-
Lok Sabha Election 2024: ప్రత్యర్థులుగా తలపడ్డా... చెక్కు చెదరని స్నేహం
ఎన్నికల ప్రచారం అనగానే ప్రత్యర్థులపై, అవతలి పారీ్టపై విమర్శలు సహజం. చాలాసార్లు పరిస్థితి వ్యక్తిగతంగా తిట్ల దండకాల దాకా వెళ్తుంది. కానీ ప్రత్యర్థులిద్దరూ మంచి స్నేహితులైతే? 1952 తొలి లోక్సభ ఎన్నికల్లో అలాగే జరిగింది. స్నేహితులిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడ్డారు. ప్రచారం చేసుకున్నారు. అయినా మంచి స్నేహితులుగానే మిగిలారు. వాళ్లే ప్రముఖ కాంగ్రెస్ నేత విష్ణు గాడ్గిల్, పిజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ లీడర్ కేశవరావ్ జేఢే. సోషలిస్ట్ వెటరన్ బాబా అధవ్ ఆ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికాయనకు 22 ఏళ్లు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘గాడ్గిల్పై తిలక్ ప్రభావం ఎక్కువ. కాంగ్రెస్లో బ్రాహ్మణ శ్రేణి ప్రముఖునిగా ఉండేవారు. మరాఠ్వాడాకు చెందిన జేఢే బహుజన ఉద్యమ భాగస్వామి. జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్తో కలిసి పనిచేశారు. బ్రాహ్మణవాదానికి అతి పెద్ద విమర్శకుడు. 1920ల్లో వారిద్దరూ ప్రత్యర్థులు. స్వాతంత్య్రోద్యమంలో జైలుపాలయ్యాక మంచి స్నేహితులయ్యారు. దళితుల కోసం పార్వతి ఆలయాన్ని తెరవడానికి 1929లో అంబేడ్కర్ నడిపిన ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1934లో రెండు కేంద్ర అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. గాడ్గిల్ మద్దతుతో జేఢే 1938లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1947లో కాంగ్రెస్ను వీడి పీడబ్ల్యూపీని స్థాపించారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో పుణే సెంట్రల్ నుంచి గాడ్గిల్పైనే పోటీ చేయాల్సి వచి్చంది. ప్రత్యర్థులుగా మారినా ప్రచారంలో పరస్పర దూషణల వంటివి అస్సలుండేవి కాదు. ప్రసంగాలూ స్నేహపూర్వకంగానే సాగేవి. ఒక్కోసారి అభ్యర్థులంతా ఒకే వేదిక నుంచి ప్రచారం చేసేవారు. మొదట జేఢే, తరువాత గాడ్గిల్, చివరికి సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఎస్.ఎమ్.జోషి మాట్లాడేవారు. ఒకరినొకరు నిందించుకోలేదు. పారీ్టలను తిట్టుకోలేదు. కులపరంగా ఓట్లడగలేదు. కేవలం హామీలపైనే దృషి సారించి ప్రచారం చేశారు. గాడ్గిల్కు 102,692 ఓట్లు, జేఢేకు 42,200 ఓట్లొచ్చాయి’’ అని అధవ్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నెలకు రూ. 60 లక్షలు సంపాదిస్తున్న ‘పోహె వాలా’
నిజాయతీగా కష్టపడే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ‘పోహెవాలా’ ఫుడ్ స్టార్టప్ వ్యవస్థాపకులు, మహారాష్ట్రకు చెందిన చాహుల్ బల్పాండే, పవన్ వాడిభాస్మే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. చాహుల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక, పవన్ ఎంబీఏ డిగ్రీ అందుకున్నాక ఒక కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. సదరు కంపెనీ వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రతి నెలా డబ్బుకు ఇబ్బంది ఎదురయ్యేది. దీంతో వారిద్దరూ పగటిపూట అదే ఆఫీసులో పనిచేస్తూ, రాత్రి పూట నాగపూర్లో పోహె విక్రయాలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వీరు తయారు చేసే పోహెకు ఆహార ప్రియుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో వీరిద్దరూ 2018లో తమ ఉద్యోగాలను వదిలేసి, పూర్తిస్థాయిలో పోహె విక్రయాలు ప్రారంభించారు. వీరు తమ బ్రాండ్కు ‘పోహె వాలా’ అనే పేరు పెట్టారు. అనంతరం అనేక రకాల పోహెలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం ఆరు సంవత్సరాలలో, వారు దేశంలోని 15 నగరాల్లో తమ అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రస్తుతం పవన్, చాహుల్ ప్రతి నెలా రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తున్నారు. చాహుల్, పవన్లు ఫుడ్ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు తొలుత రాత్ర వేళ చిన్నగా పోహె విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడంతో పాటు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారనేది గ్రహించారు. 2018 మేలో వీరు నాగ్పూర్లో తమ పోహె వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోహె విక్రయించేవారు. ఇది వారికి మార్కెట్పై లోతైన అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యాపారం సాగిస్తున్న వీరు మొత్తం 13 రకాల పోహెలను తయారు చేస్తుంటారు. ఆర్గానిక్ పోహె అమ్మకాలు ప్రారంభించినది కూడా వీరే కావడం విశేషం. నేడు పోహెవాలా బ్రాండ్ పనీర్ పోహె, ఇండోరి పోహె, నాగ్పూర్ స్పెషల్ తారీ పోహె, చివ్దా పోహె, మిశ్రా పోహె చాలా ప్రసిద్ధి చెందాయి. ఒక ఇంటర్వ్యూలో చాహుల్ బాల్పాండే మాట్లాడుతూ నిజానికి ఏ వ్యాపారానికీ హెచ్చు తగ్గులుండవని, వ్యాపారం విజయవంతం కావడానికి వినూత్న ఫార్ములా, నాణ్యత, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరమని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సరైన వ్యూహాన్ని రూపొందించడం ముఖ్యమన్నారు. వీరు ‘పోహెవాలా’కు సొంత వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. దీని సాయంతో ఆన్లైన్లోనూ పోహె విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
Galentines Day: ఇది ఎవరు, ఎపుడు జరుపుకుంటారో తెలుసా?
గాలెంటైన్స్ డే 2024. వాలెంటైన్స్ డే గురించి అందరికీ తెలుసు. లవ్బర్డ్స్ వారం రోజుల పాటు సంబరాలు చేసుకుంటారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే అంటూ రోజులు గడిచిపోయాక ఎనిమిదో రోజు ఫిబ్రవరి 14న వాలెండైన్స్ డేగా జరుపుకుంటారు. మరి గాలెంటైన్స్ డే గురించి తెలుసా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న, "లేడీస్ సెలబ్రేటింగ్ లేడీస్" కోసం గాలెంటైన్స్ డేని జరుపుకుంటారు. స్నేహితురాళ్లు ప్రేమపూర్వ బహుమతులను ఇచ్చిచ్చుకుంటారు ఇది మీ స్నేహితురాళ్ళతో ప్రేమతో పాటు కొన్ని బహుమతుతలో హ్యాపీగా గడిపే రోజు. మహిళా స్నేహితుల స్నేహాన్ని, ప్రేమను హైలైట్ చేయడానికి ఇలా ఒక నిర్దిష్ట రోజును కేటాయించారు. గాలెంటైన్స్ డేని లెస్లీ నోప్ ప్రాచుర్యంలోకి తెచ్చారు. గాలెంటైన్స్ డే అనేది అమెరికన్ సిట్కామ్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ రెండో సీజన్ 16వ ఎపిసోడ్లో ఆ రోజు గురించి ప్రస్తావన ఉంది. ఈ ఎపిసోడ్లో, లెస్లీ నోప్ (అమీ పోహ్లర్) వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు తన మహిళా స్నేహితుల కోసం తన వార్షిక గాలెంటైన్స్ డే పార్టీని ఏర్పాటు చేసింది. ఇది మహిళల సెలబ్రేషన్ రోజు. ఈ రోజును ఎలా గడుపుతారు అనేది మీరు మీ స్నేహితుల ఇష్టం! ఇది మీ రోజు అని నోప్ ప్రకటించారు. అప్పటినుంచి గాలెంటైన్స్ డే ప్రాచుర్యంలో వచ్చింది. ( Valentines day: లవ్బర్డ్స్తో, ప్రేమికుల పోలిక: ఈ ఇంట్రస్టింగ్ సంగతులు తెలుసా?) కరీనా నటాషా గాలెంటైన్స్ డే బాలీవుడ్ నటి కరీనాకపూర్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనావాలా మంచి బెస్టీలు, గత ఏడాది వీరిద్ద విలాసవంతమైన వింటర్ ఫ్యాషన్లో దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ ఏడాది గ్యాలెంటైన్స్ డే సందర్భంగా నటాషా ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అమేజింగ్ ఫోటోలను షేర్ చేసింది, National Women's Day ఎపుడు జరుపుకుంటారో తెలుసా? View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
అప్పు చెల్లించలేదని.. ఏసీపీ కుమారుడి హత్యచేసిన స్నేహితులు
న్యూఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో స్నేహితులే అతన్ని కుట్ర పన్ని అంతమొందించారు. పెళ్లికి తీసుకెళ్లి... తిరిగిరాని లోకాలకు పంపించారు. ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ యశ్పాల్ సింగ్కు 24 ఏళ్ల కుమారుడు లక్ష్య చౌహాన్ ఉన్నాడు.ఇతడు తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం తన స్నేహిలు వికాస్ భరద్వాజ్, అభిషేక్లతో కలిసి హర్యానాలోని సోనేపట్లో జరిగిన వివాహ వేడుకకు ముగ్గురు హారయ్యారు.. ఆ తర్వాత లక్ష్య చౌహాన్ తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన తండ్రి ఎసీపీ అధికారి యశ్పాల్ సింగ్ తన కుమారుడు మిస్సింగ్పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్యతో కలిసి కారులో వెళ్లిన స్నేహితుడు అభిషేక్నును అదుపులోకి తీసుకొచిన విచారించగా అసలు విషయం చెప్పాడు. వికాస్ భరద్వాజ్, లక్షయ్, తాను ముగ్గురం కలిసి కారులో సోనెపట్కు వెళ్లామని, వివాహం అనంతరం అదేరోజు రాత్రి ఇంటికి బయలుదేరామని చెప్పాడు. చదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కూలీలతో వెళ్తున్న ఆటో.. ముగ్గురు దుర్మరణం మార్గంమధ్యలో పానిపట్ దగ్గర మునక్ కాలువ వద్ద మూత్రవిసర్జన కోసం కారు ఆగినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా భరద్వాజ్, తాను కలిసి చౌహాన్ను కాలువలోకి తోసినట్లు పోలీసులకు చెప్పాడు. అనంతరం అదే కారులో వికాస్ తనని ఢిల్లీ సమీపంలోని నెరెలా వద్ద విడిచిపెట్టాడని తెలిపాడు. దీంతో కాలువలో గాలించి చౌహాన్ మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకున్నారు. నిందితుడు వికాస్ భరద్వాస్ కూడా తీస్ హజారీ కోర్టులోనే క్లర్క్గా పనిచేస్తున్నాడు. వికాస్ గతంలో లక్షయ్కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే లక్షయ్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో కక్ష పెంచుకున్న వికాస్ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మరో స్నేహితుడు అభిషేక్ను ఇందుకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201 కింద సెక్షన్లు నమోదు చేశారు. -
ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం
‘కాలంతో పాటు నడవాలి’ అంటారు పెద్దలు.‘కాలంతో పాటు నడుస్తూనే భవిష్యత్పై ఒక కన్ను వేయాలి’ అంటారు విజ్ఞులు. అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్... అనే ముగ్గురు మిత్రులు రెండో కోవకు చెందిన దార్శనికులు. లెర్న్ అండ్ ఎర్న్ ప్లాట్ఫామ్ ‘ఇంట్రాక్ట్’తో వెబ్3 వరల్డ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు... ఐటీఐ–దిల్లీలో చదువుకున్న అభిషేక్ అనిత, అపూర్వ్ కుషాల్, సంభవ్ జైన్ సంభాషణాల్లో సరదా విషయాల కంటే సాంకేతిక విషయాలే ఎక్కువగా చోటు చేసుకునేవి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? వివిధ దేశాల్లో ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు? ఏ రంగాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మన దేశంలో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు, ఇంటర్నెట్ అభివృద్ధిలో మూడు ప్రధాన దశలు, వెబ్3 టెక్నాలజీతో అపారమైన ఉద్యోగావకాశాలు...ఇలా ఒకటా రెండా బ్లాక్చైన్, క్రిప్టో టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. వారు మాట్లాడుకున్న విషయాలేవి వృథా పోలేదు.‘ఇంట్రాక్ట్’ ప్లాట్ఫామ్కు పునాదిగా ఉపయోగపడ్డాయి.ప్రజలకు బ్లాక్ చెయిన్, క్రిప్టో టెక్నాలజీని చేరువ చేయాలనే లక్ష్యంతో 2022లో ‘ఇంట్రాక్ట్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేశారు ముగ్గురు మిత్రులు. ‘వెబ్3 టెక్నాలజీకి సంబంధించి కేవలం సమాచార వేదికగానే కాకుండా ప్రతిఫలదాయక వేదికగా ఇంట్రాక్ట్ని నిర్మించాం. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అనేది ఇంట్రాక్ట్ లక్ష్యం. క్వెస్ట్, ఇంటరాక్టివ్ టాస్కుల ద్వారా బ్లాక్ చెయిన్, క్రిప్టో, వెబ్3 టెక్నాలజీతో యూజర్లను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్ అభిషేక్.సంక్లిష్టమైన రీతిలో కాకుండా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ పద్ధతిలో కొత్త ప్రాడక్టులు, సర్వీసులను యూజర్లకు పరిచయం చేయడంలో ‘ఇంట్రాక్ట్’ విజయం సా«ధించింది. టాస్క్లను విజయవంతంగా పూర్తి చేసిన యూజర్లకు క్రిప్టో, ఎన్ఎఫ్టీ, లాయల్టీ పాయింట్స్ రూపంలో ప్రోత్సాహకాలు’ అందిస్తోంది. ఎన్నో కలలతో ముగ్గురు మిత్రులు ‘ఇంట్రాక్ట్’ను ప్రారంభించారు. ఆ కలలకు కష్టాన్ని జోడించారు. ఆ కష్టం వృథా పోలేదు. లక్షలాది యూజర్లతో ‘ఇంట్రాక్ట్’ వెబ్3 వరల్డ్లో కీలక పాత్ర పోషిస్తూప్రాఫిటబుల్ ప్లాట్ఫామ్గా ఎదిగింది. ‘ఇంట్రాక్ట్’ ఇన్వెస్టర్లలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, గుమీ క్రిప్టోస్, ఆల్కెమీ, మూన్ పే, వెబ్ 3 స్టూడియోస్, కాయిన్ బేస్...మొదలైన కంపెనీలు ఉన్నాయి. సమీకరించిన నిధులలో కొంత మొత్తాన్ని తమ టీమ్ సభ్యుల సంఖ్యను రెట్టింపు చేయడానికి, సాంకేతిక అవసరాలకు ఉపయోగించారు. సాధించిన విజయంతో సంతృప్తి పడడం లేదు ముగ్గురు మిత్రులు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వెబ్3 టెక్నాలజీపై మార్కెటింగ్ నిపుణులు, కంపెనీల ఫౌండర్లు దృష్టి పెట్టారు. మరో వైపు ఉద్యోగావశాలు లేదా ఆవిష్కరణల కోణంలో యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీగా ఎన్నో కంపెనీలు మార్కెట్లోకి రావచ్చు. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లాలంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాల గురించి ఆలోచించాలనేది ముగ్గురు మిత్రులకు తెలియని విషయం కాదు.‘వెబ్3 క్రియేట్ చేసిన సరికొత్త ఆర్థిక అవకాశాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థల గురించి పరిచయం చేసి యూజర్లకు ఉపయోగపడాలనేది మా లక్ష్యం’ అంటున్నాడు సంస్థ కో–ఫౌండర్, సీయీవో సంభవ్ జైన్. -
Niharika Konidela: సీక్రెట్ సాంటాగా మెగా డాటర్.. ఫ్రెండ్స్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Anupama Parameswaran : ఫ్రెండ్స్తో ట్రిప్కు చెక్కేసిన కేరళ కుట్టి (ఫోటోలు)
-
మద్యం మత్తు.. సిమ్మింగ్ పూల్లో పడి యువకుడి మృతి
అచ్యుతాపురం(అనకాపల్లి): మద్యం మైకంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో తోటి స్నేహితుని మరణానికి కారణమయ్యాడు మరో స్నేహితుడు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొండకర్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో శనివారం రాత్రి స్విమ్మింగ్ పూల్లో పడి విజయనగరానికి చెందిన సాయివర్మ అనే యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది స్నేహితులు కొండకర్లలో ప్రైవేట్ రిసార్టులో శనివారం సందడి చేశారు. స్నేహితుల్లో కొందరు మద్యం సేవించి స్విమ్మింగ్ పూల్ వద్ద నృత్యాలు చేశారు. ఆ సమయంలో సాయివర్మను మరో స్నేహితుడు సిమ్మింగ్ పూల్లోకి తోసేశాడు. నీటిలో పడిపోయిన సాయివర్మకు ఈత రాకపోవడమో లేక మద్యం మత్తు కారణమో గానీ కొంత సేపటికి స్విమ్మింగ్ పూల్లో తేలిపోయాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సాయివర్మను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత అతిగా మద్యం సేవించడం వల్లే నీటిలో మునిగి చనిపోయాడని భావించినప్పటికీ సీసీ ఫుటేజ్ దృశ్యాలను చూసిన తర్వాత పోలీసులు ఘటనకు కారణాన్ని గుర్తించారు. పార్టీలో ఎంజాయ్ చేస్తూ స్నేహితుడే సాయివర్మను నీటిలోకి తోసేసినట్టు గుర్తించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటన కాదని భావించిన పోలీసులు సాయంత్రం తర్వాత కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇక్కడి రిసార్ట్లో గతంలోనూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకొన్న తర్వాత ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు. అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి సీసీ ఫుటేజ్లు లేకపోవడంతో కేసు తీవ్రత గుర్తించలేకపోయారు. తాజా ఘటనతో కొండకర్ల పరిసరాల్లో జరిగే పార్టీలపై నిఘా పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
స్నేహితులతో గడపాలని భార్యకు నరకం
కర్ణాటక: తన ముగ్గురు స్నేహితులతో లైంగిక క్రియలో పాల్గొనాలని ఓ కిరాతక భర్త భార్యను వేధించాడు, దిగ్భ్రాంతికి గురైన ఆమె బెంగళూరు అమృతహళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు... స్థానికంగా ఉంటున్న బాధిత యువతికి 2007 మే 10 తేదీన మంగళూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వారికి కొడుకు, కూతురు పుట్టారు. దంపతులు మంగళూరులో కాపురం ఉంటున్నారు. భర్త ఇంట్లో చిన్నపాటి విషయాలకు కూడా రచ్చ చేసేవాడు. చీటికి మాటికి వేధించేవాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. వాట్సాప్ చాటింగ్ గుట్టురట్టు భర్త ఐఫోన్తో పిల్లలు ఆడుకుంటు ఉండగా, ఆమె అందులోని వాట్సాప్ చాటింగ్ చూసి నివ్వెరపోయింది. బాబు, అనంతకుమార్, వీరేంద్ర అనే ముగ్గురితో అసభ్యకరంగా చాటింగ్ చేశాడు, పైగా వారితో శారీరక సంబంధం ఉందని, అతడు గే అని గుర్తించింది. పలువురు సెక్స్వర్కర్లతో చాటింగ్ కనిపించింది. దీనిపై భర్తను నిలదీయగా అతడు.. నా ఇష్టం, ఏమైనా చేస్తా, దీనిపై ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానని బెదిరించి కొట్టాడు. నిన్ను పిల్లలను పైసా కూడా ఇవ్వకుండా బయటకు గెంటేస్తానని హెచ్చరించాడు. తల్లిదండ్రులతో మొరపెట్టుకోవగా వారు అతనికి బుద్ధి మాటలు చెప్పినా ఫలితం లేకపోయింది. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేయడంతో ఆమె బెంగళూరులో పుట్టింటికి వచ్చేసింది. చివరకు పెద్దలు పంచాయతీ చేయగా, బెంగళూరులో ఆర్ఎంజెడ్ ల్యాటిట్యూడ్లో ఫ్లాట్ కొని అక్కడికి తీసుకెళ్లాడు. నా స్నేహితులు వస్తుంటారు, వారితో పడుకోవాలని ఆమెకు చెప్పాడు. ఆమె గొడవచేయడంతో మానసికంగా, శారీరకంగా హింసించాడని, చంపేస్తానని వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసుకున్న అమృతహళ్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ యుగేంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నారపల్లికి చెందిన వారణాసి తరుణ్(24) తన స్నేహితుడు డీకొండ నితిన్తో కలిసి ఆదివారం బీబీనగర్లో ఉంటున్న మరో స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. స్నేహితుడిని కలిసిన తర్వాత తరుణ్, నితిన్ కలిసి బీబీనగర్ మండలంలోని వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. తరుణ్, నితిన్ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. తరుణ్ చెరువులోరాళ్ల మధ్యన ఇరుక్కపోయాడు. నితిన్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తరుణ్ కోసం గాలింపు చర్యలు ఆచూకీ లభించలేదు. సోమవారం చెరువులో తరుణ్ మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరుణ్ ముఖంపై గాయాలు ఉండడంతో నితిన్పై అనుమానం ఉన్నట్లు మృతుడి తండ్రి గోవిందాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్లో కుమ్మేశారు..!
పెళ్లిలో వధువు లేదా వరుని స్నేహితుల డ్యాన్సులు చాలా ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్గా ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. స్నేహితురాల్ని సర్ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. View this post on Instagram A post shared by Betty Who (@bettywho) వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్ని ప్లే చేశారు. ఆ ట్యూన్కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు. ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను సంగీతకారుడు బెట్టీ హూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో అమెరికన్ గాయకుడు స్కాట్ హోయింగ్, కొరియోగ్రఫీ జంట ఆస్టిన్, మారిడెత్లను ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. వేదికపై డ్యాన్సులు చేసిన వారి వేషధారణ చాలా బాగుందని కొందరు నెటిజన్లు స్పందించారు. ప్రోఫెషనల్ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. బ్లాక్ పింక్ డ్యాన్స్కు ఫిదా అయినట్లు స్పందించారు. ఇదీ చదవండి: బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్తో చేయించిన సాఫ్ట్ టాయ్స్లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు
Uber Group Rides feature క్యాబ్సేవల సంస్థ ఉబెర్ తనయూజర్ల కోసంకొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. 'గ్రూప్ రైడ్స్' అనే కొత్త ఫీచర్ను (ఆగస్టు 22న) ఇండియాలో ప్రారంభించింది. దీని ప్రకారం ఒకే చోటుకు వెళ్లాల్సిన వేరు వేరు స్థానాల్లో ఉన్న యూజర్లకు ప్రయోజనం లభించనుంది. దీని ద్వారా గరిష్టంగా మరో ముగ్గురు వ్యక్తులతో ట్రిప్ షేరింగ్ ఆప్షన్ కల్పిస్తోంది. అంతేకాదు ఈ ఫీచర్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కూడా తోడ్పడనుందని ఉబెర్ వెల్లడించింది. గ్రూప్ రైడ్స్ ఫీచర్ ఈ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్ను ఉపయోగించే రైడర్లు తమ ఛార్జీలపై 30 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ కంపెనీ తెలిపింది. (ఖచ్చితమైన తగ్గింపు వారు ఎంత మంది వ్యక్తులతో ఛార్జీలను పంచుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.) తమ ట్రిప్ వివరాలను మెసేజింగ్ యాప్ల ద్వారా పోస్ట్ చేయడం ద్వారా రైడ్ కోసం స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు. వీరు ట్రిప్లో చేరిన తర్వాత వారి స్వంత పికప్ స్థానాలను యాడ్ చేయవచ్చు. ఆ స్థానాలు రైడ్ రూట్లో అప్డేట్ చేసుకోవచ్చని ఉబెర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంతో పాటు, మరింత డబ్బు ఆదాతో పాటు, ఇబ్బంది లేని ప్రయాణాన్నిఅందించేలా ఈ ఫీచర్ కస్టమర్లకు అవకాశాన్ని కల్పిస్తుందని ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ తెలిపారు. తద్వారా రోడ్డుపై వాహనాలను తగ్గించే అవకాశం రైడర్లకు కలుగుతుందన్నారు. ఈ ఫీచర్ ఎలా వాడాలి? ఉబర్ యాప్ను అప్డేట్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి 'Services' ట్యాబ్ను ఎంచుకొని అందులో 'Group Rides' పై క్లిక్ చేయాలి. ఇక్కడ పికప్ లొకేషన్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత నిర్దేశిత రైడర్లను (స్నేహితులను) ఎంచుకొని రైడ్లో జాయిన్ అవ్వమని వాట్సాప్ లింక్ సెండ్ చేస్తే చాలు. యాడ్ అయిన లొకేషన్ వివరాలు రైడ్లో యాడ్ అవ్వడంతోపాటు, ఈ సమాచారం డ్రైవర్కు కూడా అందుతుంది. -
స్నేహితుడిని కలిసేందుకు వెళ్తూ..
సంగారెడ్డి: బైక్, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన చేగుంట శివారులోని మక్కరాజీపేట బైపాస్ బ్రిడ్జి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామయంపేట మండలం జాన్సిలింగాపూర్కు చెందిన టాకూర్ బాలాజీసింగ్(32), కోళ్ల రవితేజ(20) బైక్పై హైదరాబాద్కు వెళ్తున్నారు. చిన్నశివునూర్ శివారు నుంచి వస్తున్న కంటైనర్, బైక్ మక్కరాజీపేట బైపాస్బ్రిడ్జి సమీపంలో 44వ నంబర్ రహదారిపై ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలాజీసింగ్, రవితేజలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రకాశ్గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలాజీసింగ్ కూలీ పనులు చేసుకునేవా డు కాగా, రవితేజ ఉపాఽధి హామీ పనులతోపాటు ఇతరేతర పనులు చేసుకునేవాడు. వీరిద్దరూ హైదరాబాద్లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందారు. వీరి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరి ఆలోచనో అది!..'స్నేహితుల బెంచ్'
నిన్న మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను చాలా రోజుల తరువాత. వాడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది. నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ "ఎరా , మీ స్కూల్లో ఇదొక్కేటేనా బెంచి కూర్చోవడానికి" "కాదు తాతగారు, ఆ బెంచ్ 'స్నేహితుల బెంచి' అన్నాడు నా మనవడు నాతో. నేను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా ? " నా మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాతాగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి, వాళ్ళతో జతకట్టడానికి, స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి , ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు. నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన ఎవరిదో కానీ అనుకుని , మావాడిని అడిగాను "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?" "కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నాతో నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు. "నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు" అన్నాడు . ఓ నిముషం ఆగి "ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్లు మూడో నాలుగో తరగతి పిల్లలైనా కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తే బావుంటుంది తాతయ్య, వాళ్లెప్పుడు కనిపించినా అన్నయ్యా అంటూ నా దగ్గరకు పరుగెత్తుకువచ్చి పలకరిస్తారు" తరువాత వాడు వాడి క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. నేను చేరిన కొత్తలో మా టీచర్ పిల్లందరిని క్లాస్ ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు నేనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు. ఎంతో బెంగగా అనిపించింది స్నేహితులు లేకపోవడం అప్పుడు. ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి , జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది. నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాను నేను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరు లేరు. ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో. --సుబ్రమణ్యం వల్లూరి (చదవండి: డెత్ మిస్టరీ.. ఆరోజు ఏం జరిగింది? ఇప్పటికీ సమాధానం లేకుండానే..) -
30 ఏళ్ల క్రితం ఇండియా ఇలానే ఉండేది..ఇప్పుడు కావలసింది అవే..
పేపర్ తెరిస్తే ఘోరమైన వార్తలు. రక్త సంబంధాల మధ్య కూడా కక్షలు, కార్పణ్యాలు. మానవ సంబంధాలపై విశ్వాసం పోయేలా సంఘటనలు.ఇటువంటి సమయంలో ఒక ట్విటర్ పోస్ట్ చాలామందికి హాయినిచ్చింది. ‘గాయత్రీ... ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తన పొరుగింటివారు వాట్సప్ మెసేజ్ పెట్టినసంగతిని మైసూర్కు చెందిన ఒక మహిళ షేర్ చేస్తూ తమ కాలనీలో అందరూ ఎంత స్నేహంగా ఉంటారో చెప్పింది. ‘ముప్పై ఏళ్ల క్రితం ఇండియా ఇలాగే ఉండేది’ అని అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఏం... ఇప్పుడు ఎందుకు అలా ఉండకూడదు? నిజమే. పక్కింటి పాప తలుపు తట్టి ‘బీరకాయ కూర చేసింది అమ్మ. ఇచ్చి రమ్మంది’ అని చెప్తే చాలా బాగుంటుంది. ‘గడి ముందుకేసి కూరగాయలకు వెళుతున్నా. కాస్త చూస్తుండక్కా’ అని ఎదురింటి వాళ్లతో అంటే ‘అదేం భాగ్యం. వెళ్లిరా’ అని సొంతింటి కన్నా ఈ ఇంటి పైనే దృష్టి పెట్టే వాళ్లు దొరికితే మరెంతో బాగుంటుంది. ఇలా ఉండటానికే మనుషులు ఇష్టపడేవాళ్లు. కాని ఇప్పుడు ఇలా ఉండటం ‘భాగ్యం’ అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. మైసూర్లో ఒక కాలనీ ‘గాయత్రి. ఇడ్లీలు చేశా. ఇంటికి రా’ అని తనకు వచ్చిన మెసేజ్ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ ‘మా కాలనీలో అంతా ఇలాంటి స్నేహమే’ అని గాయత్రి జయరామన్ అనే మైసూర్ జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. 20 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్న గాయత్రి ‘హూ మి, పూర్’ అనే పుస్తకం రాసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే గాయత్రి పక్కింటావిడ ఇడ్లీలకు పిలవడంతో సంతోషపడి తన కాలనీ స్నేహాలన్నీ ట్వీట్లుగా రాసింది. ‘యోగా సెంటర్కు రాపిడో బుక్ చేద్దామని ఇంటి బయట నిలబడతానా... ఎవరో ఒకరు దింపడానికి వస్తారు. నా కుక్కపిల్ల నేను బయటికెళ్తే గోల చేస్తుంది. నేను ఇంట్లోనే ఉన్నాననే భావన కలిగించడానికి తలుపు తెరిచి పెట్టి పనుల కోసం బయటకు వెళితే మా కాలనీలో అందరూ కాపలా కాసేవాళ్లే. ఒక రోజు ఒకావిడ బిసిబేలాబాత్ పంపుతారు. నిన్న ఒకామె సాంబార్ పంపింది. మా కాలనీలో ఒకరి గిన్నెలు మరొకరి వంట గదిలో ఉండటం మామూలే. ఇలాంటి స్నేహాలతో మేమంతా ఉండటం సంతోషంగా ఉంది’ అని రాసింది. దాంతో చాలామంది కనెక్ట్ అయ్యారు. ‘మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు అందరం ఇలాగే ఉండేవాళ్లం’ అని ఒకరు రాస్తే ‘మైసూర్లో అందరూ ఇలా ఉండొచ్చు. బెంగళూరులో ఈ వాతావరణం మిస్ అవుతున్నాను’ అని మరొకరు రాశారు.‘ముప్పై ఏళ్ల క్రితం అందరూ ఇలా ఉన్నవాళ్లే. ఇప్పుడెక్కడ’ అని మరొకరు బాధ పడ్డారు. ‘లాక్డౌన్ సమయంలో కొంతకాలం మాత్రం ఇలా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఎవరి గుహల్లోకి వాళ్లు వెళ్లిపోయారు’ అని మరొకరు రాశారు. ఇరుగు పొరుగుతో స్నేహంగా ఉండటం, ‘ఏం బాబాయ్’ అంటే ‘ఏం అల్లుడూ’ అని పలకరించుకోవడం.. ‘ఆంటీ ఇంటి నుంచి టీ పౌడర్ తీసుకురాపో’ అని పంపించడం కూడా అసాధ్యమైన విషయాలుగా మారిపోతే ఏ ఊతంతో ఏ స్పందనలతో జీవించాలి మనం? శ్రుతి మించి ప్రైవసీ పల్లెల్లో అయినా పట్నాల్లో అయినా ప్రతి ఒక్కరూ శ్రుతి మించిన ప్రైవసీలోకి జారుకుంటున్నారు. మొదట ఉమ్మడి కుటుంబాలు వద్దనుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని వద్దనుకుంటున్నారు. కేవలం ఎప్పుడూ ఇళ్లకు కూడా రాని కొందరు స్నేహితులు, పరిచయస్తులు చాలనుకునే స్థితికి చేరుకున్నారు. ‘మన బతుకులో ఎవరి జోక్యం అక్కర్లేదు’ అనే భావనలో ఉన్న సౌకర్యం ఎలా ఉన్నా ‘ఎవరి సాయం, తోడు లేకుండా బతుకు ఎలా ఉంటుంది’ అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ప్రైవసీ పిచ్చి ఒంటరితనంలోకి, ఏకాంతంలోకి, మనకు ఎవరూ లేరని భావనలోకి నెట్టి అభద్రతకు, ఆందోళనకు గురి చేస్తుంది. ‘ఎదుటివారి లోపాలు వెతకడం, జడ్జ్ చేయడం, మనకు హితవు చెప్పిన వారిని కూడా పగవారిని చేసుకోవడం, అనుబంధాలు ఆర్థికపరమైన సాయాలు కోరతాయనే మిషతో అందరినీ దూరం పెట్టడం’ ఇవి నేడు ప్రతి మనిషిని కేవలం కుటుంబ జీవితానికి, కుటుంబ అనుబంధాలకి (అవి కూడా సరిగ్గా ఉంటే) పరిమితం చేస్తున్నాయి. పక్కింటామె ‘ఇడ్లీ తిందూరా’ అని పిలవడమే వార్తగా మారి, అది చదివి ఆనంద బాష్పాలు వచ్చే స్థితికి మనం చేరుకుంటే ఆ తప్పు ఇడ్లీదో చట్నీదో కాదు. మనదే. ప్రేమ, అభిమానాలే ఇంధనాలు ఒక దూరప్రయాణం పరిచయస్తులు ఎవరూ లేని రైలులో చేస్తుంటే ఎలా ఉంటుందో, జీవన ప్రయాణం ప్రేమ, అభిమానాలు పంచేవాళ్లు లేకుంటే అలా ఉంటుంది. నలుగురు స్నేహితులతో సాగే పిక్నిక్ యాత్రలా జీవితం ఎందుకు ఉండకూడదు? కనీసం అప్పుడప్పుడన్నా వీధి అరుగుపై ఇరుగు పొరుగుతో కబుర్లు చెప్పుకునే కమ్మదనంతో జీవితం ఎందుకు ఉండకూడదు? పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసి ఇరుగు పొరుగు పిల్లలతో స్నేహం చేయడం మానేస్తున్నారు. దీనివల్ల వారి మానసిక ఆరోగ్యం ఎలా ఉండబోతోందో ఆలోచించారా? (చదవండి: అర్చన... అనుకున్నది సాధించింది) -
లక్షితా... ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్లో చాలా తక్కువమంది మాత్రమే టచ్లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది. ‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఎకౌంట్ క్రియేట్ చేసింది. నేహా ఆన్లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్కేజీ ఫ్రెండ్స్ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్గా మారింది. ‘నా ఎల్కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది. -
వెబ్ సిరీస్ చూసి ముగ్గురు మిత్రుల దోపిడీ యత్నం
కోరికలనేవి అందరికీ ఉంటాయి. అయితే అవి తీరనివిగా మారినప్పుడు కొందరు పెడదారి పడుతుంటారు. కోరికలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బుల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతుంటారు. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లక్నోకు చెందిన ముగ్గురు స్నేహితులకు బర్త్డే పార్టీ చేసుకునేందుకు రూ. 25 వేలు అవసరం అయ్యాయి. వారు చూసిన ఒక వెబ్ సిరీస్లోని కథనాన్ని అధారంగా చేసుకుని దోపిడీకి పథకం వేసుకున్నారు. తరువాత వీరు ముఖానికి ముసుగులు ధరించి స్థానికంగా ఉన్న ఒక జ్యూయలరీ దుకాణానికి వెళ్లారు. తరువాత వారు ఒక తుపాకీ తీసి, దుకాణం యజమానిని బెదించారు. అయితే వారి ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే వారు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణం యజమాని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీని ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ నిందితులలో ఇద్దరు ఖదరా, ఒకరు మండియావ్ ప్రాంతానికి చెందినవారన్నారు. వీరిలో ఇద్దరు మాస్క్ ధరించారని, ఒకరు రుమాలు ముఖానికి చుట్టుకున్నాడన్నారు. మే 30 వీరు స్థానికంగా ఉన్న మహేశ్వరి జ్యూయలర్స్లో దోపిడీకి ప్రయత్నించారని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని పట్టుకున్నామన్నారు. నిందితులను కోర్టుకు అప్పగించామని, వారి దగ్గర నుంచి నంబరు ప్లేటులేని స్కూటీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: ఉంగరం కావాలని మొండికేసిన వరుడు.. అలా అతని తిక్క కుదిర్చిన వధువు -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
గుంతకల్లు రూరల్: ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు.. ప్రతి పనినీ కలిసే చేసేవారు.. ఎక్కడికై నా కలిసే వెళ్లేవారు. చివరికి మృత్యువులోనూ వారు స్నేహం వీడలేదు. వివరాలు... గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఉరుకుందప్ప, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు వీరన్న (26), అదే గ్రామానికి చెందిన రాము, మహాలక్ష్మి దంపతుల కుమారుడు రవీంద్ర (25) ఇటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరన్నకు కృపాకుమారితో వివాహం కాగా, 6, 4 సంవత్సరాల వయసున్న ఇద్దరు బిడ్డలున్నారు. ఆరు నెలల క్రితం లక్ష్మి అనే యువతితో రవీంద్రకు వివాహమైంది. వీరన్న, రవీంద్ర ఒకే గ్రామానికి చెందిన వారే అయినా.. ఆటోడ్రైవింగ్ ద్వారానే ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారారు. కొంత కాలం క్రితం ఇద్దరూ అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య పరీక్షల అనంతరం గుండె సంబంధిత వ్యాధితో వీరన్న, షుగర్, బీపీతో రవీంద్ర బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. దీంతో వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. పది రోజుల క్రితం ఆయాసం ఎక్కువ కావడంతో వీరన్నను కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. రవీంద్ర ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో మంగళవారం తెల్లవారుజాము 5 గంటలకు రవీంద్ర, 5.30 గంటలకు వీరన్న మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం ఇద్దరి మృతదేహాలను కుటుంబసభ్యులు గ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
ఫ్రెండ్స్ అయిపోయిన కోహ్లీ అండ్ నవీన్...!
-
టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు
భారతదేశంలో టీ లేదా చాయ్కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. అంతేకాదు చాయ్ అమ్మి సక్సెస్ అయిన స్టోరీలు కూడా చాలా ఉన్నాయి. అయితే అనుభవ్ దూబే, ఆనంద్ విజయగాథ మాత్రం కాస్త డిఫరెంట్. ముఖ్యంగా 23 ఏళ్ల అనుభవ్ దూబే సీఏ పరీక్షలో ఫెయిలయ్యాడు. వ్యాపారవేత్త కావాలనుకుని ఏఐఎస్ డ్రీమ్స్ను వదిలేసుకున్నాడు. టీ వ్యాపారిగా 150కోట్లు సంపాదిస్తున్నాడు. మధ్యప్రదేశ్, రేవాకు చెందిన అనుభవ్ దూబే ఆనంద్ నాయక్ చిన్ననాటి స్నేహితులు. అనుభవ్ తండ్రి వ్యాపారవేత్త అయినప్పటికీ తన కొడుకును వ్యాపారిగా కాకుండా ఏఐఎస్ ఆఫీసర్ అధికారి కావాలని కోరుకున్నాడు. అప్పటికే సీఏ పరీక్షలో ఫెయిలైన కొడుకు అనుభవ్ దూబేని యూపీఎస్సీకి ప్రిపేర్ కావడాని ఢిల్లీకి పంపించాడు. తండ్రి కోరిక మేరకు అనుభవ్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పటికీ ఎందుకో ఉద్యోగంలో తన లైఫ్ సెటిల్ కాదని వ్యాపారమే కరెక్ట్ అని డిసైడయ్యాడు. ఫలితం కోట్ల విలువ చేసే కంపెనీ చాయ్ సుత్తా బార్కు కో ఫౌండర్గా మారిపోయాడు. కేవలం అయిదేళ్లలో 3 లక్షల నుండి 150 కోట్లకు ఎదిగాడు. 2016లో స్నేహితుడు ఆనంద్ నాయక్తో తన ప్లాన్గురించి చర్చించాడు. ఆలోచన బానే ఉందిగానీ ఇద్దరి దగ్గరా సరిపడా నిధులు లేవు. కానీ వ్యాపారవేత్త కావాలనుకున్న వాటి పట్టుదల ముందు అదిపెద్ద సమస్యగా తోచలేదు. ఎలాగోలా రూ. 3 లక్షలు సమకూర్చుకుని , తమ తొలి టీ అవుట్లెట్ను అమ్మాయిల హాస్టల్కు ఎదురుగా షురూ చేశాడు. తరువాతి కాలంలో వీరిద్దరితో రాహుల్ కూడా జత కలిశాడు. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) అసలే లో-బడ్జెట్. ఇక మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైన్, బ్రాండింగ్ వంటి వాటి డబ్బులు ఎలా వస్తాయని అనుభవ్,ఆనంద్ మదనపడ్డారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలే. తోటి స్నేహితుల దగ్గర అప్పు చేసి, సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్తో ఇండోర్లోని హాస్టల్కు ఆనుకుని తొలి అవుట్ లెట్ని డిజైన్ చేసుకున్నారు.అంతేకాదు ఆఖరికి బ్యానర్ను ప్రింట్ చేయడానికి డబ్బు లేకపోవడంతో, ఒక చెక్క ముక్కను తీసుకుని, చేతితో "చాయ్ సుత్తా బార్" అని రాశారు. ఈ టీ స్టాల్ పేరు, ఆలోచన, ఆశయం యువతను బాగా ఆకట్టుకున్నాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అనుభవ్ ,ఆనంద్ దేశంలోని 195 నగరాల్లో చాయ్ సుత్తా బార్ 450కిపైగా అవుట్లెట్లను ప్రారంభించారు. దుబాయ్, యుకె, కెనడా , ఒమన్ వంటి దేశాలతో సహా విదేశాలకు కూడా ఛాయ్ సుత్తా బార్ తన సత్తా చాటుకుంటోంది. చాయ్ సుత్తా బార్ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.150 కోట్లు. అనుభవ్ దూబే నికర విలువ దాదాపు 10 కోట్లు ఉంటుందని అంచనా. మట్టి కప్పులు, 250 కుటుంబాలకు ఉపాధి చాయ్ సుత్తాబార్లో మట్టి కప్పులు, కుల్హాద్లు ప్రధాన ఆకర్షణ. దీనికి 250 కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించారు. మట్టి పాత్రనే వాడుతూ తద్వారా వృత్తి నిపుణులైన కుమ్మరి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇద్దరితో మొదలై చాయ్సుత్తా బార్లో ఇపుడు ఎంబీఏ చదివినవారు, ఇతర ఇంజనీర్లతో సహా ఈరోజు 150 మందికి పైగా పని చేస్తున్నారంటే వీరి వ్యాపార దక్షతను అర్థం చేసుకోవచ్చు. ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడి సిబ్బంది దాదాపు అందరూ వికలాంగులు లేదా ఆర్థికంగా పేద నేపథ్యం నుండి వచ్చినవారు కావడం విశేషం. 7 రకాల టీ, పలు రకాల కాఫీలు, ఫాస్ట్ ఫుడ్లను విక్రయిస్తారు. ఇక్కడ టీ 10 రూపాయలకే టీ లభిస్తుంది. అనుభవ్ కష్టాలు, జీవిత పాఠం 2016: స్థానిక గూండాల దాడి 2017: నార్కోటిక్స్ దాడి 2020: కోవిడ్ హిట్; అవుట్లెట్లు మూసివేత 2020: వ్యాపారంలో నమ్మకద్రోహం చేసిన వ్యక్తి 2021: టైప్ 1 డయాబెటిస్ నిర్ధారణ 19 ఏళ్ళపుడు సీఏ వదిలి సివిల్ సర్వీసెస్కి 21 ఏళ్ళ వయసులో యూపీఎస్సీకి గుడ్బై 20వ దశకం ప్రారంభంలో ఏం చేయాలో తెలియని అయోమయం కట్ చేస్తే.. 3 లక్షల నుండి 150 కోట్లకు రాకింగ్ స్టార్గా అనుభవ్ దుబే ‘‘మీ ప్రయత్నాన్ని వదలవద్దు.. విజయం మీ కోసం వేచి ఉంది! ఆపొద్దు ప్రయత్నిస్తూ ఉండు!’’ అంటారు అనుభవ్ దూబే What's the craziest business idea you've ever had? pic.twitter.com/bfKdifIa5i — Anubhav Dubey (@tbhAnubhav) May 15, 2023 -
స్నేహితురాలిని అలా చూస్తూ..! ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్లా
తిరుపతి రూరల్: కుటుంబ బంధాలతోపాటు వారి మధ్య స్నేహం పెరిగింది. అలా 64 ఏళ్లపాటు తమ స్నేహబంధాన్ని కొనసాగించారు. అనారోగ్యంతో మృతి చెందిన స్నేహితురాలిని కడచూపు చూసేందుకు వచ్చింది. నిర్జీవంగా మారిన స్నేహితురాలిని తదేకంగా చూస్తూ.. తానూ తుది శ్వాస విడిచింది. ‘స్నేహం కోసం..’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాన్ని తలపించిన ఈ ఘటన తిరుపతి మండలం మల్లంగుంటలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... మల్లంగుంటకు చెందిన దివంగత కంబాల గంగయ్య భార్య కంబాల మునెమ్మ(80), అదే గ్రామానికి చెందిన అంజూరి పాపమ్మ (80) వరుసకు అక్కచెల్లెళ్లు. అంతకుమించి 64 ఏళ్లుగా మంచి స్నేహితులు. పిల్లల చదువుల నుంచి వారి పెళ్లిళ్లు, మనవళ్ల యోగక్షేమాల వరకు ఇరువురూ మాట్లాడుకునేవారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కంబాల మునెమ్మ ఈ నెల 9న రాత్రి మృతి చెందింది. ఆమె కుమారుడు అమెరికాలో ఉండటంతో శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న అంజూరి పాపమ్మకు మునెమ్మ చనిపోయిన విషయం చెప్పకుండా కుటుంబ సభ్యులు దాచారు. చివరి నిమిషంలో తెలుసుకున్న పాపమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ స్నేహితురాలు మునెమ్మను కడచూపు చూసేందుకు శనివారం సాయంత్రం వచ్చింది. స్నేహితురాలిని ఫ్రీజర్ బాక్స్లో అచేతన స్థితిలో చూస్తూ పాపమ్మ కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలింది. మునెమ్మ అంత్యక్రియలను శనివారమే ముగించగా.. పాపమ్మకు ఆదివారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచిన మునెమ్మ, పాపమ్మ స్నేహంపై గ్రామంలో అందరూ చర్చించుకుంటున్నారు. -
ప్రీతి ఆత్మహత్యయత్నంపై ప్రీతి ఫ్రెండ్స్ రియాక్షన్
-
స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసిన అలీ దంపతులు.. ఫోటోలు
-
టీచర్ మిస్సింగ్ కేసు..అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు
ఆఫ్రికాలో గతేడాది తప్పిపోయిన ఓ సంగీతం టీచర్ దారుణమైన హత్యకు గురయ్యాడు. తన రూమ్మేట్సే అతన్ని కడతేర్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాంగోలోని బ్రజ్జావిల్లేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గతేడాది అక్టోబర్ 26న ఆస్ట్రేలియన్ సంగీత ఉపాధ్యాయుడు మార్క్ సియవరెల్ల ఆఫ్రికాలోని కాంగోలో కనిపించకుండాపోయాడు. అప్పటిన నుంచి అంతు చిక్కని మిస్సింగ్ కేసుగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కేసు చిక్కుముడి వీడింది. కానీ అతడ్ని అంతమొందించిన విధానం విని పోలీసులను ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..న్యూసౌత్ వేల్స్లోని లీటన్కు చెందిన 57 ఏళ్ల మార్క్ సియవరెల్లా ఆరేళ్ల క్రితం ఆప్రికా దేశానికి వెళ్లాడు. అక్కడ అతను మొదటగా అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ తోపాటు సంగీతాన్ని భోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్ కాన్సులర్ స్కూల్కు మారారు. అతను కాంగోలోని బ్రజ్జావిలేలోని అపార్ట్మెంట్లోన తన స్నేహితుడి కలిసి ఉంటున్నాడు. ఇంతలో అతని పాత సహచరుడు, రూమ్మేట్ క్లెమెంట్ బెబెకా అనే వ్యక్తి మార్క్ వద్దకు వచ్చాడు. కాసేపు అక్కడే అపార్ట్మెంట్లో ముగ్గురు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో మార్క్ వాష్రూమ్కి వెళ్లగానే ఆ ఆపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి మార్క్ ఇంకొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు అతని రూమ్మేట్తో చెప్పాడు. అంతేగాదు అతను ఇక్కడ నుంచి వెళ్లిపోతే మనకేం ప్రయోజనం ఉండదు అని మార్క్ రూమ్మేట్తో అన్నాడు. దీంతో బెబెకా అయితే ఏం చేద్దాం మరీ అని అతడిని అడిగాడు. అందుకని అతన్ని కడతేర్చి అతని వద్ద నుంచి ఎంత కొంత సొమ్ము దుండుకుందా అని సలహ ఇచ్చాడు. ఇంతలో మార్క్ తాగి వదిలేసిన మందు గ్లాస్లో పాయిజన్ వేసి అక్కడ టేబుల్ మీద ఉంచాడు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తి. ఇంతలో వాష్రూమ్ నుంచి వచ్చిన మార్క్ వారితో మాట్లాడుతూ.. ఆ గ్లాస్లోని పాయిజన్ని తాగేశాడు. కాసేపటికే స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో తామిద్దం మార్క్ని ఒక బెడ్షీట్లో చుట్టి మొసళ్లు అధికంగా ఉండే కాంగో నదిలో పడేశామని బెబెకా చెప్పాడు. ఐతే మార్క్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేవని అతని వద్ద ఉన్న బ్యాంకు కార్డుల సాయంతో డబ్బులు కొట్టేశామని పోలీసలుకు వివరించాడు. కనీసం కుటుంబసభ్యులకు చివరి చూపుకూడా దక్కనీయకుండా అత్యంత ఘోరంగా హతం చేసిన విధానం పోలీసులను షాక్ గురి చేసింది. ఈ విషయాన్ని మార్క్ కుటుంబసభ్యులు విని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. (చదవండి: కాలిఫోర్నియా కాల్పుల ఘటన: పట్టుబడతానన్న భయంతో నిందితుడు..)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్
తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
Wamiqa Gabbi: క్యూట్ లుక్స్తో ఫిదా చేస్తున్న వామిక గబ్బి (ఫోటోలు)
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
Advertisement