-
తుది దశకు ‘మెగా ఫుడ్పార్కు’
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పనసంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్ పార్కు పనులు తుదిదశకు చేరాయి. ఏప్రిల్ 15 కల్లా పనులు పూర్తిచేసి.. మామిడి సీజన్ ప్రారంభమయ్యే నాటికి కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో 100 ఎకరాలను ఫుడ్ పార్కుకు కేటాయించారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా మామిడి, బొప్పాయి, జామ వంటి పండ్లతోటలు, టమా టా తదితర కూరగాయలు పెద్ద ఎత్తున సాగు చేస్తుం టారు. దీంతో వివిధ రకాల పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ కోసం మెగా ఫుడ్పార్కులో రూ.86 కోట్లతో 7.48 ఎకరాల్లో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను పూర్తిస్థాయి వసతులతో నిర్మిస్తున్నారు. ఇందులో 960 టన్నుల సామర్థ్యంతో పండ్లను మగ్గ బెట్టడంతో పాటు గంటకు ఆరు నుంచి పది టన్నుల గుజ్జు, రసాలు తీయొచ్చు. బియ్యం, జొన్నలు వంటి ఆహార పదార్థాలనూ నిల్వ చేసుకునేందుకు వీలుగా 4 వేలటన్నుల సామర్థ్యం గల గిడ్డంగిని నిర్మించారు. పండ్లు, కూరగాయల నిల్వకు కూడా 3 వేల టన్నుల సామర్థ్యంతో శీతల గిడ్డంగి, ప్యాకింగ్ యూనిట్లు, ఆహార ఉత్పత్తుల నాణ్యత పరిశీలించేందుకు ఎనలై టికల్ ల్యాబ్ తదితర అన్ని అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.260 కోట్లతో ఏర్పాటు చేస్తున్న రెండు మెగా ఫుడ్పార్కులు అందుబాటు లోకి వస్తే దాదాపు 6 వేలమందికి ఉపాధి లభిస్తుం దని అంచనా వేస్తున్నారు. పనితీరు, ఇక్కడి సౌకర్యా ల గురించి పెట్టుబడిదారులకు అవగాహన కల్పిం చేందుకు ఏపీఐఐసీ త్వరలో రోడ్ షోలు నిర్వహించబోతోంది. నేరుగా ఇక్కడకు సరుకు తీసుకువచ్చిన వారు.. కావాల్సిన విధంగా ప్రాసెస్ చేసుకొని, అవసరమైన పరిమాణంలో ప్యాకింగ్ చేసి, తీసుకెళ్లే సదుపాయాలు కల్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు వివరించారు. చాలా సంస్థలు వస్తున్నాయ్.. ఏప్రిల్ 15కల్లా మెగా ఫుడ్ పార్కులో పనులు పూర్తి చేసి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తోంది. ఇప్పటికే ప్రొడక్షన్, మార్కెటింగ్కు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు చాలా సంస్థలు ఏపీఐఐసీని సంప్రదించాయి. – డి.శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ -
మల్లవల్లి ఫుడ్ పార్క్ ద్వారా రూ.260 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద అభివృద్ధి చేసిన రెండు మెగా ఫుడ్ పార్కుల ద్వారా రూ.260 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడమేగాక, 6,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.112.94 కోట్లతో 57.95 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కును అభివృద్ధి చేయగా, దాని పక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో ఫుడ్ పార్కును అభివృద్ధి చేసింది. మెగా ఫుడ్ పార్కులో రూ.86 కోట్ల తో ఏర్పాటు చేసిన కోర్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ)ను ఈ మామిడి పండ్ల సీజన్కు అందుబాటులోకి తెస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, టమాట, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసుకునేలా సీపీసీని తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏప్రిల్ మొ దటి వారంలో రోడ్ షోలు నిర్వహిస్తామని ఏపీఐ ఐసీ వీసీ,ఎండీ జవ్వాది సుబ్రమణ్యం చెప్పారు. -
మార్చికి మల్లవల్లి ఫుడ్పార్క్
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందులో భాగంగా.. ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ను ఏర్పాటుచేసింది. మొత్తం 57.45 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్ పార్కులో సుమారు రూ.16 కోట్లతో సీపీసీని ఏర్పాటుచేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్లను ఈ సీపీసీలో నెలకొల్పారు. దీని పనితీరుపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని.. మార్చి నెలాఖరు నాటికి ఈ యూనిట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ సీహెచ్ఎస్ఎస్ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫుడ్పార్క్ పనులను ఏపీఐఐసీ బృందం శనివారం తనిఖీ చేసింది. అలాగే, దీనిపక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో స్టేట్ ఫుడ్పార్క్ను ఏర్పాటుచేసింది. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లు కూడా ఈ సీపీసీ సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. ఈ రెండు పార్కుల ద్వారా సుమారు రూ.260 కోట్ల పెట్టుబడులు, ఆరువేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. సీపీసీ నిర్వహణకు టెండర్లు ఈ సీపీసీ నిర్వహణను మూడేళ్లపాటు లీజుకిచ్చేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను కోరుతూ ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 15న మొదలయ్యే ఈ బిడ్ల దాఖలు కార్యక్రమం మార్చి 1తో పూర్తవుతుంది. గంటకు 6–10 టన్నుల గుజ్జు, కాన్సెంట్రేషన్ లైన్, 120 టన్నుల సామర్థ్యం ఉండే పండ్లను మగ్గబెట్టే (రైపెనింగ్) చాంబర్లు ఎనిమది, 3,000 టన్నుల శీతల గిడ్డంగి, 4,000 టన్నుల సరుకు నిల్వచేసే గిడ్డంగితో పాటు ల్యాబ్లు సీపీసీ పరిధిలోకి వస్తాయి. ఏటా 5 శాతం చొప్పున అద్దె పెంచనున్నట్లు నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నామని ప్రసాద్ తెలిపారు. త్వరలో రోడ్ షో ఈ మెగా ఫుడ్పార్క్లోని సెంట్రల్ ప్రోసెసింగ్ సెంటర్ సౌకర్యాలను రైతులకు, పెట్టుబడిదారులకు తెలియజేయడానికి త్వరలోనే రోడ్ షో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ రవీన్కుమార్రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో సౌకర్యాలు కల్పించామన్నారు. మామిడి, టమోటా, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి తీసుకెళ్లొచ్చన్నారు. ఇప్పటికే ఈ పార్క్లో యూనిట్లు ఏర్పాటుచేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని, మరికొన్ని సంస్థలు చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సీపీసీలో వసతులివీ.. – గంటకు ఆరు టన్నుల టమోటా, 10 టన్నుల మామిడి, 5 టన్నుల బొప్పాయి, 6 టన్నుల జామ, 4 టన్నుల అరటి గుజ్జు లేదా రసం తీసే ఆస్పెటిక్ పల్ప్లైన్.. – 200 ఎంఎల్ సామర్థ్యం కలిగిన జ్యూస్ ప్యాకెట్లు స్ట్రాతో కలిపి గంటకు 7,500 ప్యాకింగ్ చేసే పూర్తిస్థాయి అటోమేటిక్ ఫిల్లింగ్, ప్యాకింగ్ లైన్.. – జొన్నలు, బియ్యం వంటి ఆహార ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి 4,000 టన్నుల సామర్థ్యంతో గిడ్డంగి.. – పండ్లు, కూరగాయల నిల్వకు 3,000 టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగి.. – మామిడి, అరటి, టమోటా వంటి పండ్లను మగ్గ పెట్టడానికి 960 టన్నుల సామర్థ్యం కలిగిన ఈసీఆర్సీ రైపెనింగ్ చాంబర్స్.. – సుగంధ ద్రవ్యాలు, పప్పులు, బియ్యం వంటి పొడులు, గ్రాన్యూల్స్ను 100 గ్రాముల నుంచి 2 కేజీలకు వరకు ప్యాకింగ్ చేసే యూనిట్లు.. – చిన్న ప్యాకెట్లు అయితే నిమిషానికి 50–70, పెద్దవి అయితే 25–30 ప్యాకెట్ల ప్యాకింగ్.. – ఈ అహార పదార్థాలను పరీక్షించడానికి ఎనలైటికల్ ల్యాబ్. -
ఫుడ్ పార్క్: రాందేవ్ బాబాకు సీఎం యోగి ఫోన్...
లక్నో: ఉత్తరప్రదేశ్లో రూ.6వేల కోట్లతో మెగా ఫుడ్ పార్క్ పెట్టాలన్న ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు పతాంజలి సంస్థ ప్రకటించిన నేపథ్యంలో యూపీ సీఎం రంగంలోకి దిగారు. ఫుడ్ పార్క్ రాష్ట్రం నుంచి తరలించవద్దని పతాంజలి సంస్థ సహ వ్యవస్థాపకులైన రాందేవ్ బాబాను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి పతంజలి ఆయుర్వేద్ ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ, రాందేవ్ బాబాలతో మాట్లాడారు. పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని యోగి వారికి హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇవ్వడంతో రాందేవ్ కూడా పుడ్ పార్క్ను యూపీలోనే ఏర్పాటు చేయడానికి అంగీకరించారని యూపీ పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా పేర్కొన్నారు. యూపీలోని యమునా ఎక్స్ప్రెస్ హైవే సమీపంలో 425 ఎకరాల్లో పతంజలి మెగా ఫుడ్ పార్క్ పెట్టాలని భావించింది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇందుకు సహకరించడంలేదని పతంజలి ఛీప్ ఆచార్య బాలక్రిష్ణ మంగళవారం ఆరోపించారు. ‘పుడ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అనుమతుల కోసం చాలా కాలం ఎదురుచూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం లేదు. ఇప్పుడు మేము ఈ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చాలని నిర్ణయించాం’ అని బాలకృష్ణ వెల్లడించారు. ఆచార్య బాల క్రిష్ణ ఇలా బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించడంతో యోగి వెంటనే రాందేవ్ బాబాతో మాట్లాడారు. -
యోగిపై విసుగెత్తిన బాబా రాందేవ్ ఏం చేశారంటే..
లక్నో : యోగా గురు బాబా రాందేవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విసుగెత్తిపోయారు. యోగి ఎన్నిరోజులకు కూడా తమ ప్రతిష్టాత్మకమైన ఫుడ్ పార్క్కు క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై విసుగుచెందిన బాబా రాందేవ్, చివరికి తన ఫుడ్ పార్క్నే ఉత్తరప్రదేశ్ నుంచి తరలించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో యమునా ఎక్స్ప్రెవేతో పాటు మెగాఫుడ్పార్క్ను నిర్మించాలనుకున్నారు. అయితే ఈ ఫుడ్ పార్క్ స్కీమ్ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను కంపెనీ పొందలేకపోతుందని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణ చెప్పారు. పేపర్ వర్క్ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పోతుందని పేర్కొన్నారు. ‘ ఈ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. క్లియరెన్స్ కోసం చాలా కాలంగా వేచిచూస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ను ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించాం’ అని ఆచార్య బాలక్రిష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యామని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయంలో చాలా జాప్యం చేస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్షల మంది వ్యవసాయదారుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఏర్పాటయ్యే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు కావాల్సిన మిషనరీని కంపెనీ ఇప్పటికే ఆర్డర్ చేసిందని, ఈ ప్రాజెక్ట్తో లక్షల కొద్దీ ఉద్యోగవకాశాలు సృష్టిస్తామని చెప్పారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ప్రకారం ఢిల్లీకి దగ్గరిలో గౌతమ్ బుద్ నగర్లో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ కోసం ఈ ఏడాది జనవరిలోనే తొలి ఆమోదం వచ్చేసింది. కానీ దీనికి కావాల్సిన భూమి, బ్యాంకు రుణానికి సంబంధించిన పేపర్లను కంపెనీ సమర్పించాల్సి ఉంది. తమ షరతులను చేరుకోవడానికి పతంజలికి ఒక నెల పొడిగింపు ఇచ్చామని, ఒకవేళ పతంజలి తమ షరతులను అందుకోలేకపోతే, రద్దు చేయడమే తప్ప.. తమ దగ్గర మరే ఇతర అవకాశం లేదని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ అధినేత జేపీ మీనా అన్నారు. ఈ నెల ఆఖరి వరకు కంపెనీకి సమయం ఉందన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సీఎస్కేతో ఎస్ఆర్హెచ్ పోరు.. తుది జట్లు ఇవే
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement