-
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
-
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ హిట్ టాక్తో స్ట్రీమింగ్ అవుతుంది. మే 1నుంచి నెట్ఫ్లిక్స్లో అలరిస్తుంది. ఇందులో మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు నటించారు.హీరామండి వెబ్ సిరీస్లో ఉస్తాద్జీ పాత్రలో మెప్పించిన ఇంద్రేష్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో ఇంటిమేట్ సీన్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.‘సోనాక్షీకి, నాకు మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ కోసం ఎక్కువ రీటేక్లు తీసుకోలేదు. ఈ సీన్స్ తీస్తున్న సమయంలో నేను భయాందోళనకు గురైయాను. కాస్త సిగ్గుగా కూడా అనిపించింది. కానీ, సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్గా ఉండమని కోరారు. ఈ సీన్స్ కూడా ఆమె అమ్మగారి ముందే జరిగాయి. ఈ క్రమంలో సోనాక్షీ తల్లి ముందే నాతో మాట్లాడారు. ఈ సిరీస్లో ఇలాంటి సీన్లు అవసరం, కంగారు పడొద్దని చెప్పారు. సుమారు గంటకు పైగానే అందరం చర్చించుకున్నాకే షూట్ మొదలపెట్టాం. అందుకే ఎక్కువ రీటేక్లు తీసుకోలేదు. ఈ సిరీస్లో నా పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది నా కోసమే రూపొందించబడిందని నేను అనుకుంటున్నాను. సంజయ్ భన్సాలీ ప్రతీ సీన్ను చాలా జాగ్రత్తగా తీశారు.మరోక సన్నివేశంలో సోనాక్షి తన కాళ్లతో నా తలను టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా కూడా సెట్స్లో ఉన్నారు. ఆ సీన్ సమయంలో కాస్త ఇబ్బంది ఉన్నా.. ఆమె నాకు కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో సీన్స్ మా మధ్య ఉన్నాయి. హీరామండి సెట్ నుంచి నాకు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.' అని ఇంద్రేష్ మాలిక్ చెప్పాడు. -
Stunning Looks of Sonakshi Sinha: రెడ్ లెహంగాలో జిగేలుమంటున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
-
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్లో స్పృషించనున్నారు. ఈ సిరీస్లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
Sonakshi Sinha Photos: స్టైలిష్ అండ్ ఎత్నిక్ లుక్లో.. (ఫోటోలు)
-
అందాల తార సోనాక్షి సిన్హా ధరించిన డ్రస్ ధర తెలిస్తే..షాకవ్వుతారు!
స్టార్ కిడ్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత ఎప్పుడూ ఆ ప్రీఫిక్స్ అవసరం రానివ్వకుండానే కెరీర్ని మలచుకుంది సోనాక్షి సిన్హా.. కేవలం తన టాలెంట్తోనే! సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ పాత్రల ఎంపికలో తన స్టయిల్ ప్రత్యేకమని చాటుకుంది. ఫ్యాషన్లోనూ ఆ స్టయిల్నే క్రియేట్ చేసుకున్న ఆమె ఫాలో అయ్యే బ్రాండ్స్ కొన్ని..‘ఎలాంటి సమస్యకైనా పనిని మించిన మందు లేదు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో నా కాలక్షేపం.. జిమ్లో గడపడం, పెయింటింగ్, స్కెచెస్ వేయడం, సినిమాలు చూడడమే! ఏకే – ఓకే... ఫ్యాన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలన్న అనామికా ఖన్నా తపనకు.. కోల్కతాలోని ఆమె డిజైనర్ స్టోర్ అద్దం పడుతోంది. భారతీయ సంప్రదాయ వస్త్రాల పద్ధతులకు పాశ్చాత్య ధోరణులను మిక్స్ చేసి సరికొత్త డిజైన్స్ను రూపొందించడం అనామికా ప్రత్యేకత. అదే అమెను.. వారానికో డ్రెస్ కూడా అమ్ముడవని రోజుల నుంచి సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా, దీపికా పడుకోణ్, ఐశ్వర్య రాయ్ లాంటి సెలబ్రిటీలు అనామికా డిజైనర్ వేర్లో ఒక్కసారైనా మెరిసిపోవాలని ఆశపడే స్థాయికి ఎదిగేలా చేసింది. ఆపై తన బ్రాండ్ నేమ్ని పలు దేశాలకూ విస్తరింపజేసి తిరుగులేని ఫ్యాషన్ డిజైనర్గా మారింది. సామాన్యులు వీటి ధరలను అందుకోవడం కష్టమే. ఆన్లైన్లోనూ లభ్యం. సోనాక్షి సిన్హా ధరించి ఏకే ఓకే డ్రస్ ధర రూ. 38,000/- క్యూరియో కాటేజ్.. ఇదొక మహిళల బ్రాండ్! ఇక్కడ పనిచేసేవారందరు కూడా మహిళలే! ఒకరకంగా చెప్పాలంటే మహిళల చేత మహిళల కోసం రూపుదిద్దుకున్న ప్రత్యేక బ్రాండ్ ఇది. అందుకే ఇక్కడ లభించే ఏ డిజైన్ను చూసినా వెంటనే ప్రేమలో పడిపోతారు. 1971లో ఏక్తా బఠీజా ప్రారంభించిన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రస్తుతం వారి మూడోతరం వారసులు అదే ప్యాషన్తో కొనసాగిస్తున్నారు. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ కొనుగోలు చేయొచ్చు. సోనాక్షి సిన్హా ధరించిన జ్యూలరీ ధర రూ. 23,990/-, ఉండగం ధర రూ. 6,990/- ---దీపిక కొండి (చదవండి: అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్ ధర ఎంతంటే..?) -
బీచ్లో 'దబంగ్' భామ.. టైట్ డ్రస్లో శిల్ప!
జాన్వీ కపూర్ టెంప్టింగ్ పోజులు బీచ్ లో 'దబంగ్' బ్యూటీ హీరోయిన్ శిల్పా సెక్సీ స్టిల్స్ వైట్ అండ్ వైట్లో సారా అలీఖాన్ బెడ్పై పడుకుని కేజీఎఫ్ బ్యూటీ పోజులు రెండు జడలతో శ్రుతిహాసన్ ముద్దొచ్చేలా హీరోయిన్ సీరత్ కపూర్ ఎండలో సేదతీరుతున్న లవ్ లీ బ్యూటీ పెళ్లి కూతురిలా రాశీఖన్నా న్యూయార్క్ వీధుల్లో వర్షిణి వాకింగ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
సహనటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవలే దహాద్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. అయితే దబాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాధోడ్ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి) అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సోనాక్షి, జహీర్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఈ జంట పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో ప్రతిసారీ సోషల్ మీడియాలో రిలేషన్ షిప్పై గాసిప్స్ వినిపించాయి. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా జహీర్ చేసిన పోస్ట్ డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. బర్త్ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్ యూ' అంటూ నోట్లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమెతో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. గత నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ జహీర్ ఇక్బాల్తో సోనాక్షి సిన్హా సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించారు. కాగా.. వీరిద్దరు కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి సిన్హా ప్రస్తుతం హర్రర్-కామెడీ చిత్రం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనుంది. ఆ తర్వాత నికితా రాయ్ మూవీ ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో నటించనుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
బరువు పెరగడం ఓ సవాల్గా అనిపించింది: హీరోయిన్
వెండితెరపై మెరుపుతీగలా కనిపించే హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే బొద్దుగా కనిపించడానికి కూడా వెనకాడరు. అందుకు తాజా ఉదాహరణ సోనాక్షీ సిన్హా, హ్యుమా ఖురేషీ. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘డబుల్ ఎక్స్ఎల్’ చిత్రం ఈరోజు రిలీజవుతోంది. అధిక బరువుతో హేళనకు గురయ్యే ఇద్దరి అమ్మాయిల కథతో ఈ సినిమా ఉంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఈ విషయాన్ని వినోదాత్మకంగా చెబుతూ చాలా జాగ్రత్తగా డీల్ చేశారట చిత్రదర్శకుడు సత్రమ్ రమణి. ‘బాడీ షేమింగ్’ తప్పనే సందేశం కూడా ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్రం కోసం సోనాక్షి, హ్యూమా పదిహేనేసి కిలోల బరువు పెరిగారు. నిజానికి కెరీర్ ఆరంభంలో సోనాక్షి బొద్దుగానే ఉండేవారు. ‘దబాంగ్’ చిత్రంతో పరిచయం కాకమునుపు ఆమె దాదాపు 90 కిలోలు ఉంటే.. 30 కిలోలు తగ్గి ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అప్పటినుంచి దాదాపు అదే బరువుతో కొనసాగుతున్నారామె. ఇప్పుడు ‘డబుల్ ఎక్స్ఎల్’కి బరువు పెరిగిన విషయం గురించి సోనాక్షి మాట్లాడుతూ.. ‘‘బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో అయితేనే సేఫ్. కానీ ‘డబుల్ ఎక్స్ఎల్’ నాకు అలా తగ్గేంత సమయం ఇవ్వలేదు. రెండే నెలల్లో పెరగాల్సి వచ్చంది. దాంతో ఏది పడితే అది తిన్నాను. ఎన్నో ఏళ్లుగా చేస్తూ వచ్చిన వర్కవుట్లు మానేశాను. ఫలితంగా 15 కిలోలు పెరిగాను. కానీ ఇలా పెరిగితే కష్టాలు తప్పవు. వర్కవుట్లు చేయకపోవడం అనేది శారీరకంగా, మానసికంగా నా ఒత్తిడిని పెంచింది. అంతకు ముందులా యాక్టివ్గా ఉండలేకపోయేదాన్ని. అదే కొంచెం సమయం తీసుకుని, ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరిగి ఉంటే.. ఇలా ఉండేది కాదు. అందుకే తగ్గాలన్నా, పెరగాలన్నా పద్ధతి ప్రకారమే చేయండని సలహా ఇస్తున్నాను. ఇక, ఈ సినిమా పూర్తి కాగానే.. ఎక్కువ టైమ్ తీసుకుని, చక్కగా తగ్గడం మొదలుపెట్టాను. అది బాగా అనిపించింది’’ అన్నారు. హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘అధిక బరువు అనేది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పోగొడుతుంది. అయితే మనం ఎలా కనిపిస్తున్నాం అనేదాని కన్నా ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నామన్నదే ముఖ్యం. మన ప్రవర్తన బాగుంటే అదే అందం. అయితే ఆరోగ్యం కోసం తగ్గాలనుకుంటే తగ్గొచ్చు. ఎవరో ఏదో అంటారని కాదు. అమ్మాయిల బాడీ షేప్ని హేళన చేయడం సరికాదు. ఇక ఒక సినిమా కోసం బరువు పెరగడం అనేది ఓ సవాల్. ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరగకపోతే కష్టాలు మాత్రం తప్పవు’’ అన్నారు. -
సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ కోసం సోనాక్షి డేరింగ్ స్టేప్!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా డేరింగ్ స్టేప్ తీసుకుంది. ‘ఆర్.. రాజ్కుమార్’, ‘దబాంగ్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలల్లో నటించి మెప్పించిన సోనాక్షికి ఇటీవల అవకాశాలు బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వేశ్య పాత్రలో నంటించేందుకు రేడి అయ్యింది. దీంతో ఈ సమయంలో సోనాక్షి ఇలాంటి డేరింగ్ స్టేప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ స్థాయిలో ‘హీరా మండి’ పేరుతో ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించబోతున్నాడు. పాకిస్తాన్లోని లాహోర్లో రెడ్లైట్ ఎరియా నేపథ్యంలో సెక్స్ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్ సీరిస్ సాగనుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించేందుకు సోనాక్షి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ పాత్రకు సంజయ్ లీలా భన్సాలీ సోనాక్షిని ఖరారు చేశారట. ఈ వెబ్ సిరీస్ కథ వివరించగానే సోనాక్షి తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి మరు క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఇప్పటికే ఈ సిరీస్లో వేశ్య పాత్ర కోసం సీనియర్ నటి మాధురి దీక్షిత్, హ్యూమా ఖురేషిల పేర్లు తెరపై రాగా చివరకు హ్యూమా ఖురేషిని దర్శకుడు ఓకే చేశాడు. తాజాగా మరో ప్రధాన వేశ్య పాత్రకు సోనాక్షిని కూడా ఎంపిక చేశారు. ఇందులో సోనాక్షి కథక్ డ్యాన్సర్గా కనిపించనుండటంతో ఆమె కథక్ నేర్చుకునే పనిలో కూడా పడిందట. కాగా ఇది వరకు సోనాక్షి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చి ‘రౌడీ రాథోడో’ మూవీలో నటించింది. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచిందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం అలియా భట్ ‘గంగూభాయ్ కథియావాడి’ మూవీని తెరెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తెయిన అనంతరం ‘హీరా మండి’ని తెరకెక్కించే ప్లాన్ ఉన్నాడు. దీనికోసం ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ప్టిక్స్తో చర్చలు కూడా జరపుతున్నాడట. -
‘బంగార్రాజు’తో జతకట్టనున్న బాలీవుడ్ భామ!
కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్లో బంగార్రాజు మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. 2015లో విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కింగ్ నాగార్జున డబుల్ రోల్ పోషించిన ఈ చిత్రం ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో బంగార్రాజు పాత్రకు విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ ప్రాత పేరు మీద సీక్వెల్కు ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన దర్శకుడు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఇటీవల స్క్రిప్ట్ను పూర్తి చేసిన దర్శకుడ అందులో కొన్ని మార్పులు చేసి కథ ఫైనల్ చేశాడట. ఇదిలా ఉండగా నాగార్జున సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్షాను కథానాయికగా తీసుకొవాలనుకుంటున్నారని, దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్లో వినికిడి. ఒకవేళ అంతా ఒకే అయితే ఇందులో బంగార్రాజుతో సోనాక్షి సిన్హా ఆడిపాడనుందట. దీంతో పాటు ఫీమేల్ లీడ్ రోల్ కాకపోయిన, ఓ స్పెషల్ రోల్ కోసమైన సోనాక్షిని సంప్రదించాలని డైరెక్ట్ భావిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అనుకున్నట్లుగానే జూన్, జూలేలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తిసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. చదవండి: ఒక్క నెలలోనే 6కేజీలు తగ్గిన పాయల్.. ఏం చేసిందంటే.. అరియానా అసలు పేరు తెలుసా? నాగార్జునకు కూడా చెప్పలేదు! -
ట్రోల్స్పై ఘాటుగా స్పందించిన హీరోయిన్
ముంబై: తనపై విపరీతంగా ట్రోల్స్పై చేస్తున్న నెటిజన్లపై తానే గెలిచానని హీరోయిన్ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత వారం తన ట్విటర్ ఖాతాను డియాక్టివేట్ చేసినప్పటి నుంచి తనని మరింత ఎగతాలి చేస్తూ నెటిజన్లు ఫన్నీ మిమ్స్ క్రియోట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై సోనాక్షి స్పందిస్తూ కేవలం ట్విటర్ నుంచి మాత్రమే తాను నిష్క్రమించానని.. ఇవి నిజమైన ట్రోల్స్ కాదంటూ నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోమవారం ఇన్స్టాగ్రామ్లో పోస్టు షేర్ చేస్తూ.. ‘కొంతమంది తాము ఏదో గెలిచినట్లు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సరే నేను దానికి సంతోషిస్తాను. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎవరికి లాభం లేదు, నష్టం కూడా లేదు. ఇక మీరు ప్రత్యేక్షంగా చేసే విమర్శలు, అవమానాలకు కేంద్రమైన నా ట్విటర్ అకౌంట్ తీసేశాను. నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను బాధ పెట్టాలనుకున్నారు. కానీ ఇకపై మీకు ఆ అవకాశం లేకుండా చేశాను. కాబట్టి ఇక్కడ గెలిచింది నేనే’ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు. (ట్విటర్ అకౌంట్ డియాక్టివేట్ చేసిన హీరోయిన్!) తాను తన ట్విటర్ నుంచి వైదొలుగుతున్నట్లు గత వారం సొనాక్షి ప్రకటించారు. ‘‘తమ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి తెలివైన వారు మొదటగా వేసే అడుగు నెగిటివిటికీ దూరంగా ఉండటం. కాబట్టి నేను ట్విటర్కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అందుకని నా ఖాతాను తొలగిస్తున్నాను. గుడ్ బై గాయ్స్. ఇక ప్రశాంతంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) View this post on Instagram How i got myself off twitter and away from the negativity 😂 Some people are celebrating like they won something... im happy for you, tumhe laga raha hai na... lagne do, kisi ko koi farak nahi padh raha. But lets face it, ive cut the direct source of insult and abuse in my life. Ive taken away YOUR power to be able to say whatever it is that you want to me, my family and my friends. Ive taken away that access you had to me, that i had given you so trustingly. So theres only one winner here. Me. Your negativity has never served me or my life, which is why it literally took a snap of a finger to get rid of a following of 16 million people which ive garnered over the last ten years. Just like that. And im better off for it. I wish all those haters and trolls lots of love and healing, or you can continue with the hate but please know it’ll NEVER reach me. Accha ab yeh chakkar mein i know the people who love me are caught up too... please know that your love and support is what has kept me going all this while, and it always will! And I request you all to keep spreading that love and light wherever you go and to as many people as you can. Because Love is the answer. Always ❤️ A post shared by Sonakshi Sinha (@aslisona) on Jun 21, 2020 at 8:11am PDT కాగా సుశాంత్ ఆత్మహత్యపై స్పందిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ పరిశ్రమలోనిప్రముఖులు, స్టార్కిడ్స్పై మండిపడుతూ ట్విటర్లో వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనాక్షి స్పందిస్తూ..కొంత మంది సోదరభావంతో ఇతరుల మరణాలను కూడా ఫేమ్ కోసం వాడుకుంటున్నారు అంటూ కంగనాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాక ఆభ్యంతరక వ్యాఖ్యలతో విమర్శలు చేయడంతో నెటిజన్లు సోనాక్షిపై విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇక అవి తారాస్థాయికి చేరడంతో తన ట్విటర్ ఖాతాను సోనాక్షి గత శనివారం తోలగించారు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..) -
‘అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నా’
ముంబై: గతంలో చేసిన తప్పుకు ఇప్పటికీ విమర్శించడం తనని తీవ్రంగా బాధిస్తోందని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమానికి సోనాక్షి అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు రామయణానికి సంబంధించిన ప్రశ్న అడగడంతో దానికి ఆమె సమాధానం చెప్పలేకపోయారు. దీంతో మన సంస్కృతిని తెలిపే రామయణం గురించి తెలియకపోవడం సిగ్గుచేటు అంటూ ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్కు ఇచ్చిన ఇంటర్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. ‘నేను కౌన్ బనేగా కరోడ్ పతిలో రూపాదేవి అనే కంటెస్టెంట్తో కలిసి హాట్ సీట్లో పాల్గొన్నాను. అప్పుడు నన్ను రామయణంలో ఆంజనేయుడు ఎవరికి కోసం సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు అని అడిగిన ప్రశ్నకు ఆ క్షణం నా మైండ్ బ్లాక్ అయ్యింది. రూమా కూడా సమాధానం చెప్పలేక పోయింది. నిజం చెప్పాలంటే దానికి సమాధానం చెప్పలేకపోయినందుకు ఇబ్బందిగా అనిపించింది. అది తప్పే నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రామయణం చదువుతూ, వింటూ పెరిగినా కూడా సమాధానం చెప్పలేకపోవడం బాధకరం. అయితే ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ దీనిపై నన్ను ట్రోల్ చేయడం నిజంగా బాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్) ఇక లాక్డౌన్ నేపథ్యలో గతంలోని రామయణం సీరియల్ పునఃప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా సోనాక్షి విమర్శలకు గురయ్యారు. దీనిపై సోనాక్షి మాట్లాడుతూ.. రామయణం అర్ధం చేసుకోవడంలో తనని విమర్శించిన వారంతా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎందుకంటే రామయణంలో రాముడు తల్లిదండ్రులకు మంచి కుమారుడు, మంచి భర్త, మంచి మానవుడు ఎలా ఉండాలో అందరికి ఆయన ఓ ఉదాహరణగా ఉంటాడు. ఇక రాముడి నుంచి మంచి నేర్చుకోకుండా వీరంతా నాపై విమర్శలు చేశారని అన్నారు. ఇకపై తాను ఈ విమర్శలను పటించుకోనని ఆమె స్పష్టం చేశారు. (‘ఈ జంట కటిఫ్ చెప్పేసుకున్నట్టేనా?!’) -
‘సోనాక్షి సల్మాన్ ఖాన్ చెంచా!’
ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ దబాంగ్ ఫేమ్ సోనాక్షి సిన్హా తనపై విమర్శలు చేసిన నెటిజన్లపై ఫైర్ అయింది. తనను సల్మాన్ ఖాన్ చంచా అని, నటించడం రాదని కేవలం మీ నాన్న సినిమా రంగంలో ఉండడం వల్లే అవకాశాలు వస్తున్నాయనే ఓ నెటిజన్ విమర్శలకు సోనాలి ఘాటైన సమాధానమిచ్చింది. తనకు నటన రాకుంటే 9 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో అవకాశాలు ఎందుకొచ్చాయంటూ ప్రశ్నించింది. మరికొందరు నెటిజన్లు లావుగా ఉన్నావంటూ.. ఆమె టీవీలో కనిపిస్తే టీవీనే పగలగొడుతానని, సోనాక్షిని తీవ్రంగా ద్వేషిస్తానని అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేయగా వాటికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ వ్యాఖ్యలపై సోనాక్షి స్పందిస్తూ.. మీరు టీవీని పగలగొడుతున్నారంటే మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నావనుకుంటా నచ్చకుంటే టీవీని ఆపేయవచ్చు..అంతేగానీ పగలగొట్టాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం కండలవీరుడు సల్మాన్ ఖాన్కు జోడిగా సోనాక్షి దబాంగ్ 3లో నటిస్తుండగా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదలవుతున్న విషయం తెలిసిందే. -
సోనాక్షి ఫోటోషూట్ తళుకులు
ముంబై : దబాంగ్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు సోనాక్షి సిన్హా. మొదటి సినిమాతోనే కండల వీరుడు సల్మాన్ ఖాన్తో జతకట్టి ఈ బ్యూటీ భారీ విజయాన్నితన ఖాతాలో వేసుకున్నారు. ఎల్లప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్గా ఉంటూ, తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పడు అభిమానులతో షేర్ చేస్తుంటారు ఈ బొద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఆన్లైన్ షాపింగ్ ప్రచార కార్యక్రమం ఫోటో షూట్లో దిగిన చిత్రాలను సోనాక్షి బుధవారం తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘బ్లాక్ మ్యాజిక్ వుమెన్’ అనే క్యాప్షన్ జతచేర్చారు. ఈ ఫోటోలో ఆఫ్ షోల్డర్తో ధరించిన నల్లని దుస్తుల్లో, విరబోసిన కురులతో సోనాక్షి అందాలను ఆరబోశారు. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు తన అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. హాట్ లుక్స్తో మెరిసిపోతున్న సోనాక్షిని ఫ్యాఫన్ క్వీన్గా చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం సోనాక్షి దబాంగ్-3 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram Black magic woman! For the @myntrafashionsuperstar promo shoot! Styled by @mohitrai @miloni_s91 (tap for deets), hair by @themadhurinakhale, makeup @mehakoberoi and photos by @saurabhdalvi_photography 🖤 A post shared by Sonakshi Sinha (@aslisona) on Sep 11, 2019 at 6:24am PDT -
‘మిషన్ మంగళ్’పై కిషన్ రెడ్డి రివ్యూ!
ముంబై: ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రేక్షకులను అలరించేందుకు ‘మిషన్ మంగళ్’ సినిమా సిద్ధమవుతోంది. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్కుమార్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి, నిత్యమీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మిషన్ మంగళ్’ గురువారం (ఆగస్టు 15న) ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఒకింత దేశభక్తి నేపథ్యంలో ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. జగన్ శక్తి దర్శకత్వంలో ఆర్ బాల్కీ రచన, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి అప్పుడే పాజిటివ్ టాక్ మొదలైంది. ఆదివారం ఢిల్లీలో ఈ సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ చూసినవారిలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి సహా పలువురు సెలబ్రెటీలు ఉన్నారు. ఈ సినిమా తమకు చాలా బాగా నచ్చిందని, సినిమా అద్భుతంగా ఉందని ఈ స్పెషల్ స్క్రీనింగ్ వీక్షించిన ప్రముఖులతోపాటు పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ‘ఓ చక్కని రోజును ఆసక్తికరంగా ముగించాను. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హాతోపాటు ఇతర చిత్రయూనిట్తో కలిసి ‘మిషన్ మంగళ్’ ప్రివ్యూ చూడటం అమేజింగ్గా అనిపించింది. సినిమాను బాగా తెరకెక్కించారు. ఇస్రో ఘనతను, విజయాలను అద్భుతంగా చూపించారు’ అని కిషన్రెడ్డి ట్వీట్ చేశారు. What an interesting way to end a good day! Had an amazing time watching the preview of the movie #MissionMangalyaan along with the movie leads @AkshayKumar, @Sonakshisinha, and other cast & crew members. It's a movie very well shot, to depict the glory of @isro and its success. pic.twitter.com/biSSpRhttD — G Kishan Reddy (@kishanreddybjp) August 13, 2019 -
ఒక్క దెబ్బతో అక్షయ్ని కింద పడేసింది
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అంటే చాలు.. చాలా మంది నటులు పెద్దగా ఉత్సాహం చూపరు. కొందరు సినిమా అంగీకరించడానికి ముందే ప్రమోషన్ కార్యక్రమాల్లో తాము పాల్గొనమని ఒప్పందం చేసుకుంటారు. కానీ బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ మాత్రం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. తోటి నటులతో కూడా చాలా సరదాగా ఉంటారు. ప్రస్తుతం అక్షయ్ అండ్ టీమ్ మిషన్ మంగళ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రమోషన్ కార్యక్రమంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ సోనాక్షి సిన్హా, అక్షయ్ని కింద పడేసింది. ‘మిషన్ మంగళ్’ ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హీరోయిన్లు నిత్యా మీనన్, తాప్సీ, విద్యాబాలన్, కీర్తి కుల్హరి, సోనాక్షి సిన్హా, అక్షయ్ కుమార్ హాజరయ్యారు. వీరంతా కూర్చొని చిత్రానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. కుర్చీతో పాటు వెనక్కి వాలాడు. అప్పుడు పక్కనే ఉన్న సోనాక్షి.. అక్షయ్ ఛాతిపై చేత్తో కొట్టింది. దాంతో అక్షయ్ కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు. అతను పడిపోతుండగా తాప్సీ పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకపోయింది. అక్షయ్ని చూసి అందరూ ఒక్కసారి ఆశ్చర్యానికి గురవగా.. సోనాక్షి మాత్రం పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. అక్షయ్ సైతం దీన్ని సరదాగా తీసుకొని సోనాక్షి వైపు చేయి చూపుతూ ఏంటిది అన్నట్లుగా ఓ ఎక్స్ప్రెషన్ పెట్టడంతో మిగతావారూ నవ్వడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోనాక్షి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. జగన్ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్’. భారతదేశం చేసిన మిషిన్ మార్స్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. -
‘ఆ సెలబ్రిటీతో డేటింగ్ చేశా’
ముంబై : బాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే హీరోయిన్లలో ముందువరుసలో నిలిచే సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా పెదవివిప్పారు. తాను గతంలో ఓ సెలబ్రిటీతో డేటింగ్లో ఉన్నానని, తమ ప్రేమ వ్యవహారం గురించి ఎవరికీ తెలియదని వెల్లడించారు. సినీ ఇండస్ర్టీ వ్యక్తితో ఎవరితోనైనా డేటింగ్ చేశారా అని సోనాక్షిని ఓ చాట్ షోలో ప్రశ్నించగా ఓ మంచి యువకుడితో తాను డేటింగ్ చేయాలని సినీ పరిశ్రమలోనే ఏ ఒక్కరూ భావించని రీతిలో తన తల్లితండ్రులు కోరుకున్నారని చెప్పుకొచ్చారు. గతంలో సినీ పరిశ్రమకు చెందిన ఓ సెలబ్రిటీతో తన ప్రేమ వ్యవహారం గురించి ఆమె వెల్లడించారు. అయితే తమ డేటింగ్ గురించి ఎవరికీ తెలియదని చెప్పిన సోనాక్షి ఆ సెలబ్రిటీ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. రిలేషన్షిప్లో మోసాలను మాత్రం తాను సహించనని ఆమె తేల్చిచెప్పారు. తనను తన భాగస్వామి మోసం చేస్తే మరుసటి రోజును అతడు చూడలేడని చెప్పడం గమనార్హం. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారు. -
మిల మిల మెరిసే మీనాక్షి!
సోనాక్షి సిన్హా నటి మాత్రమే కాదు...చక్కగా బొమ్మలు గీస్తుంది. అంతకంటే చక్కగా పాడుతుంది. ‘దబాంగ్–3’లో ‘రజ్జో పాండే’గా మరోసారి అలరించనుంది. ‘సంతోషం సగం బలం... ఆ బలం పనిలోనే ఉంది’ అంటున్న సోనాక్షి చెప్పిన కొన్ని ముచ్చట్లు... గొప్ప ఔషధం ఎలాంటి సమస్య నుంచి బయట పడడానికైనా ఒక ఔషధం ఉంది. అదే పని! పనిలో తలమునకలైపోతే ఎలాంటి సమస్యను అయినా అధిగమించవచ్చు. ఇది నేను సొంత అనుభవంతో చెబుతున్న మాట. తీరిక సమయాల్లో జిమ్లో గడపడం, పెయింటింగ్, స్కెచ్చింగ్ వేయడం, సినిమాలు చూడడంలాంటివి చేస్తుంటాను. ఆత్మవిశ్వాసం వుమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. ‘అకిరా’ సినిమా తరువాత ఆచితూచి పాత్రలు ఎంచుకుంటున్నాను. టైటిల్ రోల్ పోషించిన నా సోలో ఫిల్మ్ ఇది. ఇది నాలోని ‘స్కిల్స్’ని నాకు తెలియజేసిన సినిమా. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సినిమా. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది. చాలెంజింగ్గా ఉండే స్క్రిప్ట్లను ఇష్టపడతాను. అప్పుడు మనలో మరోకోణం పరిచయమవుతుంది. మల్టీస్టారర్ సినిమాలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వల్ల నటులలో అభద్రతాభావం తలెత్తితే...హాలీవుడ్లోగానీ, బాలీవుడ్లోగానీ ఎన్నో మంచి సినిమాలు వచ్చి ఉండేవి కావు. నాకు అలాంటి భయాలేమీ లేవు. ‘కళంక్’ సినిమాలో మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, ఆలియా భట్, వరుణ్లతో నటించడం మంచి అనుభవం! సంతోషం జీవితంలో నా మొదటి ప్రాధాన్యత...ఎప్పుడూ సంతోషంగా ఉండడం! నేను సంతోçషంగా ఉండడం ఎంత ముఖ్యమో అవతలి వ్యక్తిని సంతోషంగా ఉంచడం అంతే ముఖ్యమని నమ్ముతాను. సానుకూల దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రభావం చేసే పని మీద పడి చురుగ్గా ఉండగలుగుతాం. చదువు చదివిన చదువు ఎప్పుడూ వృథా పోదు. నటి కావడానికి ముందు మూడు సంవత్సరాలు ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. అక్కడ ఎంతో నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నది ఇప్పుడు ఏదో ఒకచోట ఉపయోగ పడుతూనే ఉంది. ఉదాహరణకు సెట్లో ఉన్నప్పుడు ‘క్విక్ అల్టరేషన్’ అవసరమైంది అనుకోండి... సై్టలిస్ట్లు, డిజైనర్లకు ఏంచేయాలో చెబుతాను. ఇది నా వృత్తిలో భాగం అనుకుంటాను. -
ఆలియా ఓటు వేయదట ఎందుకంటే..
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయబోనని చెబుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్. తన దగ్గర ఇండియన్ పాస్ పోర్టు లేదని అందుకే ఓటు వేయలేకపోతున్నానని చెప్పింది. వరుణ్ ధావన్, అలియా భట్ లీడ్ రోల్స్లో వస్తున్న తాజా చిత్రం 'కళంక్. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నారు. కళంక్ టీంతో ఇండియా టూడే ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రభావం మీపై ఎలా ఉంది అని ప్రశ్నించగా.. వరుణ్, సోనాక్షి, ఆదిత్యలు ఓటు వేయడం మా బాధ్యత అని చెప్పారు. ఇక ఆలియానును అడగ్గా తాను ఓటు వేయలేనని చెప్పింది. తనకు ఇండియన్ పాస్పోర్టు లేదని అందుకే ఓటు వేయలేనని సెలవిచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆలియా భట్ బ్రిటీష్ పౌరురాలు అందుకే ఆమెకు భారత్లో ఓటు హక్కులేదు. అభిషేక్ వర్మ డైరక్ట్ చేస్తున్న ‘కళంక్’ మూవీని కరణ్ జోహర్, సాజిద్ల నదియావాలా, ఫాక్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ లు నటిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శ్రీదేవి గర్వపడేలా చేయాలనుకున్నా
‘‘శ్రీదేవి చనిపోయి ఏడాది పూర్తయింది. కానీ శ్రీదేవి మన మధ్య లేరు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీదేవి చేయాల్సిన ఓ పాత్రను నేను చేయడం చాలా ఎమోషనల్గా అనిపిస్తోంది. శ్రీదేవి గర్వపడేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అని మాధురీ దీక్షిత్ అన్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘కళంక్’. ఇందులో మాధురి పోషిస్తున్న పాత్రను మొదట శ్రీదేవి చేయాలి. కానీ శ్రీదేవి అకాల మరణంతో ఆ పాత్ర మాధురికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మాధురి మాట్లాడుతూ – ‘‘ఈ పాత్ర కోసం కరణ్ నన్ను సంప్రదించగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. శ్రీ, నేను చివరిసారిగా డిజైనర్ మనీష్ మల్హోత్రా బర్త్డే పార్టీలో కలుసు కున్నాం. ఆ పార్టీలో పిల్లలిద్దరితో (జాన్వీ, ఖుషీ) సంతోషంగా కనిపించింది. సడన్గా శ్రీదేవి చనిపోవడం బాధగా అనిపించింది. తన మరణంతో జీవితం చాలా చిన్నది అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతిరోజుని ఆస్వాదించాలి, ఆనందించాలి అని తెలుసుకున్నాను. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనం ఎవ్వరం ఊహించలేం’’ అని అన్నారు. ‘కళంక్’ ఈ ఏడాది రిలీజ్ కానుంది. -
చీటింగ్ ఆరోపణలపై స్పందించిన సోనాక్షి బృందం
సాక్షి, న్యూఢిల్లీ : ఈవెంట్లో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని చివరి నిమిషంలో హాజరయ్యేందుకు నిరాకరించారంటూ ఓ ఈవెంట్ నిర్వాహకుడి ఫిర్యాదుతో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సహా మరో నలుగురిపై చీటింగ్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. అయితే తాము ఎన్ని సార్లు గుర్తు చేసినా సోనాక్షికి ముందుగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని ఈవెంట్ నిర్వాహకుడిపై సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఆరోపించింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈవెంట్లో పాల్గొనేందుకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పలుమార్లు గుర్తుచేసినా నిర్వాహకులు సోనాక్షికి డబ్బు చెల్లించకపోవడంతో పాటు చివరికి తప్పుడు ప్రచారం చేసుకునేందుకు వారు ప్రస్తుతం మీడియాను వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించకపోవడంతో పాటు ఈవెంట్ ముగియగానే సోనాక్షి, ఆమె బృందానికి తిరుగు ప్రయాణం టికెట్లు పంపలేదని సోనాక్షి సిన్హా ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వాహకులు స్పందించకపోవడంతో సోనాక్షి, ఆమె బృందం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వెనుతిరిగిందని సోనాక్షి ప్రచార వ్యవహారాలు పర్యవేక్షించే ఏజెన్సీ పేర్కొంది. అయితే ఈవెంట్ను మరోసారి నిర్వహించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలపై పలుసార్లు నిర్వాహకులతో తాము కోరినా వారి నుంచి స్పందల లేదని సోనాక్షి మేనేజ్మెంట్ టీం ఆవేదన వ్యక్తం చేసింది.తమపై దుష్ర్పచారం మానకుంటే సోనాక్షి సహా ఆమె బృందం చట్టపరమైన చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది -
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ ఈవెంట్ సంస్ధ నుంచి డబ్బులు తీసుకుని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదరు కార్యక్రమానికి గైర్హాజరు కాకపోవడంతో నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోనాక్షి సిన్హా గత ఏడాది సెప్టెంబర్ 30న కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ 37 లక్షలు తీసుకున్నారని, అయితే చివరినిమిషంలో ఈవెంట్లో ఆమె పాల్గొనలేదని ఆరోపిస్తూ ఆర్గనైజర్లు ఫిర్యాదు చేయడంతో సోనాక్షి సహా ఐదుగురిపై చీటింగ్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో బాలీవుడ్ నటితో పాటు అభిషేక్ సిన్హా, మాళవిక పంజాబి, ధుమిల్ ఠక్కర్, ఎద్గార్ల పేర్లు పొందుపరిచామని మొరదాబాద్ డీఎస్పీ గజ్రాజ్ సింగ్ తెలిపారు. ఈవెంట్ నిర్వాహకుల ఫిర్యాదుపై తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. -
వచ్చే ఏడాది వస్తాం
...అంటున్నారు సల్మాన్ ఖాన్, సోనాక్షీ సిన్హా. ఎక్కడికి అంటే.. థియేటర్స్లోకి. ‘దబంగ్’తో తొలిసారి ఈ ఇద్దరూ జత కట్టారు. సోనాక్షీకి అది తొలి సినిమా. ఫస్ట్ సినిమాకే సల్మాన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఓ సూపర్ హిట్ని ఖాతాలో వేసుకోవడంతో ‘దబంగ్’ సోనాక్షీకి ఓ తీపి గుర్తు. ఎనిమిదేళ్ల క్రితం రూపొందిన ఈ చిత్రానికి ఆరేళ్ల క్రితం సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు మూడో భాగానికి రెడీ అయ్యారు. ఫస్ట్ పార్ట్కి అభినవ్ కశ్యప్, సెకండ్ పార్ట్కి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. మూడో భాగానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘వచ్చే ఏడాది ‘దబాంగ్ 3’తో మేం మీ ముందుకు వస్తాం’’ అని సల్మాన్, సోనాక్షీ పేర్కొన్నారు. కాగా, తొమ్మిదేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు ‘పోకిరి’ హిందీ రీమేక్ ‘వాంటెడ్’కి దర్శకత్వం వహించారు. హిందీలో దర్శకుడిగా ప్రభుదేవాకి అది తొలి సినిమా. ‘వాంటెడ్’ సూపర్ హిట్ అయింది. ఇన్నేళ్ల తర్వాత ‘దబంగ్ 3’తో మరో సూపర్ హిట్కి రెడీ అయ్యారు. -
‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ’ టీజర్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement