-
సంతకాన్ని జంతర్మంతర్ చేసినచో...
శూన్యంలో నుంచి కూడా కళను సృష్టించే నైపుణ్యం ఆర్టిస్ట్ల సొంతం. తాజా విషయానికి వస్తే... ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ తెల్లకాగితంపై చేసిన సంతకాన్ని క్షణాల్లో అందమైన చిత్రంగా మార్చాడు రాబిన్ బార్. సంతకం నుంచి అప్పటికప్పుడు ప్రేయసీప్రియులను సృష్టించిన రాబిన్ బార్ ఇలాంటి అలాంటి ఆర్టిస్ట్ కాదు...రికార్డ్ హోల్డర్ స్పీడ్ పెయింటర్. జస్ట్...కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వీడియో క్లిప్ 21 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. రాబిన్ బార్పై నెటిజనుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. -
ధరణిపై సంచలన నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు!
హైదరాబాద్, సాక్షి: ధరణి ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేత పత్రం ఉండనుందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ఇక.. ధరణిపై తాజా రివ్యూలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోర్టల్లో పెండింగ్లో ఉన్న 2.45లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధివిధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బందిపడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది. పోర్టల్ను పరిశీలించిన కమిటీ.. పూర్తిగా పోర్టల్ పునర్మిర్మాణం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగానే కాకుండా.. చట్టాల్ని మార్చాల్సిన అవసరమూ ఉందని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. ఇక.. ఈ కమిటీ సూచనలకు తగ్గట్లుగా నిర్ణయాలు ఉంటాయని తొలి నుంచి ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరిగేషన్, పవర్పై శ్వేతపత్రాలు విడుదల చేసి బీఆర్ఎస్ను ఇరుకునపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. -
అంచనాలు పెంచి అవినీతి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీశ్రావు ప్రసంగానికి అడ్డు వచ్చిన భట్టి, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ల అంచనాలు పెంచారని చెప్పారు. కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిట్టనిలువునా చీలిపోవడానికి గత పాలకులే కారణమని, అన్నారం, సుందిళ్ల కూడా అవే పరిస్థితుల్లో ఉన్నాయన్నా రు. 15.5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్లకు పెంచిందని విమర్శించారు. రూ.38 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు వివిధ పను ల కోసం ఖర్చు చేయగా, మరో రూ.28 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతితో వ్యయం పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన రాజీవ్సాగర్, ఇంది రా సాగర్ ప్రాజెక్టులకు రూ.1,420 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేవని, రీ డిజైనింగ్ పేరుతో రూ.23 వేల కోట్లకు పెంచి ఇప్పటివరకు ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంటు ఖర్చు, నిర్వహణ ఖర్చు కలిపి ఏటా రూ.20 వేల కోట్లు అవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా కట్టాలని భట్టి ప్రశ్నించారు. -
ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. మొత్తంగా 1.27 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుల పూర్తికి మరో రూ.97 వేల కోట్లు అవసరమని, ఖర్చు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులపై చేసిన 1.81 లక్షల కోట్ల వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారిందని పేర్కొంది. ప్రభుత్వం శనివారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, తెలంగాణ ఏర్పాటు తర్వాత నిర్మాణం కొనసాగిన, పూర్తయిన, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, వ్యయం, సాగులోకి వచ్చిన ఆయకట్టు వంటి అంశాలను అందులో వెల్లడించింది. గత సర్కారు అద్భుతంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగి, పగుళ్లు వచ్చిందని.. మరో రెండు బ్యారేజీలు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 2014 వరకు రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. 2014 తర్వాత అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చి ప్రాజెక్టుల ను నిర్మించడం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని తెలిపింది. వచ్చే పదేళ్లలో రూ.1.35 లక్షల కోట్లను తిరిగి చెల్లించాల్సి ఉందని వివరించింది. ప్రాజెక్టులపై శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు.. ► 2014కు ముందు ఆయకట్టు 57.79 లక్షల ఎకరాలు. ప్రాజెక్టులకు మొత్తం ఖర్చు రూ.54,234 కోట్లు. ► 2014–2023 మధ్య రూ.1.81 లక్షల కోట్ల వ్యయంతో.. 15.81 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ► కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల కోసం రూ.1.29 లక్షల కోట్ల ఖర్చు జరిగింది. ► రాష్ట్రంలో మొత్తం ఆయకట్టు అంచనా 1.27 కోట్ల ఎకరాలు.. ఇప్పటికే ఉన్న ఆయకట్టు 73.6 లక్షల ఎకరాలు. ► ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తిచేసి మిగతా 53.98 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే రూ.97,774 కోట్లు కావాలి. ► వచ్చే ఐదేళ్లలో అప్పులు, వడ్డీల కింద రూ.77,369 కోట్లు చెల్లించాలి. ► కాళేశ్వరానికి రూ.93,872 కోట్లు ఖర్చుచేసి 98,590 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చారు. ► పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు రూ.36 వేలకోట్లు వ్యయం చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ► పదేళ్లలో కృష్ణాజలాల దోపిడీ 4 రెట్లు పెరిగింది. ► సాగునీటికోసం ఉద్యమించిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఒంటెద్దు పోకడ పోయింది. ► కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి గత ప్రభుత్వం 2015లోనే అంగీకరించింది. ► శ్రీశైలం నుంచి రోజుకు 9.3 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు గత ప్రభుత్వం సహకరించింది. ► పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రోజుకు రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీ సామర్థ్యానికి కుదించింది. ► గత ప్రభుత్వ తీరువల్ల శ్రీశైలంపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ► కృష్ణా నీటి వాటాల్లో మనకు అన్యాయం జరిగింది. న్యాయంగా రావాల్సిన నీటిని కోల్పోయాం. ► జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ సర్కారు తుమ్మిడిహెట్టి వద్ద రూ.38,500 కోట్లతో 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 160 టీఎంసీలు ఎత్తిపోసి, 16 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూపొందించింది. ► ఎల్లంపల్లికి ఒకదశలో నీటిని పంపు చేయాల్సిన చోట రీడిజైన్ చేసి అనవసరంగా వ్యయం పెంచారు. ప్రాణహిత–చేవెళ్లకు విద్యుత్ వ్యయం ఏటా రూ.1,010 కోట్లు అయి ఉండేది. కాళేశ్వరం ద్వారా రూ.10వేల కోట్లు అవుతోంది. ► కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు 162.36 టీఎంసీలు ఎత్తిపోసి.. అందులో 30 టీఎంసీలను తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. ► ఈ ప్రాజెక్టు ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్వహణ నియంత్రణ లోపాలు ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెల్లడించింది. ► మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ దెబ్బతిని, పిల్లర్స్ కుంగి కదిలిపోయాయి. ఈ బ్యారేజీలోని లోపం మొత్తం ప్రాజెక్టు పనితీరుపైనే ప్రభావం చూపు తుంది. విజిలెన్స్ నివేదిక సైతం లోటుపాట్లను సవివరంగా వెల్లడించింది. ► కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉంది. పాలమూరు–రంగారెడ్డికి ఏఐ బీపీ కింద నిధులు తెస్తాం. కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన నీటివాటా కోసం చర్యలు తీసుకుంటాం. -
Parliament Session 2024: యూపీఏపై నిర్మల నిప్పులు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి దిగజార్చారంటూ కాంగ్రెస్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దుమ్మెత్తిపోశారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, భారతీయులపై దాని ప్రభావం’ అంశంపై లోక్సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వానికి దేశమే తొలి ప్రాధాన్యం. యూపీఏకు మాత్రం ఆ ఒక్క (గాం«దీ) కుటుంబమే ముఖ్యం. 2008లో దేశం ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుంటే జాతి ప్రయోజనాల పరిరక్షణకు యూపీఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పలు స్కామ్లతో దేశార్థికాన్ని దీనావస్థలోకి నెట్టి 2014లో ని్రష్కమించారు. వాళ్లు అధికారంలో కొనసాగితే ఇంకెన్ని దారుణాలు జరిగేవో దేవుడికే తెలుసు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా ఉండటం వల్లే యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వాళ్లిప్పుడు మాకు సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేరి్పస్తున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ సర్కార్ ఎంతటి సమర్థతతో, అంకితభావంతో పనిచేసిందో, పరిస్థితిని చక్కదిద్దిందో అంతా చూశారన్నారు. వరుస కుంభకోణాలు ‘‘బొగ్గు కుంభకోణం కారణంగా దేశం రూ.1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వాన్ని తలంటి ఏకంగా 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్ను రద్దుచేసింది. కోల్స్కామ్ ధాటికి చివరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుదుత్పత్తి తగ్గింది. మొత్తంగా పెట్టుబడులూ దెబ్బతిన్నాయి. అదే మోదీ ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా బొగ్గు బ్లాకుల వేలం జరిగింది. వాళ్లు బొగ్గును బూడిదగా మార్చారు. మా మోదీ సర్కార్ లాభసాటి విధానాలతో బొగ్గును వజ్రాల వ్యాపారమంత విలువైనదిగా మార్చింది’’ అన్నారు. నాడు పరువు పోతే నేడు ప్రతిష్ఠ పెరిగింది ‘‘యూపీఏ హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంతో దేశం పరువు పోయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సును ఔరా అనిపించేలా నిర్వహించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాం. బ్యాంకింగ్ రంగమంటే మాకు గౌరవం. కానీ యూపీఏ హయంలో ప్రభుత్వ పెద్దలు తాము చెప్పిన వారికి రుణాలొచ్చేలా చేసి మొండిబకాయిలు పెరగడానికి కారకులయ్యారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 3.2 శాతానికి దిగొచ్చాయి’’ అన్నారు. యూపీఏ పాలనపై బురదజల్లుతున్నారంటూ నిర్మల ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. -
‘బ్లాక్ అండ్ వైట్’ నిజాలు!
సందిగ్ధతకు తావు లేకుండా విషయం తేటతెల్లమయ్యే స్థితివుంటే, తప్పొప్పులు స్పష్టంగా అర్థమవు తుంటే... అలాంటి పరిస్థితిని వ్యక్తీకరించటానికి ఆంగ్లంలో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే నుడికారాన్ని ఉపయోగిస్తారు. గురువారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం (వైట్ పేపర్) విడుదల చేయగా, దీనికి పోటీగా కాంగ్రెస్ నల్లపత్రం (బ్లాక్ పేపర్) ప్రకటించింది. ఇది ఎన్నికల రుతువు గనుక అధికారంలోకొచ్చి పదేళ్లవుతున్న సందర్భంలో ఆర్థిక రంగంలో తమ ఘనతను చాటుతూ ఎన్డీయే సర్కారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఈ పదేళ్లూ ‘కర్తవ్య కాలమ’ని ఆ పత్రం అభివర్ణించింది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా ఆర్థికరంగంలో ఎంతటి అరాచకత్వం, ఎలాంటి విచ్చలవిడితనం చోటుచేసుకున్నాయో వివరించింది. 2004లో యూపీఏ అధికారంలోకి రావడానికి ముందున్న ఎన్డీయే సర్కారు దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను అందించివెళ్తే యూపీఏ దాన్ని కాస్తా ధ్వంసం చేసిందన్నది శ్వేతపత్రం ఆరోపణ. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్ ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఏకరువు పెట్టింది. ఈ కాలాన్ని ‘అన్యాయ కాలం’గా అభివర్ణించించింది. అందులో ఆర్థిక రంగంతోపాటు ఇతరేతర అంశాలను కూడా ప్రస్తావించింది. రెండూ ఒకేరోజు విడుదల కావటంవల్ల వాస్తవ స్థితి ఏమిటో ‘బ్లాక్ అండ్ వైట్’లో తేటతెల్లమవుతుందని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు యూపీఏ ఉనికిలో లేదు. దాని స్థానంలో ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి రంగంలోకొచ్చింది. గతంలో యూపీఏకు నేతృత్వం వహించినట్టే ఇప్పుడు ‘ఇండియా’కు తానే అన్నీ అయి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. అయినా శ్వేతపత్రానికి కూటమి తరఫున కాక ఆ పార్టీయే సమాధానం ఇవ్వాల్సివచ్చింది. ఉన్న స్థితిగతులను గణాంక సహితంగా చెప్పటానికి విడుదల చేసే పత్రాన్ని శ్వేతపత్రం(వైట్ పేపర్) అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన దానికి పోటీగా బ్లాక్ పేపర్ పేరిట కాంగ్రెస్ ఎందుకు విడుదల చేయాలనుకుందో తెలియదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నింద తొలగించుకోవటానికీ, బీజేపీ ‘నమ్మకద్రోహాన్ని’ చాటడానికీ 1993 మొదట్లో అప్పటి పీవీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాన్ని పూర్వపక్షం చేస్తూ, జరిగిన తప్పిదాలకు కేంద్రానిదే బాధ్యతని వివరిస్తూ బీజేపీ సైతం శ్వేతపత్రాన్నే ప్రకటించింది. ఒకటి మాత్రం వాస్తవం... పత్రాలకు ఏ పేర్లున్నా వాటిల్లో వుండేవి గణాంకాలే. సామాన్యుల బతు కులు చూస్తే తప్ప వాస్తవ స్థితిగతులేమిటో అర్థంకావు. వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గురించి శ్వేతపత్రం ఘనంగానే చెప్పింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎన్డీయేది అదే మాట. తమ అయిదేళ్ల పాలన పరమాద్భుతంగా ఉన్నదంటూ ‘భారత్ వెలిగిపోతోంది’ అనే నినాదంతో నాటి ఎన్డీయే 2004 లోక్సభ ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రజలు తిరస్కరించారు. తాజా శ్వేతపత్రం మాత్రం నాటి ఎన్డీయే సర్కారు సుదృఢమైన ఆర్థిక వ్యవ స్థను అప్పగించిందని చెబుతోంది. దాని మాటెలావున్నా యూపీఏ తొలి అయిదేళ్ల పాలన ఒడిదుడు కులు లేకుండానే గడిచిందని చెప్పాలి. రెండోసారి నెగ్గాక అతి విశ్వాసమో, ఎదురులేదన్న దురహంకారమో యూపీఏను దెబ్బతీశాయి. పార్టీలోనూ, వెలుపలా ప్రత్యర్థులను అణచివేసేందుకు అప్రజా స్వామిక విధానాలు అమలయ్యాయి.శ్వేతపత్రం ప్రస్తావించిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం తదితర 15 స్కాములలో అధికభాగం రెండో దశ పాలనలోనివే. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు తన ఘనతేనని చెప్పుకుని కూడా వాజ్పేయి సర్కారు అందించిన అవకాశాలను వినియోగించుకోలేని చేతగాని స్థితిలో యూపీఏ పడిందన్నది శ్వేతపత్రం ప్రధాన ఆరోపణ. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా చేతివృత్తులు దెబ్బ తిని, వ్యవసాయం గిట్టు బాటు కాక, కొత్తగా ఏర్పడిన ఉపాధి అవకాశాలను అందుకోలేక భిన్న వర్గాలు పడిన యాతనలు అన్నీ ఇన్నీ కాదు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గీతం ఈ దీనస్థితికి అద్దం పట్టింది. సంస్కరణలు మాన వీయ దృక్పథంతో వుండాలన్న ఆలోచన ఆ తర్వాత వచ్చిందే. అనుత్పాదక ప్రయోజనాలకు వ్యయం చేయటంతో 2003–04లో 31 శాతంగా వున్న పెట్టుబడి వ్యయం 2013–14 నాటికి 16 శాతానికి దిగజారిందని శ్వేతపత్రం అంటోంది. అయితే 2008–09లో ప్రకటించిన రూ. 52,000 కోట్ల రుణమాఫీని ఈ జాబితాలో చేర్చటం సరికాదు. సాగురంగానికి జవసత్వాలివ్వటానికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకోవటానికీ ఆ చర్య దోహదపడింది. సగటు ద్రవ్యోల్బణ శాతం 8నుంచి 5కు తీసుకురావటం, తలసరి జీడీపీలో వృద్ధి, పెట్టుబడి వ్యయం పెరుగుదల, పరోక్ష పన్ను రేటులో తగ్గుదల వంటివి తమ విజయాలుగా శ్వేతపత్రం తెలిపింది. అయితే నల్లధనాన్ని వెలికి తీయటానికంటూ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ప్రస్తావన ఇందులో లేదు. యూపీఏ కాలంనాటి అవ్యవస్థనూ, దాని చేతగానితనాన్నీ గణాంక సహితంగా చెప్పకపోవటంవల్ల అప్పటి పరిస్థితులపై కాంగ్రెస్ స్వోత్కర్షలకు పోతోందని ఏనాటినుంచో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వుంది. తాజా శ్వేతపత్రం ఆ లోటైతే తీర్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఈఅంశాలు బీజేపీకి ఆయుధాలవుతాయి. అటు కాంగ్రెస్ అప్పట్లో తాము సాధించిందేమిటో చెబుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాక, జనం మౌలిక సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలు కావటం ఎప్పుడూ మంచిదే. -
Parliament Budget Session 2024: ‘ఇది కర్తవ్య కాలం’
న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించింది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రం(వైట్ పేపర్)లో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన 59 పేజీల ఈ శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యూపీఏ సర్కారు హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని వైట్ పేపర్లో ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం లోక్సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ మచ్చుకైనా లేదు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజంగా అదొక సంక్షోభ పరిస్థితి. యూపీఏ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అప్పటి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలో అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది. యూపీఏ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అప్పటి అవినీతి వ్యవహారాలు దేశ ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చాయి. 2013లో విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అప్పటి బలహీన నాయకత్వం వల్ల రక్షణ రంగం సైతం సన్నద్ధత కోల్పోయింది. 2014లో దారుణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ యూపీఏ నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే పనికి ఎన్డీయే ప్రభుత్వం పూనుకుంది. ఒక క్రమపద్ధతిలోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా దేశానికి మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టంగా మార్చింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ అవతరించింది. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల కేవలం పదేళ్లలోనే ఈ ఘనత సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కొనసాగుతోంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిద్రించేలోగా చేరాల్సిన మైళ్లు, ఎక్కాల్సిన పర్వతాలు ఎన్నో ఉన్నాయి. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలి. అదే మన గమ్యం. ఇది మనందరి కర్తవ్య కాలం’’ అని శ్వేతపత్రంలో ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. -
యూపీఏ పాలనపై వైట్పేపర్.. లోక్సభలో రిలీజ్
న్యూఢిల్లీ: యూపీఏ పదేళ్ల పాలన(2004-2014)ను తూర్పార పడుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం లోక్సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైట్పేపర్ను టేబుల్ చేశారు. వైట్పేపర్లోని మొదటి 24 పేజీల్లో పదేళ్ల యూపీఏ పాలనలో జరిగిన వైఫల్యాలను, అవినీతిని వివరించారు. అప్పట్లో వెలుగు చూసిన 2జీ, కామన్వెల్త్, శారదా చిట్ఫండ్ తదితర కుంభకోణాలను ప్రస్తావించారు.1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చింది తామేనని చెప్పే యూపీఏ నేతలు 2004లో పవర్లోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరిచిపోయారని వైట్పేపర్లో కేంద్రం విమర్శించింది. కేవలం పదేళ్లలో దేశాన్ని ‘ఫ్రాజైల్ ఫైవ్’ స్థితి నుంచి టాప్ ఫైవ్లోకి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపింది. కొవిడ్, పలు దేశాల మధ్య యుద్ధాలు లాంటి పరిస్థితులను కూడా అధిగమించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించామని పేర్కొంది. ఇదీ చదవండి.. ఇండియా కూటమికి మరో షాక్ -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పొడిగింపు.. అందుకేనా..!
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. ముందుగా ఈ నెల 9వ తేదీ శుక్రవారం వరకే సమావేశాలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ తాజాగా శనివారం కూడా సెషన్ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రకటించారు. కాగా, యూపీఏ పదేళ్ల పాలనలో అస్తవ్యస్థమైన దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందన్న పుకార్ల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. పదేళ్ల యూపీఏ పాలనలో అవలంబించిన అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలు, అవినీతి వల్ల దేశం చాలా విలువైన పదేళ్ల కాలాన్ని కోల్పోయిన వైనాన్ని మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా ఎండగట్టనున్నట్లు సమాచారం. యూపీఏ పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారత్ తీసుకొని ఉండాల్సిన చర్యలు కూడా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యూపీఏ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదీచదవండి.. ఇండియా కూటమికి నితీశ్ అంత్యక్రియలు చేశారు -
శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు. ✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది. ✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి. ✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు. ✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది. ✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. ✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
TS: ‘స్వేద’పత్రం.. కేటీఆర్ కీలక ప్రజెంటేషన్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో ఉద్దేశ్యపూర్వకంగా తమపై బురద జల్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అయినా మాజీ మంత్రులు జగదీష్రెడ్డి, హరీశ్రావు తాను ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్గా ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో స్వేద పత్రం విడుదల చేసే సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టించినట్లు చెప్పారు. ‘అసెంబ్లీలో పూర్తిస్థాయిలో మాకు మాట్లాడే అవకాశమివ్వకపోయినా మేం ఇచ్చిన సమాధానాలకు ప్రభుత్వం పారిపోయింది. బీఆర్ఎస్ పాలనలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే దానిని 6 లక్షల 71 వేల కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వ శ్వేతపత్రాలన్నీ తప్పుల తడకలు. తొమ్మిదేళ్లలో రక్తాన్ని రంగరించి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపాం. విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్లాం’ అని కేటీఆర్ తెలిపారు. 60 ఏళ్ల గోస 10 ఏళ్లలో మాయం చేసి చూపించాం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నాయకులు మరొకసారి శ్వేతపత్రాల పేరుతో మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో సంక్షేమం, కరెంటు,వ్యవసాయం, చెరువులు, పల్లె,పట్టణ ప్రగతి లాంటి అంశాలను ప్రాధాన్య క్రమంలో తీసుకుని పనిచేశాం.రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్రారంభించాం. దీని ఫలితంగానే తొమ్మిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ అయిందని’అని కేటీఆర్ వివరించారు. విద్యుత్, సాగునీరు,తాగునీరు రంగాల్లో బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో పెట్టిన పెట్టుబడులు, చెమటోడ్చి సృష్టించిన ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్డించిన విస్తరి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం. కాలువలు కడితే 200 టీఎంసీల నీళ్లు పొలాల్లో పారేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాళేశ్వరంలోని చిన్న మేడిగడ్డ బ్యారేజ్లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధం’అని కేటీఆర్ అన్నారు. ఇదీచదవండి..లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
TS: బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’లో ఏముంది?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ రిలీజ్ చేయనున్న స్వేద పత్రం ఆసక్తి రేపుతోంది. తమ తొమ్మిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఆస్తులు, అప్పులపై గులాబీ పార్టీ కాసేపట్లో స్వేదపత్రం పేరిట వైట్పేపర్ రిలీజ్ చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషేన్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అప్పులను వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ ఈ స్వేద పత్రం విడుదల చేయనుంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వంలో తాము,తెలంగాణప్రజలు కలిసి చెమటోడ్చి ఆస్తులు సృష్టించుకున్నందునే వైట్పేపర్కు స్వేదపత్రం అని పేరు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సృష్టికే అప్పులు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నిజానికి శనివారమే స్వేదపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి నేటికి వాయిదా వేశారు. స్వేదపత్రం రిలీజ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు హాజరవనున్నారు. ఇదీచదవండి..లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
కేటీఆర్ ‘స్వేద పత్రం’ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు శ్వేత పత్రం వర్సెస్ స్వేద పత్రంతో వేడెక్కాయి. శాసనసభ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై కౌంటర్గా బీఆర్ఎస్ తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్కు సిద్ధం అవ్వగా.. ఇవాళ్టి ఆ కార్యక్రమం వాయిదా పడింది. శనివారం ఉదయం తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్కు సిద్ధమని ప్రకటించారు. మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు.. కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం ఆ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే వాయిదాకి గల కారణం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వరించేందుకే ‘స్వేద పత్రం’పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే… — KTR (@KTRBRS) December 22, 2023 -
కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్
-
విద్యుత్ సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర విద్యుత్ రంగానిదేనని, ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ వినియోగమేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకపోగా.. విద్యుత్తు సంస్థలపై రూ.1.14 లక్షల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన ప్రాజెక్టులే కారణమని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ ఏమాత్రం లేదని పేర్కొన్నారు. గురువారం భట్టి శాసనసభలో రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి.. స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. చివరిగా చర్చకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సభలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘కరెంటును ఒక్కరోజులో ఉత్పత్తి చేయలేరు. కానీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 24 గంటల కరెంటు అందించామని చెప్పిన బీఆర్ఎస్.. అందుకు అవసరమైన విద్యుత్ను ఎలా అందుబాటులోకి తెచ్చిందో చెప్పలేదు. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియటం కోసం శ్వేతపత్రాన్ని విడుదల చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి టీఎస్ జెన్కో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,365.26 మెగావాట్లు. దీనికితోడు తెలంగాణ ఏర్పాటుకు ముందే.. ఇక్కడ 2,960 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళికలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అవి ఉత్పత్తి ప్రారంభించాయి. ఆ కొత్త విద్యుత్ కేంద్రాలే అనంతర కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ను అందించడంలో కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వం పూర్తి చేసినది ఒక్కటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యానికి అదనంగా 1,800 మెగావాట్లు వచ్చేలా నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఇది పూర్తి కావడానికీ సుదీర్ఘకాలం పట్టింది. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఎక్కువ బొగ్గు వినియోగించాల్సి రావటం, కాలుష్యం వెదజల్లటం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనితో వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. మరో ప్రాజెక్టు బొగ్గుగనులకు అత్యంత దూరంగా నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా కోసమే ఏటా రూ.800 కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ వ్యయం మరింత భారీగా ఉండబోతోంది. భారీగా పెండింగ్ బకాయిలు రాష్ట్ర డిస్కంలు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్ 31 నాటికి విద్యుత్ శాఖ అప్పుల మొత్తం రూ.81,516 కోట్లు. ఇందులో రూ.30,406 కోట్లు విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్న రోజువారీ నిర్వహణ మూలధన రుణం. ఇదేకాకుండా విద్యుదుత్పత్తి, సరఫరా సంస్థలకు మరో రూ.28,673 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల వల్లే డిస్కంలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ బకాయిల్లో ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సినవే రూ.14,193 కోట్లు. విద్యుత్ కొనుగోళ్ల వాస్తవ సర్దుబాటు ఖర్చుల (ట్రూఅప్) కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాటిచ్చి.. చెల్లించని రూ.14,928 కోట్ల భారం డిస్కంలపైనే పడింది. గుండె బరువెక్కుతోంది విద్యుత్ శాఖ అప్పులకు తోడు ప్రభుత్వం కరెంటు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలతో కలుపుకొంటే ఈ మొత్తం రూ. 1.14 లక్షల కోట్లకు చేరింది. నాకు అప్పు అంటేనే భయం. వ్యక్తిగతంగా నేను అప్పు చేయను. కానీ ప్రస్తుతం నాకు వచ్చిన ఆర్థిక, విద్యుత్ శాఖల సమీక్షల సందర్భంగా గత ప్రభుత్వం చేసిపెట్టిన అప్పులు చూసి గుండె బరువెక్కుతోంది. ముందు చూపు ఏది? రాష్ట్రంలో 2014 నాటికి కరెంటు డిమాండ్ 5,661 మెగావాట్లు. దానికి 2.7 రెట్లు ఎక్కువ విద్యుత్ అందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ముందుచూ పుతో ఉంటే.. ఇప్పటి డిమాండ్కు 2.7 రెట్లు ఎక్కు వగా అంటే 39 వేల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉండాలి. అలా జరగలేదు. కనీసం డిమాండ్కు తగ్గట్టు కూడా ఉత్పత్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ హయాంలోని ప్రణాళికలతోనే.. యూపీఏ ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే ముందుచూపుతో తగిన ప్రణాళికలను అమల్లోకి తేవటంతో దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7,778 మెగావాట్లు అందుబాటులో ఉంది. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ అందాలన్న ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్తగూడెం థర్మల్ కేంద్రం, కాకతీయ రెండో దశ, సింగరేణి జైపూర్ కేంద్రం, పులిచింతల హైడల్ కేంద్రం సహా పలు కొత్త విద్యుదుత్పత్తి సంస్థలకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించింది. వీటితో 2,960 మెగావాట్ల కరెంటు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు రాష్ట్ర విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఏపీ నుంచి 1,800 మెగావాట్లు, ఎనీ్టపీసీ రామగుండం నుంచి 4 వేల మెగావాట్లు.. కలిపి 5,800 మెగావాట్లు సమకూరాయి. ఇలా అన్నీ కలిపి 16,538 మెగావాట్ల విద్యుత్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే రాష్ట్రానికి అందుతోంది. అదే బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లతో నష్టాలే తప్ప ఒరిగిందేమీ లేదు. రోజువారీ మనుగడకూ కష్టంగా.. డిస్కంలు రోజువారీ మనుగడ కోసం కూడా అలవికాని అప్పులు చేయాల్సిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవడం చాలా కష్టం. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల.. డిస్కంలు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయాల్సిన గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో కుదేలయ్యాయి. ఇలాంటి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందినా.. మేం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ను బాధ్యతాయుత, పారదర్శక మార్గంలో అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉన్నాం..’’ అని భట్టి పేర్కొన్నారు. -
TS: శ్వేతపత్రం వెనుక సీఎం పాత గురువు..హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలును ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో దగా చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేత పత్రం మీద జరిగిన స్వల్పకాలిక చర్చలో హరీశ్రావు మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి పాత గురువు శిష్యులు ఈ శ్వేతపత్రం స్టోరీ వండి వార్చారని హరీశ్రావు మండిపడ్డారు. ఏపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారన్నారు.దీనికి మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం చెప్పగా అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్రావు బదులిచ్చారు. శ్వేతపత్రంలో కేవలం అప్పులు చూపించి ఆదాయం ఎలా పెరిగిందో చెప్పకపోవడం సరికాదని హరీశ్రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వమే తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు ఆగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కరోనా, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణకు లక్ష కోట్ల రుణ భారం అదనంగా పడిందని చెప్పారు. దేశ జీడిపీకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న టాప్ 5 స్టేట్స్లో తెలంగాణ ఒకటన్నారు.తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ నెంబర్వన్గా ఉందన్నారు. ఇవీ చూడండి..తెలంగాణ శాసన సభ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
TS: వాస్తవాలను ప్రజల ముందుంచుతాం : భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. ప్రజలకు సహేతుకమైన పాలన అందించడం తమ బాధ్యత అని భట్టి చెప్పారు. శ్వేతపత్రం బుక్ విడుదలపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్రావు అభ్యంతరం చెప్పారు. అరగంట ముందు బుక్ రిలీజ్ చేసి చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు. బుక్లో ఉన్న అంశాలపై అవగాహన కోసం కొంత సమయం కావాలని అడిగారు. ఇదే రీతిలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీనణ్ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ అరగంట పాటు అసెంబ్లీని వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చారు. 👉: కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం.. క్లిక్ చేయండి అరగంట ముందు 40 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి చర్చ ప్రారంభించడాన్ని లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి శ్రీధర్బాబు సమర్థించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందన్నారు. తాము కొత్తగా చేసిందేమీ లేదన్నారు. శ్వేతపత్రంపై సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇవీ చూడండి..తెలంగాణ శాసన సభ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
ఎల్ఏసీ వద్ద పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దులు దాటి మన భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు. మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని మూడేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణలు జరిగాక అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పారు. చైనా సైనికులు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చేందుకు, మన భూభాగంలో టెంట్లు వేసేందుకు ప్రయతి్నంచడంతో గల్వాన్ ఘటన జరిగిందంటూ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు’అని తివారీ తెలిపారు. అందుకే భారత్–చైనా సరిహద్దు వివాదంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపడంతోపాటు గత మూడేళ్లుగా ఎల్ఏసీ వెంట జరుగుతున్న వాస్తవ పరిణామాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాంగ్రెస్ కోరుతోందన్నారు. ‘ఎల్ఏసీ వెంట ఉన్న 65 పెట్రోలింగ్ పాయింట్లకు గాను 26 వరకు మన ఆర్మీ నియంత్రణలో లేవన్న విషయం నిజమా? చైనా ఆక్రమణలను మనం ఎందుకు ఆపలేకపోయాం?’అని తివారీ కేంద్రాన్ని నిలదీశారు. -
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున తీసుకున్న రుణాలకు గాను భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది’అని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక కష్టాలు బయటపడకుండా ఉండేందుకుగాను రాజకీయ ప్రకటనలతో కాలం వెళ్లదీసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణను అణగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాలను మరుగున పెడుతోందన్నారు. ఇతరులను నిందించడం, రాజకీయ ప్రకటనల ద్వారా కాలక్షేపం చేయడంతో ఆర్థిక కష్టాలు తీరవని, అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
సమాచారం అడిగితే.. తెల్లకాగితాలు పంపారు
జడ్చర్ల: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సమాచారం అడిగిన ఓ వ్యక్తికి అధికారులు వివరాలేమీ లేని తెల్లకాగితాలు పంపారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రంగారావుతోటలో నివాసం ఉంటున్న సామాజికవేత్త అనిల్కుమార్ 40 రోజుల క్రితం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ, సీసీ రోడ్లు తదితర సమస్యలపై పూర్తి వివరాలు అందించాలని ఆర్టీఐ కింద మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో అనిల్కుమార్కు సంబంధిత అధికారులు పోస్టులో ఓ కవర్ పంపారు. దాన్ని విప్పి చూసిన అనిల్కుమార్ ‘తెల్ల’బోయారు. అందులో ఎలాంటి వివరాలు లేకుండా తెల్లకాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన వెంటనే స్థానిక విలేకరుల దృష్టికి తెచ్చారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షేక్ను వివరణ కోరగా తాము పూర్తి సమాచారాన్ని కవర్లో పెట్టి పోస్టు చేశామని, ఇందుకు సంబంధించిన కాపీ ఒకటి తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. అయితే మున్సిపల్ అధికారుల నిర్వాకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అనిల్కుమార్ చెప్పారు. -
పది గంటల్లోనే సినిమా పూర్తి.. ఎమ్మెల్యే రోజా అభినందనలు
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. కథ బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకునే ఏ సినిమా అయినా పెద్ద సినిమాయే. తమి ళంలో ‘స్వయంవరం’ సినిమాను 24 గంటల్లో పూర్తి చేశాం. పది గంటల్లోనే ‘వైట్ పేపర్’ను పూర్తి చేసిన టీమ్కి నా అభినందనలు. అభి హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. అదిరే అభి, అభినయ కృష్ణవాణి, తల్లాడ సాయికృష్ణ, స్నేహ, నందకిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వైట్ పేపర్’. శివ దర్శకత్వంలో శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా టీజర్ను రోజా విడుదల చేశారు. ‘‘నాలుగు కెమెరాలతో ఈ సినిమాని షూట్ చేశాం. మా ప్రయత్నానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సత్కరించారు. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కనుంది’’ అన్నారు అభి. -
స్విస్ నల్లధనంపై మోదీ మాట్లాడరేం ?
న్యూఢిల్లీ: అధికారంలోకి వస్తే స్విట్జర్లాండ్లోని నల్లధనాన్ని బయటకు తీసుకొస్తానని వాగ్దానం చేసిన మోదీ ప్రస్తుతం నల్ల ధనం గురించి ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ప్రశ్నించింది. స్విస్లో ఖాతాలు కలిగి నల్లధనం దాచుకుంటున్న వారి పేర్లను బయటపెట్టాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి గౌరవ్ వల్లభ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేగాక విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తెచ్చేందుకు మోదీ తీసుకున్న చర్యలేమిటో వివరించాలని, దానిపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. 2020లో స్విస్ బ్యాంకులో భారతీయులు దాచుకున్న నల్ల ధనం విలువ ఏకంగా 286 శాతం పెరిగి రూ. 20,700 కోట్లకు చేరుకుంది. గత 13 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా దీనిపై స్పందిస్తూ.. ‘మోదీజీ దయ చేసి సమాధానం ఇవ్వండి. నల్ల ధనాన్ని మూడేళ్లలో తీసుకొస్తానన్న మీ వాగ్దానం ఏమైంది. ఇప్పటికే మీరు అధికారంలోకి వచ్చి ఏడేళ్లయింది. మీ స్నేహితుల డబ్బును తీసుకొచ్చేందుకు మీకు శక్తి లేదా ?’అని ట్వీట్చేశారు. ఓ వైపు కరోనా కారణంగా పేదలు మరింత పేదలవుతుంటే, స్విస్ బ్యాంకులో రికార్డులు బద్దలు చేస్తూ నల్లధనం పోగవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. దీనిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్చేస్తోంది. -
శ్రీవారి హుండీలో బంగారు బిస్కెట్లు..
సాక్షి, తిరుమల: టీటీడీ ఆస్తులపై పూర్తి అధ్యయనం తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు టెండర్లు పిలిచామని ఈవో వెల్లడించారు. వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే శ్వేత పత్రం విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జూన్ 11నుంచి జూలై 10 వరకు హుండి ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. భక్తులు సమర్పించిన తలనీలాల విలువ పెరగడంతో రూ.7కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కాగా, తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండిలో ఓ అజ్ఞాత భక్తుడు బంగారు బిస్కెట్లు విరాళంగా వేశారు. ఒక్కొక్కటి 100 గ్రాములు ఉన్న 20 బంగారు బిస్కెట్లను సమర్పించిన విషయం వెలుగు చూసింది. -
‘దేశం’ జమానాలో రాష్ట్రం దివాలా
గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. నిధుల వినియోగంలో టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బిల్లుల చెల్లింపులో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) జోక్యం చేసుకుంది. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక రంగం పూర్తిగా క్షీణ దశకు చేరుకుంది. టీడీపీ సర్కారు కొత్త ప్రభుత్వానికి ఖాళీ ఖజానా, భారీగా అప్పుల కుప్పను మాత్రమే అప్పగించింది. గత ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ ఏకంగా రూ.వేల కోట్ల బకాయిల భారాన్ని కొత్త ప్రభుత్వంపై నెట్టేసింది. రూ.లక్షల కోట్ల అప్పులను తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ సొమ్ముతో ఏదైనా సాధించిందా? అంటే సమాధానం శూన్యం. ఆస్తుల కల్పన, మానవ వనరుల అభివృద్ధికి ఆ సొమ్మును ఖర్చు చేయాల్సి ఉండగా, సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న వ్యవహారాలు, అవకతవకలపై కొత్త ప్రభుత్వం బుధవారం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా నడిపిస్తామని శ్వేతపత్రంలో వాగ్దానం చేసింది. అవినీతి రహిత, పారదర్శక పాలన కచ్చితంగా అందిస్తామని స్పష్టం చేసింది. దిగజారిన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి, అభివృద్ధి పరంగా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలను కోరింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో మే 31, 2019 నాటికి 18,375 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పెట్టింది. అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టించడానికి 2018–19 ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ ప్రకారం 7,983.39 కోట్ల రూపాయలు అవసరం ఉండగా కేవలం బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో ఎన్నికల ముందు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి 1,250 కోట్ల రూపాయలనే విడుదల చేశారు. దీంతో విద్యుత్ రంగం నష్టాల్లో కూరుకుపోయింది. 2019 మార్చి 31 నాటికి విద్యుత్ బకాయిలు రూ.18,375 కోట్ల మేర పేరుకుపోయాయి. బకాయిలు పేరుకుపోవడంతో ఎన్టీపీసీ విద్యుత్ సరఫరా నిలిపేసే స్థితికి విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం దిగజార్చింది. ప్రతీ నెలా ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లడంతో రాష్ట్ర పరపతిని దిగజార్చింది. ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. దీంతో వడ్డీల భారం భారీగా పెరిగిపోయింది. నిధులు వినియోగంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక శాఖ నుంచి మరో శాఖకు అక్రమంగా నిధులు మళ్లించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాఖ బ్యాంకుల నుంచి అప్పు చేసిన రూ.4,800 కోట్లను టీడీపీ సర్కారు ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. అలాగే ఫౌరసరఫరాల సంస్ధకు సబ్సిడీ రూపేణా బడ్జెట్లో కేటాయించిన రూ.3,000 కోట్లను విడుదల చేయనందున ఈ సంస్థ ఆర్థిక స్థితి క్షీణించింది. ఎన్నికల ముందు ఖజానా నుంచి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఓట్లు కొనుగోలు కోసం పసుపు– కుంకమ పేరుతో కుమ్మరించారు. ఇలాంటి చర్యలతో వివిధ రంగాలను ఆర్థికంగా దెబ్బతీశారు. ట్రెజరీ కంట్రోల్ను ఒక ప్రైవేట్ చేతికి అప్పగించారు. పీఏవో, వర్క్స్ అండ్ అకౌంట్స్కు సంబంధం లేకుండా బిల్లుల చెల్లింపు జరిగింది. బిల్లుల చెల్లింపులో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, ఏ బిల్లు చెల్లించాలో ఏ బిల్లు చెల్లించకూడదో ఆదేశాలు ఇవ్వడం కొనసాగింది. ఇది రాష్ట్ర చరిత్రతో తొలిసారి. టీడీపీ సర్కారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని స్థితికి దిగజార్చింది. అప్పుల భారాన్నీ భారీగా పెంచేశారు. 2014లో రూ.1.48 లక్షల కోట్లుగా ఉన్న అప్పులను రూ.2.58 లక్షల కోట్లకు పెంచేశారు. దీనికి అదనంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో గ్యారెంటీలు ఇవ్వడం ద్వారా మరో రూ. 57 వేల కోట్ల అప్పుల భారం మోపారు. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ రంగాలకు వెచ్చించడంతో ఎటువంటి అభివృద్ధీ జరగకపోగా అప్పుల భారం రెండింతలైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 22.22 శాతం నుంచి 28.18 శాతానికి పెరిగింది. గత సర్కారు ఇష్టానుసారం చేసిన అప్పులతో పుట్టే ప్రతీ పిల్లాడితో సహా ప్రతి ఒక్కరిపై రూ.42,500 అప్పు ఉంది. అలాగే స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ), ఇతర కంపెనీల పేరు మీద చేసిన రుణాలను తీసుకుంటే ప్రతీ ఒక్కరిపై అప్పు ఒక లక్ష రూపాయలు దాటుతుంది. అంటే జీవితాంతం ప్రతీ ఏటా వడ్డీ రూపంలో పది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుల గుప్పిట్లో వ్యవసాయ కుటుంబాలు గత ప్రభుత్వం ఎన్నికల్లో మొత్తం వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చింది. దాని ప్రకారం చూస్తే మార్చి 31, 2014 నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం అనేక నిబంధనలు, షరతులు విధించి కేవలం రూ. 24 వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ ఈ మొత్తంలో ఇంకా రూ. 8,500 కోట్లు రైతులకు చెల్లించలేదు. 2016–17 నాబార్డుకు చెందిన జాతీయ గ్రామీణ ఆర్థిక సమ్మిళత సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాల అప్పులు దేశ సగటుతో పోల్చితే రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని తేలింది. జాతీయ సగటు వ్యవసాయ కుటుంబాల అప్పులు 47 శాతం ఉంటే రాష్ట్రంలో మాత్రం 77 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే గత ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీని ఎంత అపహాస్యం చేసిందో అర్థం అవుతుంది. రైతులను రుణ భారం నుంచి బయట వేయకుండా మరింత రుణాల ఊబిలోకి నెట్టేసినట్లు స్పష్టం అవుతోంది. 10.32 శాతం వడ్డీ రేటా? గత టీడీపీ సర్కారు నూతన రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే గడిచిన ఐదేళ్లలో కేవలం స్పల్ప మొత్తాన్ని వ్యయం చేశారు. ఇదే సమయంలో బహిరంగ మార్కెట్లో అధిక వడ్డీ రేటుకు రుణాలను సేకరించారు. ప్రభుత్వ డిపాజిట్లపై 7 శాతం కన్నా తక్కువ వడ్డీ రేటు ఉంటే సీఆర్డీఏ ఏకంగా 10.32 శాతం వడ్డీ రేటుకు బాండ్ల ద్వారా నిధులను సేకరించింది. దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ స్పందన మాత్రం నామమాత్రంగానే వచ్చింది. గత ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు విశ్వాసం లేదనడానికి ఇదొక నిదర్శనం. బడ్జెట్లో పరిమితికి మించి రుణాలు (రూ.60 వేల కోట్లు) కన్పిస్తున్నాయి. టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్వీర్యం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు పేదరికం గణనీయంగా తగ్గింది. 2010 నాటికి రాష్ట్రంలో పేదరికం రికార్డు స్థాయిలో 9.2 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పేదరికం జాతీయ స్థాయిలో 21.92 శాతంగా ఉంది. ఈ ప్రయోజనాలను గత ఐదేళ్ల పాలనలో ధ్వసం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో ఇప్పుడు ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోవడం, కనీసం సౌకర్యాలు లేకుండా మురికివాడలు భారీగా పెరగడం, గ్రామీణ, పట్టణాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం విద్య వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేయడం, సచివాలయం నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ విభాగాలను బలహీన పర్చడం జరిగాయి. వీటి అన్నింటినీ తిరిగి గాడిన పెట్టడమే ఇప్పటి ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అలాగే మానవ సూచికల్లో రాష్ట్ర ర్యాంకు దిగువ స్థాయిలో ఉంది. ప్రధానంగా మహిళా అక్షరాస్యత, మాతా శిశు మరణాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. పౌష్టికాహార లోపాలు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ మానవ సూచిక ర్యాంకును దిగజార్చాయి. సహజ వనరులతో పాటు యువత తగినంత ఉన్నందున వారికి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ప్రతీ సవాల్ను అవకాశంగా తీసుకుంటూ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా నడిపించడానికి పక్కా ప్రణాళికతో కొత్త ప్రభుత్వం వెళ్తోంది. ఇందుకోసం నూతనమైన అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు, పేదవాడి నుంచి ధనికుడి వరకు, ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, మైనారిటీతో పాటు ఇతర కులాలందరికీ నమ్మకం కలిగే విధంగా కొత్త వ్యవస్థ రూపొందుతోంది. ఈ వ్యవస్థలో ప్రతీ ఒక్కరు తమకు రావాల్సిన అవకాశాలను పొందుతున్నామనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుతారు. స్వల్ప కాలంలోనే ప్రజల ఆకాంక్షలు ఆశలను నెరవేర్చే దిశగానే కొత్త ప్రభుత్వం అడుగులు వేసింది. వ్యవసాయం తిరోగమనం గత ఐదేళ్లు వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి సాధిస్తున్నామనే ప్రచారం డొల్లతనమేనని తేలింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో (2004–2009) వ్యవసాయరంగం 5.70 శాతం వృద్ధిని నమోదు చేస్తే గత ఐదేళ్ల కాలంలో వ్యవసాయం రంగ వృద్ది 4.12 శాతం క్షీణించింది. ఇంత కాలం ఎటువంటి ప్రాతిపదిక లేని పశు సంవర్థక, మత్స్య సంపద అధిక వృద్ధిని చూపించడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినట్లు ప్రచారం చేశారు. ఐదేళ్లలో పశుసంవర్దక శాఖలో 14.26 శాతం, మత్స్య సంపదలో 29.38 శాతం వృద్ది నమోదైంది. ఈ రెండు రంగాల వృద్ధిని కలిపేసి వ్యవసాయంలో రెండంకెల వృద్ధి రేటు నమోదైనట్లు చూపిస్తూ మోసం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004–09 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అత్యధికంగా 9.56 శాతం నమోదు చేసింది. విభజన తర్వాత ఏపీలో 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 10.36 శాతం ఉన్నప్పటికీ 2011–12లో అనేక విమర్శలకు గురైన జీడీపీ ఫార్ములా బేస్ రేటును పెంచడం వల్లే ఈ వృద్ధి కనిపిస్తోంది. పాత బేస్ రేటు పరిగణనలోకి తీసుకుంటే దివంగత నేత వైఎస్ఆర్ హయాంలోనే అధిక వృద్ధి రేటు నమోదైనట్లుగా గమనించవచ్చు. పడిపోయిన పారిశ్రామిక వృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కొలమానంగా భావించే రాష్ట్ర స్థూల విలువ వృద్ధి రేటు నామమాత్రంగానే ఉంది. 2014–17 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల విలువ కేవలం ఐదు శాతం నమోదు చేయడం ద్వారా దేశంలో 16 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో జాతీయ స్థూల విలువ వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటే గుజరాత్లో అత్యధికంగా 11.6 శాతం నమోదైంది. రాష్ట్ర స్థూల విలువలో తయారీ రంగం వాటా 2012లో 14.5 శాతంగా ఉంటే 2017 నాటికి 10.2 శాతానికి పడిపోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో సెజ్లు, పారిశ్రామిక క్లస్టర్లు, కోస్టల్ జోన్స్ పేరుతో సాధించిన పారిశ్రామిక అభివృద్దిని గత ప్రభుత్వం ధ్వసం చేసింది. భారీగా పెరిగిన ధరలు గత ఐదేళ్ల పాలనలో పెరిగిన ధరలు సామాన్యుడిని నడ్డివిడిచాయి. 2013–17 మధ్యకాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గితే ఒక్క మన రాష్ట్రంలోనే ధరలు పెరిగాయి. వర్షాలు బాగా పడటం, అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గడంతో 2013–17 మధ్య కాలంలో జాతీయ ద్రవ్యోల్బణం 9 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. కానీ 2014–17 మధ్య కాలంలో రాష్ట్ర సగటు ద్రవ్యోల్బణం 7.6 శాతంగా నమోదైంది. ముఖ్యంగా వినియోగదారుల ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణంలో ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం గరిష్ట స్థాయిలో ఉంది. తలసరి ఆదాయం వృద్ది అంతంతే రాష్ట్ర తలసరి ఆదాయంలో గత ఐదేళ్లలో వృద్ది అంతంత మాత్రంగానే ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో కన్నా తలసరి ఆదాయం వృద్ధి గత ఐదేళ్లలో తక్కువగా ఉంది. 2004–09 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో 15.08 శాతం వృద్ధి నమోదు కాగా 2014–19 మధ్యకాలంలో 14.96 శాతమే నమోదైంది. ఇంతే కాకుండా గత ఐదేళ్లలో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోనే తలసరి ఆదాయం భారీగా పెరగడం మిగతా జిల్లాల్లో పెరగకపోవడంతో జిల్లాల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో తలసరి ఆదాయం కంటే కృష్ణా జిల్లా తలసరి ఆదాయం రెట్టింపు ఉండటం దీనికి నిదర్శనం. -
అప్పుల సుస్తీ–అభివృద్ధి నాస్తి
రాష్ట్ర ఖజానా నుంచి ఇష్టానుసారం దోచేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవాస్తవాలతో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ, దుబారాకు, ప్రచార ఆర్భాటాలకు, ఈవెంట్లకు పెద్దఎత్తున వ్యయం చేశారు. ప్రాజెక్టుల పాత అంచనాలను పెంచేసి ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందుతున్నారు. నీరు–చెట్టు పనులన్నీ నామినేషన్పై అధికార పార్టీ నేతలకు పంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులను చెల్లించనందున నాలుగేళ్లలో రూ.124.31 కోట్ల మేర వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. కాగా, రాష్ట్ర ఖజానాను సొంత ఖజానాగా సర్కారు మార్చేసిందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రజాధనానికి ధర్మకర్తగా ఉంటూ ప్రతీ పైసాకు జవాబుదారీగా పాలన అందించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నాలుగేళ్లలో అప్పుల్లో భారీ వృద్ధిని చంద్రబాబు సాధించారు. ఆర్థిక వ్యవస్థను, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ మరో పక్క రాష్ట్ర ఖజానా నుంచి దోచేస్తూ సొంత జేబులు నింపుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అధికార యంత్రాంగమే కోడై కూస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ఖజానా నుంచి ఇష్టానుసారం దోచేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసిన ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అవాస్తవాలతో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. తాత్కాలిక నిర్మాణాలు, ఐటీ పేరుతో భారీగా అనుత్పాదక వ్యయాన్ని చేశారు. అంతేకాకుండా చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ, దుబారాకు, ప్రచార ఆర్భాటాలకు, ఈవెంట్లకు పెద్దఎత్తున వ్యయం చేశారు. దీంతో రాష్ట్ర అప్పులు ప్రమాదకర స్థాయికి చేరిపోయాయి. నాలుగేళ్లలో ఏకంగా 1,63,670 లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, రాష్ట్ర ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 25.9 శాతానికి మించరాదు. అయితే ముఖ్యమంత్రి అస్థవ్యస్థ ఆర్థిక నిర్వహణ కారణంగా, స్థోమతకు మించి అప్పులు చేయడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు ఏకంగా 32.03 శాతానికి చేరాయి. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాలకు కలిపి ఏపీ అప్పు 96 వేల కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు 2017–18 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అకౌంటెంట్ జనరల్ గణాంకాల మేరకే 2,59,670 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. వివిధ కార్పొరేషన్ల పేరుతో భారీఎత్తున అంటే ఏకంగా 71,815 కోట్ల రూపాయల మేర వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేస్తూ ఆ అప్పులకు గ్యారెంటీ కూడా ఇచ్చేసింది. ఇందులో ఇప్పటికే ఏకంగా 35,768 కోట్ల రూపాయలను అప్పులు చేశారు. ఈ విధంగా చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా ప్రాజెక్టుల్లో పాత అంచనాలను పెంచేసి ఎస్కలేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు చెల్లిస్తూ ఆ చెల్లింపుల నుంచి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు పొందుతున్నారు. నీరు–చెట్టు పనులన్నీ కూడా నామినేషన్పై అధికార పార్టీ నేతలకు పంచేశారు. ఇప్పటివరకు ఏకంగా 16 వేల కోట్ల రూపాయల పనులు పంచేశారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులను అప్పులు చేసి చెల్లింపచేస్తున్నారు. ఇన్ని కోట్లు వ్యయం చేసినప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాలు కరువుతో అల్లాడుతుండటంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నిత్యం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులతోనే కొనసాగేది. ఇప్పుడు గత రికార్డులను అధిగమించి మళ్లీ గత నాలుగేళ్ల నుంచి వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్టుల్లో రికార్డు సృష్టించింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల రూపాయల మేర వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పించింది. ఈ సౌకర్యాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకుని 14 రోజుల్లోగా చెల్లిస్తే ఎటువంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్టులను సకాలంలో చెల్లించనందున గత నాలుగేళ్లలో 124.31 కోట్ల రూపాయల మేర వడ్డీని చెల్లించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. చేబదుళ్లకు వడ్డీ చెల్లించిందంటే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంత అస్థవ్యస్థంగా ఉందో అద్దం పడుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో కూడా ఏడాదిలో 365 రోజుల్లో అత్యధికంగా 230 రోజులు చేబదుళ్లలోనే నడిపిన చరిత్ర ఉంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, ద్రవ్య లోటులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి సాధించడం గమనార్హం. 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు –415.80 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత రెవెన్యూ లోటు –16,772.83 కోట్ల రూపాయలకు వెళ్లింది. అలాగే బడ్జెట్ అంచనాల్లో ద్రవ్య లోటు –23,054.44 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ద్రవ్య లోటు –33,591.92 కోట్ల రూపాయలుగా తేలింది. ద్రవ్య, రెవెన్యూ లోటులు ద్రవ్య జవాబు దారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలకు మించి ఉండటం గమనార్హం. ‘మళ్లీ ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుందాం’ అనే రీతిలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వచ్చే ప్రభుత్వానికి ఆర్థి కంగా వెసులుబాటు లేకుండా చేసే విధంగా చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తోందని, ఇందుకు ఉదాహరణ ఇప్పటికే బడ్జెట్ పరిమితికి మించి అప్పులు చేసిన సర్కారు ఇప్పుడు మరీ బరితెగించి వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట ఏకంగా 71,815 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరు మీద అప్పులు చేయడానికి సర్కారు గ్యారెంటీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ గత ఆర్థిక సంవత్సరంలో సొంత ఆదాయంలో 90 శాతం మేర అప్పులకు గ్యారెంటీ ఇవ్వవచ్చునని, అయితే ఇప్పుడు ఆ పరిమితి కూడా పూర్తి అయ్యేలాగ బడ్జెట్ బయట అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేసింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి కూడా మించిపోవడంతో ఇటీవల మున్సిపల్ ఆస్తులు తాకట్టు పెట్టి బడ్జెట్ బయట వాణిజ్య బ్యాంకుల నుంచి 11,340 కోట్ల రూపాయల అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి మించిపోవడంతో కేవలం 3,000 కోట్ల రూపాయల అప్పునకే సర్కారు గ్యారెంటీ ఇస్తూ మిగతా మొత్తానికి తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం జారీచేసిన జీవోలోనే స్పష్టం చేసిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత వరకు చంద్రబాబు సర్కారు దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీఆర్డీఏకు వాణిజ్య బ్యాంకులు, బాండ్లు ద్వారా 14,275 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి 30 వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించి ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. గత నాలుగేళ్లలో ఆస్తుల కల్పన వ్యయానికి కేవలం 49,367 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు ఇటీవల 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలోనే స్పష్టం చేసింది. అంటే గత నాలుగేళ్లలో 1,63,670 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేస్తే ఆస్తుల కల్పనకు 49,367 కోట్ల రూపాయలే వ్యయం చేసినట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొన్నందున మిగతా అప్పుల మొత్తం 1,14,303 లక్షల కోట్ల రూపాయలు అనుత్పాదక రంగాలకు వ్యయం చేసినట్లు స్పష్టం అయింది. ఆస్తుల కల్పనకు చేసిన వ్యయంలో నీరు–చెట్టు, ఎస్కలేషన్ తాత్కాలిక సచివాలయం, జల్సాలు, ఈవెంట్లు, దుబారాల కోసం మొత్తం 27,101 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పెద్దలు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందారని స్పష్టం అవుతోంది. ఖజానా నుంచే దోపిడీకి పాల్పడటంలో ఈ సర్కారు అందెవేసిన చేయిగా మారిపోయిందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. కాంట్రాక్టర్లకు జీవో 22 ప్రకారం అంచనాలను పెంచేసి ఎస్కలేషన్ పేరుతో ఏకంగా 9,100 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. దీనివల్ల అదనంగా ఎటువంటి ఆస్తి సమకూరకపోగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల జేబులు మాత్రం కమీషన్ల రూపంలో నిండాయనేది జగమెరిగిన సత్యం అని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఆస్తుల కల్పనకు చేసిన వ్యయంలో ఇప్పటివరకు ఒక్క శాశ్వత ఆస్తిని కూడా కల్పించకపోగా తాత్కాలిక సచివాలయం పేరుతో 1,000 కోట్ల రూపాయలను వ్యయం చేసింది. అలాగే ఈవెంట్లు, ముఖ్యమంత్రి భవనాలు మరమ్మతులు, లగ్జరీ జల్సాల కోసం గత నాలుగేళ్లలో ఏకంగా 2,615 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ఈ సొమ్ము వ్యయాన్ని నివారించదగినదని, అయితే ఒక పక్క ప్రజల నుంచి విరాళాలను సేకరిస్తూ మరో పక్క పెద్దఎత్తున జల్సాలకు వ్యయం చేయడాన్ని అధికార వర్గాలు తప్పుపడుతున్నాయి. మరో పక్క ఐటీ పేరుతో ఎటువంటి ఆస్తులు ఒనగూరని రంగానికి భారీగా వ్యయం చేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను కాదని ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనులకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులను వెచ్చిస్తున్నారని, ఇందులో భారీ దోపిడీ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఖజానాను సొంత ఖజానాగా సర్కారు మార్చేసిందని, లెక్కాపత్రం లేకుండా వ్యవహరిస్తోందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇంత అప్పు చేసిన రాష్ట్ర సర్కారు కేవలం తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక పట్టిసీమ తప్ప ఎటువంటి శాశ్వత ఆస్తులను కల్పించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత అప్పులు చేసినా శాశ్వత ఆస్తి కల్పించకపోయినా కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో రాష్ట్రానికి నిబంధనల మేరకు పన్నుల వాటా రూపంలో రావాల్సిన నిధులు 88,214 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇదే కాకుండా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో గ్రాంటు రూపంలో 84,245 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అంటే కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో, గ్రాంటు రూపంలో నాలుగేళ్లలో 1,72,428 కోట్ల రూపాయలు వచ్చినట్లు స్పష్టమైంది. కేంద్రం గ్రాంటు రూపంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన నిధులను కూడా వెచ్చించకుండా ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. అంతే కాకుండా పట్టణ పేదలకు సబ్సిడీపై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఇంటి నిర్మాణం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు లక్షల రూపాయలు పేదవాడి పేరు మీద అప్పు చేయిస్తోంది. అలాగే రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన 1500 కోట్ల రూపాయల నిధులను శాశ్వత భవనాలకు కాకుండా తాత్కాలిక భవనాలకు వెచ్చించారు. అంతే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వెచ్చించడం లేదు. దీనికి అదనంగా రాష్ట్ర సొంత, పన్నేతర ఆదాయం ఎలాగా ఉంది. ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర నిర్వహణ వ్యయం పోగా మిగతా మొత్తాన్ని ఆస్తుల కల్పనకు వెచ్చించకుండా దుబారాకు, కమీషన్లు వచ్చే రంగాలకు వెచ్చిస్తున్న విషయం తేటతెల్లం అవుతోంది. మరో పక్క రెవెన్యూ వ్యయం ఏటేటా భారీగా పెరిగిపోతోంది. -సి. మాణిక్యాలరావు, సాక్షి ప్రతినిధి
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement