-
వైభవంగా ఎల్లమ్మ ఉత్సవాలు
బొంరాస్పేట: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని పోలెపల్లి ఎల్లమ్మ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ఊరేగించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
వరాల దేవత.. ఎల్లమ్మ తల్లి
కలికిరి: కలికిరి పట్టణంలో వెలసిన కలికిరి గ్రామ దేవత, భక్తులు కోర్కెలు తీర్చే చల్లని తల్లి ఎల్లమ్మ తిరుణాల శనివారం నుంచి ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్కుమార్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని వివరించారు. జాతరలో భాగంగా ఆలయ ఆవరణంలో శనివారం రాత్రి అమ్మవారి హరికథా కాలక్షేపం, జాగరణ జరుగుతుందన్నారు. ►ఆదివారం ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తేరులో ప్రత్యేక అలంకరణ మధ్య కలికిరి పట్టణంలో ఊరేగింపు, తదుపరి సిద్దపూజ, అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులు అమ్మవారికి దీలు, బోణాలు సమర్పణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే రాత్రికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రంగు రంగుల విద్తుత్దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన చాందినీ బండ్లు ఊరేగింపు, ప్రదర్శన చేపడతారన్నారు. ►సోమవారం నుంచి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం, రాత్రి లంకాదహనం, తేరులో పుష్పపల్లకి సేవ నిర్వహిస్తామన్నారు. మంగళవారం జరుగు పార్వేట ఉత్సవంతో జాతర ముగుస్తుందని చెప్పారు. జాతరకు 27 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు.. కలికిరి ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని పీలేరు ఆర్టీసీ డిపో నుంచి 27 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు పీలేరు డీఎం కె.కుమార్ తెలిపారు. 17న ఆదివారం, 18న సోమవారం రెండు రోజుల పాటు పీలేరు–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–కలకడ మార్గంలో 6 సర్వీసులు, సోమల–కలికిరి 6, మదనపల్లి–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–సదుం మార్గంలో 3, కలికిరి–వాయల్పాడు 2, మొత్తం 27 సర్వీసులను భ క్తుల సౌకర్యార్థం నడపనున్నామని, ఈ సదుపాయా న్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. రెండు శతాబ్దాల నాటి ఆలయ చరిత్ర.. సుమారు రెండు శతాబ్దాల క్రితం కలికిరి పంచాయతీ చెరువుముందరపల్లికి చెందిన వర్తకులు వ్యాపార నిమిత్తం కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్లేవారని, అక్కడ కొనుగోలు చేసిన సరుకులను ఎడ్లబండి ద్వారా కలికిరి ప్రాంతానికి తీసుకువస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో వ్యాపారులు సరుకులు తరలిస్తున్న ఎడ్లబండి ఇప్పుడు ఆలయం ప్రాంతంలోకి వచ్చి కదలకుండా నిలిచి పోయేది. వ్యాపారులు ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఆ బండి ముందుకు సాగక పోవడంతో బండిలో ఉన్న బస్తాలను కిందకు దించుతుండగా వక్కల బస్తాలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మవారిని అదే ప్రాంతంలో విగ్రహ ప్రతిష్ట చేయించి ఆలయం నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు కలికిరి గ్రామ దేవతగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ►ఆలయం ఏర్పాటైన నాటినుంచి కలికిరి రెడ్డివారిపల్లికి చెందిన రెడ్డివారి కుటుంబీకులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ అంచెలంచెలుగా ఆలయాన్ని అభివృద్ధి చేపట్టారు. అలాగే ఉమ్మడిశెట్టి కుటుంబీకులు ఆలయ అర్చకులుగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆషాడమాసంలో అమ్మవారికి పెద్ద ఎత్తున తిరుణాల నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. -
నేటి నుంచి ఎల్లారమ్మజాతర
జామి,న్యూస్లైన్: భక్తుల కొంగుబంగారం, ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన జామి ఎల్లారమ్మ జాతర నేటినుంచి ప్రారం భం కానుంది. శనివారం తొలేళ్ల ఉత్సవం, ఆదివారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఈ జాతరకు ఉత్తరాంధ్రలోని పలుప్రాంతాలనుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సుమారు లక్షకు పైగా హజరవుతారు. ప్రతి ఏడాది దేవాదాయకమిటీ ఆధ్వర్యంలో జాతర నిర్వహించేవారు. ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అమలు, న్యాయస్థానం ఉత్తర్వుల మేర కు ప్రభుత్వం ఉత్సవ కమిటీలను రద్దుచేయడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాదీ పాల్గుణ శుద్ధ అష్టమి రోజున జాతర నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. ఏర్పాట్లు పూర్తి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. అమ్మవారి దర్శన నిమిత్తం బారికేడ్లను ఏర్పాట్లు చేశా రు. ఆలయానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దా రు. ముందుజాగ్రత్త చర్యగా మేజర్ పంచాయతీ సర్పంచ్ ఇప్పాక వెంకట త్రివేణి, ఈఓ కేవీ.రమణ ఆధ్వర్యంలో గ్రామంలోని తాగునీటి బోర్లలో క్లోరినేషన్ చేస్తున్నారు. జాతర సందర్భంగా రెండుపూటలా తాగునీటి సరఫరా ఇవ్వనున్నారు. ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీబాయి, ఈఓపీఆర్డీ కె.ధర్మారావు, ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. జాతర లో జామి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. 108 వాహనాన్ని జాతరలో సిద్ధంగా ఉంచడానికి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ఎంపీడీఓ లక్ష్మీబాయ్ తెలిపారు. పోలీస్ బందోబస్తు జాతరలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఎం.ప్రశాంత్కుమార్ తెలిపారు. 130 మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. జాతరకు సహకరించాలి జాతరకు అందరూ సహకరించాలని దేవాదాయశాఖ ఈఓ వి.అప్పారావు కోరారు. అమ్మవారిదర్శనానికి ఈ ఏడాది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఐపీ పాస్ లు రద్దుచేశామన్నారు. శీఘ్రదర్శనానికి 20,ప్రత్యేకద ర్శనానికి 10, విశిష్టదర్శనానికి 30 చొప్పున ఖరారు చేశామన్నారు. వికలాంగులు, వృద్ధులు విశిష్ట దర్శనం క్యూలోఅమ్మవారిని సందర్శించ వచ్చునని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement