-
అమెరికా నుంచి వచ్చి.. యువతిని వేధించిన సీఈఓ
హైదరాబాద్: తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్పేట సంస్థ)లో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్లో ఇండియాకు వచి్చన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సరీ్వసెస్ డ్యూస్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై.. సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, మీర్పేట్, చాదర్ఘాట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, పంజాగుట్ల, బంజారాహిల్స్, గోషామహల్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హబీబ్నగర్, రాయదుర్గం, అప్జల్గంజ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #HyderabadRains pic.twitter.com/IUaeFxv27c — pala hanmi reddy (@hanmireddy) November 23, 2023 @Hyderabadrains it's raining heavily at Raidurgham pic.twitter.com/druN8puIqC — Varun sam (@Varunsam007) November 23, 2023 Heavy rainfall in Hyderabad 🌧#HyderabadRains pic.twitter.com/o93Rq09eGp — Irfan Khan (@IrfanKhanhyd) November 23, 2023 -
అమీర్పేట్లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
HYD: పక్కనే బాయ్స్ హాస్టల్.. బాత్రూంలో ఉండగా వీడియో తీసి..
అమీర్పేట(హైదరాబాద్): మహిళ బాత్రూంలో ఉండగా వీడియో తీసిన యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం జనగాంలో అత్తగారింట్లో ఉండే ఓ గృహిణి ఎస్ఆర్నగర్ చిన్న గురుద్వారా వద్ద ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. శనివారం మధ్నాహ్నం ఆమె బాత్రూంకు వెళ్లగా.. పక్కనే శ్రీదేవి బాయ్స్ హాస్టలో ఉండే కిరణ్ అనే యువకుడు టెర్రస్పైకి ఎక్కి ఎగ్జాస్ట్ ఫ్యాను వద్ద సెల్ పెట్టి వీడియో తీశాడు. దీనిని గమనించిన మహిళ చుట్టు పక్కన ఉండే వారిని అప్రమత్తం చేయడంతో యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
అమీర్పేట్లో మల్టీప్లెక్స్ ప్రారంభించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అమీర్పేట్లో నిర్మించిన అత్యాధునిక మల్లీప్లెక్స్ను అల్లు అర్జున్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్ ఈ మల్టీప్లెక్స్లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టికెట్స్ భారీస్థాయిలో బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్ను నిర్మించాడు. తాజాగా అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇప్పటికే హైదరాబాద్లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్ను నడిపిస్తున్నాడు బన్నీ. Nizam king 👑 🔥 @alluarjun #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/NkM10Nzqn8 — AlluArjun Celebrations (@AA_CELEBRATIONS) June 15, 2023 ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం! ) the magnificent Grand Inauguration of #AAACinemas today graced by our beloved Icon Star, @alluarjun, and esteemed Minister @YadavTalasani Garu!@alluarjun Don't forget to use the hashtag #AAACinemasLaunch all day long to be a part of the excitement! 👍 pic.twitter.com/xKqnpNIi1C — AAA cinemas (@aaa_cinemas) June 15, 2023 -
AAA Cinemas Images: అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
AAA Cinemas Photos In HD: బన్నీ మల్టీప్లెక్స్లో అన్నీ ప్రత్యేకతలే.. చూస్తే వావ్ అనాల్సిందే (ఫోటోలు)
-
Hyderabad: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి పేరుతో రూ.6 లక్షలు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.6 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుల్తాన్నగర్కు చెందిన యువతికి మ్యాట్రిమోనీ ద్వారా అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ పరిచయం ఏర్పడింది. తనకు వివాహం అయ్యిందని.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. అతడి మాటలు నమ్మి సదరు యువతి అతడితో పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.15 లక్షలు కావాలని చెప్పడంతో రూ.6 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్కు భార్యాపిల్లలు ఉన్నట్లు తెలియడంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. రోడ్లపై ప్రయాణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాలను పక్కన పెట్టారు. ఆర్టీసీ బస్సుల్లోనూ పయనించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. గురువారం మాత్రం సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించినట్లు అంచనా. ఉదయం 8 గంటల నుంచే మెట్రో రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి నడుస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు వేసవి కారణంగా సొంత వాహనాల కంటే మెట్రో రైళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రద్దీ గంటలుగా భావించే ఉదయం 8 నుంచి 10 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొద్ది రోజులుగా అన్ని వేళల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటుంది. రెండు కారిడార్లలోనే ఎక్కువ.. నాగోల్ నుంచి అమీర్పేట్ వరకు అక్కడి నుంచి రాయదుర్గం వరకు అన్ని ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అలాగే ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మీదుగా మియాపూర్ వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రం ప్రయాణికుల రాకపోకలు సాధారణంగానే ఉన్నాయి. మిగతా రెండు కారిడార్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటోంది. వివిధ స్టేషన్లలో కనీసం రెండు నుంచి మూడు మెట్రో రైళ్ల సామర్థ్యం మేరకు ప్రయాణికులు ఎదురు చూస్తుండగా ఒక్క రైలు మాత్రమే అందుబాటులోకి వస్తోంది. దీంతో మెట్రో ఆక్యుపెన్సీకి మించిన ప్రయాణికులతో రైళ్లు నడుస్తున్నాయి. నగరంలోని మూడు కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయినా.. ప్రయాణికులకు పడిగాపులు తప్పడంలేదు. ట్రిప్పులు పెరిగితేనే ఊరట... ప్రస్తుతం ప్రతి 3 నుంచి 5 నిమిషాలకో రైలు చొప్పున నడుస్తున్నాయి. కానీ.. రద్దీ ఎక్కువగా ఉండే నాగోల్ –రాయదుర్గం రూట్లో 5 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులు ఒక వెల్లువలా వచ్చేస్తున్నారు. ఎల్బీనగర్– మియాపూర్ రూట్లోనే అదే పరిస్థితి. రైళ్ల వేగాన్ని పెంచి ప్రతి 2 నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉండేలా నడిపితేనే మరిన్ని ట్రిప్పులు పెరిగి ప్రయాణికులకు ఈ వేసవిలో ఊరట లభించే అవకాశం ఉంది. ఆ దిశగా హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాచరణ చేపడితే వేసవి తాపం నుంచి కొంత మేరకు ఉపశమనం లభించనుంది. Here a the answer. When you will increase the coaches? #hyderabadmetro @KTRBRS @TelanganaCMO @NVSReddyIRAS pic.twitter.com/4GkAYW4iE4 — Vishnu Vardhan (@vishnuremidi) April 20, 2023 -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, యూసుఫ్గూడ రోడ్, మైత్రివనం, అమీర్పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్పల్లి జంక్షన్, తాడ్బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్గూడ రోడ్, మైత్రివనం, అమీర్పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
Hyderabad Metro: సాంకేతిక లోపంతో నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు. మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
అమీర్పేట్లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. త్వరలోనే ప్రారంభం
సినిమాలతో పాటు బిజినెస్లపై కూడా దృష్టిపెట్టారు మన స్టార్ హీరోలు. ఎంతోమంది హీరోలు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ఏషియన్ గ్రూప్తో కలిసి ఏఎంబీ మాల్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్సు రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ అల్లు అర్జున్ పేరిట హైదరాబాద్ అమీర్పేటలో భారీ మల్టీప్లెక్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కూడా పూర్తయ్యి, ఓపెనింగ్కి ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్సును ప్రారంభించనున్నారు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని తల్లిదండ్రులు మందలించి ఇంటికి తీసుకురాగా మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బోరబండలో జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని ఇందిరానగర్కు చెందిన బి.లక్ష్మయ్య,నాగలక్ష్మిల కూతురు హేమలత (19) నల్గొండకు చెందిన వరుణ్కు ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న పెళ్లి చేసుకుంది.అదే రోజు అక్కడి పోలీసులు హేమలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు నల్గొండకు వెళ్లి పోలీసుల సమక్షంలో కూతురికి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం హేమలత నాయనమ్మ యాదమ్మ ఇంటి బయటకు కూర్చుని ఉండగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన యాదమ్మ కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా వచ్చి చూసేసరికి యువతి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. చదవండి: (భర్త కాదు.. మృగం.. భార్యను కత్తితో పొడిచి హత్య) -
HYD: కొంప ముంచిన వీడియో కాల్.. యువతి అందచందాలకు ఫిదా అయిపోయి..
సాక్షి, హైదరాబాద్: పరిచయం లేని అందమైన అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్కు బుట్టలో పడ్డాడు నగరానికి చెందిన పేరుమోసిన వ్యాపారవేత్త. ఇద్దరిమధ్యా చనువు పెరిగి ఒకరికొకరు వీడియో కాల్స్లో నగ్నంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని సైబర్నేరగాళ్లు బెదిరింపులకు దిగడంతో లక్షలు ముట్టజెప్పి న్యాయం కోసం సిటీ సైబర్క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. అమీర్పేటలో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారవేత్తకు అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయగా..ఇద్దరూ హాయ్ అంటూ మెసేంజర్లో పలకరించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరూ వాట్సప్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయమైన గంటలోనే యువతి వాట్సప్ నంబర్కు వీడియో కాల్ చేసి తన అందచందాలను చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో వ్యాపారవేత్త రెండు అడుగులు ముందుకేశాడు. మరుసటి రోజు ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. సుమారు నిమిషన్నర్ర నిడివిగల న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకున్న యువతి వ్యాపారవేత్తపై బ్లాక్మెయిల్కు ఒడిగట్టింది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యాపారవేత్త వీడియో బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో..వారు అడిగిన విధంగా పలు దఫాలుగా రూ.9లక్షలు సమర్పించాడు. ఇంకా అడుగుతూ బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రెండు రోజుల్లోనే జరగడం విశేషం. చదవండి: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి! -
మెట్రో స్టేషన్లో యువకుడి వికృత చేష్టలు.. లిఫ్ట్ ఎక్కి.. బట్టలు విప్పి
సాక్షి, హైదరాబాద్: అమీర్పేట మెట్రో స్టేషన్ లిఫ్ట్లో ఒంటరిగా వెళ్లే మహిళల ఎదుట వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్కు చెందిన ఓ మహిళ మంగళవారం షాపింగ్ చేసేందుకు అమీర్పేటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు అమీర్పేట చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మెట్రో స్టేషన్ లిఫ్ట్ ఎక్కింది. వెనకాలే వచ్చిన ఓ యువకుడు లిఫ్ట్లోకి ఎక్కాడు. బట్టలు విప్పి వికృత చేష్టలు చేయడాన్ని గమనించిన ఆమె భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి మెట్రో సెక్యూరిటి సిబ్బందికి తెలిపింది. సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఒడిషాకు చెందిన రాజుగా గుర్తించారు. సోమవారం నగరానికి వచ్చిన అతను ఉదయం నుంచి లిఫ్ట్లో ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ప్రయాణికులకు ఊరట.. లష్కర్లో మినీ బస్సులు టికెట్ రూ.5 -
పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అట్లూరి వారి గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటి అనుశ్రీ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఉంటోంది. ఫిట్నెస్ కోసం గతేడాది కల్యాణ్నగర్లోని ఏ–1 డాన్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్లో చేరింది. నిర్వాహకుడు అన్వేష్ ప్రపోజ్ చేయడంతో అంగీకరించింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించిన అన్వేష్ వేరే యువతితో చనువుగా ఉండటాన్ని గమనించిన అనుశ్రీ అతడిని నిలదీయగా మరోసారి అలా చేయనని చెప్పడంతో ఊరుకుంది. ఈ క్రమంలో ఓ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నానని రూ.10 లక్షలు అవసరముందనడంతో అనుశ్రీ డబ్బులు ఇచ్చింది. ఓ రోజు వచ్చి పెళ్లి ప్రస్తావన తీయడంతో ఇప్పుడే చేసుకుందామని స్టూడియోలోనే దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా అన్వేష్ యువతులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించి మరోసారి గట్టిగా నిలదీయగా నువ్వు నా స్టూడియోకు రావొద్దని హెచ్చరించడంతో తనుశ్రీ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..) -
కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు
సాక్షి, అమీర్పేట: కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావునగర్లో ఉంటున్న కర్నూల్కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. నన్ను అడగడానికి నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
Hyderabad: అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి... ఇంట్లోనే సన్నిహితంగా
సాక్షి, అమీర్పేట: అద్దె ఇల్లు కావాలంటూ వచ్చిన ఓ యువజంట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఎస్ఆర్నగర్లో సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఉదయం ఓ యువతి, యువకుడు ఇల్లు అద్దెకు కావాలని యజమాని వద్దకు వచ్చారు. లోపల ఇంటిని చూసేందుకు రెండో అంతస్తుకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో యజమాని పైకి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారి పోయారు. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చదవండి: (భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..?) -
ఓయోలో వ్యభిచారం.. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకొచ్చి..
సాక్షి, అమీర్పేట: ఓయో హోటల్ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బల్కంపేట ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్లో ఉన్న ఓయో రూమ్లో వ్యభాచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు. రమేష్ను విచారించగా తాను జనార్దన్ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్లోని విద్యుత్ టవర్స్లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్ను అరెస్టు చేశారు. జనార్దన్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్ మీరా, కో ఆర్టినేజర్ తిరుమల్రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ.. -
తనను కాదని.. మనువాడిందని కత్తితో దాడి
అమీర్పేట: తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(35)కి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎర్రగడ్డ బి.శంకర్లాల్నగర్లో ఉండేవారు. తొలి కాన్పులో ఆమెకు కుమారుడు, రెండోసారి కూతురు జన్మించారు. కూతురు పుట్టిందనే నెపంతో 2009లో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల కొడుకు, కూతురితో కలిసి నగరంలోనే ఉంటోంది. 2016లో సుల్తాన్నగర్లో ఉండే సైకిల్ మెకానిక్ సయ్యద్ ఖలీల్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో 2017లో బి.శంకర్లాల్నగర్కు చెందిన చెఫ్ శ్రీశైల్ కోట్ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ విషయం ఖలీల్కు తెలియడంతో ఆమెపై ఖలీల్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎర్రగడ్డ సంతలో మూడు కత్తులను కొనుగోలు చేసి గౌతంపురి కాలనీలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. క్షతగాత్రురాలిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా..
సాక్షి, అమీర్పేట: శుభకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో కలిసి ఓ మహిళ దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అసభ్యకరంగా కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీసుల సమాచారం మేరకు.. వెంగళరావునగర్లో ఉండే ఓ గృహిణి భర్తతో కలిసి ఇటీవల జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైంది. అక్కడికి సమీప బంధువైన కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా రావడంతో పక్కపక్క కూర్చుని ఫొటోలు దిగారు. అయితే కొందరు వ్యక్తులు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆడియోలోఅసభ్యకరమైన కామెంట్లు పెట్టి ఫేస్బుక్, యూట్యూబ్లో పోస్ట్ చేశారు. దీంతో సదరు మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు. చదవండి: Hyderabad: చిట్టీల పేరుతో అధిక వడ్డీ.. రెండు కోట్లతో ఉడాయించింది చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి.. -
అమీర్పేట: మెట్రో స్టేషన్పై నుంచి దూకిన యువతి
హైదరాబాద్: హైదరాబాద్లోని అమీర్పేట మెట్రో స్టేషన్ పై నుంచి ఒక యువతి కిందకు దూకడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న మెట్రో అధికారులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగాను ఉంది. కాగా యువతి వయసు 18 సంవత్సరాలు అని తేలింది. అయితే ఆమె ప్రమాదవశాత్తూ జారిపడిందా లేక ఆత్యహత్యకు ప్రయత్నించిందా అన్నది తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని..
సాక్షి, మహేశ్వరం: నిశ్చితార్థం రద్దు కావడంతో ఓ యువతి ఉరివేసుకొని తనువు చాలించింది. రెండు కుటుంబాలు పట్టింపులకు వెళ్లడంతో మనస్తాపానికి గురైంది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహేశ్వరం సీఐ మధుసూదన్, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చామలేటి చంద్రయ్య, లావణ్య దంపతుల కూతురు ప్రగతి(19) డిగ్రీ వరకు చదువుకుంది. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) మండల పరిధిలోని అమీర్పేట్ గ్రామానికి చెందిన కార్తీక్తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఇరు కుటుంబపెద్దలు పట్టింపులకు పోవడంతో ఆదివారం దానిని రద్దు చేసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ప్రగతి, కార్తీక్కు ఇష్టం ఉన్నా నిశ్చితార్థం ఆగిపోవడంతో యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో చీరతో ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 6 గంటలకు ప్రగతిని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి ..వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. ప్రగతి ఫోన్ కాల్డేటాను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: హైదరాబాద్లో విషాదం: గాలిపటం ఎగురవేస్తూ..) -
అమీర్పేట్లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ
సాక్షి, హైదరాబాద్: అమీర్పేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమీర్పేట ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ప్రోటోకాల్ విషయంలో బీజేపీ -టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్పొరేటర్- మాజీ కార్పొరేటర్ అనుచరులు బాహాబాహీకి దిగారు. పోలీసులు సర్దిచెప్పినా గొడవ సద్దుమణగలేదు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన శిలా ఫలకంమీద పోట్రోకాల్ ప్రకారం కిషన్రెడ్డి పేరు ముందు వరుసలో లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తల పరస్పర నినాదాలతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
ఇత్తడిని పుత్తడిగా మార్చి.. హాల్మార్క్ గుర్తుతో కోట్లు దండుకున్నాడు
సాక్షి, అమీర్పేట: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారు నగల దుకాణాల్లో తాకట్టుపెట్టి ఓ వ్యక్తి రూ.కోట్లు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన నగల వ్యాపారులు తెలంగాణ, ఏపీ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్నగర్కు చెందిన వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు తయారు చేయించేవాడు. అనంతరం వాటికి బంగారు కోటింగ్ వేయించి, హాల్మార్క్ గుర్తుతో సహా నగర షాపులకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. ఇదే తరహాలో బోరబండ, రహమత్నగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. శుక్రవారం నకిలీ నగలతో బోరబండలోని ఓ నగల షాపునకు వెళ్లిన వెంకట్రెడ్డి వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి చేతిలో మోసపోయిన 18 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement