-
నిఖత్ శుభారంభం..
అస్తానా (కజకిస్తాన్): ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 5–0తో రఖీమ్బెర్దీ జన్సాయా (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు) కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు.మీనాక్షి 4–1తో గసిమోవా రొక్సానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... అనామిక పంచ్ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుమ్బయేవా అరైలిమ్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్ను నిలిపివేసి భారత బాక్సర్ను విజేతగా ప్రకటించారు. ఇస్మిత్ (75 కేజీలు), సోనియా (54 కేజీలు) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఇష్మిత్ 0–5 తో అర్మాత్ (కజకిస్తాన్) చేతిలో, సోనియా 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు.ప్రిక్వార్టర్స్లో బోపన్న జోడీ..రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలిరౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–2తో అర్నాల్డి–పసారో (ఇటలీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జంట మూడు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బొలెలీ–వావాసోరి (ఇటలీ)లతో బోపన్న–ఎబ్డెన్ తలపడతారు. -
పోరాడి ఓడిన సుమిత్
మరాకెష్ (మొరాకో): గ్రాండ్ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 95వ ర్యాంకర్ సుమిత్ 6–1, 3–6, 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. సుమిత్ కు 10,165 యూరోల (రూ. 9 లక్షల 16 వేలు) ప్రైజ్మనీ, 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యూకీ జోడీ శుభారంభం ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 6–3, 6–4తో స్టీవెన్స్ (నెదర్లాండ్స్)–పెట్రోస్ సిట్సిపాస్ (గ్రీస్) ద్వయంపై గెలిచింది. -
సుమిత్ నగాల్ శుభారంభం
గ్రాండ్ప్రి హసన్–2 ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్వన్ సుమిత్ నగాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మొరాకోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమిత్ 4–6, 6–3, 6–2తో కొరెంటిన్ ముటెట్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సుమిత్ ఆరు ఏస్లు సంధించి, ప్రత్యర్థి సరీ్వస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 61వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో సుమిత్ ఆడతాడు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ 21–18, 21–14తో 2019 చాంపియన్ జోడీ మొహమ్మద్ అసన్–హెండ్రా సెతియావాన్ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2022 విజేత జోడీ మొహమ్మద్ షోహిబుల్ ఫిక్రి–బగాస్ మౌలానా (ఇండోనేసియా)తో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. లక్ష్య సేన్ బోణీ మరోవైపు పురుషుల సింగిల్స్లో 2022 రన్నరప్, భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 21–14తో ప్రపంచ 33వ ర్యాంకర్ మాగ్నస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్కు నిరాశ ఎదురైంది. చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రియాన్షు 19–21, 21–11, 9–21తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ముందంజ వేయగా... గత ఏడాది సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఈసారి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. అశి్వని–తనీషా ద్వయం 21–13, 21–18తో యెంగ్ ఎన్గా టింగ్–యెంగ్ పుయ్ లామ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గింది. గాయత్రి–ట్రెసా జోడీ 18–21, 12–21తో అప్రియాని రహాయు–సితీ ఫాదియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక , సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇండోర్లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్ లో రష్మిక 6–3, 1–0తో టాప్ సీడ్ ఇరీనా మరియా (రొమేనియా)పై ... సహజ 6–3, 6–1తో జీల్ దేశాయ్పై గెలిచారు. రష్మికతో మ్యాచ్లో రెండో సెట్ మధ్యలో గాయంతో ఇరీనా వైదొలిగింది. -
సింధు శుభారంభం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్లో ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. వ్యోన్ లీ (బెల్జియం)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు తొలి గేమ్ను 14 నిమిషాల్లో 21–10తో సొంతం చేసుకుంది. ఈ దశలో గాయం కారణంగా వ్యోన్ లీ వైదొలగడంతో సింధును విజేతగా ప్రకటించారు. ఆకర్షి కశ్యప్ 16–21, 11–21తో పాయ్ యు పో (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ప్రణయ్ 21–14, 13–21, 13–21తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. ప్రపంచ నంబవర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మరో తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 9–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ ఏ దశలోనూ డెన్మార్క్ స్టార్కు పోటీనివ్వ లేకపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్కిది 11వ ఓటమి కావడం గమనార్హం. -
గట్టెక్కిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 80 నిమిషాల్లో 20–22, 22–20, 21–19తో మిచెల్లి లీ (కెనడా)పై కష్టపడి గెలిచింది. తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్లో 7–14తో వెనుకబడిన సింధు నెమ్మదిగా పుంజుకుంది. స్కోరు 15–18 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు 20–20తో సమమైనా... కీలకదశలో సింధు రాణించి రెండు పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ కూడా హోరాహోరీగా సాగినా కీలక తరుణంలో సింధు పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21–15, 20–22, 21–8తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... ప్రణయ్ 17–21, 17–21తో లు గ్వాంగ్ జు (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ 89 నిమిషాల్లో 6–7 (6/8), 6–3, 10–8తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)–మనారినో (ఫ్రాన్స్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న యూకీ–హాస్ జంట ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
రష్మిక సంచలనం
సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ –125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో ప్రపంచ 520వ ర్యాంకర్ రష్మిక 2–6, 6–1, 7–6 (7/5)తోప్రపంచ 93వ ర్యాంకర్, రెండో సీడ్ నావో హిబినో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఐదు ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేసింది. -
క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండు సార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల 50 కేజీల విభాగంలో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 3–2తో ఒయుత్సెసెగ్ యెసుగెన్ (మంగోలియా)పై నెగ్గింది. ఈ బౌట్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ప్రతీ రౌండ్లోనూ పంచ్లతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. చివరకు విజయం నిఖత్నే వరించింది. అయితే మరో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ బౌట్లో ఊహించని రీతిలో అనర్హతకు గురై వెనుదిరిగింది. 75 కేజీల విభాగంలో ఓ రూర్కే ఆయిఫే (ఐర్లాండ్)తో తలపడుతుండగా లవ్లీనా రిఫరీ మూడో హెచ్చరికకు గురైంది. దీంతో మూడో రౌండ్ పూర్తవకముందే డిస్క్వాలిఫైతో బౌట్ నుంచి నిరాశగా ని్రష్కమించింది. 57 కేజీల కేటగిరీలో సాక్షి చౌదరి 5–0తో సెల్మౌని చాహిర (అల్జీరియా)పై ఏకపక్ష విజయం సాధించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ (54 కేజీలు)కు ప్రిక్వార్టర్స్లో 2–3తో ఫే నియ (ఐర్లాండ్) చేతిలో చుక్కెదురైంది. -
కిరణ్ జార్జి సంచలనం
ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్, ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 13–21, 21–18తో ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ౖఫైనల్కు చేరాడు. భారత్కే చెందిన లక్ష్య సేన్, ప్రియాన్షు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
శ్రమించి నెగ్గిన సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 69 నిమిషాల్లో 12–21, 21–18, 21–15తో ప్రపంచ 7వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా టున్జంగ్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–13తో లుకాస్ కోర్వి–రొనన్ లాబర్ (ఫ్రాన్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
సంచలనాలతో బోణీ...
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అదరగొట్టే ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ పదో ర్యాంకర్ ప్రణయ్ 21–17, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై... ప్రపంచ 20వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–13తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయాలు సాధించారు. లీ షి ఫెంగ్పై ప్రణయ్కిది వరుసగా మూడో విజయంకాగా... చౌ తియెన్ చెన్పై శ్రీకాంత్కిది రెండో గెలుపు. 2014లో హాంకాంగ్ ఓపెన్లో చౌ తియెన్ చెన్ను తొలిసారి ఓడించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఈ చైనీస్ తైపీ ప్లేయర్తో ఆడిన ఆరుసార్లు ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ నంబర్వన్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మ్యాచ్లో ఆకర్షి 17–21, 17–21తో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 11–21, 21–15, 21–14తో సయాకా హొబారా–యు సుజు (జపాన్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 21–18, 9–21, 18–21తో యె హోంగ్ వె–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్లో జొకోవిచ్, స్వియాటెక్
లండన్: టాప్స్టార్లు నొవాక్ జొకోవిచ్, ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో సెర్బియన్ దిగ్గజం, రెండో సీడ్ జొకోవిచ్ తనదైన శైలిలో స్విట్జర్లాండ్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు ఇంటిదారి చూపాడు. ఇప్పటికే ఈ సీజన్లో జరిగిన రెండు గ్రాండ్స్లామ్ టైటిళ్లను చేజిక్కించుకున్న జొకోవిచ్ 6–3, 6–1, 7–6 (7/5)తో వరుస సెట్లలో స్విస్ ఆటగాడిని ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో మ్యాచ్ను ముగించాడు. 11 ఏస్లతో రెచ్చిపోయిన జొకో ఒక డబుల్ఫాల్ట్ చేశాడు. 26 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ 38 విన్నర్లు కొట్టాడు. ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో నికోలస్ జెర్రి (చీలి)పై గెలిచేందుకు కష్టపడ్డాడు. రష్యా స్టార్, మూడో సీడ్ మెద్వెదెవ్ 4–6, 6–3, 6–4, 6–4తో మార్టన్ ఫుక్సొవిక్స్ (హంగేరి)పై, ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 6–4, 7–6 (7/5), 6–4తో లాస్లొ జేర్ (సెర్బియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్ల్లో 19వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 5–7, 6–2, 6–2తో యోసుకె వాతనుకి (జపాన్)పై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ జన్నిక్ సిన్నెర్ (ఇటలీ) 3–6, 6–2, 6–3, 6–4తో క్వెంటిన్ హేలిస్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ స్వియాటెక్ (పోలాండ్)తో పాటు ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్), బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్స్ చేరారు. స్వియాటెక్ 6–2, 7–5తో పెట్ర మార్టిచ్ (క్రొయేషియా)ను వరుస సెట్లలో ఓడించగా, స్వితోలినా 7–6 (7/3), 6–2తో మాజీ ఆ్రస్టేలియా చాంప్ సోఫియా కెనిన్ (అమెరికా)ను కంగుతినిపించింది. మారి బౌజ్కొవా (చెక్ రిపబ్లిక్) ఐదో సీడ్ కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్)కు షాకిచ్చింది. చెక్ అమ్మాయి 7–6 (7/0), 4–6, 7–5తో సీడెడ్ ప్లేయర్ గార్సియాను మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టించింది. 14వ సీడ్ బెన్సిక్ 6–3, 6–1తో మగ్ద లినెటి (పోలాండ్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. బోపన్న జోడీ శుభారంభం భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న పురుషుల డబుల్స్లో శుభారంభం చేశాడు. ఆస్ట్రేలియన్ మాథ్యూ ఎబ్డెన్తో జోడీకట్టిన బోపన్న ఆరో సీడ్ జంటగా బరిలోకి దిగింది. తొలిరౌండ్లో భారత్–ఆసీస్ జోడీ 6–2, 6–7 (5/7), 7–6 (10/8)తో గులెర్మో డ్యురన్– థామస్ ఎచెవెరీ (అర్జెంటీనా) జంటపై చెమటోడ్చి గెలిచింది. -
శ్రీకాంత్ ముందుకు...
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత క్రీడాకారులు ముందంజ వేశారు. కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ప్రియాన్షు రజావత్కు ప్రపంచ మూడో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) నుంచి వాకోవర్ లభించడంతో అతను కోర్టులో అడుగు పెట్టకుండానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ గ్వాంజ్ జు లూ (చైనా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 22వ ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–13, 21–19తో గెలుపొందాడు. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో శ్రీకాంత్ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్ను దక్కించుకున్నాడు. రెండో గేమ్లో శ్రీకాంత్కు ప్రతిఘటన ఎదురైంది. అయితే స్కోరు 19–19 వద్ద శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్తోపాటు గ్వాంజ్ జు లూపై వరుసగా ఐదో విజయాన్ని సాధించాడు. ప్రపంచ 11వ ర్యాంకర్, ఆసియా చాంపియన్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–17, 21–13తో గెలిచాడు. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్లో స్కోరు 17–17 వద్ద వరుసగా నాలుగు పాయింట్లు గెలిచాడు. రెండో గేమ్లో స్కోరు 5–3 వద్ద లక్ష్య సేన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 12–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్నకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్ ఆకర్షి తొలి రౌండ్లో 10–21, 4–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో లక్ష్య సేన్తో శ్రీకాంత్; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (వియత్నాం)తో ప్రణయ్; ఆంథోనీ సినిసుక జిన్టింగ్ (ఇండోనేసియా)తో ప్రియాన్షు రజావత్; తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో పీవీ సింధు తలపడతారు. -
French Open 2023: 55 ఏళ్ల తర్వాత...
పారిస్: బ్రెజిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 55 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో ఆ దేశ క్రీడాకారిణికి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో బ్రెజిల్కు చెందిన బీత్రిజ్ హదాద్ మాయ క్వార్టర్ ఫైనల్ చేరింది. టెన్నిస్లో ఓపెన్ శకం (1968లో) మొదలయ్యాక దివంగత మరియా బ్యూనో చివరిసారి బ్రెజిల్ తరఫున గ్రాండ్స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ చేరింది. 1968లో మరియా బ్యూనో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్కు... యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరింది. మరియా బ్యూనో ఐదు గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గినా ఆ విజయాలన్నీ ఓపెన్ శకంకంటే ముందు వచ్చాయి. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ బీత్రిజ్ 3 గంటల 51 నిమిషాల్లో 6–7 (3/7), 6–3, 7–5తో సారా సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై, అమెరికా టీనేజర్ కోకో గాఫ్ 7–5, 6–2తో షిమెద్లోవా (స్లొవేకియా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఆరో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
నాదల్కు షాక్
న్యూయార్క్: ఈ ఏడాది మూడో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు నిరాశ ఎదురైంది. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో రాఫెల్ నాదల్ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా ప్లేయర్ ఫ్రాన్సిస్కో టియాఫో తన కెరీర్లోనే గొప్ప ప్రదర్శనతో ప్రపంచ మూడో ర్యాంకర్ నాదల్ను ఓడించి యూఎస్ ఓపెన్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ టియాఫో 6–4, 4–6, 6–4, 6–3తో రెండో సీడ్ నాదల్ను ఓడించి సంచలనం సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో టియాఫో ఆడతాడు. నాదల్తో 3 గంటల 34 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో టియాఫో 18 ఏస్లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నాదల్ సర్వీస్ను ఐదుసార్లు బ్రేక్ చేసిన టియాఫో 49 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు నాదల్ తొమ్మిది డబుల్ ఫాల్ట్లు, 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్గా గ్రాండ్స్లామ్ టోర్నీలలో నాదల్ను ఓడించిన మూడో అమెరికా ప్లేయర్గా టియాఫో ఘనత వహించాడు. గతంలో అమెరికా ప్లేయర్లు ఆండీ రాడిక్ (2004లో), జేమ్స్ బ్లేక్ (2005లో) నాదల్ను ఓడించారు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించి, వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్నాడు. గాయం కారణంగా అతను సెమీఫైనల్ మ్యాచ్లో ఆడకుండా తన ప్రత్యర్థి కిరియోస్ (ఆస్ట్రేలియా)కు వాకోవర్ ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), 11వ సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరారు. 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–4, 3–6, 6–4, 4–6, 6–3తో గెలుపొంది వరుసగా రెండో ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరాడు. సినెర్ 6–1, 5–7, 6–2, 4–6, 6–3తో ఇవాష్క (రష్యా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఆరో సీడ్ సబలెంకా (బెలారస్), ఎనిమిదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో స్వియాటెక్ 2–6, 6–4, 6–0తో నీమియెర్ (జర్మనీ)పై, సబలెంకా 3–6, 6–3, 6–2తో డానియెలా కొలిన్స్ (అమెరికా)పై, పెగూలా 6–3, 6–2తో క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, ప్లిస్కోవా 7–5, 6–7 (5/7), 6–2తో మాజీ నంబర్వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. -
Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–13, 17–21, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ గెలుపుతో ఇటీవల ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీలో హి బింగ్ జియావో చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ సైనా నెహ్వాల్ 21–16, 17–21, 14–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గతవారం మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలోనూ సైనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ ముందంజ పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్ మ్యాచ్ల్లో సాయిప్రణీత్ 21–8, 21–9తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై, కశ్యప్ 16–21, 21–16, 21–16తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–19, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. సమీర్ వర్మ 21–10, 12–21, 14–21తో నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 19–21, 21–18, 16–21తో ఫాబ్రియానా కుసుమ– అమాలియా ప్రాతవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Wimbledon 2022: జొకోవిచ్ అలవోకగా...
లండన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6–0, 6–3, 6–4తో 25వ సీడ్ కెచ్మనోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఆరు ఏస్లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–3తో బెరాన్కిస్ (లిథువేనియా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. రెండో రౌండ్లో క్వాలిఫయర్ జాక్ సాక్ (అమెరికా) 6–4, 6–4, 3–6, 7–6 (7/1)తో మాక్సిమి క్రెసీ (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. దాంతో 1995 తర్వాత వింబుల్డన్ టోర్నీలో మూడో రౌండ్కు చేరిన అమెరికా ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. హీతెర్, జబర్ ముందంజ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ల్లో మూడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా) 6–2, 6–3తో డయానా పెరీ (ఫ్రాన్స్)పై, హీతెర్ వాట్సన్ (బ్రిటన్) 7–6 (8/6), 6–2తో కాజా జువాన్ (స్లొవేనియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. హీతెర్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. -
ప్రి క్వార్టర్స్లో పోర్చుగల్, జర్మనీ
బుడాపెస్ట్: యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్ జట్లు కూడా నాకౌట్ దశకు చేరాయి. గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా బుధవారం అర్ధరాత్రి పోర్చుగల్, ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. 31వ, 60వ నిమిషాల్లో అతను రెండు గోల్స్ సాధించాడు. ఫ్రాన్స్ జట్టులో కరిమ్ బెన్జిమా ఇంజూరి టైమ్ (45+2వ ని.)లో, 47వ నిమిషంలో రెండు గోల్స్ చేశాడు. ఇదే గ్రూప్లో ఉన్న జర్మనీ... హంగేరితో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ను కూడా 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఐదు పాయింట్లతో ఫ్రాన్స్ ఈ గ్రూప్లో అగ్రస్థానంలో నిలవగా... నాలుగు పాయింట్లు సాధించిన జర్మనీ రెండో స్థానంలో నిలిచింది. పోర్చుగల్ కూడా 4 పాయింట్లు సాధించినప్పటికీ... జర్మనీ చేతిలో ఓడటంతో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. టోర్నీ నిబంధనల ప్రకారం గ్రూప్లో టాప్–2లో నిలిచిన జట్లు నేరుగా... మూడో స్థానంలో నిలిచిన 6 జట్ల నుంచి మెరుగైన నాలుగు టీమ్లు ప్రిక్వార్టర్స్కు చేరుకునే అవకాశం ఉంది. దాంతో పోర్చుగల్ కూడా నాకౌట్ దశకు అర్హత సాధించింది. శనివారం నుంచి ప్రిక్వార్టర్ఫైనల్ మ్యాచ్లు ఆరంభమవుతాయి. చరిత్రకు గోల్ దూరంలో రొనాల్డో ఫుట్బాల్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ దూరంలో నిలిచాడు. యూరో కప్లో భాగంగా ఫ్రాన్స్తో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ చేసిన రొనాల్డో... అంతర్జాతీయ ఫుట్బాల్ (దేశం తరఫున)లో ఇరాన్ ప్లేయర్ అలీ డయీ పేరిట ఉన్న అత్యధిక గోల్స్ (109) రికార్డును సమం చేశాడు. రొనాల్డో మరొక్క గోల్ సాధిస్తే అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా చరిత్రకెక్కుతాడు. -
సింధు ముందంజ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–16, 21–19తో నెస్లిహాన్ యిజిట్ (టర్కీ)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–18, 21–11తో సమీర్ వర్మ (భారత్)పై, సౌరభ్ వర్మ 21–19, 21–18తో కిర్చ్మెర్ (స్విట్జర్లాండ్)పై, అజయ్ జయరామ్ 21–12, 21–13తో థమాసిన్ (థాయ్లాండ్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–18, 19–21, 21–16తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్)లపై... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–5, 21–19తో అనాబెల్లా –స్టిన్ కుస్పెర్ట్ (జర్మనీ)లపై గెలిచారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్లో నాదల్ దూకుడు
మెల్బోర్న్: కెరీర్లో 21వ గ్రాండ్స్లామ్ టైటిల్ లక్ష్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో బరిలోకి దిగిన స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్లో నాదల్ 7–5, 6–2, 7–5తో కామెరూన్ నోరి (బ్రిటన్)పై వరుస సెట్లలో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు 16 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడిన నాదల్ 14 సార్లు కనీసం ప్రిక్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. నోరితో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో నాదల్ ఏడు ఏస్లు సంధించి కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసిన నాదల్ తన సర్వీస్ను ఒకసారి మాత్రమే కోల్పోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ)తో నాదల్ ఆడతాడు. ముఖాముఖి పోరులో నాదల్ 12–4తో ఆధిక్యంలో ఉన్నాడు. గ్రాండ్స్లామ్ టోర్నీ ల్లో మాత్రం వీరిద్దరు రెండుసార్లు తలపడ్డారు. ఒక్కోసారి గెలిచారు. మూడో రౌండ్లో ఫాగ్నిని 6–4, 6–3, 6–4తో అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మెద్వెదేవ్ ఎట్టకేలకు... పురుషుల సింగిల్స్లో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ బెరెటిని (ఇటలీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్లో మెద్వెదేవ్ 6–3, 6–3, 4–6, 3–6, 6–0తో ఫిలిప్ క్రాయినోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు. తద్వారా గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఐదు సెట్లపాటు జరిగిన మ్యాచ్ల్లో తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. గతంలో మెద్వెదేవ్ ఆరుసార్లు ఐదు సెట్లపాటు జరిగిన మ్యాచ్ల్లో ఓటమి చవిచూశాడు. సిట్సిపాస్ 6–4, 6–1, 6–1తో మికెల్ వైమెర్ (స్వీడన్)పై, రుబ్లెవ్ 7–5, 6–2, 6–3తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై, బెరెటిని 7–6 (7/1), 7–6 (7/5), 7–6 (7/5)తో ఖచనోవ్ (రష్యా)పై గెలిచారు. యాష్లే బార్టీ జోరు మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. యాష్లే బార్టీ 6–2, 6–4తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై, స్వితోలినా 6–4, 6–0తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై నెగ్గారు. ప్లిస్కోవా 5–7, 5–7తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో... బెన్సిచ్ 2–6, 1–6తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓటమి పాలయ్యారు. ముకోవాతో గంటా 54 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రపంచ మాజీ నంబర్వన్ ప్లిస్కోవా ఏకంగా పది డబుల్ ఫాల్ట్లు, 40 అనవసర తప్పిదాలు చేసింది. ముగిసిన భారత్ పోరు ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్న (భారత్)–యింగ్యింగ్ దువాన్ (చైనా) జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. 63 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో బోపన్న–యింగ్యింగ్ ద్వయం 4–6, 4–6తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)–జేమీ ముర్రే (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియన్ ఓపెన్లో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లందరూ తొలి రౌండ్ను దాటకుండానే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్లో సుమీత్ నాగల్... పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, మహిళల డబుల్స్లో అంకిత రైనా జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. -
ప్రిక్వార్టర్స్లో ఫెడరర్, నాదల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఫెడరర్ 7–5, 6–2, 7–6 (7/4)తో లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై, మూడో సీడ్ నాదల్ 6–2, 6–3, 6–2తో సోంగా (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ల్లో సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–4తో జులియా జార్జెస్ (జర్మనీ)పై, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 6–1తో హరియెట్ డార్ట్ (బ్రిటన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. -
బ్రెజిల్ దూసుకెళ్లింది
సాకర్ ప్రపంచకప్లో జర్మనీలా బ్రెజిల్ కూలిపోలేదు. మరో షాక్కు తావివ్వలేదు. మరో పరాభవానికి చోటివ్వ లేదు. టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ అంచనాలకు తగ్గట్టే ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ దూసుకుపోయింది. మెరుగైన ప్రదర్శనతో సెర్బియాపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాస్కో: జోరుమీదున్న బ్రెజిల్ నాకౌట్ దశకు చేరింది. ఐదుసార్లు చాంపియన్ అయిన బ్రెజిల్ తమ చివరి లీగ్ మ్యాచ్లో 2–0 గోల్స్తో సెర్బియాపై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో బ్రెజిల్కిది వరుసగా రెండో విజయం. స్విట్జర్లాండ్తో తొలి మ్యాచ్ను డ్రా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్లో కోస్టారికాపై గెలిచింది. దీంతో గ్రూప్ ‘ఇ’లో ఓటమి ఎరుగని బ్రెజిల్ టాపర్గా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెర్బియాతో బుధవారం జరిగిన పోరులో పాలిన్హో, తియాగో సిల్వా ఆకట్టుకున్నారు. ఇద్దరు చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే బ్రెజిల్ దాడులు మొదలయ్యాయి. కానీ సమన్వయం కుదరక నాలుగో నిమిషంలోనే గోల్ చేసే చక్కని అవకాశాన్ని కోల్పోయింది బ్రెజిల్. ప్రత్యర్థి గోల్ పోస్ట్కు అత్యంత సమీపంగా బంతిని తీసుకొచ్చిన జీసస్ షాట్... నెమార్, కౌటిన్హో సమన్వయలేమితో నిష్ఫలమైంది. ఆ తర్వాత కూడా బ్రెజిల్ పదేపదే లక్ష్యం దిశగా గురిపెట్టింది. ఎట్టకేలకు తొలి అర్ధభాగం ఆట 36వ నిమిషంలో కౌటిన్హో ఇచ్చిన పాస్ను మిడ్ఫీల్డర్ పాలిన్హో మెరుపువేగంతో గోల్ పోస్ట్లోకి తరలించాడు. దీంతో బ్రెజిల్ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. 1–0 ఆధిక్యంతో ఫస్టాఫ్ను ముగించింది. డిఫెండర్లు, మిడ్ఫీల్డర్లు అద్భుతంగా రాణించారు. దీంతో బంతిని బ్రెజిల్ గోల్పోస్ట్వైపు తీసుకెళ్లేందుకే సెర్బియా ఆపసోపాలు పడింది. ఇక ద్వితీయార్ధంలోనూ బ్రెజిల్ ఆధిపత్యమే కొనసాగింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచేందుకు ఆటగాళ్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో బ్రెజిల్ రెండో గోల్ నమోదైంది. ఆట 68వ నిమిషంలో స్ట్రయికర్ నెమార్ కార్నర్ నుంచి ఇచ్చిన పాస్ను డిఫెండర్ తియాగో సిల్వా హెడర్ గోల్గా మలిచాడు. దీంతో 2–0 ఆధిక్యంతో దూసుకెళ్లిన బ్రెజిల్ను సెర్బియా ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో బ్రెజిల్ ఆటగాళ్లు ఆరుసార్లు లక్ష్యంపై గురిపెట్టగా రెండు సార్లు విజయవంతమయ్యారు. ప్రత్యర్థి సెర్బియా జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే టార్గెట్కు చేరినప్పటికీ ఫలితాన్ని మాత్రం సాధించలేకపోయింది. జూలై 2న జరిగే ప్రిక్వా ర్టర్ ఫైనల్లో మెక్సికోతో బ్రెజిల్ ఆడుతుంది. అభిమానుల ఘర్షణ సాకర్ క్రేజ్ ఆకాశమంత అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్కప్ కోసం ప్రాణాలిస్తారు. చేదు ఫలితాలొస్తే జీర్ణించుకోలేక ప్రాణాలొదిలేస్తారు. మైదానంలో తమ జట్లు పోరాడితే... ప్రేక్షకుల గ్యాలరీల్లో అభిమానులు బాహాబాహీకి దిగుతుండటం కూడా ఇక్కడ సహజం. బ్రెజిల్, సెర్బియా మ్యాచ్ ముగిశాక ఇరు దేశాల అభిమానులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రేక్షకురాలు ఇదంతా చూసి భయాందోళనకు గురైంది. పోలీసులు ఈ సంఘటనలో బాధ్యులైన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ప్రిక్వార్టర్స్లో బాయ్స్ స్పోర్ట్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బాస్కెట్బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న క్లబ్ లీగ్ బాస్కెట్బాల్ టోర్నీలో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘బి’ జట్టు ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ మ్యాచ్లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ (బీఎస్సీ) ‘బి’ జట్టు 51-50తో హైదరాబాద్ వైఎంసీఏ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బీఎస్సీ జట్టు తరఫున విఘ్నేశ్ 25 పాయింట్లు, అమన్ 15 పాయింట్లు సాధించారు. హైదరాబాద్ వైఎంసీఏ జట్టులో వినయ్ (22), నరేశ్ (7) పోరాడారు. ఇతర మ్యాచ్ల్లో సనత్నగర్ క్లబ్ 41-23తో సెయింట్ జోసెఫిన్ క్లబ్పై గెలుపొందింది. సనత్నగర్ క్లబ్ తరఫున నవీద్ (13), సాయి ప్రకాశ్ (11)... సెయింట్ జోసెఫిన్ క్లబ్ జట్టులో అశుతోష్ (10), దత్త (4) ఆకట్టుకున్నారు. ఎన్పీఏ క్లబ్ 43-39తో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్లో ఎన్పీఏ తరఫున మనోజ్ (20), భూపేందర్ (15)... బీఎస్సీ ‘ఎ’ జట్టులో ప్రశాంత్ (15), ప్రదీప్ (10) రాణించారు. మరో మ్యాచ్లో హూప్స్టర్స్ జట్టు 63- 53తో బీహెచ్ఈఎల్ ‘ఎ’ జట్టుపై గెలుపొందింది. హూప్స్టర్స్ జట్టు తరఫున రామకృష్ణారెడ్డి (23), వెంకటేశ్ (15)... బీహెచ్ఈఎల్ ‘ఎ’ జట్టులో చైతు (17), తులసి (12) ప్రతిభ కన బరిచారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement