-
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
కీలకమైన ఉత్తరప్రదేశ్లో లోక్సభ ఎన్నికల పోరు పశి్చమ యూపీ నుంచి యాదవ భూమికి చేరింది. బ్రజ్, రోహిఖండ్ ప్రాంతాల్లోని 10 లోక్సభ స్థానాలకు 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. యాదవులు, ముస్లింలు ఒక్కటైతే అక్కడ వారి తీర్పే ఫైనల్. వారి ఓట్లపైనే ఆశలు పెట్టుకున్న సమాజ్వాదీ పార్టీకి మూడో విడత అగ్నిపరీక్ష కానుంది. యూపీలో తొలి రెండు విడతల్లో జాట్ బెల్ట్గా భావించే పశి్చమ యూపీలోని 16 స్థానాలకు పోలింగ్ ముగియడం తెలిసిందే... సంభల్ యాదవ ఆధిపత్య స్థానమిది. దివంగత ఎస్పీ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ 1998, 1999ల్లో ఇక్కడి నుంచే లోక్సభకు వెళ్లారు. 2004లోనూ ఎస్పీ నేత రామ్గోపాల్ యాదవ్ గెలిచారు. 2014లో మాత్రం బీజేపీ నేత సత్యపాల్ సింగ్ సైని గెలిచారు. 2019లో ఎస్పీ నేత షఫీకుర్ రెహమాన్ బార్క్ భారీ విజయం సాధించారు. ఆయన అనారోగ్యంతో కన్నుమూయడంతో ఈసారి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే జియావుర్ రెహమాన్కు ఎస్పీ టికెటిచి్చంది. బీజేపీ మళ్లీ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర్ లాల్ సైనీనే రంగంలోకి దింపింది. బీఎస్పీ నుంచి షౌలత్ అలీ పోటీ చేస్తున్నారు.హథ్రస్ ఈ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం 1991 నుంచీ బీజేపీ కంచుకోట. కాంగ్రెస్ అయితే 1971 తర్వాత ఇక్కడ ఎన్నడూ గెలవలేదు! ఇక ఎస్పీ, బీఎస్పీ ఈ స్థానంలో ఒక్కసారి కూడా గెలుపు ముఖమే చూడలేదు! 2009లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆరెల్డీ ఇక్కడ విజయం సాధించింది. 2019లో ఎస్పీ అభ్యర్థి రామ్జీ లాల్ సుమాన్పై బీజేపీ అభ్యర్థి రాజ్వీర్ సింగ్ దిలార్ 2.6 లక్షల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 66 ఏళ్ల దిలార్ ఏప్రిల్ 24న గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో బీజేపీ టికెట్ అనూప్ ప్రధాన్కు లభించింది. ఎస్పీ తరఫున జస్వీర్ వాలీ్మకి పోటీ చేస్తున్నారు.బరేలీ కేంద్ర మాజీ మంత్రి సంతోష్ గంగ్వార్ ఇక్కడి నుంచి ఎనిమిదిసార్లు బీజేపీ తరఫున గెలిచారు! ఒక్క 2009 మినహాయిస్తే 1989 నుంచి అన్ని ఎన్నికల్లో గంగ్వార్దే గెలుపు! ఈసారి మాత్రం బీజేపీ ఆయన్ను పక్కన పెట్టింది. అదే సామాజిక వర్గానికి చెందిన ఛత్రపాల్ సింగ్ గంగ్వార్కు టికెటిచి్చంది. ఎస్పీ నుంచి ప్రవీణ్ సింగ్ అరాన్ బరిలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థి చోటేలాల్ గంగ్వార్ నామినేషన్ తిరస్కరణకు గురవడం ఆ పారీ్టకి షాకిచి్చంది. దీంతో ఇక్కడ ద్విముఖ పోటీయే నెలకొంది.ఫతేపుర్ సిక్రీ 2009లో ఈ స్థానాన్ని బీఎస్పీ సొంతం చేసుకుంది. గత రెండు ఎన్నికల నుంచి మాత్రం బీజేపీదే విజయం. 2019లో ఆ పార్టీ అభ్యర్థి రాజ్కుమార్ చాహర్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్కు 1.72 లక్షల ఓట్లు పోలైతే, చాహర్ ఏకంగా 6.67 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు! దాంతో ఈ విడత కూడా చాహర్కే బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి రామ్నాథ్ సికర్వార్, బీఎస్పీ నుంచి రామ్నివాస్ శర్మ పోటీలో ఉన్నారు. ఎస్పీ మాజీ నేత భగవాన్ శర్మ (గుడ్డూ పండిట్) స్వతంత్ర అభ్యరి్థగా పోటీలో ఉండటం కాంగ్రెస్కు ప్రతికూలం కానుంది.బదాయూ ఎస్పీకి కీలకమైన స్థానమిది. 1996 నుంచి 2014 దాకా ఆ పారీ్టకి కంచుకోట. 2009, 2014ల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ నెగ్గారు. 2019లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య ఆయనపై కేవలం 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ విడత దురి్వజయ్ శాక్యను బీజేపీ పోటీలో దించింది. ఎస్పీ కూడా సీనియర్ నేత శివపాల్ యాదవ్ ఒత్తిడితో ఆయన కుమారుడు ఆదిత్యకు టికెటిచ్చింది. ధర్మేంద్ర యాదవ్ను పక్కన పెట్టడం దానికి ప్రతికూలంగా మారొచ్చంటున్నారు.ఫిరోజాబాద్ ఇదీ ఎస్పీ ఆధిపత్యమున్న స్థానమే. 2009లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, 2014లో ఆయన సోదరుడు అక్షయ్ యాదవ్ విజయం సాధించారు. 2019లో మాత్రం ఫిరోజాబాద్ బీజేపీ పరమైంది. ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చంద్రసేన్ జడాన్ 28 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి అక్షయ్ యాదవ్పై గెలిచారు. ఈసారి ఎస్పీ నుంచి మళ్లీ అక్షయ్ బరిలో ఉన్నారు. బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎంపీని మార్చి విశ్వదీప్ సింగ్కు టికెటిచి్చంది.ఎటా ఆది నుంచీ బీజేపీని ఆదరిస్తున్న స్థానమిది. 1999, 2004 ఎన్నికల్లో మాత్రం ఎస్పీ నెగ్గింది. 2009 ఎన్నికల్లో యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం విశేషం! ఆయన కుమారుడు రాజ్వీర్సింగ్ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ తరఫున దవేశ్ శాక్య, బీఎస్పీ నుంచి మహమ్మద్ ఇర్ఫాన్ బరిలో ఉన్నారు.ఆవ్లా 1989 నుంచి బీజేపీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 2009 నుంచి ఆ పారీ్టకే ఇక్కడి ఓటర్లు పట్టం కడుతున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన ధర్మేంద్ర కశ్యప్కే ఈసారి కూడా బీజేపీ టికెట్ దక్కింది. ఎస్పీ నుంచి నీరజ్ మౌర్య, బీఎస్పీ తరఫున అబిద్ అలీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 2014లో ఎస్పీ, 2019 ఎన్నికల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచాయి.బీజేపీ హవా కొనసాగేనా!? మూడో విడతలో పోలింగ్ జరిగే 10 స్థానాల్లో ఎనిమిది 2019లో బీజేపీ గెలుచుకున్నవే. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి బరిలో దిగగా బీఎస్పీ ఒంటరి పోరు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వాటి మధ్య చీలితే బీజేపీ లాభపడనుంది. ఈ 10 లోక్సభ స్థానాల్లో ముస్లింలతో పాటు ఓబీసీలు, ముఖ్యంగా యాదవ్ల పాటు ఓట్లు ఎక్కువ. ఎటా, ఫిరోజాబాద్, మెయిన్పురి, బుదౌన్, సంభాల్ యాదవ ప్రాబల్య స్థానాలు. సంభాల్, ఆవ్లా, ఫతేపుర్ సిక్రీ, ఆగ్రా, ఫిరోజాబాద్ల్లో ముస్లిం ఓటర్లు 13 శాతమున్నారు. బరేలీలోనైతే ఏకంగా 33 శాతం దాకా ఉంటారు! ఇతర లోక్సభ స్థానాల్లో లోధ్, కచి్చ, శాక్య, మురావోల ప్రాబల్యమూ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
దివంగత సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరుణంలో శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు. శివపాల్ యాదవ్కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్ యాదవ్ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెయిన్పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్ స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. -
లోక్సభ ఎన్నికల తరుణంలో.. సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ
లోక్సభ ఎన్నికల తరుణంలో సమాజ్ వాదీ పార్టీకి ఎదురు దెబ్బ తగలింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లక్నోకి చెందిన కీలక నేతలు బీజేపీ చేరారు.సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జై చౌబే, బలరామ్ యాదవ్, జగత్ జైస్వాల్ సహా పలువురు నేతలు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, పలువురు జిల్లా అధ్యక్షులు ఈరోజు బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీపై ప్రజలకు చేరువైంది. ఆయన నేతృత్వంలో వికసిత్ భారత్ కోసం కృషి చేస్తాం. అందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని డిప్యూటీ సీఎం పాఠక్ అన్నారు. -
బీజేపీ ఆటనే.. మేమూ మొదలుపెట్టాం!
లక్నో : తాజా ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేనివారిని తాజా ఉప ఎన్నికలు ఓడించాయని ఆయన చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ ఆడుతున్న ఆటను.. తాము కూడా ఆడుతున్నామని, విపక్షాలను చీల్చి గండి కొట్టాలన్న బీజేపీ ఎత్తుగడలకు బ్రేక్ వేశాయని ఆయన అన్నారు. గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ‘బీజేపీ మాతో ఆడుతున్న ఆటనే.. మేం ఆ పార్టీ నుంచి నేర్చుకొని.. ఆడుతున్నాం. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఏమైంది? రుణమాఫీ కాదు రైతుల ప్రాణాలను బీజేపీ సర్కారు బలిగొంటోంది. ఇది పెద్ద మోసం’ అని అఖిలేశ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని కైరానా లోక్సభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 55వేల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్ఎల్డీకి మద్దతునిచ్చాయి. మరోవైపు నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ నియోజకవర్గమైన ఇక్కడ ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. -
‘యోగి.. నువ్వేం ముఖ్యమంత్రివి?’
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్పై సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని యోగికి రామ్ గోపాల్ సూచించారు. (సల్మాన్ గెటప్లో యోగి.. వైరల్) శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత.. యోగి పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘లేపేస్తాం.. చంపి పడేస్తాం’ అంటూ యోగి మాట్లాడుతున్నారు. ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. ఆయన అధికారంలోకి వచ్చాక ఫేక్ ఎన్కౌంటర్లు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అమాయకులు ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు’ అని రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ముజఫర్ నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకడు తప్పించుకుని పోయాడు. ఈ కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడగా.. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామ్గోపాల్ యాదవ్ యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీహర్లో బీజేపీ-జేడీయూ కూటమికి షాక్
-
రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని.. బీజేపీలోకి జంప్!
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ సమాజ్వాదీ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు. రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాంరాం చెప్పి సోమవారం బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రి, పార్టీ నేత పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన సోమవారం కమలం కండువా కప్పుకున్నారు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిన నరేశ్ అగర్వాల్ పార్టీ మారారు. సమాజ్వాదీ పార్టీలో నరేశ్ అగర్వాల్ అత్యంత సీనియర్ నేత. ఆయన ఏడుసార్లు హర్దోయి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత కొన్నాళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న నరేశ్ పార్టీని వీడటం.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గత ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
అక్కడ విపక్షాల అనైక్యత బీజేపీకి వరం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం ఎవరిదే ముందే తేలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు సంయుక్తంగా బీజేపీకి పళ్లెంలో పెట్టి అందిస్తున్నాయని చెప్పవచ్చు. గతేడాది ఉత్తరప్రదేశ్కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఇకముందు కలిసికట్టుగా పోటీ చేయాలని ఈ మూడు పార్టీల నాయకులు ప్రకటించారు. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేయగా, బీఎస్పీ విడిగా పోటీ చేసిన విషయం తెల్సిందే. ఈసారి గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేస్తాయని, తద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పాలకపక్ష బీజేపీకి ఓ సవాల్ను విసురుతాయని రాజకీయ పరిశీలకులు భావించారు. సాక్షి ప్రత్యేకం. ఈసారి ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. ఆయన మొండితనం తెలిసిన కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ నాయకురాలు మాయావతిని కదిపి చూసింది. ఆమె ఎలాంటి ఐక్యతా పిలుపునకు స్పందించలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలోపెట్టుకొని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సమాజ్వాది పార్టీ గోరఖ్పూర్ నుంచి సంతోష్ నిషాద్, ఫూల్పూర్ నుంచి నాగేంద్ర పటేల్ను రంగంలోకి దించింది. గోరఖ్పూర్లో నిషాద్ కులస్థులు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని, ఫూల్పూర్లో కుర్మీలు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ గోరఖ్పూర్ నుంచి సుర్హీత ఛటర్జీ కరీంను, ఫూల్పూర్ నుంచి మనీష్ మిశ్రాను బరిలోకి దింపింది. బీఎస్పీ నాయకురాలు మాయావతి మాత్రం ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.సాక్షి ప్రత్యేకం. యూపీలోని ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతగా తీవ్రంగా ప్రయత్నించిందీ ఒక్క కాంగ్రెస్ పార్టీనే. ప్రతిపక్షాల ఐక్యత వల్ల లాభపడేది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే కావడంతో ప్రాంతీయ పార్టీలు, ఇతర చిన్న పార్టీలు పట్టించుకోలేదు. 2014లో జరిగిన లోక్సభ, ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీనే బాగా దెబ్బతిన్నప్పటికీ ఐక్యత కోసం మాయావతి కలిసి రావడం లేదు. ఆమె నిర్ణయాలు ఎవరికి అర్థం కాకుండా ఉంటున్నాయి. పొత్తుకు అంగీకరించని ఆమె ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎలాగూ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లయితే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో విజయం బీజేపీ అభ్యర్థులదేనని ఎవరైనా చెప్పవచ్చు! -
'అదంతా టైం వేస్ట్.. ఇప్పటికే హర్ట్ అయ్యా'
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న అఖిలేశ్ యాదవ్ కాస్త చిరాకుతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులు అనేవి సమయం వృధా చేసే పనులు అని, సీట్ల పంపిణీ విషయంలో పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెడతాయని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై బుధవారం అఖిలేశ్ స్పందిస్తూ తన గురి మొత్తం ఇప్పుడు ఆ ఎన్నికలపైనే అన్నారు. 2019 ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నామని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సమాజ్వాది పార్టీని బలోపేతం చేయడమేనని అన్నారు. '2019 ఎన్నికల ద్వారా ఉత్తరప్రదేశ్ నుంచి దేశం మొత్తానికి ఓ సందేశం వెళ్లనుంది. ఇప్పుడు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే విషయాన్ని నేను ఆలోచించడం లేదు. అదంతా కూడా సమయం వృధా. ఇక నేను తికమక అవ్వాలని అనుకోవడం లేదు. అయితే, పొత్తులు గురించి కాకుండా మాలాగే ఆలోచించే పార్టీతో స్నేహం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నాము' అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ పొత్తుపెట్టుకొని పనిచేసి ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. -
వీడియో సాక్ష్యం.. చిక్కుల్లో నటుడు సంజయ్!
-
సమాజ్వాదీ ముసలం.. ముగియలేదా?
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములాయం కుటుంబంలోని గొడవలతో సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ములాయం, తనయుడు అఖిలేష్ల వర్గాలుగా చీలిపోయిన పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించుకోగా.. ఒకానోక టైంలో తనను తాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా అఖిలేశ్ ప్రకటించుకోవటం.. సైకిల్ గుర్తు కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించటం లాంటివి చూశాం. చివరకు పరిస్థితి సర్దుమణిగినా.. పార్టీకి భారీ ఓటమి మాత్రం తప్పలేదు. ఇదిలా ఉంటే నాలుగైదు నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ పార్టీలో పరిస్థితులు ఏం మారలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23న రాష్ట్ర సర్వసభ్య సమావేశం, అక్టోబర్ 5న పార్టీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ యువనేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. అయితే విభేధాల అనంతరం భారీ స్థాయిలో నిర్వహించబోతున్న పార్టీ సమావేశాల విషయంలో నేతాజీ ములాయం పేరు ప్రస్తావన రాకపోవటం విశేషం. ములాయం వర్గీయులకు కూడా ఈమేర ఆహ్వానం అందలేదనే తెలుస్తోంది. మరోవైపు ములాయం సింగ్ నేతృత్వంలో ఈ నెల 21న లొహియా ట్రస్ట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రస్ట్ 11 మంది సభ్యుల్లో తనయుడు అఖిలేష్తోపాటు, సోదరుడు రామ్గోపాల్ యాదవ్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ మొన్నామధ్య నిర్వహించిన సమావేశాలకు వీరిద్దరూ హాజరుకాకపోవటంతో.. త్వరలో నిర్వహించబోయేదానిపై కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకోవటంతో సమాజ్వాదీ పార్టీ అధికార జగడం ఇంకా సర్దుమణగలేదనే చెప్పుకుంటున్నారు. -
అమర జవాన్ భార్యను అవమానించిన అఖిలేష్
సాక్షి, లక్నో: సమాజ్ వాదీ పార్టీ యువ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమర జవాన్ కుటుంబాన్ని అవమానించాడంటూ విమర్శలు మొదలయ్యాయి. ఒకరికి బదులుగా మరోకరికి సన్మానం చేయటమే అందుకు కారణం. 1965 ఇండో-పాక్ యుద్ధంలో అబ్దుల్ హమీద్ అనే జవాన్ చనిపోగా, ఆరు రోజుల తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అజంఘడ్ జిల్లా నాథ్పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమీద్ భార్య రసూలన్ బీబిని అఖిలేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అయితే ఆ వార్తను టీవీల్లో చూసిన హమీద్ అసలు భార్య రసూలన్ షాక్కి గురైంది. అఖిలేష్ సన్మానం చేసింది ఎవరికోనని, అసలు ఆ రోజంతా తాను ఇంట్లోనే ఉన్నానని 90 ఏళ్ల రసూలన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆమె మనవడు కూడా ధృవీకరించాడు. ఇక విషయం ఆ నోటా ఈ నోటా పాకి బీజేపీ చెవిన పడటంతో అఖిలేష్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ వీరుడి కుటుంబాన్ని ఘోరంగా అవమానించారంటూ సమాజ్ వాదీ చీఫ్ పై మండిపడింది. అంతేకాదు సెప్టెంబర్ 10న రసూలన్ను తాము ఘనంగా సత్కరించబోతున్నామని బీజేపీ ప్రకటించింది. తప్పు జరిగిపోయింది: సమాజ్వాదీ పార్టీ సన్మాన కార్యక్రమంలో తప్పు జరిగిపోయిందన్న విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఒప్పుకుంది. నిజానికి అక్కడ రామ్ సముజ్ యాదవ్ అనే అమర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించాం. రసూలన్ బిబి పేరు జాబితాలో ఉండగా మైక్లో నిర్వాహకులు పేరు చదివారు. వెంటనే ఓ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు వేదికపైకి రావటంతో ఆమెకు అఖిలేష్ సన్మానం చేశారు. ఆమె రసూలన్ అవునో.. కాదో... నిర్ధారణ చేసుకోకపోవటం మా తప్పే. ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాం అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతేకాదు త్వరలో పార్టీ తరపున ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఎమ్మెల్సీల రాజీనామా.. సీఎంకు లైన్క్లియర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లైన్ క్లియర్ అయింది. ఆయన ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. శాసనమండలిలో ఆయన అడుగుపెట్టేందుకు వీలుగా ఇద్దరు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్సీలు రాజీనామా చేసి.. మార్గం సుగమం చేశారు. శాసనమండలి సభ్యులైన బుక్కాల్ నవాబ్, యశ్వంత్ సింగ్ శనివారం తమ పదవులకు రాజీనామా చేశారు. మరింతమంది రాజీనామా చేసే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు స్వతంత్రదేవ్ సింగ్, మోసిన్ రజాలు శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నికకావాల్సి ఉంది. వీరికి రెండు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానిక మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఎంపీలుగా ఉన్న సీఎం యోగి, డిప్యూట్యీ సీఎం మౌర్య తమ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. గత ముఖ్యమంత్రులైన మాయావతి, అఖిలేశ్ యాదవ్ సైతం ఇదేవిధంగా ఎమ్మెల్సీలుగా సభలో అడుగుపెట్టారు. -
దేవుళ్లను అవమానించారు!
♦ రాజ్యసభలో ఎస్పీ ఎంపీ అగర్వాల్ వ్యాఖ్యపై దుమారం ♦ క్షమాపణకు అధికార పక్షం డిమాండ్ ♦ సభ రెండుసార్లు వాయిదా.. ఎట్టకేలకు దిగొచ్చిన నరేశ్ అగర్వాల్.. ♦ మన్ కీ బాత్ ఆపండి.. రుణాల్ని మాఫీ చేయండి: లోక్సభలో విపక్షాలు న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లపై రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు బుధవారం తీవ్ర దుమారం సృష్టించాయి. హిందూ దేవుళ్లను ఆల్కహాల్ బ్రాండ్లతో అగర్వాల్ పోల్చారని, సభ వెలుపల ఆయన ఆ వ్యాఖ్యలు చేసుంటే తప్పకుండా కేసు పెడతారని సభా నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా తప్పుపట్టారు. ఎస్పీ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ, ఇతర మిత్రపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ.. ఆయన క్షమాపణకు పట్టుబట్టాయి. అందుకు అగర్వాల్ నిరాకరించడంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం సమావేశమయ్యాక ఆయన క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ‘దళితులు, మైనార్టీలపై పెరుగుతున్న హత్యాచారాలు, దాడులు’ అంశంపై చర్చ సందర్భంగా అగర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ‘మీరు వాడిన మాటల తీవ్రత ఇంకా గుర్తించలేదు. ఇతర మతాల దేవుళ్ల గురించి అలా మాట్లాడేందుకు మీరు సాహసించగలరా?’ అని ప్రశ్నించారు. అగర్వాల్ వ్యాఖ్యల్ని డిప్యూటీ చైర్మన్ వినకపోవడంతో రికార్డుల పరిశీలనకు సభను 10 నిమిషాలు వాయిదావేశారు. అనంతరం భేటీ కాగానే కురియన్ మాట్లాడుతూ ‘అగర్వాల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పారు. అలాగే ఆ వ్యాఖ్యల్ని ఎక్కడా వాడవద్దని మీడియాకు సూచించారు. ఇంతలో అగర్వాల్ లేచి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటానని చెప్పగా.. ‘దేవుళ్లని అవమానిస్తే ఊరుకోం’ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార సభ్యుల నిరసనలతో సభ వాయిదాపడింది. అనంతరం సమావేశమయ్యాక.. తన వ్యాఖ్యలకు అగర్వాల్ క్షమాపణలు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఏ కుల, మత విశ్వాసాల్ని అవమానించలేదని వివరణ ఇచ్చారు. రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించింది రైతు సమస్యల్ని కేంద్రం విస్మరించిందన్న ప్రతిపక్షాల నిరసనలతో లోక్సభ మార్మోగింది. రైతుల దుస్థితిని కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ‘మన్ కీ బాత్ బంద్ కరో, కర్జా మాఫీ షురూ కరో’(రేడియోలో మాట్లాడడం ఆపి.. రైతు రుణ మాఫీ మొదలుపెట్టండి) అని నినాదాలు చేశారు. బీజేపీ మిత్రపక్షం స్వాభిమాని ప„Š (ఎస్డబ్లు్యపీ) ఎంపీ రాజు షెట్టీ కూడా విపక్షాలతో జతకలిశారు. దీంతో సభ ప్రారంభంలోనే గంట వాయిదా పడింది. అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని, రైతు రుణాల మాఫీతో పాటు.. పెట్టుబడి ఖర్చుల్లో 50 శాతం కంటే ఎక్కువ చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. 193వ నిబంధన కింద చర్చకు సిద్ధమని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ చెప్పా రు. ప్రభుత్వ సమాధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్, లెఫ్ట్, ఆర్జేడీ సభ్యులు వాకౌట్ చేశారు. ‘గోరక్షణ’పై రాష్ట్రాలకు పూర్తి అధికారం ‘గోరక్షణ’ పేరిట హత్యలపై లోక్సభలో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అలాంటి సంఘటనలు జరిగితే చర్యలు తీసుకునేందుకు రాష్ట్రాలకు పూర్తి అధికారం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ సమాధానంపై ఎస్పీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ.. వెల్లోకి దూసుకెళ్లారు. పాకిస్తాన్తో కలసి భారత్పై దాడి చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని మాజీ రక్షణ మంత్రి, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ లోక్సభలో పేర్కొన్నారు. అలాంటి ముప్పు ఎదురైతే ఎలా ఎదుర్కొంటారో పార్లమెంట్కు చెప్పాలని ఆయన కోరారు. ట్రిపుల్ ఐటీలకు చట్టబద్ధ హోదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ)లకు చట్టబద్ధ హోదా కల్పిస్తూ పెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించింది. పేద విద్యార్థుల ఫీజులు పెంచబోమని, రిజ్వరేషన్ల చట్టం వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.‘ద ట్రిపుల్ ఐటీ (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) బిల్లు’లో భాగంగా 15 ట్రిపుల్ ఐటీల్ని ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్’గా పరిగణిస్తారు. -
అపర్ణా యాదవ్ సంస్థకు 86% ‘నిధులు’
లక్నో: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గో సంరక్షణకు కేటాయించిన నిధుల్లో 86 శాతం డబ్బులు అపర్ణ యాదవ్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఖాతాలోకి చేరాయి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ప్రభుత్వం తాజాగా ఈ వివరాలు వెల్ల డించింది. నాటి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు తమ్ముడు ప్రతీక్ యాదవ్ భార్యనే అపర్ణ. గో సంరక్షణకు కేటాయించిన నిధుల వివరాలు తెలపాలంటూ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ భార్య నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. 2012 నుంచి 2017 మధ్య యూపీ ప్రభుత్వం మొత్తం రూ.9.66 కోట్లను గో సంరక్షణకు కేటాయించగా, అందులో రూ.8.35 కోట్లను అపర్ణ నడిపే జీవ్ ఆశ్రయ అనే సంస్థకు కేటాయించింది. -
అఖిలేష్.. ఇక చాలు దిగిపో!
తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ రగడ మొదలైంది. తన కొడుకు అఖిలేష్ యాదవ్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోరారు. పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను అఖిలేష్ నెరవేర్చలేకపోయారని ములాయం విమర్శించారు. పార్టీ అధ్యక్ష పదవిని తీసుకునేటప్పుడు మూడు నెలల తర్వాత మళ్లీ తనకు తిరిగి అప్పగిస్తానని అఖిలేష్ చెప్పాడని ఆయన ఆగ్రాలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. తనకు పదవుల మీద ఆశ లేదని, అయితే అఖిలేష్ తన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో జాతీయ మీడియా అతడినే అడగాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహం ఏంటని అడిగితే మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. వాస్తవానికి ములాయం జాతీయాధ్యక్షుడిగా ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఆ విషయం తనకు పెద్దగా తెలియదని ములాయం అన్నారు. -
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
-
ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
తన పేరు చెప్పేటప్పుడు ఆ యువకుడి గొంతులో కాస్తంత గర్వం తొణికిసలాడింది. ''నా పేరు మోహిత్ యాదవ్..'' అంటూనే ఒక్కసారిగా అక్కడున్న పోలీసు అధికారి చెంప మీద కొట్టాడు. తన మేనమామ పేరు చెప్పుకొంటూ అతగాడు రెచ్చిపోయాడు. ఎందుకంటే అతడి మేనమామ ఉత్తరప్రదేశ్లోని ఇటా నియోజకవర్గానికి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ!! మోహిత్ యాదవ్ అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. తనను స్టేషన్కు పిలిపించినందుకు అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో ఎస్ఐ జితేంద్ర కుమార్ను లాగి ఒక్కటిచ్చాడు. అక్కడున్న మిగిలిన పోలీసులు అతడిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా, వాళ్లలో ఒకరి కాలర్ పట్టుకున్నాడు. పోలీసు అధికారుల విధి నిర్వహణను అడ్డుకున్నందుకు యాదవ్ను అరెస్టు చేశారు. మోహిత్ యాదవ్ మామ రమేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. యూపీ ఎన్నికల సమయంలో ఆయనను బీజేపీ తమ పార్టీ నుంచి తప్పించింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు చాలావరకు జరిగాయి. రాజకీయ నాయకులు, వాళ్ల బంధువులు పలువురు అధికారుల మీద దాడులు చేసేవారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇలా ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మోహిత్ యాదవ్ నిరుద్యోగి. వాళ్ల నాన్నకు తుపాకుల దుకాణం ఉంది. మోహిత్ పొద్దున్న ఆస్పత్రికి వెళ్లి, తన బంధువుకు ఎక్స్రే తీయించుకోడానికి వీఐపీ ట్రీట్మెంట్ కావాలని డిమాండ్ చేశాడు. వాళ్లను వెంటనే చూడాలని, క్యూలో వేచి ఉండేది లేదని అన్నాడు. అలా కుదరదని అక్కడి సిబ్బంది చెప్పడంతో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్ను కొట్టడంతో పాటు డాక్టర్ మీద కూడా దాడి చేశాడు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు చెప్పడంతో వాళ్లొచ్చి అతడిని స్టేషన్కు లాక్కెళ్లారు. అక్కడ కూడా అలాగే చేయడంతో లోపల వేశారు. అతడు బాగా తాగినట్లు తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ చెప్పారు. -
శివపాల్ సన్నిహితులపై వేటు
లక్నో: సమాజ్వాదీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. శివపాల్ యాదవ్కు సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురిపై వేటు పడింది. మహ్మద్ షాహిద్, దీపక్ మిశ్రా, కల్లు యాదవ్, రాజేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్ సహా ఆరుగురిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. 'సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా' అనే పేరుతో కొత్త పార్టీ పెడుతున్న ములాయం సింగ్ తమ్ముడు, శివపాల్ యాదవ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన మద్దతుదారులపై వేటు వేయడం గమనార్హం. స్నేహితుల రూపంలో ఉన్న శత్రువులెవరో రాజకీయాల్లో ఉన్న తమకు బాగా తెలుసునని మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషం. తన కొడుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసి తప్పు చేశానని అంతకుముందు ములాయం సింగ్ అన్నారు. కాంగ్రెస్తో చేతులు కలిపి పార్టీని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. -
ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వేదికపై చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరికీ ఆసక్తి కలిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ను పలకరించగా.. ఆయన మోదీ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పారు. పక్కనే ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. మోదీలో చెవిలో ములాయం ఏం చెప్పారన్న దానిపై అప్పట్లో పలు ఊహాగానాలు వెలువడ్డాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్ బయటపెట్టారు. 'నేతాజీ (ములాయం) ప్రధాని మోదీతో.. కాస్త చూసుకోండి, ఇతను నా కొడుకు అఖిలేష్ అని చెప్పారు' అని అఖిలేష్ వెల్లడించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తాను నమ్మింది చెబుతున్నాని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎస్పీ ఓడిందని అఖిలేష్ ఆరోపించారు. -
ములాయం కొత్త పార్టీ!!
-
ములాయం కొత్త పార్టీ!!
కన్న కొడుకుతో విభేదాలు.. తమ్ముడికి అందలం.. చివరకు పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగింపు.. ఇంతటి ఘోర అవమానాలను చూసిన రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్.. పాతికేళ్ల తర్వాత మళ్లీ కొత్త పార్టీ పెడుతున్నారు. అన్నయ్య ములాయం సింగ్ నేతృత్వంలో 'సమాజ్వాదీ సెక్యులర్ మోర్చా' అనే ఈ పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన తమ్ముడు, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. నేతాజీకి ఆయన గౌరవం తిరిగి ఇప్పించడానికి, సమాజ్వాదీ పార్టీకి చెందినవాళ్లందరినీ మళ్లీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నామని శివపాల్ యాదవ్ చెప్పారు. సుమారు పాతికేళ్ల క్రితం సమాజ్వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్ యాదవ్.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో విభేదాలతో ఒక విధంగా రోడ్డున పడ్డారు. తాను స్థాపించిన పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదిరినట్లే కనిపించినా.. ప్రచారపర్వంలో మళ్లీ ఆ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. కేవలం తన తమ్ముడు పోటీ చేసిన నియోజకవర్గంతో పాటు చిన్నకోడలు పోటీ చేసిన లక్నో కంటోన్మెంటు స్థానంలో మాత్రమే ములాయం ప్రచారం చేశారు. అందులో చిన్నకోడలు అపర్ణాయాదవ్ ఓడిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు అధికారం లేక, అటు పార్టీ మీద కూడా పట్టులేకుండా ఎందుకని అనుకున్నారో ఏమో.. చివరకు సొంత పార్టీని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. సమాజ్వాదీ పార్టీని పెట్టినప్పుడు తనకు తోడుగా ఉన్న తమ్ముడు శివపాల్ యాదవ్ను కూడా తీసుకెళ్తున్నారు. అయితే సమాజ్వాదీ పార్టీలో ఉన్నవారిలో ఎంతమంది ములాయం వెంట వస్తారో చూడాల్సి ఉంది. ఈ వయసులో మళ్లీ ఆయన రాష్ట్రమంతా తిరిగి కొత్త పార్టీకి ప్రచారం చేసి, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం కూడా ఎంవతరకు సాధ్యమో తెలియాల్సి ఉంది. -
జనం మెచ్చని జోడీ.. విడాకులే దారి
- ఎస్పీతో కాంగ్రెస్ తలాక్ లక్నో: ‘ఈ జోడీ ప్రజలకు నచ్చింది.. బంపర్ మెజారిటీ గెలిపిస్తారు..’ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ మధ్య పొత్తుపై సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలివి. సీన్ కట్చేస్తే ‘జనం మెచ్చని జోడీకి విడాకులే దారి.. ఎస్పీతో పొత్తుకు రాంరాం..’ అని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు! ఆదివారం లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ బబ్బర్ మీడియాకు చెప్పారు. యూపీ వ్యవహారాల ఇన్చార్జి గులామ్ నబీ ఆజాద్ సహా కీలక నేతల సమక్షంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అఖిలేశ్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత వల్ల.. ఆయనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా దారుణంగా నష్టపోయిందని భేటీలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ‘3కే’ ఫార్ములాకు పునరంకితం.. సమాజ్వాదీ పార్టీతో తెగదెంపుల అనంతరం తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించిన ‘3కే’ ఫార్ములాకు పునరంకితం అవుతున్నట్లు యూపీ కాంగ్రెస్ ప్రకటించింది. కోల్పోయిన చరిష్మాను తిరిగి సాధించుకోవడం కాంగ్రెస్కు తెలుసని, అతి త్వరలోనే నేలకు కొట్టిన బంతిలా దూసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ సూచించిన ‘కార్యకర్త.. కార్యాలయం.. కార్యక్రమం..’ అనే 3కే ఫార్ములాతో కాంగ్రెస్కు పునరుజ్జీవం కలుగజేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. -
ఆ ప్రశ్న అడగ్గానే.. అఖిలేష్కు కోపం వచ్చింది
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశంలో సహనం కోల్పోయారు. పార్టీ పగ్గాలను తండ్రి ములాయం సింగ్ యాదవ్కు అప్పగించాలంటూ బాబాయ్ శివపాల్ యాదవ్ చేసిన ప్రతిపాదన గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అఖిలేష్కు కోపం వచ్చింది. 'ఈ విలేకరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు. ఆయన చొక్కా కూడా కాషాయ రంగులో ఉంది. అతనితో పాటు ఇతర జర్నలిస్టులకు చెబుతున్నా.. మేలో ఏ తేదీ అయినా నిర్ణయించుకోండి. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. అయితే ఆ తర్వాత మీరు నా కుటుంబం గురించి ఏ ప్రశ్న కూడా అడగరాదు' అని అఖిలేష్ అన్నారు. నీలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమవుతోందని, దేశం నాశనమైతే నీవు కూడా ఉండవంటూ ఆ విలేకరిపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ మీడియా సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు. అఖిలేష్ భద్రత సిబ్బంది ఓ సీనియర్ జర్నలిస్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేష్, శివపాల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగిన సంగతి తెలిసిందే. ములాయం తన సోదరుడు శివపాల్ వర్గానికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎస్పీ చీఫ్గా ఉన్న ములాయంను పదవి నుంచి తొలగించి, అఖిలేష్ను పార్టీ అధ్యక్షుడిగా ఆయన వర్గీయులు ఎన్నుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వర్గాలు రాజీపడ్డాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అఖిలేష్ స్థానంలో ములాయంకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించాలని వారి కుటుంబంలో డిమాండ్లు వస్తున్నాయి. -
సమాజ్వాదీ రాష్ట్ర అధ్యక్షుడిగా సింహాద్రి
సాక్షి, హైదరాబాద్: సమాజ్వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో సోమనబోయిన రామలింగయ్య, భద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా సింహాద్రి జన్మించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు నల్లగొండలో, పీజీ, పీహెచ్డీ ఉస్మా నియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. 35 ఏళ్ల పాటు ఓయూలో ఫ్రొఫెసర్గా పని చేశారు. 30 ఏళ్ల నుంచి అనేక సామాజిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమంపై 1996 నుంచి ప్రొఫెసర్ జయశంకర్తో కలసి అనేక పుస్తకాలు రాశారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రోడ్డు మ్యాప్ రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించారు. ఓబీసీ స్థితిగతులపై అనేక పరిశోధనలు చేయడమే కాకుండా, పుస్తకాలూ ప్రచురించారు. ‘మండలి ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి–రాజకీయాలు’ వంటి సమకాలిన అంశాలపై పుస్తకాలు రాశారు. ఓబీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement