-
అంబానీని బెదిరించింది తెలంగాణ కుర్రాడే! ఏం జరిగిందంటే..
Threat emails to Mukesh Ambani: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్లు పంపిన వ్యక్తిని ముంబై గాందేవి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించిన పోలీసులు అతడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు తెలిపారు. గత వారంలో ముఖేష్ అంబానీకి ఐదు బెదిరింపు ఈమెయిల్లు వచ్చాయని, కోట్ల కొద్దీ డబ్బు డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు. “ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా తెలుస్తోంది. మా దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం ” అని ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ‘బిజినెస్మేన్’ సినిమాలో మాదిరిగా.. 2012లో వచ్చిన మహేష్బాబు సినిమా ‘బిజినెస్మేన్’ను నిందితుడు ఫాలో అయినట్టున్నాడు. అందులో హీరో ముంబైలో బడా వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు సంపాదిస్తాడు. అచ్చం అలాగే ఈ నిందితుడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ఈమెయిల్స్ ద్వారా రూ.కోట్లు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు. మా దగ్గర మంచి షూటర్లున్నారు.. గత అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే పేరుతో ముఖేష్ అంబానీకి మొదటి బెదింపు ఈమెయిల్ వచ్చింది. “మీరు (అంబానీ) మాకు రూ. 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా వద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్లు ఉన్నారు” అని అందులో పేర్కొన్నారు. తర్వాత మరొక ఈమెయిల్ వచ్చింది. అందులో మొదటి ఈమెయిల్ స్పందించనందుకు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. "డిమాండ్లు నెరవేర్చకపోతే, డెత్ వారెంట్ (అంబానీకి) జారీ అవుతుంది" అని బెదిరించారు. అక్టోబర్ 31న అంబానీ అధికారిక ఈమెయిల్ ఐడీకి మూడో ఈమెయిల్ పంపించిన నిందితుడు ఈ సారి రూ.400 కోట్లు డిమాండ్ చేశాడు. నవంబర్ 1, 2 వ తేదీల్లో కూడా అలాంటి మరో రెండు ఈమెయిల్లు వచ్చాయి. ఈమెయిల్స్లోని ఐపీ అడ్రస్లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
మస్క్ ఏం చేసినా మామూలుగా ఉండదు.. ఆఫీస్కి రానక్కరలేదని అర్ధరాత్రి మెయిల్స్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఏం పని చేసినా మామూలుగా ఉండదు. లేఆఫ్స్ దగ్గర నుంచి బ్లూ టిక్స్ వరకూ ప్రతీదీ వివాదాస్పదం, చర్చనీయాంశం అవుతోంది. తాజాగా ఆయన ట్విటర్ ఉద్యోగులకు అర్ధరాత్రి ఈమెయిల్ పంపడం చర్చనీయాంశం అయింది. ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... మస్క్ ఇలా ఉద్యోగులకు అర్ధరాత్రి మెయిళ్లు పంపడం కొత్తేమీ కాదు. కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఆయన ఉద్యోగులతో పంచుకుంటారు. అయితే ఉద్యోగులు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదంటూ అర్ధరాత్రి ఈమెయిల్ పంపడమే అసాధారణంగా ఉంది. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ఇంతకీ ఏం జరిగిందంటే.. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ట్విటర్ కార్యాలయం ఉద్యోగులు లేక దాదాపు సగం ఖాళీగా ఉండటాన్ని గమనించిన మస్క్ ఆ మరుసటి రోజు నుంచి ఉద్యోగులు ఆఫీస్ రావటం వారి ఇష్టమని, తప్పనిసరేమీ కాదని ఉద్యోగులకు అర్ధరాత్రి 2:30 సమయంలో ఈమెయిల్స్ పంపారు. ఈ మేరకు Fortune.com నివేదించింది. మస్క్ ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో అనేక మార్పులు చేశారు. 7,500 ఉన్న ఉద్యోగుల సంఖ్యను ఒకేసారి 2,000లకు తగ్గించారు. కొత్తగా వెరిఫైడ్ అకౌంట్లకు సబ్క్రిప్షన్ చార్జీలు ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: పీఎఫ్ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? -
Air India Urination Case: వెలుగులోకి కీలక ఈమెయిల్స్
ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన కేసులో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఎయిర్లైన్ ఆ ఘటన జరిగిన రోజే అధికారులకు ఈమెయిల్స్ పంపినట్లు తేలింది. వాస్తవానికి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, త్వరితగతిన స్పందించకపోవడం, నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోకపోవడం తదితర విషయాల్లో జాప్యం గురించి సర్వత్ర పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ విషయమై డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రశ్నించగా ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే తమకు సమాచారం ఇవ్వలేదని ఎయిర్ ఇండియాలోని టాప్ మేనేజ్మెంట్ గతంలో సమర్థించుకుంది. ఐతే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తోసహా ఎయిర్లైన్స్ ఉన్నతాధికారులకు ఈమెయిల్స్ వెళ్లాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా క్యాబిన్ సూపర్వైజర్ నవంబర్ 27న మధ్యాహ్నం 1 గంట సమయంలో బేస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్(ఐఎఫ్సీడీ), హెచ్ఆర్ హెడ్కి ఈమెయిల్ పంపినట్లు నివేదికలో వెల్లడైంది. అలాగే కస్టమర్ కేర్ ఫిర్యాదులు గురించి ఉన్నతాధికారులు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ మెయిల్కి ప్రత్యుత్తరాలు కూడా అదే రోజు 3.47 గంటలకు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఆరోజు టెలిఫోన్ చర్చల అనంతరం ఈమెయిల్స్ పంపించినట్లు కూడా పేర్కొంది. అంతేగాదు అదే రోజు రాత్రి 7.46 గంటలకు ఈమెయిల్ కస్టమర్స్ విభాగం ఇన్ఫ్లైట్ సర్వీస్ హెడ్లకు ఈమెయిల్స్ పంపించినట్లు తేలింది. పైగా అదేరోజు సాయంత్రం బాధితురాలి అల్లుడు నుంచి ఈ మెయిల్ అందుకున్న విల్సన్ కస్టమర్ కేర్ ఆ మెయిల్స్ ఫార్వర్డ్ చేసి తనకు వచ్చిన మెయిల్స్పై దృష్టిపెట్టినట్లు కమ్యూనికేషన్లు చూపిస్తున్నాయి. అయితే ఎయిర్ ఇండియా మేనేజింగ్ డ్రైరెక్టర్(సీఎండీ) క్యాంప్బెల్ విల్సన్ మాట్లాడుతూ..ఎయిర్లైన్ తన సిబ్బందిలోని లోపాలను విచారించడానికి, ఎందుకు ఆల్యసంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో విచారించడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ ఘటన గురించి విమానంలో ల్యాండింగ్ అయిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించినట్లు తేలింది. ఐతే పైలట్ నిందితుడు శంకర్ మిశ్రా స్ప్రుహ లేనప్పుడూ చేసిన ఘటనగానే భావించాడు. బాధితురాలి పట్ల జరిగిన వికృత ఘటనగా సీరియస్ భావించకపోవటం, పైగా ఇరువురు మధ్య రాజీ కుదిర్చి సర్థి చెప్పేందుకు యత్నించాడమే గాక గొడవ రాజీ అయినట్లుగా ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో ఆరోజు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శంకర్ విశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మిశ్రా కూడా కామ్గా ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి నిష్క్రమించినట్లు తేలింది. ఎప్పుడైతే బాధితురాటు ఎయిర్ ఇండియా చైర్మన్కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఎయిర్లైన్స్ అధికారులకు ఇరువురు మధ్య ఆర్థిక రాజీ కుదరిందని అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్లైన్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏకి ఫిర్యాదు చేయడం జాప్యం అయ్యిందని తదుపరి విచారణలో తేలింది. దీంతో డీజీసీఏ విమానయాన సంస్థ మరియు దాని చీఫ్లకు మాత్రమే కాకుండా మొత్తం విమాన సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే డీజీసీఏ ఈ ఘటనపై ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా, పైలెట్ ఇన్ కమాండ్ లైసెన్స్ మూడు నెలలపాటు సస్పెన్షన్ తోపాటు ఎయిర్ ఇండియా డైరెక్టరేట్ ఇన్ఫ్లైట్ సర్వీస్కు కూడా సుమారు రూ. 3 లక్షల జరిమాన విధించి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్.. భారీ పెనాల్టీ) -
హాలిడేస్లో వర్క్ చేయమంటున్నారా..? ఇలా చేస్తే బాస్కు భారీ జరిమానా!
మీరు ఎంతో ఇష్టపడి ఓ జాబ్ చేస్తున్నారు. అలా అని హాలిడేస్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయంలో ఆఫీస్లో ఆ వర్క్ ఉంది.. ఈ వర్క్ ఉంది అని కొలీగ్స్ నుంచి లేదంటే బాస్ నుంచి పొద్దస్తమానం ఫోన్స్, ఈమెయిల్స్, ఫోన్ నోటిఫికేషన్లు వస్తుంటే చిరాకుగా ఉంటుంది కదా. ఇదిగో ఇకపై ఉద్యోగుల్ని ఇలాంటి ఇబ్బందులు పడకుండా.. తోటి సహచర ఉద్యోగులు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా సంస్థలు కొత్త కొత్త పాలసీలను అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ పాలసీ ఏంటని అనుకుంటున్నారా? సెలవుల్లో ఉన్న ఉద్యోగికి.. తోటి సహచర ఉద్యోగులు ఆఫీస్ వర్క్ విషయంలో ఇబ్బంది పెట్టకూడదు. అలా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు పాలసీలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్ 11 కొత్త పాలసీని తన సంస్థ ఉద్యోగులకు అమలు చేసింది. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే?.. ఆఫీస్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆఫీస్ నుంచి అతని కొలీగ్స్ కానీ, బాస్లు కానీ ఎవరైనా సరే ఆఫీస్ వర్క్ అని ఇబ్బంది పెట్టకూడదు. ఒక వేళ ఇబ్బంది పెడితే డిజిగ్నేషన్తో సంబంధం లేకుండా బాస్తో సహా అందరికి లక్షరూపాయిలు జరిమానా విధిస్తున్నాం’ అంటూ కొత్త పాలసీ గురించి లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా డ్రీమ్ 11 కంపెనీ ఫౌండర్ హర్ష్ జైన్, భవిత్ శేట్లు మాట్లాడుతూ..లీవ్లో ఉన్న ఉద్యోగికి వారం రోజుల పాటు ఆఫీస్తో సంబంధం ఉండకూడదు. మెయిల్స్, మెసేజెస్, వాట్సాప్ గ్రూప్ మెసేజెస్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు ఇంట్లో ఉంటే ఆఫీస్ వర్క్ అనే మాటే ఊసెత్తకూడదు. ఇలా కొత్త పాలసీని అమలు చేయడం వల్ల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విశ్రాంతి తీసుకోవచ్చు. తద్వారా మానసిక స్థితి, జీవన ప్రమాణాల నాణ్యత, వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని అర్ధం చేసుకున్నాం. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. -
రూ.13 వేలు కడితే అమెరికా హెజ్1బీ వీసా..! ఇలాంటి స్కామర్లతో జర భద్రం..
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలతో మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ లింక్డ్ఇన్ యూజర్ స్కామర్లు వీసాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. అమెరికా హెచ్1బీ వీసా ఇప్పిస్తామని 160 డాలర్లు(రూ.13వేలు) కడితే దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడుతామని సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నాడు. ఓ టాప్ సోడా కంపెనీల పేరుతో ఈ ఆఫర్ లెటర్ పంపుతున్నారని చెప్పాడు. మొదట రూ.13వేలే అని చెప్పినా ఆ తర్వాత ఆశావాహుల నుంచి లక్షలు కాజేస్తున్నారని వివరించాడు. ఈ స్కామర్లు పంపే ఈ-మెయిళ్లు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల పేరుతో కూడా ఉంటాయని సదరు వ్యక్తి వివరించాడు. మీకు నమ్మకం కల్పించేందుకు వాళ్లు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నిజంగా జాబ్ ఆఫర్ ఇచ్చే ఏ సంస్థ అయినా డబ్బులు వసూలు చేయదు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని లింక్డ్ఇన్ యూజర్ సూచించాడు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement