-
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం వరి, సోయాబీన్ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. -
ఆగస్ట్–సెప్టెంబర్ నెలల్లో సాధారణ వర్షాలు: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వర్షాకాలం రెండో అర్ధభాగం(ఆగస్ట్–సెప్టెంబర్)లో సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. జూలైలో దేశవ్యాప్తంగా అధిక వర్షాలు నమోదయ్యాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలపై ఎల్నినో పరిస్థితులు ప్రభావితం చేయలేకపోయాయని తెలిపింది. ఆగస్ట్, సెప్టెంబరు నెలల్లో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేసినప్పటికీ, సాధారణ (422.8 మిల్లీమీటర్ల కంటే తక్కువగా (94 శాతం నుంచి 99 శాతం) కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మీడియాతో అన్నారు. జూన్లో సాధారణం కంటే 9% లోటు వర్షపాతం నమోదవగా, జూలై వచ్చే సరికి 13% అదనంగా వానలు పడ్డాయని చెప్పారు. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో 1901 తర్వాత మొదటిసారిగా అత్యల్ప వర్షపాతం 280.9 మిల్లీమీటర్లు నమోదైందని చెప్పారు. గత అయిదేళ్లలోనే అత్యధికంగా ఈసారి 1,113 భారీ వర్షపాతం ఘటనలు, 205 అత్యంత భారీ వర్షపాతం ఘటనలు జూలైలో నమోదయ్యాయని చెప్పారు. -
ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నేపథ్యంతో.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో నేడు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
వర్షాలు పడలేదని.. రైతులెవరూ అధైర్యపడొద్దు
సంగారెడ్డి మున్సిపాలిటీ: రుతుపవనాలరాక ఆలస్యం కావడం, వరుణుడి జాడ లేకపోవడంతో ఎన్నో ఆశలతో సాగుకు భూములను సిద్ధం చేసిన రైతుల్లో కొంత ఆందోళన నెలకొందని, అయితే ఎలాంటి ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి నసింహరావు అన్నారు. విత్తుకునే అదను దాటలేదన్నారు. ప్రస్తుతం సన్నాలు, మధ్యకాలిక, స్వల్పకాలిక వంగడాలు ఎంచుకోవాలి. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని, వీలైనంత వరకు పంట మార్పిడి చేయాలని అప్పుడే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, 70 నుంచి 110 మి.మీ. వర్షం పడితేనే విత్తనాలు విత్తుకునేందుకు అనువుగా ఉంటాయన్నారు. బుధవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్కు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా జాన్ 15 వరకే బీపీటీ సోనా రకం వరి సాగుకు నారుపోసుకోవాలన్నారు. ఆ తర్వాత పోసుకుంటే వాటికి తెగుళ్లు ఆశిస్తాయని తెలిపారు. సన్నరకం ధాన్యం ఆర్– ఎన్ఆర్ కేఎస్ఎం, దొడ్డు రకం 1010ని జూలై 15 వరకు నారు పోసుకోవాలి. అన్ని రకాల నేలలు వరి సాగుకు అనుకూలమని రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతు: నరసయ్య, అంత్వార్ (నారాయణఖేడ్) మూడు ఎకరాల పత్తి వేసాము. దానికి ఎలాంటి మందు వేయాలి. జేడీఏ: ఇప్పుడు డీఏపీ, కాంప్లెక్స్ వేయొచ్చు. రైతు: నవాజ్ రెడ్డి, చక్రియాల్ (చౌటకూర్) జిలుగు, జనుము రాలేదు సార్. ఆలస్యం అయ్యాయి. పంటకు ఇబ్బంది అవుతుంది. జేడీఏ: అవును. జిలుగు జనుము ఆలస్యమయ్యాయి. మీ దగ్గరలోగల మండలం నుంచి తెచ్చుకోవచ్చు. రైతు: శ్రీనివాస్. పుల్కల్ (పుల్కల్) మూడు ఎకరాల పత్తి మొలక వచ్చింది. ఇంకా మూడు ఎకరాలు ఉంది. ఏ పంటకు అనుకూలం సార్ ఇప్పుడు. జేడీఏ: జులై 10 వరకు పత్తి పంట వేసుకోవాలి. అది దాటితే ఇతర పంటలు వేసుకోవాలి. రైతు: విఠల్, జూకల్ (నారాయణఖేడ్) 25 గుంటల భూమి మూడు నెలల క్రితం నా పేరుపై పట్టా చేసుకున్నా. ఏఈఓ దగ్గర చూసుకుంటే డబ్బులు పడలేదు సార్. జేడీఏ: మీరు చేయించుకుని మూడు నెలలు మాత్రమే అయ్యింది. కొంచెం ఆలస్యం అవుతుంది. రైతు: నరసింహారెడ్డి, సత్వర్ (జహీరాబాద్) జనుము విత్తనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు సార్. జేడీఏ: జహీరాబాద్ డీసీఎంఎస్ ఆఫీసులో వచ్చాయి తీసుకోండి. రైతు: నరేందర్, వెంకటాపూర్ (సదాశివపేట) సబ్సిడీపై ఎలాంటి ధాన్యాలు ఉన్నాయి సార్. జేడీఏ: కంది, సోయాబీన్ ఉన్నాయి. మిగతావి సబ్సిడీపై డీలర్లను అడిగి తెలుసుకోవాలి. అంతర పంటలు వేస్తే మంచిది. రైతు: రాజ్ కుమార్ దేశ్పాండే, మానియర్ పల్లి (కోహిర్) జిలుగు, జనుము తొందరగా రాకపోవడం కారణంగా ఆలస్యంగా విత్తనాలు వేశాము. మొక్కలు లేటుగా మొలుస్తున్నాయి. జేడీఏ: వర్షాలు లేని కారణంగా లేటుగా మొలుస్తున్నాయి. ఆందోళన చేందొద్దు. -
కురిసింది వాన.. జిల్లా అంతటా వర్షాలు అన్నదాతల్లో హర్షం
ఆదిలాబాద్టౌన్: రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు జిల్లాలో ఓ మోస్తారు నుంచి సాధారణ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. విత్తనాలు విత్తుకునే అదను దాటుతున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది ఇప్పటికే విత్తనాలు విత్తుకోగా, ఈసారి కనీసం 20 శాతం కూడా రైతులు విత్తనాలు వేసుకోలేదు. పత్తి పంట విత్తుకునేందుకు జూలై రెండో వారం వరకు, సోయా పంట వేసుకునేందుకు జూలై మొదటి వారం వరకు గడువు ఉందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇన్నిరోజుల పాటు తీవ్ర ఉక్కపోతకు గురైన జిల్లా వాసులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు. జిల్లా అంతటా వర్షాలు.. ఇచ్చోడలో 56.0 మి.మీ, బజార్హత్నూర్లో 34.3 మి.మీ, నార్నూర్లో 39.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది సగటున 1,100 మి.మీ.లు కురువాల్సి ఉంది. జూన్కు సంబంధించి 190 మి.మీ.లు కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 29 నుంచి 35 మి.మీ.ల వర్షం కురిసిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా 87 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉందని పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాలతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. తడిసి ముద్ద.. ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురువడంతో పట్టణమంతా తడిసి ముద్దయ్యింది. జనాలు వర్షంలో తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ద్విచక్ర వాహనాలపై ఆయా పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తడుస్తూ వెళ్లగా మరికొంతమంది రెయిన్ కోట్లు ధరించి వెళ్లారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement