళ్లు తెగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మిక్సీ మోటర్లోకి అస్సలు వాటర్ పోకూడదు. ఒక్క చుక్క నీరు పోయినా మోటర్ పాడయ్యే అవకాశం ఉంది. -
Summer: సీలింగ్ ఫ్యాన్.. క్లీనింగ్ ఇలా...!
సాధారణంగా సీలింగ్ ఫ్యాన్లను ఎక్కువ ఎత్తులో అమర్చుతారు. అందువల్ల వాటిని తరచు శుభ్రం చేయడం చాలా కష్టం. అలాగని నెలల తరబడి అలాగే ఉంచేస్తే మురికి పేరుకుని పోయి అసహ్యంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పాత పిల్లో కవర్ తీసుకుని టేబుల్ మీద ఎక్కి సీలింగ్ ఫ్యాన్ రెక్కలను కవర్ చేయాలి. కవర్ పైభాగం నుంచి మీ చేతులతో రుద్దాలి. అదేవిధంగా, మూడు రెక్కలను శుభ్రం చేయాలి. మట్టి కూడా కవర్లో పడిపోతుంది. ఇది మీ ఇంటిని కూడా మురికిగా చేయదు. మరో పద్ధతి... పాత షర్ట్, టీషర్ట్ లేదా ఏదైనా కాటన్ వస్త్రం సహాయంతో ఫ్యాన్ను శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్ మీద ΄÷డి దుమ్ము ఉంటే.. అది సులభంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ వంటగదిలో ఉండే ఫ్యాన్ను క్లీన్ చేస్తున్నట్లయితే.. దానిపై నూనె, ధూళి పేరుకుపోయి ఉంటుంది. అటువంటి వాటిని సబ్బుతో కడగడం మంచిది. కాసేపు రెక్కలను స్క్రబ్ చేయాలి. గుర్తుంచుకోవాల్సింది.. ఫ్యాన్ను క్లీన్ చేసినప్పుడల్లా కింద ఒక షీట్ లేదా వస్త్రాన్ని పరచాలి. దీంతో ఫ్యాన్ క్లీన్ అయిన తర్వాత మీకు పని పెరగదు. ఫ్యాన్ మురికి షీట్లో పడిపోతుంది. ఫ్యాన్ శుభ్రం చేసేటప్పుడు గ్లాసెస్ లేదా సన్గ్లాసెస్ ధరించండి. ఇది చెత్తను కంట్లో పడకుండా చేస్తుంది. దీంతో అలర్జీ కూడా రాదు. సీలింగ్ ఫ్యాన్ శభ్రం చేసేటపుడు ముక్కుకు మాస్క్ లేదా రుమాలు కట్టుకోవాలి. ఇవి చదవండి: ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..! -
ఇయర్ వాక్స్.. లాభమా? నష్టమా?
'కొంతమందిని చూస్తే ఎప్పుడూ ఏ తాళం చెవో, పెన్ను రీఫిలో, పొడవుగా చుట్టిన కాగితాన్నో, ఏవీ దొరక్కపోతే చేతివేళ్లతోనో చెవిలో సంగీతం పాడిస్తుంటారు. ఈ చికాకంతా ఎందుకని చాలామంది స్నానం చేయగానే వీలైనంత లోతుగా చెవిని శుభ్రం చేస్తుంటారు. కానీ బయటికి కనిపించే చెవి కాకుండా లోపలి వైపు శుభ్రం చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.' ఇంతకీ చెవి ఎలా శుభ్రం చేయాలో చూద్దాం... కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది. అంతేకాదు, చెవిలో పెట్టిన బడ్ కర్ణభేరికి తగలవచ్చు. ఇది మరింత ప్రమాదకారి. దీనివల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు. బయటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది. శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. చెవిలోని నాళం పొడిబారకుండా ఉండేందుకు దోహదపడుతుంది. మరి ఇయర్ వాక్స్ని ఏం చేయాలి? దాని జోలికి వెళ్లకుండా ఉండడమే సరి. వాక్స్ తీయడం కోసం చెవి లోపల ఇయర్ బడ్ మాత్రమే కాదు. ఇంకేమీ పెట్టక్కరలేదు. ఎందుకంటే, చెవి తనను తానే శుభ్రం చేసుకోగలుగుతుంది. ఒకవేళ చెవిలో శబ్దాలు రావడం, నొప్పి లాంటి సమస్యలు కనిపించినా, వినికిడిలో తేడా అనిపించినా వెంటనే ఈఎన్టీ నిపుణుని కలవండి. ఇవి చదవండి: 'పచ్చి మిరపకారా'నికి గారం చేయండి.. ఎందుకో తెలుసా? -
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట: ఆలయాలు శుభ్రం చేస్తున్న ప్రముఖులు (ఫొటోలు)
-
రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన నటుడు
అయోధ్యలో ఈ నెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటులు హాజరుకానున్నారు. ఇంతలో ఒక నటునికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్.. రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేస్తూ ఒక వీడియోలో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు జాకీష్రాఫ్ను మెచ్చుకుంటున్నారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రామునిపై ఆ నటునికి ఉన్న భక్తిని, అతని సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. ‘ఎక్స్’లో షేర్ చేసిన ఈ వీడియోను యూజర్స్ అమితంగా ఇష్టపడుతున్నారు. పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఒక యూజర్ జాకీని ఉద్దేశించి ‘జీరో నుంచి హీరోగా మారిన వ్యక్తి’ అని కామెంట్ చేయగా, మరొకరు, 'కెమెరా ముందు.. కెమెరా వెనుక అత్యంత వినయుడు' అని రాశారు. జాకీ ష్రాఫ్ అప్పుడప్పుడు పలు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. నిరుపేద చిన్నారులకు వైద్య చికిత్స చేయించేందుకు, అలాంటి వారికి విద్య అందించేందుకు జాకీష్రాఫ్ విరాళాలు అందిస్తుంటారు. ఆయన సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. #WATCH | Maharashtra: Amruta Fadnavis wife of Maharashtra Deputy CM Devendra Fadnavis & Bollywood actor Jackie Shroff took part in the cleanliness drive of the oldest Ram temple in Mumbai. (14.01) pic.twitter.com/mhdkzcNB5x — ANI (@ANI) January 14, 2024 -
Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు
పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్ ఈజ్ అజ్’ సంస్థలోని టీనేజ్ పిల్లలే ఈ క్లీనింగ్కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు. విందామా వారి మాట? మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది! కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే? మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది. ఛేంజ్ ఈజ్ అజ్ ముంబైలో ఎంతలేదన్నా డజన్ అందమైన బీచ్లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్ షా, శుభ్ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్ మీడియా వేదికగా ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ను ప్రారంభించి ముంబైలోని బీచ్ల క్లీనింగ్కి నడుం కట్టారు. జూలై 2019న మొదటిసారి అక్షత్ షా, శుభ్ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్ను క్లీన్ చేయడానికి సోషల్ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్ను క్లీన్ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్లను క్లీన్ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్ షా, శుభ్. ప్రస్తుతం అక్షత్ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. పాతిక వేలమంది వాలంటీర్లు ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్ల శుభ్రత గురించి ఛేంజ్ ఈజ్ అజ్ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో బీచ్లు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు. -
హిందీ మాట్లాడేవాళ్లు... టాయిలెట్లు కడుగుతున్నారు
చెన్నై/పట్న: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రగడ మొదలైంది. తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్ కారి్మకులు తమిళనాడులో మరుగుదొడ్లు కడుగుతున్నారంటూ మారన్ ఈ ఏడాది మార్చి నెలలో ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మారన్ వైఖరిని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం స్పందించారు. మార్చి జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ మాట్లాడుతూ... తమిళ భాషతోపాటు ఆంగ్ల భాషను తమ పార్టీ ప్రోత్సహిస్తోందని, తమిళనాడు ప్రజలు ఆయా భాషలను చక్కగా నేర్చుకుంటున్నారని చెప్పారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఇప్పుడు గూగుల్ కంపెనీకి సీఈఓగా ఎదిగాడని గుర్తుచేశారు. ఒకవేళ సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకొని ఉంటే నిర్మాణ రంగంలో సాధారణ కారి్మకుడిగా పని చేసుకుంటూ ఉండేవాడని అన్నారు. తమిళనాడు విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకొని ఐటీ కంపెనీల్లో పెద్ద హోదాల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని, మెరుగైన వేతనాలు పొందుతున్నారని తెలిపారు. హిందీ మాత్రమే నేర్చుకుంటున్న ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులు తమిళనాడుకు వలస వచ్చి నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని, రోడ్లు ఊడుస్తున్నారని, టాయిలెట్లు కడుగుతున్నారని చెప్పారు. హిందీ మాత్రమే నేర్చుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. మారన్ మాట్లాడిన వీడియో క్లిప్ సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. డీఎంకే రంగు బయటపడింది: బీజేపీ హిందీ రాష్ట్రాల ప్రజల గురించి ప్రస్తావిస్తూ మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారిని, ఉత్తర భారతీయులను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ‘ఎక్స్’లో విమర్శించారు. ఆ పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మంపై దాడి చేశారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరువిప్పడం లేదని ఆక్షేపించారు. ఇతరులను కించపర్చడం తగదని డీఎంకే నేతలకు హితవు పలికారు. మారన్ వ్యాఖ్యలు కొన్ని నెలల క్రితం నాటివే అయినప్పటికీ డీఎంకే అసలు రంగు మళ్లీ బయటపడిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు. ఉత్తర భారతీయులను అవమానించేలా, దూషించేలా డీఎంకే పెద్దలు తరచుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. భవిష్యత్తులోనూ వారు వైఖరి మార్చుకుంటారన్న నమ్మకం తనకు లేదన్నారు. అన్ని రాష్ట్రాలూ సమానమే: డీఎంకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియోను వ్యాప్తిలోకి తీసుకొస్తున్నారని డీఎంకే అధికార ప్రతినిధి జె.కాన్స్టాండైన్ రవీంద్రన్ ఆరోపించారు. సమతావాద సమాజానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ అనేది తమ విధానం కాదని, అన్ని రాష్ట్రాలూ సమానమేనని అన్నారు. మారన్ ఏనాడూ చెప్పని మాటలను చెప్పినట్లుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘మాతృ భాషతోపాటు ఆంగ్లమూ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయన్నది మారన్ ఉద్దేశం. ఇంగ్లిష్ నేర్చుకున్నవారికి ఇండియాలోనే గాక ప్రపంచమంతటా డిమాండ్ ఉంది. మారన్ చెప్పిందీ అదే’’ అన్నారు. పరస్పరం గౌరవించుకోవాలి: తేజస్వి దయానిధి మారన్ వ్యాఖ్యలను బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం ఖండించారు. తమ పార్టీ తరహాలోనే డీఎంకే కూడా సామాజిక న్యాయాన్ని నమ్ముతుందని చెప్పారు. అలాంటి పార్టీ నేత ఇతర రాష్ట్రాల వారిని అవమానించేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. కుల అసమానతలు, కొన్ని కులాల వారే ప్రమాదకరమైన పనులు చేయడం గురించి ప్రస్తావించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రజలందరినీ ఇందులోకి లాగడం సమంజసం కాదని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రజలను గౌరవించాలని సూచించారు. పరస్పరం గౌరవించుకోవడం సముచితమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తాము ఇతరులను గౌరవిస్తామని, వారి నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. -
ఈ రోబో ఇంటి పనులన్నీ సులభంగా చేసేస్తుంది!
ఇంటి పనులన్నీ చేసే రోబోలను సినిమాల్లోనూ లేదా కార్టూన్ షోల్లోనే చూశాం. నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకోసం ఇప్పటికే పరిశోధనలు చేయడమే గాక పలు రూపాల్లో రోబోలను తీసుకొచ్చారుగానీ. ఎలా రోబోలతో పనిచేయించుకోవాలనేది కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఏం చేయాలన్నిది రోబోకి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోబోకు సాధారణ ఇంటి పనులను ఎలా నిర్వహించాలో సులభంగా నేర్చుకుని చేసేస్తుంది. ఈ మేరకు రోబోని ట్రైయిన్ చేసేలా డాబ్ ఈ అనే కొత్త ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉంటే పనులను పరిగణలోకి తసుకుని ఓ డేటాని రూపొందించారు న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. ఈ డాబ్ ఈకి మనం సాధారణంగా వినయోగించే రీచర్ గ్రాబర్ స్టిక్కి జోడించిన ఐఫోన్ను ఉపయోగిస్తే చాలు. రోబో ఈజీగా అన్ని పనులను నేర్చుకుంటుంది. ఈ ఐఫోన్ దేనికంటే మనమిచ్చిన ఇన్స్ట్రక్షన్లను డాబ్ ఈ డేటా రోబోకి ఎలా చేయాలో రికార్డు చేసిన వీడియోల ద్వారా తెలుపుతుంది. దీంతో రోబో ఆటోమేటిగ్గా సులభంగా ఆ పనిని చేసేస్తుంది . ఈ సరికొత్త సాంకేతికతో కూడిన రోబో వర్కింగ్ గురించి న్యూయార్క్లోని దాదాపు 22 ఇళ్లల్లో టెస్ట్ చేయగా చక్కటి ఫలితం వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ డాబ్ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా మరింత ఎక్కువగా ఉంటే కొత్త ఇంటిని చూడగానే ఆ రోబోని ట్రైయిన్ చేయాల్సిన పని కూడా ఉండదనేది పరిశోధకులు ఆలోచన. ప్రతి ఇంట్లో ఉండే పనులన్నీ రోబోలకు ఇప్పటికే తెలుసు, నేర్చుకున్నాయి కూడా అన్నారు. ఇక్కడ రోబో స్టిక్సిస్టమ్లను వినియోగిస్తుంది. వీటినన్నంటిని కలిపి డాబ్-ఇ అని పిలుస్తారు. ఈ రోబో ఇల్లు తుడవడం దగ్గర నుంచి లాండ్రీ వరకు అన్నింటిని చేసేస్తుంది. (చదవండి: భారత రెస్టారెంట్కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్గా అరోరా) -
లిటిల్ స్టార్స్ ఇన్ ఫైవ్స్టార్
ఒక వ్యక్తి కొంత మంది పిల్లలను ఫైవ్స్టార్ హోటల్కు తీసుకువెళ్లి వారికి ఇష్టమైన పదార్థాలు తినిపించిన వీడియో వైరల్ అయింది. ఆ పిల్లలకు ఈయన తండ్రి కాదు. కనీసం దూరపుచుట్టం కాదు. వీరు వీధిబాలలు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ వీడియో 39 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. కవల్చాబ్ర అనే వ్యక్తి కారు ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయినప్పుడు కొందరు పిల్లలు కారు అద్దాలను తుడవడం మొదలు పెట్టారు. వారిని చూడగానే చాబ్రకు ‘అయ్యో!’ అనిపించింది. వెంటనే పిల్లలను కారులో కూర్చోబెట్టుకొని ఫైస్టార్ హోటల్కు తీసుకువెళ్లాడు. ఈ వైరల్ వీడియో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తోంది. -
క్లీనింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మురుగునీరు, చెత్త నిర్మూలన వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది. రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన అనంతరం పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు. -
రెడీ మిక్స్ ప్లాంట్లో దారుణం
మణికొండ (హైదరాబాద్): ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్ ప్లాంట్ను శుభ్రం చేస్తున్న కార్మికులను గమనించకుండా.. దానిని ఆపరేటర్ ఆన్ చేయటంతో వారు అందులోనే నుజ్జునుజ్జుగా మారి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మారంట బేటా సోరెన్ (30), సుశీల్ ముర్ము (29)లు పుప్పాలగూడలో టవర్ల నిర్మాణం చేస్తున్న ఏఎస్బీఎల్ స్పెక్ట్రా సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లిన వారు రెడీమిక్స్ కాంక్రీట్ను మిక్స్ చేసే యంత్రంలోకి దిగి దానిని నీటితో శుభ్రం చేస్తున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా రెడీమిక్స్ ఆపరేటర్ ఆన్ చేశాడు. దాంతో మారంగ బేటా సోరెన్, సుశీల్ ముర్ము అందులో కూరుకుపోయి నుజ్జునుజ్జు మారి మృతి చెందారు. పక్కనే పనిచేస్తున్న వారి బంధువు మాజ్హి ముర్ము గమనించి వెళ్లి చూడగా ఇద్దరూ అప్పటికే మృతిచెందారు. అతనితో పాటు అక్కడే పని చేస్తున్న తోటి కార్మికులు, మృతుల బంధువులు నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఫరి్నచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. పాటు ఆపరేటర్పై దాడికి పాల్పడ్డారు. మాజ్హి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.. పుప్పాలగూడ ఎస్బీఎల్ స్పెక్ట్రా నిర్మాణ సంస్థలోని రెడీమిక్స్ ప్లాంట్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.పర్వతాలు, జిల్లా కార్యదర్శి ఎస్. మల్లేష్లు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వ చ్చిన కార్మికుల భద్రతకు నిర్మాణ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు చట్ట ప్రకారం వచ్చే ఎక్స్గ్రేషియాను ఇవ్వాలన్నారు. -
సఫాయి కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారమివ్వాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. అదేవిధంగా, డ్రెయినేజీలను శుభ్రం చేస్తూ శాశ్వత వైకల్యానికి గురయ్యే వారికి కనీసంగా రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కూడా పేర్కొంది. మాన్యువల్ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా లేకుండా చేయాలని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒకవేళ సఫాయి కార్మికులు విధుల్లో ఇతర అవకరాలకు గురయిన సందర్భాల్లో రూ.10 లక్షలను పరిహారంగా చెల్లించాలని కూడా ఈ సందర్భంగా జస్టిస్ భట్ పేర్కొన్నారు. -
స్మార్ట్ఫోన్లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
Swachhata Hi Seva: స్వచ్ఛ భారత్.. స్వాస్థ్ భారత్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పిలుపుమేరకు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో జరిగిన స్వచ్ఛతా కీ సేవాలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. గంటపాటు శ్రమించారు. తమ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. మార్కెట్లు, జల వనరులు, బస్ స్టాండ్లు, టోల్ వసూలు కేంద్రాలు, గోశాలలు, జంతు ప్రదర్శనశాలలు, సముద్ర తీర ప్రాంతాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, కళాశాలల్లోనూ శ్రమదానం చేశారు. 4 నిమిషాల నిడివి గల తన శ్రమదానం వీడియోను ప్రధాని మోదీ తన అధికారిక ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘నేడు దేశమంతా స్వచ్ఛతపై దృష్టి పెట్టింది. నేను, అంకిత్ బైయాన్పూరియా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నాం. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాదు, ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జతకలిపాం. ఇదంతా స్వచ్ఛ భారత్, స్వాస్థ్ భారత్ కోసమే’’ అని మోదీ ఉద్ఘాటించారు. 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో.. స్వచ్ఛతా కీ సేవా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు చీపుర్లకు పనిచెప్పారు. ఇళ్ల చుట్టుపక్కన, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం ఊడ్చేశారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, మార్కెట్ సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, ధార్మిక సంస్థలు, వాణిజ్య సంఘాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 9.20 లక్షలకుపైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శ్రమదానం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని ఝండేవాలన్ ఏరియాలో శ్రమదానంలో పాల్గొన్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి ఢిల్లీలో స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీతాపూర్లో ‘స్వచ్ఛతా పఖ్వాడా’ నిర్వహించారు. ‘చెత్త రహిత భారత్’ను సాధిద్దాం దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కేంద్రప్రభుత్వం తీర్మానించుకుందని, ఇదొక పెద్ద సవాలు అయినప్పటికీ చేసి చూపిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. స్వచ్ఛతా యజ్ఞంతో మహాత్మా గాం«దీకి నివాళులర్పిద్దామని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా కీ సేవాలో పాల్గొన్ని, కొత్త చరిత్ర సృష్టిద్దామని ఉద్బోధించారు. ‘చెత్త రహిత భారత్’ అనే కలను నెరవేర్చుకుందామని సూచించారు. ప్రజలు శ్రమదానంలో పాల్గొనాలంటూ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ఇచి్చన ‘స్వచ్ఛ భారత్’ పిలుపును ప్రజలు అందిపుచ్చుకుంటారని తాము ఆశిస్తున్నట్లు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ చెప్పారు. -
కాలువ శుభ్రం చేస్తుంటే వందలకొద్దీ సైకిళ్లు.. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి?
భారతదేశం అయినా విదేశాల్లో అయినా సరే ప్రతి పౌరుడి బాధ్యత తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. విదేశాల్లో రోడ్డుపై చెత్త వేయడం నేరంతో సమానం. ఇందుకు కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినా చాలామంది నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియోలో కాలువను శుభ్రం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మురుగునీటిలో నుంచి పెద్ద సంఖ్యలో సైకిళ్లు బయటకు వచ్చి, కుప్పగా ఏర్పడిన తీరు వీడియోలో కనిపిస్తుంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. కాలువను శుభ్రం చేస్తున్న కార్మికులు నీటి అడుగునుంచి పలు సైకిళ్లను వెలికితీశారు. జేసీబీతో ఈ క్లీనింగ్ పనులను చేపట్టారు. ఈ క్లిప్ @fasc1nate అనే ఖాతాతో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ది గార్డియన్’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వేలాది బైక్లు, సైకిళ్లను నదులు, చెరువులు, సరస్సులలో విసిరివేస్తున్నారు. ఇదేవిధంగా బైక్లు, సైకిళ్లు ప్రమాదవశాత్తు కూడా నీట మునుగుతున్నాయి. ఈ కారణంగా వాటిని శుభ్రపరిచే సమయంలో పెద్ద మొత్తంలో చెత్త బయటకు వస్తున్నది. కేవలం 2 నిమిషాల 9 సెకన్ల వీడియోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది పలువురి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ పరంగా ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఇన్ని సైకిళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాయగా, మరొకరు ఈ సైకిళ్లను అమ్ముతారా? అని ప్రశ్నించారు. మరొక యూజర్ కాలువలోకి ఇంత పెద్ద సంఖ్యలో సైకిళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? అని రాశారు. ఇది కూడా చదవండి: శాంతినికేతన్తో చైనాకు లింకు ఏమిటి? తాన్ యున్ జెన్ ఏం సాయం చేశారు? Finding some surprises while cleaning the canals of Amsterdam. pic.twitter.com/QsEJgj5GHM — Fascinating (@fasc1nate) September 18, 2023 -
నమామీ గోదావరి..స్వచ్ఛ గోదావరే లక్ష్యంగా ఏపీ సర్కార్ కృషి
-
ఇలా చేస్తే వాటర్ బాటిల్స్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు
ఈ రోజుల్లో ప్రతి యంత్రం, ప్రతి పరికరం.. న్యూ టెక్నాలజీని అందుకుంటూ.. ఈజీ ప్రొసెస్ను వినియోగదారులకు అందిస్తున్నాయి. సాధారణంగా వాటర్ బాటిల్స్, పాల బాటిల్స్, వాటి చిన్న చిన్న మూతలను క్లీన్ చేయడానికి పొడవాటి బ్రష్ ఉండేది. అయితే చిత్రంలోని బ్రష్ చూడటానికి అలానే కనిపిస్తుంది కానీ, ఇది టెక్నాలజీతో ముడిపడిన పరికరం (ఎలక్ట్రిక్ వాటర్ప్రూఫ్ డివైస్). ఒక్క బటన్ నొక్కితే చాలు గిర్రున తిరుగుతూ బాటిల్ మూల మూలలను శుభ్రం చేసి పెడుతుంది. ఈ హ్యాండ్హెల్డ్ క్లీనర్కి తగినంత చార్జింగ్ పెట్టుకుని.. వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. అవసరం అయితే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీలు వేసుకుని సులభంగా వాడుకోవచ్చు. ఒంపులు తిరిగిన మగ్గులు, గ్లాసులు, చెంబులు, బేబీ బాటిల్స్, బాటిల్ నిపుల్స్ వంటివి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అందుకు అనువైన రెండు వేరు వేరు బ్రష్లు.. బేస్ డివైస్కి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. మధ్యలో ఉన్న పవర్ బటన్ ఆన్ చేసుకోవడంతో ఈ డివైస్ పని చేస్తుంది. ఇది వాటర్ప్రూఫ్ కావడంతో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని ధర 14 డాలర్లు (రూ.1,158) -
ఫలితాలిస్తున్న మిషన్ క్లీన్ కెనాల్స్
-
నాలాలు, వరద నీటి కాలువల శుభ్రతపై దృష్టి సారించాలి
రాయదుర్గం: పట్టణ ప్రాంతాల్లో నిత్యం నాలాలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసే అంశంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ... ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో రోడ్లపైకి మురుగునీరు, వర్షపునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షపు నీటిని చాలా వరకు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కూడా పేర్నొన్నారు. అన్ని విభాగాల వారు సమష్టిగా చర్యలు చేపడితే దాదాపు అన్ని సమస్యలు తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు. తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలిస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తే చాలా వరకు సమస్యలు తీరేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కరుణాగోపాల్, రీ సస్టేనబిలిటీ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పి.జి.శాస్త్రి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ కె.కిషన్, జేఎన్టీయూఏ వాటర్ రిసోర్సెస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.గిరిధర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.గోపాల్నాయక్, సిటీ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నర్సింగ్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పిల్లలకు పాలు పడుతున్నారా? కనిపించని బ్యాక్టీరియాలు..
సాధారణంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉంటాం. అందులోనూ పాలు తాగే పిల్లల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. వాళ్ల కోసం వాడే పాలసీసాలు, పాల పీకలు, ఉగ్గు గిన్నెలు, స్పూన్లు వంటివన్నీ శుభ్రంగా ఉంచాలి. అయితే ఎంత శుభ్రంగా కడిగినా కనిపించని క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి. వాటిని పారదోలేందుకు ఉపయోగపడుతుంది ఈ బేబీ బాటిల్ స్టీమ్ స్టెరిలైజర్. ఇందులో సుమారుగా ఆరు చిన్న చిన్న బాటిల్స్తో పాటూ నిపుల్స్, ఉగ్గు గిన్నెలు వంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ – ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ టెక్నాలజీతో ఆటో షట్ ఆఫ్ వంటి ఆప్షన్తో రూపొందిన ఈ డిౖవైస్.. 99.9 శాతం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత సుమారు 24 గంటల పాటు మూత తియ్యకుండా ఉంచితే.. క్రిమిరహితంగా దాచిపెడుతుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ మెషిన్.. బాటిల్స్ని క్లీన్ చేయగలదు. బాగుంది కదూ!. ఈ స్టీమ్ స్టెరిలైజర్ ధర 22 డాలర్లు (రూ.1,810) మాత్రమే. -
సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్ - ధర ఎంతో తెలుసా?
విద్యుత్తుతో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు ఇప్పటికే చాలా చోట్ల వాడుకలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రోబో వాక్యూమ్ క్లీనర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రోబో వాక్యూమ్ క్లీనర్లు గదిలోని చెత్తను పూర్తిగా తొలగించాక, వాటిలోని అర చెత్తతో నిండిపోతోంది. ఆ చెత్తను మనం తొలగించాల్సి ఉంటుంది. అయితే, చైనీస్ హైటెక్ కంపెనీ ‘జియావోమీ’ ఇటీవల సెల్ఫ్ క్లీనింగ్ రోబో వాక్యూమ్ క్లీనర్ను అందుబాటులోకి తెచ్చింది. ‘రోబోరాక్ ఎస్7 మాక్స్ అల్ట్రా’ పేరుతో తెచ్చిన ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ గదిలోని చెత్తను తొలగించాక, తనను తాను శుభ్రం చేసుకుంటుంది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇందులోని సెన్సర్లు గదిలోని చెత్తను రకాల వారీగా గుర్తించి, అందుకు అనుగుణంగా పనిచేస్తాయి. సూక్ష్మమైన ధూళికణాలను కూడా ఏరివేసేందుకు ఇవి దోహదపడతాయి. గదిలో అడ్డదిడ్డంగా వస్తువులు పడి ఉంటే, అడ్డంకులను దాటుకుని మరీ ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ పనిచేస్తుంది. దీని ధర 1299 డాలర్లు (రూ.1,06,581). -
శరీరంపై 800 టాటూలు.. అక్కడే చిక్కొచ్చి పడింది..!
టాటూ.. శరీరాన్ని మరింత అందంగా ఫ్యాషన్గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్లూ మనమీదే ఉండేలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ బ్రిటన్కు చెందిన ఓ మహిళకు మాత్రం టాటూలే తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. దిక్కరింపులే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా లభించట్లేదట. ఎందుకంటే..? ఆమె పేరు మెలిస్సా స్లోన్(46) యూకేకు చెందిన మహిళ. ఇంతకు ముందు తనకు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆమె తన శరీరంపై ఏకంగా 800 టాటూలను వేయించుకుంది. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉండేది. మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకుంటే.. ఇక రాను రాను పరిస్థితి మారిపోయింది. వాటికి అలవాటు పడి శరీరమంతా పచ్చబొట్లను పొడిపించుకుంది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. మెలిస్సాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూటూల కారణంగా శరీరం నీలం రంగులో మారిపోయిందని ఆమె చెబుతున్నారు. కానీ అవంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. బహుశా ప్రపంచంలో తన కంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపై ఉండబోవని ఆమె అన్నారు. ఇదీ చదవండి: గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి.. -
సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి..
చిత్తూరు: చౌడేపల్లి మండలం పెద్ద కొండామారిలో విషాద ఘటన జరిగింది. విద్యుత్ షాక్కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సంపు క్లీన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచారు. మృతులను రమణ, మునిరాజా, రవిలుగా గుర్తించారు. మోటారు వైరు తెగి సంపులో పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబసభ్యులు తెలిపారు. విగతజీవులుగా మారిన వారిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం.. -
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement